-
గవర్నర్ ఫొటోతో తపాలా ‘మైస్టాంప్’
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా విశేష ఆదరణ చూరగొంటున్న ‘మై స్టాంప్’ కింద తపాలాశాఖ ఏపీ సర్కిల్ గవర్నర్ నరసింహన్ ఫొటోలతో తపాలా బిళ్లలను రూపొందించింది. దీనికి సంబంధించి ఓ ఆల్బమ్ను శుక్రవారం సాయంత్రం తపాలాశాఖ ఏపీ, తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్ట్మాస్టర్ జనరల్ బీవీ సుధాకర్ రాజ్భవన్కు వెళ్లి గవర్నర్ నరసింహన్కు అందజేశారు. ఆ తపాలాబిళ్లలు చెల్లుబాటవుతాయని, వాటిని సాధారణ పోస్టల్ స్టాంప్స్ తరహాలో వినియోగించొచ్చని గవర్నర్కు వివరించారు. తన చిత్రాలతో ఉన్న స్టాంపులు చూసి గవర్నర్ అబ్బురపడ్డారు. -
త్వరలో పోస్టల్ ఏటీఎంలు
2015 నాటికి అన్ని ఆఫీసులకు ఆన్లైన్ తపాలా సూపరింటెండెంటు రామారావు మాకవరపాలెం : తపాలాశాఖ ఏటీఎం సౌకర్యం కల్పిస్తోంది. ఆశాఖ అనకాపల్లి డివిజన్ సూపరింటెండెంట్ డి.సి.హెచ్.రామారావు ఈ విషయం తెలిపారు. మండల కేంద్రంలోని పోస్టాఫీసును శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిక్డాలతోపాటు కార్యాలయ పరిసరాలను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ 2015 నాటికి అన్ని గ్రామీణ పోస్టాఫీసులను ఆన్లైన్కు ప్రతిపాదించామన్నారు. తమ శాఖ ఆధ్వర్యంలో అనకాపల్లిలో త్వరలో ఏటీఎం ఏర్పాటు చేస్తామన్నారు. తన పరిధిలోని 47 పోస్టాఫీసుల్లో కొత్త వాతావరణం కోసం చర్యలు చేపట్టామన్నారు. ఉపాధి కూలీలు, పెన్షన్దారులకు చెల్లింపులకు అనకాపల్లి డివిజన్ పరిధిలో 392 మంది సీఎస్పీలు అవసరమన్నారు. ప్రస్తుతం 288 మంది ఉన్నారని తెలిపారు. త్వరలో మరో 35 మంది నియామకానికి వచ్చే నెల 2న అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలిస్తామన్నారు. లబ్ధిదారుల నుంచి కాకుండా స్థానిక పెద్దల నుంచి ఫిర్యాదులొస్తున్నందున సీఎస్పీలపై విచారణకు అవకాశం లేదన్నారు. తక్కువ ఖర్చుతో సేవలు ప్రజలకు తక్కువ ఖర్చుతో సేవలు లక్ష్యంగా తమ శాఖ పని చేస్తున్నదన్నారు. ఇప్పటికే లాజిస్టిక్ పేరుతో పార్శిల్ సర్వీసును ప్రారంభించామన్నారు. మై స్టాంప్ పేరుతో కొత్త కార్యక్రమాన్ని ప్రవేశపెట్టామన్నారు. రూ. 300 చెల్లిస్తే వారి ఫొటోతో స్టాంప్ను అందజేస్తామన్నారు. ఆ స్టాంపులను అతికించుకుని ఎక్కడికైనా వారు గ్రీటింగ్స్, ఇతర ఆహ్వాన పత్రికలు పంపిచుకోవచ్చన్నారు. తక్కువ కమిషన్తో ఇన్స్టెంట్ మనీయార్డర్(ఐఎంవో), మొబైల్ మనీ ట్రాన్స్ఫర్ స్కీము (ఎంఎంటిఎస్) సౌకర్యాన్ని ప్రజలకు అందిస్తున్నామన్నారు. మీ సేవ ద్వారా ప్రస్తుతం విద్యుత్ బిల్లులు కట్టించుకుంటున్నామని, త్వరలో ఫోన్ బిల్లులు, పాస్ పోర్టులకు దరఖాస్తులను స్వీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నామని వివరించారు. -
నా ఫొటో.. నా స్టాంప్..!
సాక్షి/అఫ్జల్గంజ్, న్యూస్లైన్: పోస్టాఫీసుల్లో నగరవాసులు ‘క్యూ’ కడుతున్నారు. అవును.. మీరు చదివింది నిజమే.! స్పీడ్ కొరియర్, ఇంటర్నెట్ సేవలతో శరవేగంగా దూసుకుపోతున్న హైటెక్సిటీలో ఇలాంటి పరిస్థితి ఏంటని ఆశ్చర్యపోతున్నారా? తపాలా శాఖ ప్రవేశపెట్టిన ‘మై స్టాంప్’ సేవల మహిమే ఇదంతా. మహనీయులు, విశిష్ట సందర్భాలకు చిహ్నంగా ముద్రించే తపాలా బిళ్ల (స్టాంపు)ల సరసన మీ ఫొటోతో ఉన్న స్టాంపులు కూడా ఇప్పుడు ముద్రించుకోవచ్చు. కొత్తదనాన్ని ఇట్టే ఒంటబట్టించుకునే నగరవాసులు తమ ఫొటోతో ఉన్న స్టాంప్లను ఫ్రెండ్స్కు గిఫ్ట్గా ఇస్తూ ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. నగరంలో ఈ తరహా గిఫ్ట్ల సందడి ఇప్పుడు ఊపందుకుంది. ఈ నేపథ్యంలో ‘మై స్టాంప్’ విశేషాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. ఉద్యోగాలు, పై చదువులకు దరఖాస్తులు.. పుట్టినరోజు, వివాహ వేడుకలకు ఆహ్వానాలు.. నూతన సంవత్సర శుభాకాంక్షలు.. ఇలా సందర్భమేదైనా పోస్ట్ చేయాలంటే పోస్టల్ కవరుపై తపాలా బిళ్లను అంటించాల్సిందే. గతంలో మహనీయులు, విశిష్ట సందర్భాలను గుర్తుకుతెచ్చే చిత్రాలను మాత్రమే స్టాంపులపై ముద్రించేవారు. అయితే మారుతున్న కాలానికి, నగరవాసుల అభిరుచులకు అనుగుణంగా తపాలా శాఖ సైతం తన సేవలను విస్తరించింది. వినియోగదారుల ఫోటోతో కూడిన స్టాంప్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘మై స్టాంప్’ పేరుతో ప్రారంభమైన ఈ సేవలతో మహనీయుల స్టాంపుల సరసన నిలిచే మహత్తర అవకాశం సామాన్యులను వరిస్తోంది. దీనికి పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తోంది. రాష్ట్రంలోనే తొలిసారిగా అబిడ్స్ జనరల్ పోస్టాఫీసులో ఈ ఏడాది ఏప్రిల్ 3న ‘మై స్టాంప్’ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. నగరవాసుల నుంచి అనూహ్య స్పందన రావటంతో ఈ సేవలను క్రమంగా నగరంలోని అన్ని తపాలా శాఖ కార్యాలయాలకు విస్తరించారు. అందరికీ క్రే జ్ స్టాంప్ కలెక్షన్ తరహాలో ఇప్పుడు మై స్టాంప్ అనేది క్రేజ్గా మారింది. ఇటీవలే నగర మేయర్ మాజిద్ హుస్సేన్ కూడా తన ఫొటోతో ఉన్న స్టాంప్ను తీసుకున్నారంటే నగరవాసుల్లో దీనికున్న ఆదరణను అర్థం చేసుకోవచ్చు. ఇప్పటివరకు అబిడ్స్ జీపీఓలో 125 మంది ‘మై స్టాంప్’లను తీసుకున్నట్లు తపాలా శాఖ వర్గాలు తెలిపాయి. మై స్టాంప్ను భద్రపరుచుకోవడానికి కొందరు, పేరెంట్స్, స్నేహితుల పుట్టిన, పెళ్లి రోజు వేడుకలకు గిఫ్ట్గా ఇచ్చేందుకు ఇంకొందరు తీసుకుంటున్నారు. రూ. 300కి 12 స్టాంపులు ‘మై స్టాంప్’ కావాలనుకునేవారు తపాలా శాఖ దరఖాస్తుతో పాటు ప్రభుత్వం ఆమోదించిన ఏదైనా గుర్తింపు కార్డును జతచేయాలి. స్టాంప్ సైజు ఫొటోతో పాటు రూ. 300 ఫీజు చెల్లించాలి. దరఖాస్తు ఇచ్చిన గంటలోపు ‘మై స్టాంప్’లను వినియోగదారులకు అందిస్తారు. ఒక్కో షీటులో రూ. 5 విలువ గల 12 స్టాంపులుంటాయి. మరిన్ని ఫొటోలు కావాలనుకునేవారు ప్రతీ అదనపు షీటుకు రూ. 60 చెల్లించాలి. ప్రస్తుతం 4 డిజైన్లతో కూడిన స్టాంపులే అందుబాటులో ఉన్నాయి. వీటిని కవర్లు పోస్టు చేసేటప్పుడు మాములు స్టాంపుల తరహాలోనే వాడుకోవచ్చు. వ్యక్తుల ఫొటోలు, కంపెనీ లోగోలు, ఇళ్లు.. ఇలా నచ్చిన వస్తువుల ఫొటోలనూ స్టాంపులపై ముద్రించుకోవచ్చు. అయితే అభ్యంతరకర చిత్రాలను స్టాంపులపై ఎట్టిపరిస్థితుల్లోనూ ముద్రించరు. వివరాలకు 040-23463509/19 నంబర్లలో సంప్రదించవచ్చు. తొలిస్టాంప్ నాదే.. చిన్నప్పటి నుంచి స్టాంపుల సేకరణ నా హాబీ. అలాంటిది నా ఫొటోతో స్టాంప్ అంటే నా ఆనందానికి అవధుల్లేవు. ‘మై స్టాంప్’ అందుబాటులోకి రాగానే తొలి స్టాంప్ నాకే లభించడం చాలా సంతోషంగా ఉంది. దాన్ని ఆల్బమ్లో భద్రపరుచుకున్నా. - ఎల్. నాందేవ్, తుర్కయాంజాల్, జీపీఓ స్టాంప్ ట్రెజరర్ (రంగారెడ్డి) గిఫ్ట్గా ఇచ్చి ఆశ్చర్యపరిచా! మా తల్లిదండ్రులు, స్నేహితుల పుట్టిన రోజు వేడుకలకు, పండుగలకు వారి ఫొటోతో ఉన్న స్టాంప్ను గిఫ్ట్గా ఇచ్చి ఆశ్చర్యపరిచా. మై స్టాంప్లు బహుమతిగా ఇచ్చేందుకు చాలా ఉపయోగపడతాయి. - రంజాన్ అలీ, గచ్చిబౌలి
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గైటీ థియేటర్ ప్రత్యేకత ఏమిటి? బ్రిటీషర్లు ఎందుకు నిర్మించారు?
గ్యారంటీలు అమలైతే ఓట్లడగం! : మాజీ మంత్రి హరీశ్రావు
గంపగుత్తగా రాబట్టాలని..
No Headline
ఫలానా వారి కుమార్తెలు 30 లక్షల మంది
నూర్ బాషా కులాన్ని గుర్తించింది సీఎం జగనే
Watch Live: కోరుకొండలో సీఎం జగన్ ప్రచార సభ
నియోజకవర్గంలో జూన్ 2019 నుంచి జూన్ 2023 వరకూ వివిధ పథకాలతో లబ్ధి
రాజకీయ అపర చాణక్యుడు సుబ్బరాజు
మెట్ట రాజకీయానికి కేంద్రం జగ్గంపేట
తప్పక చదవండి
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- సుప్రీం కోర్టుకు కేజ్రీవాల్ పిటిషన్
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- ఐపీఎల్లో నేటి (మే 7) మ్యాచ్
- షర్మిల.. ఎందుకిలా..!
- MI Vs SRH: ఆల్టైమ్ రికార్డు సమం
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- Modi-CBN: దొందూ దొందే!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
Advertisement