-
నయీమ్ అనుచరుడు శేషన్నను కోర్టులో హాజరుపర్చిన పోలీస్ లు
-
తెలంగాణలో సంచలన ఎన్కౌంటర్లు ఇవే!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఏడు ఎన్కౌంటర్లు చోటు చేసుకున్నాయి. అన్నీ సంచలన కేసులే కావడం గమనార్హం. వీరిలో నలుగురు మావోయిస్టులు, పేరుమోసిన మాఫియాడాన్, రెండు ఘటనల్లో సిమీ ఉగ్రవాదులు ఉన్నారు. 2015, ఏప్రిల్ 4 : తెలంగాణలో తొలి ఎన్ కౌంటర్ జరిగింది. నల్లగొండ సిమీ ఉగ్రవాదుల సంచారంతో వణికిపోయింది. 2013లో మధ్యప్రదేశ్లోని ఖాండ్వా జైలు నుంచి పారిపోయిన ఐదుగురిలో ఇద్దరు ఉగ్రవాదులు సూర్యాపేటలో బస్సులు తనిఖీ చేస్తున్న సమయంలో పోలీసులపైకి కాల్పులు జరిపి పారిపోయారు. జానకీపురం గ్రామంలో పోలీసులతో జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు సిమీ ఉగ్రవాదులు హతమయ్యారు. 2015, ఏప్రిల్ 7 : సిమీ ఉగ్రవాది వికారుద్దీన్ అతని నలుగురు సహచరులను హైదరాబాద్లోని కోర్టుకు తీసుకువస్తుండగా ఆలేరు సమీపంలో పోలీసులపైకి దాడికి దిగారు. ఉగ్రవాదులు ఫైర్ ఓపెన్ చేయడంతో పోలీసులు ఎదురుకాల్పులకు పాల్పడ్డారు. ఈ కాల్పుల్లో వికారుద్దీన్తోపాటు నలుగురు సహచరులు మరణించారు. 2015, సెప్టెంబర్ 15 : ఉమ్మడి వరంగల్ జిల్లా వెంగళాపూర్ వద్ద మావోయిస్టులకు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు ప్రాణాలు కోల్పో యారు. వీరిలో ఒకరు మహిళ. 2016, ఆగస్టు 8 : షాద్నగర్ సమీపంలోని మిలీనియా టౌన్షిప్ పరిసరాల్లో జరిగిన ఎన్కౌంటర్లో మాఫియాడాన్ నయీముద్దీన్ అలియాస్ నయీమ్ హతమయ్యాడు. 2019, జూలై 31 : కొత్తగూడెం జిల్లా రోళ్లగూడెం వద్ద జరిగిన ఎన్కౌంటర్లో న్యూడెమోక్రసీ నేత లింగన్న హతమయ్యాడు. 2019–20 : మణుగూరు మండలం బూరుగుల గ్రామంలో జాడి వీరాస్వామి అలియాస్ రఘును మట్టుబెట్టారు. 2019, డిసెంబర్ 6 : దిశ కేసులో ఆరిఫ్, శివ, నవీన్, చెన్నకేశవులు చటాన్పల్లిలో జరిగిన ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయారు. -
మళ్లీ తెరపైకి నయీం అనుచరుల ఆగడాలు
సాక్షి, యాదాద్రి : గ్యాంగ్స్టర్ నయీమ్ అనుచరుల ఆగడాలు మళ్లీ తెరపైకి వచ్చాయి. వీరిని అదుపుచేయలేక పోతున్నారని భువనగిరిజోన్ డీసీపీ ఈ.రామచంద్రారెడ్డి, భువనగిరి పట్టణ ఇన్స్పెక్టర్ వెంకన్నపై రాచకొండ సీపీ మహేష్ భగవత్ శనివారం సాయంత్రం హుటాహుటిన చర్యలు తీసుకున్నారు. కొందరు ఇటీవల సీఎం కార్యాలయంలో నయీమ్ అనుచరుల అగడాలు, పోలీ స్ల వైఖరిపై ఫిర్యాదు చేయడంతో మరోసారి అధికార యంత్రాంగం శాఖపరమైన చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా డీసీపీ రామచంద్రారెడ్డిని రాచకొండ కమిషనరేట్ కార్యాలయానికి అటాచ్ చేశారు. యూసుఫ్గూడ పీఎంటీ, పీఈటీ ఫస్ట్ బెటాలియన్ చీఫ్ సూపరింటెండెంట్కు రిపోర్టు చేసి పోలీస్ రిక్రూట్మెంట్ పూర్త య్యే వరకు పనిచేయాలని ఆదేశాలు జారీచేయగా, భువనగిరి పట్టణ ఇన్స్పెక్టర్ వెంకన్నగౌడ్ను రాచకొండ సీపీ కార్యాలయానికి అటాచ్ చేసి ఆయన స్థానంలో భువనగిరి ట్రాíఫిక్–2 ఇన్స్పెక్టర్ సురేందర్కు బాధ్యతలు అప్పగించారు. భువనగిరి శివారులో గల సర్వే నంబర్ 730లో 5.20 ఎకరాల భూమిని నయీమ్ అనుచరులైన పాశం శ్రీను, ఎండీ నాసర్లు భువనగిరి సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇటీవల రిజిష్ట్రేషన్ చేయించారని సీపీకి అందిన ఫిర్యాదుపై విచారణ జరిపారు. సిట్ ఆదేశాలతో పోలీస్లపై వెంటనే చర్యలు తీసుకున్నారు. నయీమ్ అనుచరులపై భువగగిరి పట్టణ పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేశారు. పోలీస్ అధికారి అండదండలతోనే నయీ మ్ అనుచరుల ఆగడాలు మళ్లీ మొదలయ్యాయన్న ఫిర్యాదుతోనే సీపీ సీరియస్గా స్పందించినట్లు తెలుస్తోంది. భువనగిరి కేంద్రంగా నేర సామ్రాజ్యాన్ని ప్రారంభించిన నయీం ప్రస్థానం 2016 ఆగస్టు 8న మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్ వద్ద జరిగిన ఎన్కౌంటర్తో ముగిసింది. ఎన్కౌంటర్ అనంతరం అతని ఆకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగుచూశాయి. నేర సామ్రాజ్యంలో ఉన్నత స్థాయి ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, పోలీసు అధికారులు ఇలా అన్ని వర్గాల ప్రాతినిధ్యం బయటపడింది. ప్రధానంగా భువనగిరి కేంద్రంగా నయీం, అతని అనుచరులు సాగించిన ఆకృత్యాలు, బలవంతపు వసూళ్లు, వ్యవసాయ భూములు, ఇళ్ల ప్లాట్ల బాధితులు పోలీసులు ముందుకు వచ్చారు. వారు ఇచ్చిన ఫిర్యాదులతో అప్పట్లో నయీమ్ అనుచరులపై పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపించారు. సిట్ ఏర్పాటు నయీంఎన్కౌంటర్తో వెలుగులోకి వచ్చిన వందలాది మంది బాధితులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు ప్రభుత్వం సిట్ దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేసింది. రాష్ట్ర వ్యాపితంగా 230కిపైగా సిట్ కేసులు నమోదు చేసింది. జిల్లాలో భువనగిరి పట్టణ పోలీస్స్టేషన్లో 121, రూరల్ పోలీస్స్టేషన్లో 25, యాదగిరిగుట్టలో 21, వలిగొండలో 4, చౌటుప్పల్లో 1 కేసు నమోదైంది. భువనగిరి పట్టణంలో సుమారు 50 బలవంతపు వసూళ్ల కేసులు కాగా, మిగతావన్నీ భూ కబ్జాల కేసులు నమెదయ్యాయి. టీచర్స్ కాలనీలో ప్లాట్ల కేసు భువనగిరి టీచర్స్ కాలనీ సమీపంలోని శ్రీ లక్ష్మినర్సింహస్వామి నగర్ ప్లాట్ల అక్రమణ కేసులో నయీం అనుచరులు, కుటుంబ సభ్యులపై 2016లో కేసు నమోదైంది. 1994లో భువనగిరి పట్టణ శివారు, బొమ్మాయిపల్లి శివారులోని సర్వేనంబర్లు 722, 723, 724, 726, 727, 728, 729, 730, 731, 732, 733లలో మూడు దశల్లో వెంచర్లు చేసి ప్లాట్లు విక్రయించారు. 154 ఎకరాల భూమిలో 1756 ఓపెన్ ప్లాట్ల వెంచర్లో భువనగిరి, హైదరాబాద్ ఇతర ప్రాంతాలకు చెందిన వందలాది మంది ప్లాట్లు కొనుగోలు చేశారు. 2003– 2004 నుంచి ప్లాట్లు కొనుగోలు చేసిన యజమానులకు తెలియకుండా నయీం, అతని అనుచరులు భూ యజమాని పట్టాదారు పాస్పుస్తకాలతో తమకు సంబంధించిన వ్యక్తుల పేరుమీద డబుల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అనంతరం మరికొందరికి విక్రయించారు. ఈ విషయంలో 2010లో బాధితులు పెద్ద ఎత్తున భువనగిరిలో, హైదరాబాద్లో ఆందోళన చేశారు. కానీ నయీం అనుచరులు బెదిరించడంతో పాటు అధికారులనుంచి సరైన సహకారం లభించకపోవడంతో ఈ విషయం కాస్త అటకెక్కింది. నయీం ఎన్కౌంటర్ జరగడంతో బాధితులంతా తమ ప్లాట్లను తమకు ఇప్పించాలని ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. కేసు భువనగిరి ఆర్డీఓ కార్యాలయంలో పెండింగ్లో ఉంది. పోలీస్లు కుమ్మక్కు అయ్యారా? నయీమ్ అనుచరులతో పోలీస్లు కుమ్మక్కు అయయ్యారన్న ఆరోపణలపైనే సీపీ తీవ్రమైన చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. రిటైర్మెంట్కు చేరువలో ఉన్న డీసీపీ రామచంద్రారెడ్డి జిల్లాలో విధుల్లో చేరిన నాటినుంచి రియల్ఎస్టేట్ సెటిల్మెంట్లు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. తనకింది ఉద్యోగులు కొందరితో కలిసి ఇటీవల నయీమ్ అనుచరులకు భూ సెటిల్మెంట్లకు సహకరిస్తున్నాడన్న ఫిర్యాదులు అందాయి. భువనగిరి శివారులోగల సర్వేనంబర్ 730లో ఎ5.20గుంటల భూమి అక్రమంగా ఇటీవల నయిమ్ అనుచరులు పాశం శ్రీను, అబ్దుల్ నాసర్లు కలిసి భువనగిరి, బీబీనగర్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో నయీమ్కు సంబంధించిన బినామీ ఆస్తులను రిజిస్ట్రేషన్కు సిద్ధం చేసినట్లు సమాచారం. దీంతో బాధితులు సీపీని కలిసి తమను పోలీస్లు పట్టించుకోవడం లేదన్న ఫిర్యాదు చేయడంతో ఆయన సిట్ విచారణకు ఆదేశించారు. దీంతో శనివారం సిట్ అధికారులు భువనగిరి రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. హార్డ్డిస్క్ను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు జిల్లా రిజిస్ట్రార్తోపాటు సబ్ రిజిస్ట్రార్లను విచారించారు. పాశం శ్రీను, అబ్దుల్నాసర్లతోపాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేశారు. -
పోలీసుల ఆరా
– నయీం ముఠా కార్యకలాపాలపై నిఘా – ఎన్కౌంటర్పై మిలియన్ డాలర్ ప్రశ్నలు షాద్నగర్ : నల్లగొండ జిల్లాకు చెందిన గ్యాంగ్స్టర్ నయీంకు షాద్నగర్లో ఏం పని.. ఈ పట్టణంలో ఎంతకాలంగా నివాసమున్నాడు.. ఇక్కడ కూడా తన నేరసామ్రాజ్యాన్ని విస్తరించడానికి పథకం పన్నాడా.. ఇంతవరకు ఈ ప్రాంతంలో ఎన్ని సెటిల్మెంట్లు చేశాడు.. ఇవి స్థానికుల్లో రేకెత్తుతున్న ప్రశ్నలు. మరోవైపు నయీం ఏ విధమైన కార్యకలాపాలు సాగించాడని పోలీసులు విచారణ చేపట్టారు. సోమవారం ఉదయం శివారులోని మిలినీయం టౌన్షిప్లో పోలీసులు జరిపిన కాల్పుల్లో గ్యాంగ్స్టర్ నయీం మృతిచెందిన విషయం విదితమే. ఎన్నోచోట్ల భూదందాలు, సెటిల్మెంట్లు చేసిన ఇతను చివరకు ఎన్కౌంటర్ అవుతాడని ఎవరూ ఊహించలేదు. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ ఇక్కడి పోలీసులు నయీంకు స్థానికంగా ఉండే పరిచయాలపై ఆరా తీస్తున్నారు. స్థానికులతో పరిచయాలు స్థానికంగా కొందరితో నయీంకు సంబంధాలు ఉన్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. గ్యాంగ్స్టర్తో సబంధాలున్న షాద్నగర్కు చెందిన కొందరు వ్యక్తులు తమ ఉనికి తెలియకుండా ఇతర ప్రాంతాలకు వెళ్లినట్టుగా తెలుస్తోంది. వారి సహకారంతోనే నయీం ఈ ప్రాంతంలో నివాసముంటూ తన కార్యకలాపాలు సాగించేవాడంటున్నారు. కాగా ఇతడికి షాద్నగర్ కొత్తకాదని ఎనిమిదేళ్ల నుంచే సంబంధాలు ఉండేవని మరికొందరు చెబుతున్నారు. ‘మినీఇండియా’నే సేఫ్ షాద్నగర్ పరిసర ప్రాంతంలో ఎన్నో పరిశ్రమలు ఉన్నాయి. వాటిలో పనిచేయడానికి వివిధ రాష్ట్రాల నుంచి ఎందరో వస్తుంటారు. దీంతో షాద్నగర్ పరిసర ప్రాంతం ‘మినీఇండియా’గా పిలుస్తున్నారు. అలాగే రాష్ట్ర రాజధాని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా శంషాబాద్లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి ఈ పట్టణం చేరువలోనే ఉంది. నయీం నివసించిన ఇంటినుంచి అరగంట నుంచి నలబై నిమిషాల వ్యవధిలోనే అక్కడికి చేరుకోవచ్చు. పట్టణ శివారులో ఇళ్లు ఉండటంతో తన కార్యకలాపాలు నిరభ్యంతరంగా జరుపుకోవచ్చని ఆలోచించే నయీం మిలినీయం టౌన్షిప్ కాలనీలో నివాసం ఏర్పరచుకున్నాడని ప్రజలు భావిస్తున్నారు. అంతేగాక ఎన్నో ఏళ్లుగా షాద్నగర్కు సేఫ్ జోన్ అనే పేరుంది. ఇక్కడి నుంచి తన కార్యకలాపాలు సాగిస్తే ఎవరికీ అనుమానం రాదనే మకాం వేశాడని పలువురు చర్చించుకుంటున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆదివాసీల హక్కుల జోలికొస్తే ఊరుకోం
ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి
గర్భిణులూ జెర జాగ్రత్త..
న్యూస్రీల్
వడగండ్ల వాన
‘బీఆర్ఎస్తోనే గ్రామాల అభివృద్ధి’
● ఎమ్మెల్యేలకు ప్రతిష్టాత్మకంగా పార్లమెంట్ ఎన్నికలు ● ప్రచారంపై దృష్టి పెట్టిన ప్రజాప్రతినిధులు ● అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత మారిన పరిస్థితులు ● అధికార కాంగ్రెస్లో చేరికలు ప్రభావం చూపేనా..?
ఉద్యోగాలిప్పిస్తానని ఘరానా మోసం
ఎన్నికల వేళ డేగకళ్ల నిఘా
నాంచారమ్మ జాతర విజయవంతం చేయండి
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement