-
సమాజంలో మార్పు రావాలి
అప్పుడే అత్యాచారాలను అడ్డుకోవచ్చు: కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి కిస్ ఆఫ్ లవ్ను కమ్యూనిస్టులే ప్రోత్సహిస్తున్నారు: ఏబీవీపీ జాతీయ అధ్యక్షుడు సాక్షి, విజయవాడ బ్యూరో: దేశంలో అత్యాచారాలు ఆగాలంటే సమాజంలో మార్పు రావాలని, ఈ మార్పు ప్రతి ఇంటి నుంచి ప్రారంభం కావాలని కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ఆడపిల్లలను మగపిల్లలతో సమానంగా చూడాల్సిన బాధ్యత అమ్మలదేనన్నారు. విజయవాడలో 2 రోజులుగా జరుగుతున్న ఏబీవీపీ రాష్ట్ర స్థాయి మహిళా సమ్మేళనం ముగింపు సభలో శనివారం ఆమె ప్రసంగించారు. ఆడపిల్లలకు 18 ఏళ్ల వయసులోపు పెళ్లిళ్లు నిరోధించడం, వరకట్న నిరోధం, గృహ హింస, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు వంటి అనేక చట్టాలు అమల్లో ఉన్నా వాటిని యథేచ్ఛంగా ఉల్లంఘిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు ఏటా 9 శాతం చొప్పున పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అత్యాచారాలకు పేదరికం కూడా మరో ప్రధాన కారణమని, పేదరిక నిర్మూలనకు జాతీయ మిషన్ను ఏర్పాటు చేయాల్సివుందని అన్నారు. రాజధానికి భూ సమీకరణ వల్ల రైతులకు నష్టం జరగదని, దీనిపై ప్రభుత్వం చర్చలు జరుపుతుందని పురందేశ్వరి చెప్పారు. సమ్మేళనంలో పాల్గొన్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ యూపీఏ ప్రభుత్వంలో వచ్చిన భూసేకరణ చట్టం వల్ల పరిశ్రమలకు ఇబ్బందులున్నాయని, దాన్ని మార్చడానికి ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. మీ పిల్లలను కిస్ ఆఫ్ లవ్కు పంపుతారా? ఏబీవీపీ జాతీయ అధ్యక్షుడు మురళీమనోహర్ మాట్లాడుతూ.. మార్క్సిస్టు సిద్ధాంతాన్ని అనుసరించే సీపీఐ, సీపీఎం పార్టీలే కిస్ ఆఫ్ లవ్లను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ఆయా పార్టీల వారు తమ పిల్లలను ఇలాంటి వాటికి పుంపుతున్నారా? అని ప్రశ్నించారు. పిల్లల పెంపకంలో తల్లుల మైండ్సెట్ మారాలని సూచించారు. కాగా, రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన విద్యార్థినులకు వివిధ అంశాలపై బృంద చర్చలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు. సమ్మేళనంలో పాల్గొన్న వారికి తులసి మొక్కలు అందించారు. -
28 మంది డీఎస్పీలకు పోస్టింగులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 28 మంది డీఎస్పీలకు కొత్తగా పోస్టింగ్లిస్తూ డీజీపీ అనురాగ్శర్మ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవలే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వీరందరికీ ఇన్స్పెక్టర్ నుంచి డీఎస్పీలుగా పదోన్నతులిచ్చారు. అనంతరం వీరిని డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయమని చెప్పారు. కాగా, మంగళవారం డీజీపీ అనురాగ్శర్మ నేతృత్వంలోని డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ సమావేశమై వీరికి కొత్తగా పోస్టింగులిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో హైదరాబాద్లో 24 మందికి పోస్టింగులివ్వగా, మురళి మనోహర్కు సీసీఎస్ మహబూబ్నగర్ డీఎస్పీగా, గోవర్ధన్కు నాగర్కర్నూల్ డీఎస్పీగా, షేక్ అలీకి సంగారెడ్డి డబ్ల్యూపీఎస్గా, తిరుపతన్నకు సంగారెడ్డి డీఎస్పీగా పోస్టింగ్ ఇచ్చారు. -
మళ్ళీ సీక్వెల్ కూడానా?
రజనీకాంత్ నటించిన ‘కోచ్చడయాన్’కు సీక్వెల్ వస్తోందా? ఆ చిత్రం సహ నిర్మాత మురళీ మనోహర్ మాటలు వింటే అలాగే అనుకోవాల్సి వస్తోంది. త్రీడీ మోషన్ క్యాప్చర్ విధానంలో రూపొందిన ఈ చిత్ర సీక్వెల్కు తమ బృందం మరింత కష్టపడుతుందని ఆయన తాజాగా వ్యాఖ్యానించారు. ఉత్తర భారతదేశంలో ఆశించిన రీతిలో ‘కోచ్చడయాన్’కు ఆదరణ లభించలేదని అంగీకరించిన ఆయన, ఈ వ్యాఖ్య చేశారు. ‘‘పరిమిత సమయంలో, పరిమిత బడ్జెట్లో మేము చేయగలిగినదంతా చేశాం. అయితే, ఇంకా మెరుగ్గా తీసి ఉండాల్సిందని ఒప్పుకుంటున్నా. ఏమైనా, దీనికి సీక్వెల్లో మరింత కష్టపడి, బాగా తీస్తాం’’ అని మురళీ మనోహర్ అన్నారు. హిందీ ప్రాంత ప్రేక్షకులు ఈ సాంకేతిక అద్భుతాన్ని ఆస్వాదించలేకపోయారని ఆయన అభిప్రాయపడ్డారు. చిత్రం ఏమిటంటే, తమిళ, తెలుగు భాషల్లో కూడా ఈ సినిమా అంతంత మాత్రంగానే ఉన్నా, ఈ సహ నిర్మాత మాత్రం ఘన విజయం సాధించిందంటూ డబ్బా కొట్టుకున్నారు. అనుకున్న దాని కన్నా ఆలస్యమైనా, హిందీలో కూడా ఈ చిత్రంపై పెట్టిన పెట్టుబడి వెనక్కి వచ్చేస్తుందంటూ నమ్మకం వ్యక్తం చేశారు. ఈ కబుర్లు విని, సినీ విశ్లేషకులు ముక్కున వేలేసుకుంటున్నారు. అవును మరి... మొదటి సినిమాకే దిక్కు లేదంటూ ఉంటే, దీనికి సీక్వెల్ కూడానా అని పెదవి విరుస్తున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
చిన్నబోయిన చిన్నబొంకూరు
తప్పక చదవండి
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- ముస్లిం రిజర్వేషన్లే రద్దు
- ఉద్యమం అయిపోలే.. మిగిలే ఉంది
- హైదరాబాద్పై కుట్ర
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
Advertisement