-
పూర్ణిమ.. ఇక ఇంటికే
కన్నవారి వద్దకు వెళ్లేందుకు ఆసక్తి సాక్షి, హైదరాబాద్: ‘తల్లిదండ్రులను కలవను, నేను వారితో ఉంటే వారికి చెడు జరుగుతుంది..’అంటూ భీష్మించుకు కూర్చున్న పూర్ణిమసాయి వైఖరిలో మార్పు వచ్చినట్టు తెలుస్తోంది. ఇంటికి వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. జూన్ 7న హైదరాబాద్ లో అదృశ్యమైన పూర్ణిమ ముంబైలో ఉన్నట్లు పోలీసులు కనుగొన్న విషయం తెలిసిందే. బుధవారం తెల్లవారుజామున నగరానికి తీసుకువచ్చిన పూర్ణిమని బాలల పరిరక్షణ సమితి(సీడబ్ల్యూసీ) ఆదేశాల మేరకు కాచి గూడ నింబోలిఅడ్డాలోని ప్రభుత్వ బాలికల సదన్కు తరలించారు. విషయం తెలుసుకొని ఉదయం బాలసదన్కు వచ్చిన ఆమె తల్లిదం డ్రులు నాగరాజు, విజయకుమారి సాయంత్రం వరకు అక్కడే వేచి ఉన్నారు. ఆమె ఉద్దేశాన్ని కౌన్సెలర్లు కూడా తెలుసుకునే ప్రయత్నం చేశారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యూసీ) సభ్యులు వెంకటేశ్వర్లు, పి.అంజన్రావు కూడా పూర్ణిమను కలసి ఇల్లు వదలి వెళ్లేందుకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ‘నేను యాక్టింగ్ కోర్సు చేస్తానంటే ఇంట్లో వద్దన్నారు. నాన్న డాక్టర్ కావాలని గట్టిగా కోప్పడ్డాడు. అందుకే ఇంటి నుంచి వెళ్లా. అమ్మనాన్నల వద్దకు వెళ్లేందుకు నాకు ఎలాంటి అభ్యంతరం లేదు’ అని ఆమె వారితో చెప్పినట్టు తెలిసింది. సాయంత్రం తల్లిదండ్రులు, అమ్మమ్మతో మాట్లాడినట్టు సమాచారం. ముంబై నుంచి దాదాపు 14 గంటలపాటు ప్రయాణం చేసి అలసిపోయిన పూర్ణిమ కుదుటపడ్డాక మాట్లా డతామని, ఆమె ఇష్టాఇష్టాలు తెలుసుకుంటా మని, ఆ తర్వాత ఆమె తల్లిదండ్రులతో మాట్లా డాక ఓ నిర్ణయానికి వస్తామని సీడబ్ల్యూసీ చైర్పర్సన్ పద్మావతి ‘సాక్షి’కి తెలిపారు. ఇప్పటికే పూర్ణిమ మానసిక స్థితి కుదుటపడేలా కౌన్సెలింగ్ ఇస్తున్నామని, ఆమె తల్లిదండ్రు లతో వెళ్లేందుకు ఇష్టంగానే ఉన్నట్టు తెలిసిం దని, రేపు మరోసారి బాలికతో మాట్లాడిన తర్వాత శుక్రవారం సీడబ్ల్యూసీ తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. పద్మావతి, వెంకటే శ్వర్లు, విజయాదేవి, నాగేశ్వరరావు, బాలా రాజ్లతో కూడిన బెంచ్ ఆఫ్ మేజిస్ట్రేట్స్ సమావేశమై పూర్ణిమతో, తర్వాత తల్లిదండ్రు లతో మాట్లాడనుంది. ప్రముఖ మానసిక నిపుణుడు వీరేందర్ పూర్ణిమకు కౌన్సెలింగ్ ఇచ్చేందుకు వెళ్లినా అనుమతించలేదు. మానసిక ఒత్తిడికి లోనైంది: అంజన్రావు పూర్ణిమ మానసికంగా ఒత్తిడికి గురైనట్లు కనిపి స్తోందని అంజన్రావు అన్నారు. బాలిక తల్లి దండ్రులతో ఉండేందుకు అయిష్టత వ్యక్తం చేస్తూనే, ఒక్కోసారి వెళతానని అంటోందన్నా రు. పూర్ణిమని మాదాపూర్ డీసీపీ విశ్వ ప్రసాద్, కూకట్పల్లి ఏసీపీ భుజంగరావు కలిశారు. బాలిక మనస్సులో ఏదో ఆందోళనకరమైన విషయం ఉన్నట్లు కనిపిస్తోందని వారు తెలి పారు. బాలిక ఆరోగ్యంగానే ఉందన్నారు. తల్లిదండ్రులకు పంపే విషయంలో సీడబ్ల్యూ సీదే తుది నిర్ణయమని చెప్పారు. చదువులోనూ ముందంజే... నిజాంపేటలోని భాష్యం స్కూల్లో చదివే పూర్ణిమ విద్యార్థులందరితో కలివిడిగా ఉండడం తోపాటు చదువు విషయంలోనూ ముందంజలో ఉంటుందని ప్రిన్సిపాల్ సుధీర్ తెలిపారు. 70 శాతం పైగా మార్కులు సాధించి తరగతి గదిలో ముందువరుసలో ఉంటుందని చెప్పారు. ఆమె స్నేహితులు సాయిశ్రీ, పూజిత, దుర్గ మాట్లాడుతూ పూర్ణిమ అప్పుడప్పుడూ ఒంటరిగా ఉండి ఏదో ఆలోచిస్తుండేదన్నారు. ఆమెను ఏదైనా బాధ ఉన్నదా? అని అడిగితే తనకు ఇంట్లో అవమానం జరుగుతోందని చెప్పేదని వివరించారు. తన సోద రిని ఒక విధంగా, తనను మరోవిధంగా తన తల్లి దండ్రులు చూడడం ఎంతో బాధ కలిగించిందని చెప్పేదన్నారు. తనకు బ్యాంక్ ఉద్యోగం చేయాలని కూడా ఉందని పూర్ణిమ కొన్ని సందర్భాల్లో చెప్పినట్లు స్నేహితులు వివరించారు. ఇంట్లో జరుగుతున్న చిన్న, చిన్న మనస్పర్ధలే ఆమె ఇంటి వదిలివేయడానికి కారణం అయి ఉండవచ్చని ఆమె స్నేహితులు అభిప్రాయపడ్డారు. -
పూర్ణిమ సాయి కథ సుఖాంతం
హైదరాబాద్ : పదో తరగతి విద్యార్థిని పూర్ణిమ సాయి కథ ఎట్టకేలకు సుఖాంతమైంది. తల్లిదండ్రులతో కలిసి ఇంటికి వెళ్లేందుకు ఆమె అంగీకరించింది. సైకాలజిస్టుల కౌన్సెలింగ్తో పూర్ణిమ సాయి మనసు మార్చుకుంది. ముంబై స్టేట్హోంలో ఉన్నప్పుడు తల్లిదండ్రులకు వద్దకు వెళ్లనని, వాళ్ల ముఖాలే చూడనని తెగేసి చెప్పిన పూర్ణిమ... హైదరాబాద్కు రాగానే సానుకూలంగా స్పందించింది. గత నెల 7న అదృశ్యమై ముంబై చేరిన పూర్ణిమ సాయిని పోలీసులు ఇవాళ ఉదయం హైదరాబాద్ నింబోలి అడ్డాలోని బాలికాసదన్లో చేర్చారు. సుదీర్ఘ ప్రయాణం చేయటంతో అలసిపోయిన పూర్ణిమ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటోంది. అయితే పూర్ణిమ ఆరోగ్యం కుదుటపడ్డాకా... చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మరోసారి సమావేశమై పూర్ణిమ ఇష్టానుసారం నిర్ణయం తీసుకోనున్నారు. పూర్ణిమ తండ్రి నాగరాజు మాట్లాడుతూ ‘పూర్ణిమ మాతో రావడానికి ఒప్పుకుంది. మాతో అరగంట పాటు మాట్లాడింది. అయితే అధికారికంగా పాపను మాకు అప్పగించేందుకు మరో రెండు రోజులు పడుతుంది.’ అన్నారు. ఈ సందర్భంగా పూర్ణిమ సాయి అమ్మమ్మ మాట్లాడుతూ ‘తల్లిదండ్రులతో కలిసి ఉంటే ఆపద వస్తుందని కలలో పూర్ణిమకు షిర్డీ సాయి చెప్పాడట. సైకాలజిస్టులతో పాటు మేం కూడా నచ్చజెప్పాం. మా ప్రయత్నం ఫలించింది. తల్లిదండ్రులతో ఉండేందుకు అంగీకరించింది.’ అని తెలిపారు. మరోవైపు పూర్ణిమసాయికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని బాలల హక్కుల కమిషన్ సభ్యుడు అంజన్రావు స్పష్టం చేశారు. పూర్ణిమ సాయి ఉదంతం మొత్తాన్ని చైల్డ్ రైట్స్ కమిషన్ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తామన్నారు. బాలల హక్కుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని అసలు పూర్ణిమ ఎపిసోడ్లో ఏం జరిగిందో వాస్తవాలను తెలుసుకుంటామని చెప్పారు. -
పూర్ణిమ తల్లిదండ్రులకు చేదు అనుభవం
- అమ్మానాన్నను చూడను.. వారి వద్దకు వెళ్లను - వారు బాగుండాలన్నదే నా కోరిక: పూర్ణిమ సాయి - తల్లిదండ్రులతో ఉంటే వారికి చెడు జరుగుతుందని ‘కల’వరపాటు - కూతురును కలవకుండానే హైదరాబాద్కు చేరుకున్న తల్లిదండ్రులు - నేడు పూర్ణిమను నగరానికి తీసుకురానున్న సైబరాబాద్ మహిళా పోలీసులు సాక్షి, హైదరాబాద్/ముంబై: ‘‘నా తల్లిదండ్రులు బాగుండాలి. వారికి ఏమైనా జరిగితే తట్టుకోలేను. ఏడాది పాటు నా వారికి దూరంగా ఉంటే ఇబ్బందులు తప్పుతాయని కలలో దేవుడు చెప్పిన మాటలు నా చెవుల్లో ఇంకా మారుమోగుతూనే ఉన్నాయి’’నగరంలో అదృశ్యమై ముంబైలో ఆచూకీ లభించిన పూర్ణిమ సాయి చెపుతున్న మాటలివీ. అమ్మానాన్నలను కలవడం కాదు కదా కనీసం చూసేందుకు కూడా ఆమె ఇష్టపడటంలేదు. దీంతో తల్లిదండ్రులు నాగరాజు, విజయకు మారి పూర్ణిమను కలవకుండానే ముంబై నుంచి సోమవారం రాత్రి నగరానికి చేరుకున్నారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు, మానసిక నిపుణులు పూర్ణిమకు ఎంత చెప్పినా తల్లిదండ్రులతో వచ్చేందుకు ఆమె ఇష్టపడలేదు. దీంతో పూర్ణిమను హైదరాబాద్ తీసుకొచ్చేందుకు సైబరాబాద్ మహిళా పోలీసు లు ముంబై చేరుకున్నారు. మంగళవారం సాయంత్రానికి ఆమెను హైదరాబాద్ తీసుకు రానున్నారు. జూన్ 7న నమోదైన మిస్సింగ్ కేసును కిడ్నాప్ కేసుగా మలచడంతో ఆ కేసు విషయంలో ఆమెను రంగారెడ్డి జిల్లాలోని జువెనైల్ కోర్టు ముందు హాజరుపరచను న్నారు. ఆ తర్వాత పూర్ణిమ ఇష్టపకారం తల్లిదండ్రుల వద్దకు వెళతానంటే పంపుతారు. లేదంటే చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించి ఏదైనా హోంలో ఉంచే అవకాశం ఉంది. ‘కల’ కదిలించింది.. జూన్ 7న అంటే మిస్సింగ్కు రెండు రోజుల ముందు వచ్చిన కల పూర్ణిమను ఆగమాగం చేసింది. 5వ తేదీ తెల్లవారుజామున కలలో సాయిబాబా వచ్చి ‘నువ్వు మీ తల్లిదండ్రులతో ఉంటే వారికి ప్రాణహాని ఉంది. చెడు జరుగుతుంది. నా దగ్గరకు వచ్చేయి. లేదంటే నీ కుటుంబానికి ఇబ్బందులు తప్పవు. ఎవరికీ తెలియని ప్రదేశానికి రా’అంటూ వచ్చిన కల ఆమెను ఉక్కిరిబిక్కిరి చేసింది. అదే రోజు పూర్ణిమ అమ్మకు కడుపునొప్పి రావడంతో దానిని చెడుకు తొలి సంకేతంగా భావించింది. మరుసటి రోజు చెల్లెలు తీవ్రమైన దగ్గుబారిన పడటంతో కుటుంబంలో ఇబ్బందులు మొదలయ్యాయని అనుకుంది. దీంతో జూన్ 7న ఉదయం ఇంట్లో రూ.వెయ్యి తీసుకుని స్కూల్కు వెళుతున్నానని చెప్పి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్కు వచ్చి షిర్డీ వెళ్లే రైలు ఎక్కింది. జూన్ 8న షిర్డీ సాయి దర్శనం చేసుకుని తల్లిదండ్రులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురుకావొద్దని ప్రార్థించి.. జూన్ 9న ముంబైలోని దాదర్ రైల్వేస్టేషన్ చేరుకుంది. అక్కడికి కిలోమీటర్ దూరంలో ఉన్న బోయివాడ పోలీసుల వద్దకు వెళ్లిన పూర్ణిమ.. తన అసలుపేరు, ఊరు, తల్లిదండ్రుల పేరు చెబితే వారిని పిలిపించి తనను పంపిస్తారన్న భయంతో తాను అనాథనని అబద్ధం చెప్పింది. తన పేరు అనికశ్రీ అని, తల్లిదండ్రులు లేరని సికింద్రాబాద్లోని తుకారాంగేట్లోని సాయిశ్రీ ఆశ్రమం నుంచి వచ్చానంటూ వివరించింది. పోలీసులు ఆమెను డొంగ్రీలోని బాలసుదర్ గృహ్కు తరలించారు. సికింద్రాబాద్ సమీపంలోని ఠాణాలకు అనికశ్రీ పేరుతో ఎవరైనా తప్పిపోయారన్న కేసు నమోదైందా అని తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఆ పేరుతో అదృశ్యమైన కేసు నమోదు కాలేదని తెలియడంతో బోయివాడ పోలీసులు ఊరకుండిపోయారు. తల్లిదండ్రులను కలిసేందుకు ససేమిరా.. ఇటీవల పూర్ణిమ తల్లిదండ్రులు నాగరాజు, విజయకుమారి బాలల హక్కుల సంఘం ప్రతినిధులతో కలసి తమ పాప ఆచూకీ ఉంటే చెప్పండి అంటూ మీడియాతో మొరపెట్టుకున్నారు. ఆ వార్త ఫొటోలతో పాటు ప్రచురితం కావడంతో తుకారాం గేట్ ఇన్స్పెక్టర్ ముంబై పోలీసుల నుంచి తనకు వాట్సాప్లో వచ్చిన ‘అనికశ్రీ ఫొటో’కు పత్రికలో వచ్చిన ఫొటోకు దగ్గర పోలికలు ఉండటంతో ఆ ఫొటోను బాచుపల్లి ఇన్స్పెక్టర్ బాలకృష్ణరెడ్డికి పంపారు. ఆదివారం వారు తల్లిదండ్రులను పిలిపించి ఫొటోను చూపగా.. అందులో ఉన్నది తమ అమ్మాయేనని ధ్రువీకరించారు. సోమవారం పోలీసులతో కలసి తల్లిదండ్రులు నాగరాజు, విజయకుమారి ముంబై వెళ్లగా.. వారిని కలిస్తే ఏమవుతుందోనన్న భయంతో పూర్ణిమ తల్లిదండ్రులను చూసేందుకు, కలిచేందుకు ససేమిరా అంది. మానసిక నిపుణులు కూడా ఆమె ఇష్ట్రపకారం మీరు కలవకండి అని చెప్పారని ముంబైకి వెళ్లిన బాచుపల్లి ఎస్సై శంకర్ ‘సాక్షి’కి తెలిపారు. ‘అనికశ్రీ’ పేరు వెనక కథ ఇదే.. స్టార్ప్లస్ టీవీ చానల్లో ప్రసారమయ్యే ఇష్క్బాజ్ సీరియల్ను పూర్ణిమ చూసేది. ఆ సీరియల్స్లో అనికశ్రీ పాత్రను ప్రముఖ సీరియల్ నటి సురభి చందన పోషిస్తోంది. ఆ పాత్రకు మంత్రముగ్ధురాలైన పూర్ణిమ ఏకంగా ఆ నటితో ఇన్స్ట్రాగామ్లో చాట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. పూర్ణిమ అని చెబితే పోలీసులకు దొరికిపోయే అవకాశం ఉండటంతో తనకు ఇష్టమైన అనికశ్రీ పేరు చెప్పినట్టు తెలుస్తోంది. పూర్ణిమకు నటనపై ఉన్న మక్కువతోనే ముంబైకి వచ్చి ఉంటుందని, చివరకు ఆ సీరియల్లో పాత్ర పేరు ‘అనిక శ్రీ’నే తన పేరుగా బోయివాడ పోలీసులకు చెప్పడం దీన్ని స్పష్టం చేస్తోందని పోలీసులు చెపుతున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు కొత్తకోటకు సీఎం రేవంత్ రాక..
‘నీట్’కు ఏర్పాట్లు పూర్తి
ఐదుగురి నామినేషన్లు
పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాకేష్రెడ్డి
సుందర మున్నేరే లక్ష్యం..
నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు
నేడు, రేపు డిప్యూటీ సీఎం భట్టి పర్యటన
పకడ్బందీగా విధులు నిర్వర్తించాలి
బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం
ముగ్గురు మంత్రులం ఉన్నాం..
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement