-
ఎస్సీ వర్గీకరణ కోసం ఢిల్లీలో ధర్నా
జగదేవ్పూర్ (గజ్వేల్): కొత్త ఏడాదిలో కొత్త ఉద్యమాలకు ఎమ్మార్పీఎస్ శ్రీకారం చుడుతుందని ఎమ్మార్పీఎస్ తెలంగాణ జాతీయ అధ్యక్షుడు మేడి పాపయ్య, రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ అన్నారు. వచ్చేనెల 3, 4 తేదీల్లో ఢిల్లీలో జరిగే ఎస్సీ వర్గీకరణ ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా తిగుల్నర్సాపూర్లోని కొండ పోచమ్మ ఆలయాన్ని వీరు సందర్శించారు. అనంతరం రాష్ట్ర కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వం చిన్నచూపు చూసిందని, అందుకే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మాదిగలు పుట్టగతులు లేకుండా చేశారన్నారు. వచ్చే నెల 3, 4 తేదీలల్లో ఢిల్లీలో వర్గీకరణ కోసం ధర్నా చేపడుతున్నామని తెలిపారు. వర్గీకరణ విషయాన్ని సీఎం కేసీఆర్ ఇటీవల ప్రధాని దృష్టికి తీసుకెళ్లడంపై తెలంగాణ ఎమ్మార్పీఎస్ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. కొండపోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు ఎమ్మార్పీఎస్ తెలంగాణ అధ్యక్షుడిగా కొత్తగా నియామకం అయిన వంగపల్లి శ్రీనివాస్ శుక్రవారం కొండపోచమ్మ ఆలయంలోని అమ్మవారిని దర్శించుకున్నా రు. ఆలయ చైర్మన్ ఉపేందర్రెడ్డి వారికి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రాల శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పొన్నాల కుమార్, మహిళా అధ్యక్షురాలు మంజుల తదితరులు పాల్గొన్నారు. వర్గీకరణ చేయొద్దు: చెన్నయ్య హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణ చెల్లదని సుప్రీంకోర్టు స్పష్టం చేసినా, ముఖ్యమంత్రి కేసీఆర్ ఎస్సీ వర్గీకరణ బిల్లును భుజాలపై మోసుకెళ్లి ప్రధాని మోదీ వద్ద పెట్టడం మాలల మనోభావాలను దెబ్బతీయటమేన ని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య అన్నారు. శుక్రవారం మాల మహానాడు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ‘వర్గీకరణ వద్దు.. కలిసుంటేనే ముద్దు’అంటూ లోయర్ ట్యాంక్ బండ్లోని డా.బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద మహాధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం డా.బీఆర్ అంబేడ్కర్ విగ్రహం నుంచి చౌరస్తా వరకు రాస్తారోకో చేపట్టారు. ట్రాఫిక్ సమస్య తలెత్తడంతో పోలీసులు ఆందోళనకారులను సైఫాబాద్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ క్రమంలో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ సందర్భంగా చెన్నయ్య మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మాలల ఓట్లు అవసరం రాలే దా? అని ప్రశ్నించారు. ఓటు రాజకీయాలు చేసి ప్రభుత్వం వచ్చిన తర్వాత వర్గీకరణ బిల్లు జపం చేయడం సరైంది కాదన్నారు. ఇలాంటి నిర్ణయాలను మానుకోకపోతే ప్రగతి భవనాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తం గా ఆందోళనలను ఉధృతం చేసి, మాలల సత్తా చాటుతామన్నారు. కార్యక్రమంలో మాలమహానాడు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గైని గంగారాం, వర్కింగ్ ప్రెసిడెంట్ జంగం శ్రీనివాస్, మహిళా అధ్యక్షురాలు కనదాల తదితరులు పాల్గొన్నారు. -
ఎమ్మార్పీఎస్ నేత ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్: ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఎక్కువయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయనను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. పలు చోట్ల రాస్తారోకోలు చేస్తున్నారు. నిరసనల్లో భాగంగా వైఎస్సార్ కడపజిల్లా రాజంపేటకు చెందిన ఎంఆర్పీఎస్ నాయకుడు చేమూరి వెంకటేష్ మాదిగ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉండటంతో జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో బుధవారం రాత్రి మందకృష్ణమాదిగను పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. సూర్యాపేటలోని 65వ నంబరు జాతియ రహదారిపై ఎంఆర్పీఎస్ నాయకులు రాస్తారోకో నిర్వహించారు -
సబ్రిజిస్ట్రార్ కార్యాలయం ముట్టడి
రాజంపేట: సబ్రిజిస్ట్రార్ అవినీతికి పాల్పడుతున్నారంటూ వైఎస్సార్ జిల్లా రాజంపేట లో ఆందోళన జరిగింది. సోమవారం ఉదయం ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు కార్యాలయం వద్దకు చేరుకుని సబ్ రిజిస్ట్రార్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అవినీతిని అరికట్టాలని డిమాండ్ చేస్తూ కార్యాలయం ఆవరణలో బైఠాయించారు. ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. -
ఏపీ సీఎంను అరెస్ట్ చేయాలి
నల్గొండ : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయాలంటూ ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు సోమవారం నల్గొండ జిల్లా టీడీపీ కార్యాలయాన్ని ముట్టడించారు. తెలంగాణ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు యాతాకుల భాస్కర్ మాదిగ ఆధ్వర్యంలో జిల్లా నాయకులు టీడీపీ భవన్ ఎదుట ఆందోళన చేశారు. వెంటనే ఏపీ అసెంబ్లీలో వర్గీకరణ బిల్లు ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement