-
పేదలకు బాధ్యతగా వైద్యం
డాక్టర్లకు వైద్య విధాన పరిషత్ జిల్లా కో ఆర్డినేటర్ హితవు తీరు మారాలని ఏరియా ఆస్పత్రి డాక్టర్లకు సూచన ఉద్యోగుల కోసం ప్రత్యేక గదులు నిర్మిస్తున్నామని వెల్లడి నర్సీపట్నం టౌన్, న్యూస్లైన్ : ఆస్పత్రికి వచ్చిన రోగులకు మెరుగైన వైద్యసేవలందించాలని వైద్యాధికారులను వైద్య విధాన పరిషత్ జిల్లా కో-ఆర్డినేటర్ నాయక్ సూచించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు శుక్రవారం ఆయన స్థానిక ఏరియా ఆస్పత్రిని సందర్శించారు. మొదటగా సాధారణ విభాగంలో రోగుల కేస్షీట్ను పరిశీలించారు. కేస్షీట్లో రోగానికి సంబంధించిన వివరాలు లేకపోవడంతో వైద్యులకు హితవు చెప్పారు. కేస్షీట్లో ఉన్న కాలమ్లలో రోగి వివరాలను నమోదు చేయాలన్నారు. రోగుల పట్ల బాధ్యతారహితంగా వ్యవహరించారన్న పేరు తెచ్చుకోవద్దన్నారు. ఆస్పత్రికి ప్రధానంగా పేదలే వస్తారు కనుక వైద్యులు ఉద్యోగధర్మంతోపాటు సేవానిరతిని కూడా చూపాలని కోరారు. ఇకనుండి కేస్షీట్లో రోగి వివరాలు సక్రమంగా ఉండాలని సూచించారు. రోగుల వద్దకు వెళ్లి స్వయంగా పరీక్షించారు. రోగుల ఆరోగ్య సమస్యలకు అనుగుణంగా వైద్యసేవలందకపోవడంతో వైద్యులను మందలించారు. వార్డుల్లో రోగులను, ప్రసూతి విభాగాన్ని పరిశీలించారు. ప్రసూతి విభాగంలో ఫ్రిజ్ పనిచేయకపోవడంతో ఆస్పత్రి అభివృద్ధి నిధుల నుండి రెండు ఫ్రిజ్లు, ఇన్వర్టర్ కొనుగోలు చేయాలని జూనియర్అసిస్టెంట్ను ఆదేశించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎంప్లాయిస్ హెల్త్స్కీమ్ ద్వారా జిల్లాలో పలు ఆస్పత్రుల్లో ప్రత్యేక గదులు అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు తెలిపారు. చింతపల్లిలో 15 పడకలు, అరకులో 15 పడకలు, పాడేరులో 15, నర్సీపట్నంలో 15, అనకాపల్లిలో 25, అగనంపూడి పీహెచ్సీలో 15 ప్రత్యేక గదులు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. నర్సీపట్నంలో ఇప్పటికే ఉన్న గదులను రీమోడలింగ్ చేయాల్సి ఉందని చెప్పారు. చింతపల్లిలో, అరకులో కొత్తగా ప్రత్యేక గదుల నిర్మాణం కొనసాగుతున్నట్టు తెలిపారు. వీటి ద్వారా ఉద్యోగులకు ఏరియా ఆస్పత్రిలో మెరుగైన వైద్యసేవలు లభిస్తాయన్నారు. ప్రసవాల లక్ష్యాన్ని అధిగమించడంతో ఆస్పత్రికి రాష్ట్రంలో మంచిపేరు ఉందని చెప్పారు. -
లింకువర్కర్లకు పచ్చజెండా
నర్సీపట్నం టౌన్, న్యూస్లైన్ : అంగన్వాడీ కేంద్రాల్లో లింకు వర్కర్లను నియమించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారి శ్రీకళ తెలిపారు. పనిభారం వల్ల ప్రస్తుతం ఉన్న కార్యకర్తలు, ఆయాలు సేవలు అందించడంలో ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. వారికి వెసులుబాటు కల్పించడానికి వీలుగా లింకువర్కర్లను నియమించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ ఆమె చెప్పారు. ప్రాజెక్టు పరిధిలో 232 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయని, వీటిలో 132 కేంద్రాల్లో మొదటివిడతగా లింకువర్కర్లను నియమించనున్నామని తెలిపారు. త్వరలోనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలవుతుందని చెప్పారు. మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించడానికి వీలుగా ఐసీడీఎస్ ద్వారా ప్రభుత్వం రుణసదుపాయాన్ని కలుగజేసే విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చినట్టు శ్రీకళ చెప్పారు. రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు రుణసదుపాయం అందిస్తామని చెప్పారు. ఈ రుణం మంజూరులో 50 శాతంసబ్సిడీని ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పారు. మిగిలిన 50 శాతం వారు ఆర్థికంగా అభివృద్ధిచెందుతూ చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. టైలరింగ్, టిఫిన్సెంటర్లు, టెంట్హౌస్లు, ఫొటోస్టూడియో వంటి వ్యాపార సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చని సూచించారు. ఈ రుణం మంజూరులో దారిద్య్ర రేఖకు దిగువనున్న మహిళలకు; గృహహింసకు, భర్త వేధింపులకు గురైన వారికి, వితంతువులకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. ప్రాజెక్టుకు ఎనిమిది మందిని ఎంపిక చేసి రుణం ఇవ్వాల్సిందిగా సిఫార్సు చేస్తామని చెప్పారు. 21 నుండి 45 సంవత్సరాల లోపు వయసు కలిగినవారు ఇందుకు అర్హులని చెప్పారు. గ్రామాల్లో సంవత్సరాదాయం రూ.60 వేలు, పట్టణంలో రూ.75 వేలు మించి ఉండరాదని తెలిపారు. ఇప్పటివరకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రీస్కూల్ మాత్రమే నిర్వహించేవారమని, ఇక నుండి ఎల్కేజీ, యుకేజీ కూడా ప్రారంభిస్తున్నామని శ్రీకళ చెప్పారు. నెలకొకసారి ప్రీస్కూల్ డేను నిర్వహిస్తామని చెప్పారు. ఇందిరమ్మ అమృతహస్తం ద్వారా గర్భిణులకు 25 రోజుల పాటు గుడ్లు, పాలు, మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని చెప్పారు ప్రాజెక్టు పరిధిలో 1625మంది గర్భిణులు, 1629మంది బాలింతలు ఉన్నారని చెప్పారు. అమృతహస్తం ద్వారా వీరందరికీ పౌష్టికాహారాన్ని అందిస్తున్నామని చెప్పారు. అమృతహస్తంపై విస్తృత ప్రచారం నిర్వహించి అవగాహన కల్పిస్తామని చెప్పారు. గ్యాస్స్టౌలు కూడా వారం, పదిరోజుల్లో ఆయా కేంద్రాలకు చేరుతాయని చెప్పారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement