-
ఇంటింటికా.. ఓకే!
మిజోరం ఎన్నికల్లో పోటీ పడుతున్న అభ్యర్ధులు ఇకపై ఇంటింటి తిరిగి ప్రచారం చేసుకోవచ్చు. ఎన్నికలంటేనే ఇంటింటికి తిరిగి ప్రచారం చేసుకోవడమే కదా, మళ్లీ కొత్తగా చెప్పేదేంటి అనుకుంటున్నారా? ఇది తెలియాంటే మీకు మిజోరామ్ పీపుల్స్ ఫోరమ్ (ఎంపీఎఫ్) గురించి తెలియాలి. ఎన్నికల సమయంలో ఎంపీఎఫ్ సంస్థ వాచ్డాగ్ లాగా పనిచేస్తుంది. చర్చి అండతో ఏర్పాటైన ఎంపీఎఫ్లో పలు ప్రభుత్వేతర ప్రముఖ సంస్థలు సభ్యులుగా ఉన్నాయి. సినిమా భాషలో చెప్పాలంటే ఎంపీఎఫ్ శాసిస్తుంది, ప్రజలు పాటిస్తారు. అదంతే. దాన్నెవరూ మార్చలేరు. ఎంపీఎఫ్ పుణ్యమా అని మిజోరంలో గత రెండు ఎన్నికల సందర్భంగా ఇంటింటి ప్రచారానికి అవకాశం లేదు. ఏదైనా నియోజకవర్గంలో పోటీపడుతున్న వివిధ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులందరూ ఒకే ఉమ్మడి వేదికపైనే ప్రచారం చేసుకోవాల్సి వచ్చేది. ఆయా అభ్యర్థులు తమ గుణగణాలు, తామేం చేయదలచుకున్నది ఆ వేదిక ద్వారా ప్రజలకు చెప్పేవారు. అభ్యర్థులు కూడా ఎంపీఎఫ్ను కాదని ముందడుగు వేయడానికి సాహసించలేదు. గత రెండు ఎన్నికల్లోనూ ఇదే స్టాండ్ తీసుకున్న ఎంపీఎఫ్ ఈసారికి నిబంధనలను కాస్త సడలించింది. ఒకే వేదిక ప్రచార విధానాన్ని పక్కనపెట్టి ఇంటింటి ప్రచారానికి అనుమతించింది. దీంతో పార్టీలు ఎగిరిగంతేశాయి. అయితే ఎంపీఎఫ్ ఇందుకు కొన్ని షరతులు విధించింది. ఇంటింటికీ తిరిగే అభ్యర్ధుల వెంట కార్యకర్తలు ఉండకూడదు, అభ్యర్థి ఓటర్లను ప్రలోభ పెట్టకుండా చూసేందుకు ఆయనతోపాటు ఎంపీఎఫ్ ప్రతినిధులు తప్పనిసరిగా ఉండాలి. ఇది వినేందుకు కాస్తంత ఇబ్బదికరంగానే ఉన్నా.. పాపం ఇంటింటి ప్రచారానికి అవకాశం ఇచ్చారుగా అన్న సంతోషంతో పార్టీలన్నీ ఈ నిబంధనకు అంగీకరించాయి. 2006లో ఎంపీఎఫ్ ఏర్పాటైంది. అంతకుముందు ఎన్నికల సందర్భంగా హింస, ప్రలోభాలు తీవ్రస్థాయిలో ఉండేవని, వీటిని అడ్డుకునేందుకే.. చర్చి రంగంలోకి దిగి ఈ ఫోరమ్ ఏర్పరిచిందని ప్రతినిధులు చెప్పారు. తమ సంస్థ ఏపార్టీకీ అనుకూలం కాదని, తాము ఎన్నికల్లో తటస్థంగా వ్యవహరిస్తామని వెల్లడించారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఎంపీఎఫ్ కళ్లు గప్పి ఓటర్లను ప్రలోభపెడుతోందని మిజో పీపుల్స్ మూవ్మెంట్ ఆరోపిస్తోంది. కాంగ్రెస్ ఈ ఆరోపణలను ఖండించింది. అయితే.. ఎంపీఎఫ్ సభ్యులను కలుపుకుని ప్రచారానికి వెళ్లడం అసౌకర్యంగా ఉందని మెజారిటీ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
పాపాలు!
