-
కేసీఆర్పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదు: ఎంపీ నామా
సాక్షి,ఖమ్మం జిల్లా: సత్తుపల్లిలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో ఎంపీ నామా నాగేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నేను రైతు బిడ్డని, చిన్నప్పటి నుంచి కష్టాలు చూసినవాడిని.. తెలంగాణా రాకముందు బ్రతుకు దెరువు కోసం వలసలు ఉండేవని గుర్తు చేశారు’. 9 ఏళ్ళ కాలంలో అనేక పథకాలను కేసీఆర్ ప్రవేశ పెట్టారని వేలాది కోట్ల రూపాయలను పట్టణాల అభివృద్ధికి ఖర్చు చేశారని కొనియాడారు. తెలంగాణ మీద కన్నుగుట్టి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని ఆపాలని కేంద్ర ప్రభుత్వం మాయ మాటలు చెబుతోందని ధ్వజమెత్తారు. ఒక ఎంపీని పిలవకుండా హైదరాబాద్లో కార్యక్రమాలు చేశారని మండిపడ్డారు. ప్రజా ప్రతినిధులను అవమాన పరిచేలా పొంగులేటి మాట్లాడటంపై అసహనం వ్యక్తం చేశారు. విమర్శించే ముందు చరిత్ర తెలుసుకోవాల్సిన మాట్లాడాల్సిన అవసరం ఉందని, ఇటువంటి పద్దతులు మార్చుకోవాలని హితవు పలికారు. కేసీఆర్పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని ఫైర్ అయ్యారు. ఏ ఎన్నికలైన ఖమ్మం ప్రజలు సీఎంకు అండగా ఉంటారని పేర్కొన్నారు. అనేక సేవా కార్యక్రమాల చేస్తున్న పార్థ సారథి రెడ్డి పై బండి సంజయ్ విమర్శలు చేయటం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. -
‘నామా’ పురాణం బట్టబయలు
సాక్షి, హైదరాబాద్: టీడీపీ మాజీ ఎంపీ నామా నాగేశ్వర్రావు హైదరాబాద్కు చెందిన ఓ మహిళను బ్లాక్మెయిల్ చేసిన ఉదంతం ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సంచలనమైంది. నగ్న చిత్రాలున్నాయని, వాటిని బయటపెడతానని నామా బెదిరించడంపై హైదరాబాద్కు చెందిన మహిళ జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో నామా నాగేశ్వర్రావుతోపాటు ఆయన సోదరుడు సీతయ్యలపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. దీనిపై శనివారం ‘సాక్షి’ ప్రచురించిన కథనం రెండు రాష్ట్రాల్లో దుమారం రేపింది. బాధ్యతాయుతంగా ఉండాల్సిన ప్రజాప్రతినిధి మహిళ పట్ల వ్యవహరించిన తీరు మీడియాలో చర్చనీయాంశమ యింది. బాధిత మహిళ సుజాతా రామకృష్ణన్ కూడా నేరుగా మీడియా ముందుకు వచ్చారు. తనను నామా బెదిరించారని, అసభ్య పదజాలంతో దూషించారని, నగ్నచిత్రాలను బయటపెడతానని భయభ్రాంతులకు గురిచేశారని ఆవేదనను వెలిబుచ్చారు. నామా తనతో సంభాషించిన ఆడియోలను కూడా విడుదల చేశారు. మరోవైపు టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కూడా ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. విలేకరులు అడిగిన ప్రశ్నకు ‘అదంతా వ్యక్తిగత వ్యవహారం.. పరిశీలిస్తాం.’ అని చెప్పి తేలిగ్గా కొట్టిపారేయడం గమనార్హం. బాబు సమాధానం చెప్పాలి: సుజాత బాధిత మహిళ సుజాతా రామకృష్ణన్ మీడియాతో మాట్లాడిన సందర్భంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంపై తాను రెండు నెలల క్రితమే పోలీసులకు ఫిర్యాదు చేసినా కొందరు టీడీపీ నేతలు, మాజీ మంత్రులు కలసి కేసు నమోదు కాకుండా పోలీసులపై ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. తన కుమారుడిని ఓ రౌడీషీటర్తో బెదిరించారని, ఫిర్యాదు వెనక్కు తీసుకోవాలని చాలా ఒత్తిడి తెచ్చారని పేర్కొన్నారు. మహిళా సాధికారత కోసం పనిచేస్తానని చెబుతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ విషయంపై స్పందించాలని డిమాండ్ చేశారు. మహిళలను లొంగదీసుకుని, బెదిరించే మనస్తత్వం ఉన్న నామాను పార్టీ పొలిట్బ్యూరోలో ఎలా కొనసాగిస్తారో బాబు సమాధానం చెప్పాలని, ఈ విషయంలో తనకు న్యాయం చేయాలని కోరారు. త్వరలోనే నోటీసులు : ఈ ఉదంతంపై త్వరలోనే మాజీ ఎంపీ నామా నాగేశ్వర్రావుకు నోటీసులిచ్చి విచారణ జరుపుతామని జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు. బాధిత మహిళ గతంలో రెండుసార్లు ఫిర్యాదు ఇచ్చిందని, అయితే, ఎలాంటి ఆధారాలు చూపనందున ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదన్నారు. తాజాగా ఫిర్యాదుతోపాటు ఆడియో, వీడియో ఆధారాలు ఇచ్చినందున వాటిని పరిశీలించి నామా, ఆయన సోదరుడు సీతయ్యపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. త్వరలోనే నోటీసులిచ్చి చట్టప్రకారం నామాను విచారిస్తామని చెప్పారు. మరోవైపు సుజాతా రామకృష్ణన్ వాంగ్మూలాన్ని జూబ్లీహిల్స్ పోలీసులు శనివారం నమోదు చేసుకున్నారు. ఈ రికార్డు ఆధారంగానే నామాకు నోటీసులిచ్చి విచారణ జరపనున్నారు. నా జీవితం తెరిచిన పుస్తకం టీడీపీ మాజీ ఎంపీ నామా నాగేశ్వర్రావు సాక్షి, అమరావతి: తనపై సుజాత చేసిన ఆరోపణల మీద టీడీపీ మాజీ ఎంపీ నామా నాగేశ్వర్రావు స్పందించారు. టీటీడీపీ సమావేశంలో పాల్గొనేందుకు శనివారం విజయవాడ వచ్చిన ఆయన ఏపీ సీఎం క్యాంపు కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడారు. తాను బ్లాక్ మెయిల్ చేసినట్లు ఎవరో ఆరోపించిన విషయం తనకు తెలిసిందని, అందుకే బయటకు వచ్చి మాట్లాడుతున్నానన్నారు. ఇంకా పూర్తి వివరాలు తనకు తెలియవని, తెలుసుకున్న తర్వాత మాట్లాడుతానన్నారు. తన జీవితం తెరిచిన పుస్తకమని, తాను ఎవరినీ బ్లాక్ మెయిల్ చేయలేదన్నారు. నలుగురికీ సాయపడ్డానే తప్ప ఎవరినీ ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదన్నారు. సుజాత మీకు తెలుసా అని మీడియా ప్రతినిధులు అడిగినా స్పందించకుండా ఆయన వెళ్లిపోయారు. నామా, సుజాతల ఆడియో సంభాషణ ఇదీ... సుజాత: ఎందుకు అరుస్తారు అసలు నామా: సంబంధం లేదన్నాను. ఒకసారి చెప్పాను.. వందసార్లు చెప్పాను.. నువ్వు కావాలని చెప్పి చేయించి కాదంటావు.. ప్రామిస్ చేయమంటావు. సుజాత: ఏమీ లేనప్పుడు ప్రామిస్ చేయడానికి ఏమైంది? నామా: నువ్వెవరివే అసలు. నువ్వు నా గురించి ఎంక్వైరీ చేస్తున్నప్పుడు.. నా మీద కాన్ఫిడెన్స్ లేనప్పుడు నాతో మాట్లాడకు అని వందసార్లు చెప్పా. నాతో మాట్లాడకు. అంతే.. ఒకటే మాట. నువ్వు ఇంత చిల్లర (బూతు మాట).. కాబట్టి డ్రైవర్ల దగ్గర ఎంక్వైరీ చేయడమేనా.. ఇదేనా నీ పద్ధతి. సుజాత: వాళ్లను అడిగితే లేని విషయాలు బయటకు వస్తాయా? నామా: ఏంటే... నువ్వు చిల్లర... కాబట్టి కథలు అల్లుతున్నావే. రోజుకో కథ అల్లి దొబ్బుతున్నావు. దొంగ (బూతు) ఒకసారి చెప్తారు.. రెండుసార్లు చెప్తారు... రోజూ ఆట అయిపోయింది నీకు.. ఇది కాదే బ్లాక్మెయిల్? సుజాత: ఎందుకు, నిజాన్ని అడగడం బ్లాక్మెయిలా? నామా: నీ..... సుజాత: నిజం అడిగితే బ్లాక్మెయిలా... నాకు చెప్పండి.. ప్రామిస్ చేస్తారా... లేదా? నామా: ఈ మాట మాట్లాడకు. నాకు సంబంధం లేదని చెప్పాను. సుజాత: అంటే.. లేనప్పుడు ఎందుకు ప్రామిస్ చేయవు? నామా: (బూతు మాట) నాకు సంబంధం లేదంటే నీకేంటే ప్రామిస్ చేసేది... (బూతు మాట) సుజాత: నువ్వెవరు నన్ను (బూతు మాట) అనడానికి నామా: బూతుమాట సుజాత: అంటే అది నిన్ను పెళ్లి చేసుకుందా. అది పతివ్రతా.. అంటే నువ్వు దానికి తాళి కట్టావు. అంతే కదా.. అందుకే కదా అది నిన్ను మొగుడు అని చెప్పుకుంటుంది. నామా: పద్ధతి ప్రకారం మాట్లాడు సుజాత: నేను పద్ధతి ప్రకారమే మాట్లాడుతున్నా. అది నిన్ను మొగుడు అని ఎందుకు చెప్పుకుంటుంది? నీ గురించి మాట్లాడినప్పుడు హస్బెండ్.. హస్బెండ్ అని ఎందుకు చెప్తోంది.. నామా: అది ఎవరో నాకు తెలియదు. దాంతో నువ్వు (బూతు మాట)... ఆ సంగతులు నాతో మాట్లాడకు. నువ్వు తప్పుడు (బూతు మాట) కాబట్టి అలా చేస్తున్నావు. సుజాత: అవును.. మరి నువ్వేంటి... నువ్వేంటి? నామా: అది చిల్లర (బూతు మాట) కాబట్టి నాకు సంబం«ధం లేని విషయం అది సుజాత: అంటే అది నిన్ను మొగుడని చెప్పుకోవచ్చా? నామా: ఈ విధంగా బ్లాక్మెయిల్ చేయడం సుజాత: ఏంటి బ్లాక్మెయిల్.... నువ్వు ఏమీ చేయనప్పుడు బ్లాక్మెయిల్ ఎందుకవుతుంది? నువ్వు ఏం తప్పు చేయనప్పుడు నీకు ఎందుకంత కోపం వస్తోంది? నామా: మెస్సేజ్లు పెడతావు...బ్లాక్మెయిల్ చేస్తావు... సుజాత: ఏం చేశాను.. ఏం ఫోటోలు పంపించాను.. ఏం పంపించాను నామా: నా మాట మీద కాన్ఫిడెన్స్ లేనప్పుడు నాతో మాట్లాడకు. ఒకటే మాట. సుజాత: అంటే నువ్వు దాంతో...? నామా: ఏయ్.. పో... (బూతు మాట) సుజాత: ఇవాళ మధ్యాహ్నం కూడా దానితో మాట్లాడావు. నామా: నీ... (బూతు మాట) నాకు సంబంధం లేదని చెప్తున్నా.. పద్ధతిగా మాట్లాడు. సుజాత: నేను ప్రూవ్ చేస్తే ఏం చేస్తావు ఇప్పుడు. ఇంతకుముందు ఒకసారి ఒప్పుకున్నావా లేదా దాంతో నీకుందని ఒప్పుకున్నావా లేదా? నామా: నువ్వొక... చూడు... ఇక మొదలుపెట్టానంటే... నువ్వు తలెత్తుకోకుండా చేస్తా.. నువ్వు మాట్లాడుతున్నావు చెప్తున్నా.. సుజాత: ఓకే... నామా: చిల్లర మాటలు మాట్లాడకు.. చెప్తున్నా.. సుజాత: ఓకే చెయ్యి.. నామా: ఏమనుకుంటున్నావో నువ్వు... సుజాత: ఏం చేస్తావు... నన్ను తలెత్తుకోకుండా చేస్తానన్నావు.. ఏం చేస్తావు. రెండో ఆడియో టేపులోని సంభాషణలు.. నామా: నీకు నమ్మకం ఉంటే చెయ్యి... లేకపోతే లేదు. సుజాత: నాకు నమ్మకం ఎలా ఉంటుంది... నీ మీద నామా: పెట్టు సుజాత: నువ్వు వాళ్లతో ఆడే డ్రామాలు వాళ్లతో ఆడుతున్నావ్... వాళ్లకేమో నా మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని చెప్తున్నావ్. నామా: నువ్వు ఇదే మాట్లాడుతున్నావ్ సుజాత: సరే...నరేంద్ర నీకు తెలుసని ప్రూవ్ చేస్తే ఏం చేస్తావ్... జూలై నెలలో వాడు నీకు కాల్స్ చేశాడు.. నీవ్వు వాడితో మాట్లాడావని ప్రూవ్ చేస్తే ఏం చేస్తావ్? నామా: తప్పు మాట్లాడుతున్నావ్. తప్పు మాట్లాడుతున్నావ్. సుజాత: 2014 నీ కాల్స్ లిస్టు నా దగ్గర ఉందని నీకు తెలుసు కదా. నామా: నువ్వు మొదలుపెట్టిందే మాట్లాడుతు న్నావ్.. ఇక దయచేసి నాకు ఫోన్ చెయ్యకు సుజాత: ఓకే సరే అయితే నామా: నువ్వు మారిపోతానంటే... సుజాత: నువ్వు మారవా... నామా: నువ్వు తప్పు మాట్లాడుతున్నావ్. వాళ్లతో మాట్లాడావ్, వీళ్లతో మాట్లాడావ్.. నాకు ఎవ్వరితో మాట్లాడే అవసరం లేదు. సుజాత: అవునా... నువ్వు టీఆర్ఎస్లో చేరుతున్నావ్. నీ పొలిటికల్ కెరియర్ కోసం నన్ను విత్డ్రా చేసుకోమంటున్నావ్. అంతేగానీ.. నామా: నా పొలిటికల్ కెరీర్ గురించి నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు. నా పొలిటికల్ కెరీర్ గురించి నువ్వు అడగొద్దు. నా పొలిటికల్ కెరీర్ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు. అర్థమైందా..? సుజాత: నా పర్సనల్ లైఫ్ గురించి మాత్రం నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చు నామా: తప్పులు మాట్లాడుతున్నావ్.. ఛండాలంగా మాట్లాడుతున్నావ్ సుజాత: అవునా... నామా: కావాలని మాట్లాడుతున్నావ్... కావాలని చేస్తున్నావ్.. సమస్యే లేదు. ఇలాంటి చిల్లర పనులు నేను చెయ్యను. చేయబోను. కేసు విత్డ్రా చేసుకుని తర్వాత మాట్లాడు. (ఇంతలోనే ఫోన్ కట్ అయిపోయింది) -
ఖమ్మం గుమ్మంలో ‘తుమ్మల’
రాజకీయ వ్యూహకర్తగా పేరు.. మారనున్న జిల్లా రాజకీయ ముఖచిత్రం సాక్షి ప్రతినిధి, ఖమ్మం: రాజకీయ చాణుక్యడిగా పేరున్న తుమ్మల నాగేశ్వరరావుకు మంత్రివర్గంలో చోటు లభించడంతో జిల్లా రాజకీయాల్లో అ నూహ్య పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. టీడీపీ నేతగా దాదాపు నాలుగు దశాబ్దాల పాటు రాజకీయ ఏకచత్రాధిపత్యాన్ని సాగించిన తుమ్మల భుజస్కంధాలపై ఖమ్మం జిల్లాలో నామమాత్రంగా ఉన్న టీఆర్ఎస్ను బలోపేతం చేయాల్సిన బాధ్యత ఉంది. దశాబ్దకాలం తర్వాత మంత్రి గా బాధ్యతలు చేపట్టిన తుమ్మల కమ్యూనిస్టుల కంచుకోటగా, కాంగ్రెస్కు ఆయువుపట్టుగా ఉన్న జిల్లాలో లక్ష్య సాధనలో రాజకీయంగా ముందు ఎవరివైపు గురి పెడతారనే అంశం చర్చనీయాం శమైంది. టీడీపీలో ఉన్నప్పుడు తనకు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు తదితరుల వ్యూహాలకు భిన్నంగా టీడీపీ శ్రేణులను గులాబీదళం వైపు మరల్చుకోవడానికి ప్రధాన దృష్టి సారించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వంటి నేతల సొంత జిల్లా కావ డం, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన రేణుకా చౌదరి ప్రభావం జిల్లాపై ఉన్న నేపథ్యంలో జిల్లాలోని కొందరు కాంగ్రెస్ శ్రేణుల్లో గూడుకట్టుకున్న అసంతృప్తి, నిరాశను తనవైపు ఏ మేర కు తిప్పుకోగలుగుతారన్న భావన వ్యక్తమవుతోంది. టీడీపీ లక్ష్యంగా.. తెలంగాణలో తెలుగుదేశంను తుడిచి పెట్టడమే లక్ష్యంగా తుమ్మల పావులు కదిపే అవకాశం ఉం దని... కాంగ్రెస్, టీడీపీ తదితర పార్టీల్లో ఇమడలేని నేతలపై తుమ్మల ఇప్పటికే దృష్టి సారించారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు జి ల్లాకు మంత్రిపదవి లేకపోవడంతో టీఆర్ఎస్లో ఎవరికి వారే యమునా తీరే అన్న పరిస్థితుల్లో పార్లమెంట్ సెక్రటరీ జలగం వెంకట్రావును, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, పార్టీకి ఇద్దరు శాసనసభ్యులను సమన్వయం చేసుకుం టూ పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సి ఉంది. -
తనయ కష్టం చూడలేక తండ్రి ఆత్మహత్య
అతనికి కూతురంటే ప్రాణం. భారీగా కట్నకానుకలు ఇచ్చి ఆమెకు పెళ్లి చేశాడు. పెళ్లరుున ఏడాదిన్నరకే ఆమెను అల్లుడు వేధిస్తుండడాన్ని తట్టుకోలేకపోయూడు. భర్త దగ్గర ఉండలేకపోతున్నానంటూ పుట్టింటికొచ్చి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న కూతురిని చూసి ఆ తండ్రి గుండె చెరువైంది. ఆమె ఏదైనా అఘారుుత్యం చేసుకుంటుందేమోనని అతడు నిత్యం భయపడుతుండేవాడు. తీవ్రంగా మదనపడుతుండేవాడు. ఎంతో ప్రేమగా పెంచుకున్న తన చిట్టి తల్లికి వచ్చిన కష్టాన్ని చూసి తట్టుకోలేక, ఆమె కన్నీళ్లను తుడవలేక తనువు చాలించాడు. పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వందనం (ఖమ్మం అర్బన్): తన కూతురిని అల్లుడు వేధిస్తుండడాన్ని తట్టుకోలేని ఓ వ్యక్తి పురుగు మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అతని కుటుంబీకులు తెలిపిన ప్రకారం...వందనం గ్రామస్తుడు పున్నం నరసింహా రావు(43) తన చిన్న కూతురు శివాణిని, గోపాలపురం గ్రామానికి చెందిన దొండపాటి సురేష్కు ఇచ్చి 18 నెలల క్రితం వివాహం చేశాడు. హైదరాబాదులోగల ప్రైవేటుబ్యాంక్లో ఉద్యో గం చేస్తున్న సురేష్కు వివాహ సమయంలో నాలుగు ఎకరాల భూమి, కొంత బంగారం, సుమారు 60లక్షల రూపాయలు కట్నంగా ఇచ్చాడు. శివాణి-సురేష్ దాంపత్యం జీవితం కొన్నాళ్లపాటు బాగానే సాగింది. వారు హైదరాబాద్లో కాపురం పెట్టారు. అప్పటికే సురేష్కు తన సహోద్యోగితో వివాహేతర సంబంధం ఉంది. శివాణిని వదిలించుకోవాలని నిర్ణరుుంచుకున్న సురేష్.. ఆమెను రకారకాలుగా హింసించసాగాడు. ఈ విషయం తన తల్లిదండ్రులకు చెబితే తట్టుకోలేరనే భయంతో ఆమె కొంతకాలం ఈ హింసను భరించించింది. చివరికి ఆమె రెండు నెలల కిందట పుట్టింటికి వచ్చి తన తల్లిదండ్రులకు మొత్తం విషయం చెప్పి విలపించింది. ఆమె ఇక్కడకు వచ్చిన తరువాత కూడా సురేష్ వేధించడం మానలేదు. ఆమెను బెదిరిస్తూ సెల్ఫోన్కు మెసేజ్లు పంపించసాగాడు. తన కూతురు ఏదైనా అఘా యత్యం చేసుకుంటుందేమోనని నరసింహారావు నిత్యం భయపడుతుండేవాడు. ఈ వేదనతోనే అతడు గత మంగళవారం తన ఇంటి వద్ద పురుగు మందు తాగాడు. అప్పటి నుంచి హైదరాబాదులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతడు గురువారం రాత్రి మృతిచెందాడు. కూతురు శివాణిని అల్లుడు సురేష్తోపా టు అతని తమ్ముడు, తండ్రి వేధిస్తుండడాన్ని తట్టుకోలేకనే నరసింహారావు ఆత్మహత్య చేసుకున్నట్టుగా అతని కుటుంబీకులు చింతకాని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మృతదేహంతో రాస్తారోకో నరసింహారావు మృతదేహాన్ని అతని కుటుంబీ కులు, బంధువులు శుక్రవారం గోపాలపురం తీసుకొచ్చారు. సురేష్ ఇంటి ఎదుట ఖమ్మం- వైరా ప్రధాన రహదారిపై మృతదేహాన్ని ఉంచి రెండు గంటలపాటు ఆందోళనకు దిగారు. రెండు వైపులా ట్రాఫిక్ నిలిచిపోవడంతో అర్బన్ సీఐ శ్రీధర్ వెళ్లి, డీఎస్పీతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తానని ఆందోళనకారులకు నచ్చచెప్పి శాంతింపచేశారు. అదే సమయంలో అటువైపు వచ్చిన మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు ఆగారు. శివాణితో మాట్లాడారు. మృతుని కుటుంబానికి తగిన న్యాయం చేయాలని సీఐని కోరారు. -
మీ అందరికీ రుణపడి ఉంటా : తుమ్మల
సత్తుపల్లి : ‘నాకు రాజకీయ జన్మనిచ్చి ఈ స్థాయికి తీసుకొచ్చిన మీ అందరి జన్మజన్మలా రుణపడి ఉంటా’నని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భావోద్వేగానికి లోనయ్యారు. సత్తుపల్లిలోని చల్లగుళ్ల నర్సింహారావు నివాసంలో ఆదివారం జరిగిన ఐదు నియోజకవర్గాల ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘గత 30 సంవత్సరాలుగా ఎలా పని చేశమో, భవిష్యత్తులో కూడా మీ కీర్తి ప్రతిష్టల కోసం.. మీ సౌభాగ్యం కోసం, మీ తుమ్మల పనిచేస్తాడు.. మీరిచ్చిన అపూర్వ సంఘీభావం జీవితాంతం గుర్తు పెట్టుకుంటా..’ అని అన్నారు. పలుమార్లు కంటతడి పెట్టిన తుమ్మల... టీడీపీకి రాజీనామా చేసిన జిల్లా అధ్యక్షులు కొండబాల కోటేశ్వరరావు మాట్లాడుతున్న సమయంలో తుమ్మల నాగేశ్వరరావు పలుమార్లు కన్నీటి పర్యంతమయ్యారు. ‘తుమ్మల నిర్ణయానికి కట్టుబడి ఉంటాం.. మీ అనుమతితో ప్రతిష్టాత్మకమైన నిర్ణయాన్ని ప్రకటిద్దాం.. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పనిచేద్దాం.. మీ అందరి అనుమతితో సభ్యత్వం తీసుకుందాం.. తుమ్మల నాయకత్వాన్ని బలపర్చుదాం’ అని కొండబాల కోటేశ్వరరావు కార్యకర్తల హర్షద్వానాల మధ్య ప్రకటించటంతో తుమ్మల నాగేశ్వరరావు కన్నీరు ఆపుకోలేకపోయారు. దీంతో సభాప్రాంగణంలో నిశ్శబ్దం అలుముకుంది. ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ మాట్లాడుతూ జిల్లాలో నియంతలా తయారైన వ్యక్తి పోకడలపై అధిష్టానానికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయిందని, అది భరించలేకనే బయటకు రావాల్సి వచ్చిందని మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తాము పదవుల కోసమో, డబ్బు కోసమో టీడీపీని వీడడం లేదన్నారు. ఈ సమావేశంలో జడ్పీ చైర్పర్సన్ గడిపల్లి కవిత, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్బాబు, డీసీఎంఎస్ చైర్మన్ అంజయ్య, జెడ్పీ వైస్ చైర్మన్ బరపాటి వాసు, డీసీసీబీ డెరైక్టర్లు బోడేపూడి రమేష్బాబు, పాల నర్సారెడ్డి, వెలిశాల చెన్నాచారి, చల్లగుండ్ల కృష్ణయ్య, నాయకులు దొడ్డాలకుల స్వాతి, బీరెడ్డి నాగచంద్రారెడ్డి, తోటకూర రవిశంకర్, బాలాజీ నాయక్, మచ్చా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement