-
కమ్మ వాళ్ళకి చంద్రబాబు టికెట్ ఇస్తే నేనూ పోటీలో ఉంటా..
తూర్పుగోదావరి, పెద్దాపురం: పెద్దాపురం తెలుగుదేశం పార్టీలో సామాజిక చిచ్చు రేగింది. అసెంబ్లీ టికెట్ కేటాయింపులో సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి చిన రాజప్పకు టికెట్ ఇచ్చేందుకు అభ్యంతరం లేదన్న మార్కెట్ కమిటీ చైర్మన్, సీనియర్ నాయకులు ముత్యాల రాజబ్బాయి కమ్మ సామాజిక వర్గానికి చంద్రబాబు టికెట్ ఇవ్వదలచుకుంటే నేనూ పోటీలో ఉంటానంటూ సోమవారం బహిరంగంగా ప్రకటించారు. మాజీ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే బొడ్డు భాస్కర రామారావు రెండు రోజుల క్రితం అధిష్టానం కమ్మ సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వాలని చూస్తోందని, ఆరో తేదీలోపు తనకు టికెట్ ప్రకటిస్తుందని ప్రచారం చేస్తుండడంతో అదే సామాజిక వర్గానికి చెందిన రాజబ్బాయి తాను కూడా ఈ దఫా పోటీలో ఉంటానంటూ ఆర్బీ పట్నంలో తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ప్రకటించారు. దీంతో దాదాపు కమ్మ సామాజిక వర్గంలో కూడా చిచ్చురేగడంతో ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న బొడ్డుకు ఈ ప్రకటన చుక్కెదురైనట్టయ్యింది. 1982లో పార్టీ స్థాపించిన నాటి నుంచి టీడీపీలో కొనసాగుతున్న తనకు కమ్మ సామాజిక వర్గ నాయకుడే అడ్డుపడుతూ ఉన్నాడని రాజబ్బాయి అన్నారు. గత ఎన్నికల్లో టికెట్ ఆశించిన తనకు చంద్రబాబు ఈ దఫా చిన రాజప్ప గెలుపునకు కృషి చేస్తే ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చారన్నారు. ఇప్పటికీ ఆయన తనకు న్యాయం చేస్తాననడంతోనే సమన్వయ కమిటీ తరఫున తాను రాజప్పకు మద్దతు ఇచ్చానన్నారు. ఆయనకు కాకుండా కమ్మ సామాజిక వర్గం నుంచే పెద్దాపురం అసెంబ్లీ టికెట్ కేటాయిస్తే చంద్రబాబు తనకు టికెట్ కేటాయిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. దీనిపై మరోమారు చంద్రబాబును కలుస్తానని రాజబ్బాయి ప్రకటించారు. సమావేశంలో గ్రామ నాయకులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు. -
తిరగబడ్డ తెలు‘గోడు’
► పెద్దాపురంలో తిరుగుబాటు జెండా ► మాటతప్పిన ‘బాబు’పై రాజబ్బాయి ఫైర్ ► ఇంటిలోనే ఆమరణదీక్ష కాకినాడ: ‘ఏరుదాటాక తెప్ప తగలేసే.. సామెతను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బాగా వంటపట్టించుకుంటున్నారు. అవసరం ఉన్నంత వరకు వాడుకుని ఆనక కరివేపాకులా తీసి పడేయడంలో ఆయనకు మించిన నాయకుడు లేడంటున్నారు. ఈ మాట ఏ ప్రతిపక్షాలో అంటే రాజకీయం చేయడం కోసమని జనం అనుకుంటారు. కానీ ఆ పార్టీ కోసం కోట్లు తగలేసుకుని జండా మోసిన నాయకులే అంటే జనం నిజమని నమ్మక తప్పదు. ఇప్పుడా విషయం జిల్లాలోని పెద్దాపురం నియోజకవర్గంలో కనిపిస్తోంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో దగాపడ్డ తెలుగు తమ్ముడు తిరుగుబాటు జెండా ఎగరేయడం పార్టీలో తీవ్ర కలకలం రేపింది. ఆ నియోజకవర్గంలో ఒకప్పుడు ముఖ్యనేతగా చలామణీ అయిన ముత్యాల రాజబ్బాయి పెద్దాపురం మండలం ఆర్బీ పట్నం గ్రామం లో తన ఇంటి వద్దనే సోమవారం చంద్రబాబు ఇచ్చిన హామీ నెరవేర్చనందుకు నిరసనగా దీక్షకు ఉపక్రమించారు. రాజబ్బాయి గత సార్వత్రిక ఎన్నికల్లో పెద్దాపురం నియోజకవర్గం నుంచి టిక్కెట్టు ఆశించారు. పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ జెండాను భుజాన వేసుకుని తిరిగారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఆ నియోజకవర్గంలో పార్టీ తరఫున పోటీచేసే నాయకులకు ఆర్థికంగా వెన్ను దన్నుగా నిలిచారు. చంద్రబాబు సహా జిల్లా ముఖ్యనేతలు నిమ్మకాయల చినరాజప్ప, యనమల రామకృష్ణుడు వంటి వారు సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ టిక్కెట్టు ఇస్తుందని రాజబ్బాయిని నమ్మించారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కోట్లు తగలేసినా, చంద్రబాబు పాద యాత్ర చేస్తున్నప్పుడు అంతటా వెంటే ఉన్నా చివరకు పెద్దాపురం టిక్కెట్టు దక్కలేదు. స్థానికేతరుడైన చినరాజప్పను పెద్దాపురం నుంచి పోటీపెడుతున్నాం, కలిసి పనిచేసి సర్కార్ వచ్చాక ఎమ్మెల్సీ ఇస్తామని నమ్మించారని రాజబ్బాయి ఆవేదన చెందబుతున్నారు. చంద్రబాబు సిఎం అయ్యారు. మాట ఇచ్చిన చినరాజప్ప, యనమల ఉపముఖ్యమంత్రి, మంత్రులై పోయారు. అది జరిగి రెండేళ్లు దాటిపోయింది అయినా రాజబ్బాయికి పార్టీలో న్యాయం జరగలేదు. కానీ పార్టీ వీడిపోయిన ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు వర్గీయులు తిరిగి సైకిల్ ఎక్కి తమపై పెత్తనం చెలాయిస్తున్నారని రాజబ్బాయి వర్గం మండిపడుతోంది. ఇచ్చిన మాటకు కట్టుబడి అప్పుడు పోటీ నుంచి విరమించుకుంటే ఇస్తామన్న ఎమ్మెల్సీ పదవి ఇవ్వకపోగా బ్యానర్లు, పోస్టర్లకే పరిమితమయ్యే నాయకులకు వత్తాసు పలుకుతున్నారని రాజబ్బాయి వర్గీయులు అగ్గిమీదగుగ్గిలమవుతున్నారు. చివరకు అందరినీ ఒకేలా చూడాల్సిన రాజప్ప కూడా పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తూ పార్టీ కోసం రెక్కలు ముక్కలు చేసుకున్న తమ లాంటి వారిని కరివేపాకుల్లా తీసిపడేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజబ్బాయి ఆమరణదీక్షకు దిగడం చంద్రబాబు అనుసరిస్తోన్న వైఖరిని స్పష్టం చేస్తోందని కార్యకర్తలు మండిపడుతున్నారు. ఆయనకు ఏదో మొక్కుబడిగా మార్కెట్కమిటీ చైర్మన్ పదవి ఇచ్చి చేతులు దులుపేసుకున్నారు. ఇప్పుడేమో కనీసం ఆ పదవికి కూడా గౌరవం ఇవ్వకుండా ప్రోటోకాల్ పాటించడం లేదని రాజబ్బాయి వర్గం రాజప్పపై నిప్పులు చెరుగుతోంది. బాబు హామీ ఇచ్చే వరకు ఆమరణ దీక్ష విడిచిపెట్టేది లేదని రాజబ్బాయి చెబుతున్నారు. జిల్లాకు బుధవారం చంద్రబాబు వస్తున్నారని తెలిసే రాజబ్బాయి ఇటువంటి బెదిరింపులకు దిగుతున్నారని, ఈ విషయంలో పార్టీ తీవ్రంగా పరిగణిస్తుందని నేతలు చెబుతున్నారు. కష్టపడ్డ వారికి పార్టీలో గుర్తింపు, పదవులు లభించడం లేదని పెద్దాపురంలో అయితే బయటపడ్డప్పటికీ జిల్లాలోని మిగిలిన నియోజకవర్గాల్లో చాపకిందనీరులా ఉందనడానికి ఈ ఘటన ఓ ఉదాహరణని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
Advertisement