- యథేచ్ఛగా కల్తీ పాల విక్రయం - లోకల్ డెయిరీల అక్రమాలు - ప్రజల ఆరోగ్యానికి ముప్పు - అమలు కాని కల్తీ నిరోధక చట్టం సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలో పా‘పాల’ భైరవులు పెరిగిపోతున్నారు. వీరిని కట్టడి చేయడంలో జీహెచ్ఎంసీ, వైద్య ఆరోగ్య శాఖల విభాగాలు దారుణంగా విఫలమవుతున్నాయి. ఆహార కల్తీ నిరోధక చట్టం(2006) అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. గ్రేటర్ పరిధిలో విక్రయిస్తున్న వివిధ బ్రాండ్ల పాలల్లో (ప్యాకెట్ పాలు) ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగించేఇ.కోలి, సాల్మొనెల్లా, యూరియా ఆనవాళ్లు బయటపడుతున్నా ఈ విభాగాలు ప్రేక్షక పాత్ర వహిస్తుండడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే అంశంపై రాష్ట్ర బాలల హక్కుల సంఘం గతంలో మానవ హక్కుల సంఘం, లోకాయుక్తను ఆశ్రయించాయి. దీంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్పట్లో హడావుడిగా కొన్ని లోకల్ డెయిరీలపై దాడులు చేసి, స్వల్ప మొత్తంలో జరిమానా విధించి మమ అనిపించారు. నేటికీ కల్తీని నిలువరించేందుకు పటిష్ట చర్యలు తీసుకోకపోవడంతో నగరంలో యథేచ్ఛగా పాల కల్తీ జరుగుతోందని, ప్రజారోగ్యం ప్రమాదంలో పడుతోందని స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలు, బాలల హక్కుల సంఘం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆందోళన కలిగిస్తున్న కల్తీ మహా నగర పరిధిలో రోజుకు సుమారు 40 లక్షల లీటర్ల పాలు అవసరం ఉండగా ఏపీ డెయిరీ, మదర్ డెయిరీ, తిరుమల, జెర్సీ, దొడ్ల, ముకుంద, రిలయన్స్, వైష్ణవి, హ్యాట్సన్ వంటి ప్రభుత్వ, ప్రైవేటు డెయిరీలు సుమారు 35 లక్షల లీటర్లు విక్రయిస్తున్నాయి. గ్రేటర్ పరిధిలో రోజుకు ఐదు లక్షల లీటర్ల పాల కొరత ఉంది. నగరానికి ఆనుకొని ఉన్న జిల్లాల్లో పాల ఉత్పత్తి కనిష్ట స్థాయికి పడిపోవడం, పశు పోషణ తగ్గడం, సంస్థాగత రుణాలు లభ్యం కాకపోవడం, నిర్వహణ భారంగా మారడంతో పలువురు ఔత్సాహికులు, రైతులు డెయిరీలను నిర్వహించలేకపోతున్నారు. ఇదే అదనుగా డెయిరీల నిర్వాహకులు చిక్కదనం పెరిగేందుకు పాలపొడి, కార్న్ఫ్లోర్, డాల్డా వంటి వంటనూనెలకు సంబంధించిన కొవ్వు పదార్థాలను పాలలో కలిపి విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. లోకల్ డెయిరీలు విక్రయిస్తున్న పాలను నిబంధనల ప్రకారం సూక్ష్మజీవ రాహిత్యం(పాశ్చరైజేషన్) చేయడం లేదని బాలల హక్కుల సంఘం పరిశీలనలో తేలింది. వివిధ బ్రాండ్ల పాలలో ఇ.కోలి, సాల్మొనెల్లా బ్యాక్టీరియా ఆనవాళ్లు బయటపడ్డాయి. మరికొన్నింటిలో యూరియా ఆనవాళ్లు గుర్తించారు. పాలలో నురుగు, చిక్కదనం పెరిగేందుకు యూరియా నీళ్లను కలుపుతున్నట్లు బయటపడడం కలకలం సృష్టిస్తోంది. పాలల్లో ఇ.కోలి బ్యాక్టీరియా ఆనవాళ్లు ఉండడంతో వీటిని తాగిన వారు తీవ్రమైన జీర్ణకోశ వ్యాధుల బారిన పడుతున్నారు. కడుపు నొప్పి, డయేరియా వ్యాధులతో బాధ పడుతున్నారు. సాల్మొనెల్లా బాక్టీరియా ఆనవాళ్లున్న పాలు తాగిన చిన్నారుల మెదడుపై దుష్ర్పభావం పడుతోంది. యూరియా ఆనవాళ్లున్న పాలను తాగిన వారికి కంటిచూపు దెబ్బతినే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మరికొన్ని డెయిరీల నిర్వాహకులు రెండు మూడు రోజుల పాటు పాలు నిల్వ ఉండేందుకు వివిధ రకాలైన రసాయనాలను కలుపుతున్నట్లు తేలింది. వీటిని తాగిన వారుగొంతు నొప్పి బారిన పడుతున్నారు. కాగితాలపైనే చట్టాలు.. పాలకల్తీని అరికట్టేందుకు ఆహార కల్తీ నిరోధక చట్టం(2006)ను అమలు చేయడంలో ఇటు జీహెచ్ఎంసీ, అటు వైద్య ఆరోగ్య శాఖలు దారుణంగా విఫలమవుతున్నాయి. దీంతో ఈ చట్టం కాగితం పులిలా మారింది. ఈ చట్టంలోని సెక్షన్-34 ప్రకారం సురక్షితం కాని పాలు విక్రయిస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. కొరతకు ఇదో నిదర్శనం.. ప్రభుత్వ రంగ సంస్థ విజయ డెయిరీ (ఏపీ డెయిరీ) నగరంలో రోజుకు సుమారు 3.9 లక్షల లీటర్ల పాలను మాత్రమే సరఫరా చేస్తోంది. ఆశించిన స్థాయిలో ఉత్పత్తి లేకపోవడంతో కర్ణాటక డెయిరీ నుంచి లక్ష లీటర్లు, బాలాజీ డెయిరీ నుంచి 50 వేల లీటర్లను కొనుగోలు చేస్తోంది. గతంలో నిల్వ చేసిన పాల పొడిని సైతం పాల తయారీకి వినియోగించినట్టు లాలాపేటలోని ఆంధ్రప్రదేశ్ పాడి పరిశ్రమ సహకార సమాఖ్య జనరల్ మేనేజర్(ఎంపీఎఫ్) ఏడు కొండలు రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసింది: హరీష్ రావు
ఫ్రీగా సినిమా టికెట్లు.. ఓటేసినందుకు కాదు! మరి...
'ప్రసన్నవదనం' బ్యూటీ చాలా ఘాటు గురూ.. రాశి సింగ్ (ఫొటోలు)
ఈ సమ్మర్ సీజన్లో.. నేరుగా 'చల్లని పెరుగుతోనే వెరైటీ కర్రీలు'!
వల్లభనేని వంశీ తో సాక్షి స్ట్రెయిట్ టాక్
ఆ విషయం తెలిశాక ఖుష్బు తట్టుకోలేకపోయింది: సుందర్
బిగ్ క్వశ్చన్: వాలంటీర్లపై కక్ష..అవ్వాతాతలకు శిక్ష
శంషాబాద్: ఆపరేషన్ చిరుత సక్సెస్
తగ్గిన ప్రపంచ నం1 కంపెనీ విక్రయాలు.. భారత్లో మాత్రం..
‘శబరి’ మూవీ రివ్యూ
తప్పక చదవండి
- Hari Prasad: పట్టుదలతో 'క్లైమెట్ యాక్షన్' వైపు పచ్చటి అడుగు..
- నాకు నేనే సవాల్గా మారా: స్టార్ హీరోయిన్
- సెలబ్రిటీలతో ఎయిర్బీఎన్బీ జట్టు..
- మోసాల బాబు మరో అబద్ధం..
- మోసాల బాబు మరో అబద్ధం..
- Israel-Hamas war: కాలిఫోర్నియా వర్సిటీలోకి పోలీసులు
- ఉద్యోగుల ఫ్రెండ్లీ సీఎం
- ‘పంపుసెట్ల’నూ కాపీ కొట్టేసిన బాబు!
- Central government: సీబీఐ మా నియంత్రణలో లేదు
- భువనగిరి ఖిలాపై ఏ జెండా ఎగిరేనో?
Advertisement