-
క్రెడిట్ కోసం చైనా స్టిక్కర్లు
-
తూత్తుకుడిలో వివక్షకు చెక్
సాక్షి, చైన్నె : తూత్తుకుడిలో అల్పాహారం పథకం వివాదానికి తెర పడింది. వెనుక బడిన సామాజిక వర్గానికి చెందిన మహిళ సిద్ధం చేసిన అల్పాహారాన్ని విద్యార్థులతో కలిసి మంగళవారం ఎంపీ కనిమొళి , మంత్రి గీతా జీవన్ స్వీకరించారు. వివరాలు.. తూత్తుకుడి జిల్లా ఎట్టయపురం సమీపంలోని ఉసిలం పట్టి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో సీఎం అల్పాహార పథకం అమలు వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. ఆ గ్రామానికి చెందిన వెనుకబడిన సామాజిక వర్గానికి చెందిన మునియ సెల్వి అల్పాహారాన్ని సిద్ధం చేసి వడ్డిస్తుండడం అగ్ర వర్ణాలలో ఆగ్రహాన్ని రేపింది. దీంతో తమ పిల్లల చేత అల్పాహారం బహిష్కరించారు. ఈ సమాచారంతో అధికారులు రంగంలోకి దిగి గ్రామస్తులను బుజ్జగించారు. అదే సమంయలో డీఎంకే ఎంపీ, మంత్రి గీతా జీవన్ , తూత్తుకుడి జిల్లా ఉన్నతాధికారులు అందరూ మంగళవారం ఉదయాన్నే ఆగ్రామానికి వెళ్లారు. గ్రామ పెద్దలతో మాట్లాడారు. వివక్ష తగదని హితవు పలికారు. అందరూ సమానమే అని సూచించారు. విద్యార్థులను అల్పాహారం స్వీకరణకు పంపించాలని తల్లిదండ్రులను కోరారు. వీరి విజ్ఞప్తికి తల్లిదండ్రులు స్పందించారు. పిల్లలందరితో కలిసి ఎంపీ, మంత్రి, అధికారులు అల్పాహారం స్వీకరించారు. పిల్లలకు కనిమొళి స్వయంగా వడ్డించారు. అలాగే, ఆహారం తయారు చేస్తున్న మునియ సెల్వితో మాట్లాడారు. ఆమెకు భరోసా ఇచ్చారు. -
కనిమొళి అభినందన.. ఆమె ఉద్యోగం పోయింది?
సాక్షి, చైన్నె: కోయంబత్తూరు నగర ప్రైవేటు బస్సులో తొలి మహిళా డ్రైవర్గా అందరి మన్ననలు పొందుతున్న ఎం షర్మిల(24) శుక్రవారం రోడ్డున పడ్డారు. ఆమె నడిపిన బస్సులో ఎంపీ కనిమొళి ప్రయాణం చేసిన కొన్ని గంటల్లో ఆ బస్సు డ్రైవర్ ఉద్యోగాన్ని షర్మిల కోల్పోవాల్సి వచ్చింది. కోయంబత్తూరులో బస్సు డ్రైవర్ షర్మిల ఇటీవల సెలబ్రటీ అయ్యారు. ఆమె ఓ ప్రైవేటు బస్సుకు డ్రైవర్గా పనిచేస్తున్నారు. ఓ యువతిగా ఆమె బస్సు నడిపే విధానం సామాజిక మాధ్యమాలలో, మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో తమకు షర్మిల ఆదర్శం అంటూ అనేక మంది యువతులు అనేక మంది మీడియా ముందుకొచ్చారు. తాము సైతం డ్రైవింగ్ నేర్చుకుని బస్సులను నడిపేందుకు సిద్ధమయ్యారు. సెలబ్రటీగా మారిన షర్మిలను అభినందించేందుకు, ఆమెతో సెల్ఫీలు దిగేందుకు ఎగబడే వాళ్లు మరీ ఎక్కువే. డ్రైవర్గా ఆమె పనితీరును పరిశీలించేందుకు డీఎంకే ఎంపీ కనిమొళి శుక్రవారం కోయంత్తూరుకు వచ్చారు. కండక్టర్ తీరుతో.. షర్మిల నడిపే బస్సులో ఇదివరకు ఉన్న మగ కండక్టర్ను తొలగించి శుక్రవారం నుంచి కొత్తగా లేడీ కండక్టర్ను ఆ ట్రావెల్స్ యాజమాన్యం నిర్ణయించింది. అయితే, ఆ లేడీ కండక్టర్ రూపంలో షర్మిలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. తన బస్సులోకి హఠాత్తుగా కనిమొళి ఆమెతో పాటు మరికొందరు ఎక్కడంతో షర్మిల ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోయింది. ఆమె పనితీరున స్వయంగా కనిమొళి వీక్షించి, అభినందించారు. అయితే, ఆ లేడీ కండక్టర్ టికెట్టుకు చిల్లర ఇవ్వాల్సిందేనని కనిమొళితో పాటు ఆమెతో వచ్చిన వారిపై ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. జాబ్ పోలేదు? తనకోసం కనిమొళి రావడంతో ఆ కండక్టర్ను షర్మిల వారించారు. అయితే, ఆ కండక్టర్ మరింత దూకుడుగా వ్యవహరించడంతో తదుపరి స్టాప్లో కనిమొళితో పాటుగా మిగిలిన వారు బస్సు దిగి వెళ్లిపోయారు. అయితే.. ఆ తర్వాత ఏమి జరిగిందో ఏమోగానీ గాంధీపురం స్టాప్లో బస్సును ఆపేసి షర్మిల దిగి వెళ్లిపోయారు. పబ్లిసిటీ కోసం వెంపర్లాడుతున్నానని తన యజమాని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు ఆమె ఓ వీడియోలో చెప్పుకొచ్చారు. ఎంపీ కనిమొళి పట్ల మహిళా కండక్టర్ ప్రవర్తన సరిగా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఇక ఆ బస్సు నడపనని షర్మిల స్పష్టం చేశారు. ఏదేమైనా తన కలల కొలువుకు దూరమైనట్టు బాధపడ్డారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే బస్సు యజమాని దురై కన్నా మాత్రం మరోలా స్పందించారు. వ్యక్తిగత పబ్లిసిటీ షర్మిలకు పెరిగిందని, అయినా, తాము భరిస్తున్నామని, ఆమెను ఉద్యోగం నుంచి తొలగించలేదని బస్సు యాజమాని దురై కన్న పేర్కొన్నారు. ఈ వ్యవహారం కనిమొళి దృష్టికి చేరడంతో షర్మిలతో ఆమె వ్యక్తిగత సహాయకులు మాట్లాడినట్టు సమాచారం. -
కనిమొళి వ్యాఖ్యలపై చర్యలు చేపట్టాలి
సాక్షి, చెన్నై: రూ.కోట్లు ఇచ్చే వారికే బాలాజీ దేవుడంటూ.. పేదవాడిని కాపాడలేని దేవుడు ఎందుకంటూ.. డీఎంకే ఎంపీ కనిమొళి వివాదస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వెంకన్నపై ఎంపీ చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి మండిపడ్డారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విధమైన వ్యాఖ్యలు చేసి వివాదం సృష్టించడం ఇది ఒక కొత్త రాజకీయ ఎత్తుగడలో భాగమని కేతిరెడ్డి అన్నారు. ప్రజలను ఆశాంతికి గురిచేయటం తమిళ రాజకీయ నాయకుల లక్ష్యమని ఆయన విమర్శించారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామిపై తప్పుడు వ్యాఖ్యలు చేశారన్నారు. హిందువుల మనోభాబాలను కనిమొళి దెబ్బతీశారని కేతిరెడ్డి మండిపడ్డారు. సంచలనం వ్యాఖ్యలు చేసి వార్తలో ఉండాలనుకోవడం సిగ్గు చేటు.. మీరు ఇదే వ్యాఖ్యలను ఇతర మతస్తులపై చేసే దమ్ము ఉందా అని కేతిరెడ్డి ప్రశ్నించారు. మీరు చేసిన వ్యాఖ్యలకు తగిన మూల్యం త్వరలో చెల్లించటం ఖాయమని ఆయన అన్నారు. ఆమె చేసిన నాస్తిత్వం ప్రసంగంలో వెంకన్నను ఉదాహరణగా చేప్పిన విషయం తెలిసిందే. హిందూ సమాజంను అవమాపరిచిన రాజ్యసభ సభ్యురాలు కనిమొళిపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలని కేతిరెడ్డి డిమాండ్ చేశారు. తిరుపతి: తమిళనాడుకు చెందిన డీఎంకే ఎంపీ కనిమొళి హిందూ మతాన్ని కించపరిచేలా మాట్లాడారని, ఆమెపై తక్షణమే కేసు నమోదు చేయాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్రెడ్డి డిమాండ్ చేశారు. కనిమొళిపై గురువారం ఆయన తిరుపతి అర్బన్ ఎస్పీ అభిషేక్ మొహంతికి ఫిర్యాదు చేశారు. అనంతరం భానుప్రకాశ్రెడ్డి మాట్లాడుతూ.. రూ.కోట్లు ఇచ్చే వారికే బాలాజీ దేవుడంటూ కనిమొళి వ్యాఖ్యానించడం దారుణమన్నారు. పేదవాడిని కాపాడలేని దేవుడు ఎందుకంటూ.. భక్తుల మనోభావాలను ఆమె దెబ్బతీశారని మండిపడ్డారు. -
తెట్టు తిప్పలు!
► నేతల పడగ ► వంద టన్నులు తొలగింపు ► పీఆర్కే పరిశీలన ► కెప్టెన్ల వద్ద విచారణ సాక్షి, చెన్నై: ఆయిల్ తెట్టు అధికార వర్గాల్ని ముప్పుతిప్పలు పెడుతోంది. క్రమంగా చెన్నై సముద్ర తీరం తెట్టుతో కలుషితం అవుతుండడం ఆందోళన రేకెత్తిస్తోంది. ప్రధాన ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్, ఎంపీ కనిమొళి, వీసీకే నేత తిరుమావళవన్ నేతలు తీరం వెంబడి పర్యటించారు. పనుల వేగం పెంచాలని డిమాండ్ చేశారు. కేంద్ర రోడ్డు, రవాణా శాఖ సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ ఎన్నూరు పరిసరాల్లో పర్యటించారు. ఎన్నూర్ కామరాజర్ హార్బర్కు కూత వేటు దూరంలో సముద్రంలో రెండు నౌకలు ఢీకొన్న విషయం తెలిసిందే. క్రూడాయిల్తో వచ్చిన నౌకలో ఏర్పడ్డ లీకేజీ చెన్నై సముద్ర తీరాన్ని కలుషితం చేసింది. క్రూడాయిల్ సముద్రంలో కలవడంతో తీరం రంగు మారింది. జల సంపద మీద ప్రభావం, తీరం కలుషిత ప్రభావం రోజురోజుకు పెరుగుతుండడంతో ఆందోళన బయలు దేరింది. ఎనిమిదో రోజుగా సముద్రం నుంచి ఆయిల్ తెట్టును తొలగించే పనులు శర వేగంగా శనివారం కూడా సాగాయి. తొలగించే కొద్దీ తెట్టు తీవ్రత పెరుగుతుండడంతో ఈ కలుషితం ఎలాంటి కొత్త సమస్యల్ని తెచ్చిపెడుతుందో అన్న ఆందోళన తీరవాసుల్లో, జాలర్ల కుటుంబాల్లో బయలుదేరింది. కోస్టుగార్డు, రెవెన్యూ, కేంద్ర ప్రభుత్వ, హార్బర్వర్గాలు ఈ తెట్టుతో ముప్పుతిప్పలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. వంద టన్నులు : శనివారం నాటికి వంద టన్నుల మేరకు తెట్టును తొలగించినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. బకెట్లతో సిబ్బంది, సూపర్ సక్కింగ్ పరికరంతో శరవేగంగా తెట్టు తొలగింపు సాగుతున్నట్టు వివరించారు. సూపర్ సక్కింగ్ పరికరంతో రెండు రోజుల్లో 54 టన్నుల మేరకు తెట్టును తొలగించినట్టు, ఇందులో నీళ్లు సైతం కలిసి ఉన్నట్టుగా పేర్కొన్నారు. ఎన్నూర్ పరిసరాల్లో 21 టన్నులు, ఆర్కే నగర్లో 3.4 టన్నులు, మెరీనాతీరంలో ఏడు టన్నులు, శక్తి నగర్, గాంధీనగర్లలో ఐదు టన్నుల మేరకు అత్యధికంగా తెట్టు తొలగింపు సాగింది. కెప్టెన్ల వద్ద విచారణ : కామరాజర్ హార్బర్ అధికారి గుప్తా ఇచ్చిన ఫిర్యాదుతో మీంజూరు పోలీసులు రంగంలోకి దిగారు. 336, 427, 431, 250, 285 సెక్షన్ల కింద కేసుల నమోదుతో హార్బర్లో ఉన్న రెండు నౌకల కెప్టెన్ల వద్ద తీవ్రంగా విచారణ సాగిస్తున్నారు. రెండు నౌకలు ఢీకొనాల్సినంత పరిస్థితి ఎందుకు ఏర్పడిందో తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని విచారణ సాగుతోంది. పీఆర్కే పరిశీలన : కేంద్ర రహదారులు, రోడ్డు , రవాణా శాఖ సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ తిరువొత్తియూరు, ఎన్నూరు పరిసరాల్లో తీరం వెంబడి సాగుతున్న తెట్టు తొలగింపు పనుల్ని పరిశీలించారు. అధికారుల నుంచి వివరాలను సేకరించారు. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండు నౌకలు ఢీకొన్న సమాచారంతో తక్షణ పరిశీలన సాగిందని, అయితే, ఎలాంటి లీకేజీ తొలుత కనిపించక పోవడంతో పెద్దగా ముప్పు ఉండదని భావించామన్నారు. ఆ నౌకలో 58 వేల టన్నుల మేరకు చమురు ఉన్నట్టు, దానిని దిగుమతి చేసే పనుల వేగం శరవేగంగా సాగుతోందన్నారు. నౌక ఇంజిన్ ఆగడంతోనే లీకేజీని గుర్తించామని, ఒక వేళ నౌకలో చీలిక ఏర్పడి ఉంటే, భారీ ముప్పును చవి చూసి ఉండాల్సి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. తెట్టు తొలగింపునకు తగ్గ అత్యాధునిక పరికరాలు ఉన్నాయి, త్వరితగతిన తొలగిస్తామన్నారు. హార్బర్లో ఉన్న నౌకలను పరిశీలించినానంతరం నష్టం తీవ్రతను ప్రకటిస్తామని పేర్కొన్నారు. తమకు నష్ట పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేస్తూ పలుచోట్ల తీరంలోని జాలర్ల కుటుంబాలు ఆందోళనకు దిగాయి. స్టాలిన్, కనిమొళిల పరిశీలన : డీఎంకే నిర్వాహక అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్, డీఎంకే ఎంపీ కనిమొళి, వీసీకే నేత తిరుమావళవన్ నాయకులు సముద్ర తీరంలో పర్యటించారు. తెట్టు తొలగింపు పనుల్ని పరిశీలించారు. తిరువొత్తియూరు, భారతీనగర్ పరిసరాల్లో స్టాలిన్ పర్యటించి, అక్కడి జాలర్లతో సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా స్టాలిన్ మాట్లాడుతూ 32 కిమీ మేరకు తెట్టు విస్తరించే వరకు అధికారులు, పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరించి ఉండడం శోచనీయమన్నారు. సంబంధిత మంత్రి ఆలస్యంగా తీరానికి పరుగులు పెట్టారని పేర్కొంటూ, ఇకనైనా పనుల్నిమరింత వేగవంతం చేయించాలన్నారు. ఈ తెట్టు రూపంలో చెన్నైకు నీటిని అందిస్తున్న మీంజూరు నిర్లవణీకరణ పథకంకు ఎలాంటి ఇబ్బందులు నెలకొననున్నాయోనన్న ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం నిపుణుల్ని రంగంలోకి దించాలని, అత్యాధునిక పరికరాలను మరింతగా ఉపయోగించాలని, లేని పక్షంలో మరింత ఆందోళన తప్పదేమోనని పేర్కొన్నారు. ఇక, డీఎంకే ఎంపీ కనిమొళి ఎన్నూరు పరిసరాల్లో పర్యటించి, అధికారుల మధ్య సమన్వయం కొరవడినట్టు ఆగ్రహం వ్యక్తం చేశారు. సాంకేతిక నిపుణులు లేకుండా, సాధారణ సిబ్బందితో పనులు సాగుతున్నాయన్నారు. వీసీకే నేత తిరుమావళవన్ జాలర్ల గ్రామాల్లో పర్యటించి, తెట్టు రూపంలో పడుతున్న ఇబ్బందుల్ని తెలుసుకున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
ధోని నా తండ్రి లాంటి వారు: ‘బేబీ మలింగ’ కామెంట్స్ వైరల్
వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి
మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
ఏడాది తర్వాత ఓటీటీలోకి హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఆ సమస్యతో చాలా బాధపడ్డా, కానీ అదే కాపాడింది : సారా టెండూల్కర్
సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
బెంగాల్ గవర్నర్పై ఆరోపణలు: విచారణ జరపాలన్న మిసా భారతి
డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు
Pooja Hegde: రెడ్ డ్రెస్సులో అగ్గి రాజేస్తున్న బుట్టబొమ్మ (ఫోటోలు)
తప్పక చదవండి
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
- షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
- మరీ అంత చెత్త ఆటగాళ్లలా కనిపిస్తున్నారా?: సెహ్వాగ్ చురకలు
- భారీ ఆఫర్ను రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కారణం ఇదేనట
- Happy Birthday Trisha : 25 ఏళ్ల కెరియర్లో వివాదాలతో పాటు కోట్లలో ఆస్తులు
- Hindupur: కుచ్చుటోపీ చుట్టాలొచ్చారోచ్! ఉండండి టోపీ పెడతాం...
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
Advertisement