-
అప్పుడలా ఇప్పుడిలా...
హరితం మాయం.. పెరుగుతున్న వేసవి తాపం కాంక్రీట్ మహారణ్యంలా నగరం...కనిపించని చల్లదనం ఒకప్పుడు ఎటు చూసినా పచ్చదనం... నీటితో కళకళలాడే తటాకాలు... మన ‘భాగ్’ (తోటల) నగరం సొంతం. భానుడు ఉగ్రరూపం దాల్చకుండా... మొక్కలు... చెట్లు అడ్డుకునేవి. మనకు ఆసరానిచ్చేవి. మనసుకు హాయినిచ్చేవి. కాలక్రమంలో హరితవనాలు మాయమైపోయాయి. బహుళ అంతస్తుల భవనాలు... ఫ్యాక్టరీలు.. వాహనాల కాలుష్యం... వేల చేతులతో నగరాన్ని బంధించాయి. వేసవి వస్తే మంటలు సృష్టిస్తున్నాయి. సూర్యుడికే చెమటలు పుట్టిస్తున్నాయి. సిటీబ్యూరో: దక్కన్ నేలపై అన్ని కాలాల్లోనూ ఆహ్లాదం కలిగించే సమశీతోష్ణ వాతావరణం... విశిష్ట భౌగోళిక పరిస్థితులు.. వరదలు, భూ కంపాలు, సునామీ వంటి విపత్తులకు అవకాశం లేని ‘భాగ్య’నగరం మనది. నాటి కుతుబ్షాహీలు, అసఫ్జాహీ నవాబులు మొదలు.. అమెరికా అధ్యక్షులు.. విఖ్యాత కంపెనీల సీఈఓల మనసు దోచుకుందీ సిటీ. శతాబ్దాలుగా భాగ్ (తోటల) నగరంగా విలసిల్లిన భాగ్యనగర ఆహ్లాదకర వాతావరణానికి ఎందరో జేజేలు పలికారు. కానీ ఇప్పుడు ఆ స్థాయిలో హరిత వాతావరణం లేకపోవడంతో ప్రస్తుత వేసవిలో ఎండ వేడిమికి నగర వాసులు అల్లాడుతున్నారు. రహదారులు, బహుళ అంతస్తుల భవంతులతో నగరం కాంక్రీట్ మహారణ్యంలా మారింది. హరితం కనుమరుగైనగరం త్వరగా వేడెక్కుతోంది. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం మహా నగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) పరిధిలో 30 శాతం గ్రీన్బెల్ట్ (హరిత వాతావరణం) ఉండాలి. కానీ 8 శాతమే ఉంది. దీంతో ఉష్ణోగ్రతలు సొమ్మసిల్లేలా చేస్తున్నాయని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమశీతోష్ణ స్థితికి కారణాలివే... దక్కన్ పీఠభూమి సముద్ర మట్టానికి సుమారు 536 అడుగుల ఎత్తులో ఉండడంతో ఇక్కడి భౌగోళిక అనుకూలతలు విదేశీ కంపెనీలు, పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. వేసవిలో ఉదయం, సాయంత్రం పొడి వాతావరణం.. మధ్యాహ్నం ఎండ వేడిమి తీవ్రంగా బాధించినా.. రాత్రి వేళ చల్లటి నిర్మలమైన వాతావరణం హైదరాబాద్ ప్రత్యేకత. గాలిలో ఆర్థ్రత (తేమ అధికంగాలేని) లేని ఆహ్లాద వాతావరణం ఉబ్బసం వ్యాధిగ్రస్తులకూ ఉపశమనం కలిగిస్తుందన్న నానుడి ఉంది. అక్టోబరు-ఫిబ్రవరి నెలల్లో సిటీలో 30 నుంచి 36 డిగ్రీల లోపునే పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఏప్రిల్, మే నెలల్లో సాధారణంగా 39 నుంచి 43 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. అధికంగా చలి, వేడి, వర్షం లేని సమశీతోష్ణ వాతావరణం ఈ నగరసొంతం. దీంతో ఏ కాలంలో సందర్శించినా ఇక్కడి వాతావరణం పర్యాటకులను కట్టి పడేస్తోంది. కానీ ఇలాంటి వాతావరణాన్ని మనమే చేజేతులా దూరం చేసుకుంటున్నాం. శరవేగంగా రహదారుల విస్తరణ, బహుళ అంతస్తుల భవంతులు, వాణిజ్య సముదాయాల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నా.. హరిత తోరణం(గ్రీన్బెల్ట్) అదే స్థాయిలో పెరగకపోవడం శాపంగా పరిణమిస్తోంది. మోటారు వాహనాలు, పరిశ్రమల నుంచి వెలువడుతున్న కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ వంటి వాయువుల ఉద్గారాలు పెరిగి సిటీలో వేసవి తాపం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ ప్రాంతాల్లో హరిత వనాలు నగరంలో సుమారు 1200 ఎకరాల్లో విస్తరించిన ఉస్మానియా విశ్వవిద్యాలయం.. రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం... గచ్చిబౌలిలోని కేంద్రీయ విశ్వవిద్యాలయం... కేబీఆర్ పార్క్... బొటానికల్ గార్డెన్, జూ పార్క్, వనస్థలిపురం డీర్పార్క్ తదితర ప్రాంతాల్లో హరిత తోరణం ఉంది. దీంతో ఆ ప్రాంతాల్లో వేసవితాపం అంతగా పెరగకపోవడం విశేషం. ఏప్రిల్, మే నెలల్లో నగరంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదైనప్పటికీ ఆప్రాంతాల్లో నాలుగు డిగ్రీలు తక్కువగా.. అంటే 36 డిగ్రీల మేర మాత్రమే ఉష్ణోగ్రతలు నమోదవుతుండడం విశేషం. అక్కడ నివసించే వారు వేసవి తాపానికి అంతగా గురికారని... దీనికిహరిత తోరణమే కారణమని పర్యావరణవేత్తలు స్పష్టం చేస్తున్నారు. చెట్లు ఉష్ణోగ్రతలను నాలుగు నుంచి ఐదు డిగ్రీల మేర తగ్గిస్తాయని చెబుతున్నారు. పచ్చదనం కనుమరుగు డెబ్భయ్యవ దశకం వరకు పెద్ద చెట్లు, తోటలతో అలరారిన భాగ్యనగరంలో రహదారుల విస్తరణ, మెట్రో పనులు, బహుళ అంతస్తుల భవంతులు, నూతన కాలనీల ఏర్పాటుకు భారీగా చెట్లను నరికి వేస్తుండడంతో హరితం కనుమరుగవుతోంది. నగర విస్తీర్ణంలో 30 శాతం హరిత వాతావరణం ఉంటేనే వాయు కాలుష్యం, వేసవి తాపం నుంచి ఉపశమనం లభిస్తుంది. ప్రొఫెసర్ జీవానందరెడ్డి, పర్యావరణ వేత్త పరిష్కారాలివే.. నగరంలో మిగిలి ఉన్న చెరువుల చుట్టూ పెద్ద మొత్తంలో మొక్కలు నాటి గ్రీన్బెల్ట్ ఏర్పాటు చేయాలి. తద్వారా భూగర్భ జలమట్టాలు పెరిగి, పర్యావరణ కాలుష్యం బాగా తగ్గుతుంది. సువిశాల ప్రాంగణాల్లో బహుళ అంతస్తుల భవంతులు నిర్మిస్తున్న వారు విధిగా కొంత విస్తీర్ణంలో మొక్కలు పెంచుతామని... ఇంకుడు గుంతలు ఏర్పాటు చేస్తామని డిక్లరేషన్ ఇచ్చిన తరవాతనే జీహెచ్ఎంసీ భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేయాలి. నూతన కాలనీల్లో 30 శాతం గ్రీన్బెల్ట్ ఉండేలా చూడాలి. నూతన లే అవుట్లకు అనుమతులిచ్చే సమయంలో ఈ విషయాన్ని తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాలి. పర్యావరణ పరిరక్షణలో మనం సైతం.. నగరంలో పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని నివారించేందుకు సిటీజన్లుగా మనం పాటించాల్సిన కొన్ని చిట్కాలు.. చెట్ల ఆకులు వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్, సూక్ష్మ ధూళి కణాలను గ్రహించి ఆక్సిజన్ను విడుదల చేస్తాయి. చెట్లు ఎయిర్ ఫిల్టర్లుగా పని చేస్తాయని అందరూ గ్రహించాలి. చెట్లు చల్లదనాన్ని ఇవ్వడం ద్వారా విద్యుత్ వంటి ఇంధనాన్ని ఆదా చేస్తాయి. కాలుష్య ఉద్గారాలను బాగా తగ్గిస్తాయి. ఇళ్లపై సోలార్పవర్ ప్యానెల్స్ను ఏర్పాటు చేసుకోవాలి. ఇళ్లఆవరణలో విధిగా మొక్కలు నాటాలి.వాహనాల్లో ఉదయం, సాయంత్ర వేళల్లోనే పెట్రోలు లేదా డీజిల్ నింపాలి. ఇంధనం ఆవిరి కాకుండా చూడాలి. వాహనాలను నీడలోనే పార్క్ చే ద్దాం. మస్కిటో రిపెల్లెంట్ల వాడకాన్ని గణనీయంగా తగ్గించాలి. {sాఫిక్ సిగ్నళ్ల వద్ద వాహనాలను ఆఫ్ చేసి ఇంధనాన్ని ఆదా చేద్దాం. బయటికి వెళ్లేటపుడు మాస్క్ ధరించి ధూళి కాలుష్యం నుంచి విముక్తి పొందండి. ఒకే ప్రాంతంలో ఉద్యోగం చేసేవారు కార్పూలింగ్ క్లబ్లు ఏర్పాటు చేసుకొని ఒకే కారులో ప్రయాణించండి. ఫైవ్స్టార్ రేటింగ్ ఉన్న ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ గృహోపకరణాలనే కొనుగోలు చేయండి. తక్కువ కాలుష్యం వెదజల్లే మోటారు వాహనాలనే కొనుగోలు చేయండి. 15 ఏళ్లకు పైబడిన వాహనాలను వినియోగించవద్దు. ప్లాస్టిక్ వాడకాన్ని బాగా తగ్గించండి. పేపరు బ్యాగులను వినియోగించండి. రీచార్జబుల్ బ్యాటరీలనే వినియోగించండి. -
రెగ్యులరైజ్’ ధమాకా!
నిరుపేదలకు శుభవార్త నాలుగు పద్ధ్దతుల్లో అనధికార గృహాల రెగ్యులరైజేషన్ 125 గజాలలోపు నివాసాలకు ఉచితం మిగతా నివాసాలకు రుసుం నిర్ణయం సిటీబ్యూరో: ప్రభుత్వ భూముల్లో నివాసాలు ఏర్పాటు చేసుకున్న నిరుపేదలకు శుభవార్త. అనధికార గృహాలన్నింటినీ రెగ్యులరైజ్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మంగళవారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇక రెగ్యులరైజ్కు సంబంధించిన రుసుము, విధివిధానాలను త్వరలో ఖరారు చేస్తారు. నగరంలోని ప్రభుత్వ భూముల్లో సుమారు 1.30 లక్షల నుంచి 1.60 లక్షల వరకు నివాసాలు ఉన్నట్లు అధికారయంత్రాంగం ఇప్పటికే గుర్తించింది. వీటిలో 15 నుంచి 50 గజాల లోపు స్థలంలో నివాసం ఉంటున్న వారందరిని ఒక పూల్గా మార్చి బహుళ అంతస్తుల భవనాలు నిర్మించి శాశ్వత నివాసం కల్పించనున్నారు. ఇక మిగతావాటి రెగ్యులరైజేషన్ను నాలుగు విధాలుగా చేయనున్నారు... ► 125 గజాల స్థలం లోపు నివాసాలు ఏర్పాటు చేసుకున్న పేదలకు ఎలాంటి రుసుం లేకుండా రెగ్యులరైజ్ చేస్తారు ► 250 నుంచి 300 గజాల స్థలంలోపు ఏర్పాటు చేసుకున్న వారికి తక్కువ రుసుంతో ప్యాకేజీ ► 500 గజాలలోపు నివాస స్థలాలు ఏర్పాటు చేసుకున్న వారి భూములకు ప్రతి 100 గజాలకు కొంత ధర పెంచుతూ రుసుం విధిస్తారు ► 4,500 గజాలకుపైగా భూమిలోని నివాసాలు, శాశ్వత నిర్మాణాలకు భారీ మొత్తంలో రుసుం నిర్ణయించి రెగ్యులరైజ్ చేస్తారు -
‘విశ్వ’మంత ఆశ
సీఎం కలల సాకారానికి కసరత్తు బహుళ అంతస్తుల బాధ్యత ఆర్కిటెక్ట్ హఫీజ్కు అప్పగింత ప్రణాళికలు రూపొందించాలని ఆదేశం హుస్సేన్సాగర్ చుట్టూ అందమైన బహుళ అంతస్తుల భవనాలు.. మూసీ చుట్టూ కొత్త అందాలు.. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతిబింబంగా తెలంగాణ కళాభారతి .. ఇలా ప్రపంచంలోనే ప్రత్యేకంగా... ప్రతి ఒక్కరూ చూసి తీరాల్సిన నగరంగా గ్రేటర్ను తీర్చిదిద్దాలనుకుంటున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆ దిశగా తన ఆలోచనలకు కార్యరూపం ఇచ్చే పనిని ప్రారంభించారు. దీని కోసం ముంబైకి చెందిన ప్రముఖ ఆర్కిటెక్ట్ హఫీజ్ సేవ లను వినియోగించుకోనున్నారు. ఈ ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై గురువారం జరిగిన సమావేశానికి హఫీజ్ను ఆహ్వానించారు. ఈ బహుళ అంతస్తుల భవ నాల నిర్మాణానికి ఎంత ఖర్చయినా వెనుకాడేది లేదని... అందుకు తగిన ప్రణాళికలు రూపొందించాల్సిందిగా హఫీజ్ బృందాన్ని కోరారు. అంతేకాదు.. నగరంలోని ఏ ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు వస్తే బాగుంటుందో పరిశీలించి ప్రణాళిక రూపొందిం చాలన్నారు. హైదరాబాద్ నగరంప్రపంచంలోనే ప్రత్యేకంగా ఉండాలన్నారు. ఇదీ హఫీజ్ విశిష్టత.. ముంబై యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్లో డిప్లొమా, కొలంబియా యూనివర్సిటీలో డిగ్రీ, ఎంఎస్ పూర్తి చేసిన హఫీజ్ ఇంపీరియల్ 1, 2 భవనాలతో పాటు దేశంలోనే అత్యంత ఎత్తయిన భవనాల వాస్తుశిల్పిగా ప్రసిద్ధికెక్కారు. కొత్త పద్ధతులతో... అందరినీ ఆకట్టుకునేలా భవనాలను తీర్చిదిద్దడంలో పేరుపొందారు. హఫీజ్ ప్రాజెక్టుల్లో నోయిడా మహాగున్ మెడోస్, నవీ ముంబైలో డీవై పాటిల్ స్టేడియం, సీవుడ్స్ ఎస్టేట్ (ఎన్ఆర్ఐ కాంప్లెక్స్), గుర్గావ్లో డీఎల్ఎఫ్ అరాలియాస్, హీరానందర్ గార్డెన్స్ వంటివి ఉన్నాయి. దేశంలోని వివిధ నగరాల్లో ఎన్నో నిర్మాణాలతో పాటు ఓఎన్జీసీ గ్రీన్బిల్డింగ్స్కు రూపకల్పన చేశారు. ప్రముఖ నగరాల్లో ఇన్ఫోసిస్ బిల్డింగ్లు, ఏవీ బిర్లా ట్రైనింగ్ సెంటర్ నిర్మాణంలో ఆయన నైపుణ్యం కనిపిస్తుంది. నగరంలోని మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదనలను గతంలో హఫీజ్ సిద్ధం చేశారు. ఎందుకనో అది కార్యరూపం దాల్చలేదు. తాజాగా బహుళ అంతస్తులతో పాటు మూసీ సుందరీకరణకు హఫీజ్ బృందం డిజైన్ చేయనుంది. చేపట్టనున్న పనులు మూసీ నది చుట్టుపక్కల ప్రాంతాల్లో కొత్త కట్టడాలు (పార్కులతో సహా) ఇందిరా పార్కు ఖాళీ స్థలంలో తెలంగాణ కళాభారతి (నాలుగు ఆడిటోరియంలతో సహా) రవీంద్ర భారతి ప్రదేశంలో హైదరాబాద్ చారిత్రక, సాంస్కృతిక ప్రత్యేకతలు చాటేలా నిర్మాణం మొజాంజాహి, చార్మినార్, హుస్సేన్సాగర్, సాలార్జంగ్ మ్యూజియంల వద్ద కొత్త ఆకర్షణలు టవర్లు, బహుళ అంతస్తుల భవనాలు చారిత్రక, వారసత్వ, సాంస్కృతిక లక్షణాలు ప్రతిబింబించడంతో పాటు ఆర్థికప్రగతికి దోహదపడేలా నిర్మాణం.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ బరితెగింపు
ఆత్మవిశ్వాసం + మనోధైర్యం..
సేవాభావం పెంపొందించుకోవాలి
భక్తిశ్రద్ధలతో శివాలయాల్లో ప్రదోష పూజలు
యువన్ శంకర్రాజా ఇండిపెండెంట్ మ్యూజికల్ ఆల్బమ్
రామేశ్వరం అగ్ని తీర్థంలో భక్తుల పుణ్యస్నానాలు
నీట్లో భిన్న ప్రశ్నపత్రాలతో గందరగోళం
వేలూరు జిల్లాలో గాలివాన
మరణంలోనూ వీడని బంధం
తప్పక చదవండి
- దుబాయ్ నుంచి సెలవుపై వచ్చి ఆంబులెన్స్ ఢీ కొట్టి..
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- Arya 20 Years Celebrations: ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- AP: పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- Telangana: మరో రెండు రోజులు వానలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- పథకాలను అడ్డుకున్నా.. గెలుపును ఆపలేరు: సీఎం వైఎస్ జగన్
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement