-
ఇవ్వడంలో మనదే పైచేయి
సాక్షి, అమరావతి: ఉపాధి కోసం అమెరికా వెళ్లినా.. అక్కడే కంపెనీలు స్థాపించినా.. తమదే పైచేయని భారతీయులు నిరూపిస్తున్నారు. తమది ఇచ్చే చెయ్యేగాని, తీసుకునే చెయ్యి కాదని తేల్చి చెబుతున్నారు. అమెరికాలో భారతీయులు పొందుతున్న జీతాల కంటే అమెరికన్లకు భారతీయ కంపెనీలు చెల్లిస్తున్న వేతనాలే ఎక్కువని ‘నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ కంపెనీస్, సర్వీసెస్(నాస్కామ్) నివేదిక వెల్లడించింది. అమెరికన్లకు ఉపాధి అవకాశాలు కల్పించడంలోనూ ఆ దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలోనూ భారతీయుల పాత్ర కీలకం. కానీ, వీసాల జారీలో భారతీయుల పట్ల అమెరికా చూపుతున్న వివక్షను నిపుణులు తప్పుబడుతున్నారు. ‘విన్ అండ్ విన్’జోడీ అయిన భారత్, అమెరికాలు వీసాల జారీతోపాటు అన్ని అంశాల్లో సహకరించుకోవాలని, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటనలో ప్రధాని మోదీ ఈ అంశాన్ని ప్రస్తావించాలని కోరుతున్నారు. వాళ్లకు ఇస్తున్న జీతాలే ఎక్కువ భారతీయులు తమ ఉద్యోగ అవకాశాలు కొల్లగొడుతున్నారనే భావన అమెరికన్లలో ఉంది. వాస్తవం మాత్రం అందుకు పూర్తి విరుద్ధం. నాస్కామ్ గణాంకాలు ఏం చెబుతున్నాయంటే.. అమెరికాలో భారతీయులు పొందుతున్న ఉద్యోగ అవకాశాల కంటే.. భారతీయ కంపెనీలు అమెరికన్లకు కల్పిస్తున్న ఉద్యోగాలే ఎక్కువ. అంతేకాదు, అమెరికాలో భారతీయులు పొందుతున్న జీతాల కంటే... భారతీయ కంపెనీలు అమెరికన్లకు చెల్లిస్తున్న వేతనాలే ఎక్కువ. అమెరికాలో పనిచేస్తున్న భారతీయ వృత్తి నిపుణులు సగటున పొందుతున్న వార్షిక వేతనం 94,800 డాలర్లు. కానీ భారతీయ కంపెనీలు అక్కడి అమెరికన్ ఉద్యోగులకు చెల్లిస్తున్న సగటు వార్షిక జీతం 96,300 డాలర్లు. ఈ లెక్కన, భారతీయ కంపెనీలే అమెరికన్లకు సగటున ఏడాదికి 1,500 డాలర్లు ఎక్కువగా చెల్లిస్తున్నాయి. అమెరికాలో ఏటా 5 లక్షల ఉద్యోగాలు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి భారతీయ 52 కంపెనీలు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయని అమెరికాకు చెందిన ‘ఐహెచ్ఎస్ మార్కిట్ రీసెర్చ్’ వెల్లడించింది. 2018లో భారతీయ కంపెనీలు అమెరికన్లకు ప్రత్యక్షంగా 1.80 లక్షలు, పరోక్షంగా 3.40 లక్షల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు.. అంటే 5.20 లక్షల ఉద్యోగావకాశాలు కల్పించాయి. అంతేకాదు, అమెరికాలో 2016లో 2.60 శాతం, 2018లో 3.80 శాతం ఉద్యోగాలు కల్పించాయి. వీసాల జారీలో మాత్రం చిన్నచూపు అమెరికా ఆర్థిక పురోభివృద్ధికి ఇంతగా దోహపడుతున్నప్పటికీ భారతీయులకు వీసాల మంజూరులో కఠిన ఆంక్షలు విధిస్తోంది. ట్రంప్ అధ్యక్షుడయ్యాక కొత్తగా హెచ్–1బీ వీసాల జారీ మరింత కఠినతరంగా మారింది. ఇప్పటికే భారతీయుకలు ఎక్కువగా వీసాలు ఇస్తున్నామన్న అమెరికా వాదన అహేతుకమని నిపుణులు చెబుతున్నారు. 2016లో హెచ్–1బీ వీసాల కోసం అందిన భారతీయుల దరఖాస్తుల్లో 5 శాతం తిరస్కరణకు గురయ్యాయి. 2018లో దాదాపు 50 శాతం దరఖాస్తులను తిరస్కరించడం, 2020 జనవరి నాటికి 2 లక్షలకుపైగా దరఖాస్తులు పెండింగులో ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అమెరికా ‘జీడీపీ’కీ వెన్నుదన్ను అమెరికా ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో భారతీయ కంపెనీలు ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. 2017లో అమెరికా జీడీపీకి అక్కడి భారతీయ కంపెనీలు 57.20 బిలియన్ డాలర్లు సమకూర్చాయి. అమెరికా జీడీపీకి ఆ దేశంలోని ఆరు రాష్ట్రాలు సమకూర్చినదాని కంటే భారతీయ కంపెనీలే ఎక్కువ సమకూర్చ డం అసాధారణమని ‘ఐహెచ్ఎస్ మార్కిట్ రీసెర్చ్’ పేర్కొంది. వీసాల జారీలో సమతుల్యత ఉండాలి భారతీయ కంపెనీలకు తగినన్ని వీసాలు జారీ చేయడం లేదు. అమెరికా వీసాల జారీలో భారత కంపెనీలు, బహుళ జాతి కంపెనీల మధ్య సమతుల్యత ఉండాలి. సమాన అవకాశాలు కల్పిస్తేనే ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతమవుతాయి. – కేశవ్ మురుగేశ్, నాస్కామ్ చైర్మన్ విరివిగా వీసాల జారీ.. ప్రయోజనకరం ‘భారతీయులు 50 ఏళ్లుగా అమెరికాలో సంపద సృష్టికర్తలుగా గుర్తింపు పొందారు. ఐటీ ఉద్యోగి నుంచి సీఈవో వరకు భారతీయులు నిరుపమాన సేవలు అందిస్తున్నారు. భారతీయులకు ఎంత విరివిగా వీసాలు జారీ చేసి ప్రోత్సహిస్తే మన దేశంతోపాటు అమెరికా కూడా అంతగా పురోభివృద్ధి సాధిస్తుంది. భారతీయుల వీసాల జారీకి కనీస వేతనాలకు బదులు వృత్తి నైపుణ్యాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ప్రొ. పీవీజీడీ ప్రసాద్రెడ్డి, ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ -
అమ్మో! అప్పుడేనా!!
• జీఎస్టీ అమలుకు సిద్ధంగా లేని కంపెనీలు • దాదాపు 20 శాతమే రెడీ అంటున్న నిపుణులు • పన్నుల అమలుకు భారీ ఐటీ వ్యవస్థ కావాలి • చిన్న కంపెనీల్లో ఆందోళనలు కూడా తొలగాలి • వచ్చే ఏప్రిల్ నుంచి అమలు కష్టమనే వ్యాఖ్యలు • 2017 జూలై లేదా అక్టోబర్ నుంచి అమలు!! • పూర్తి అమలుకు మరో రెండేళ్లు పట్టే అవకాశం రెండు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ దాదాపు 130 కోట్ల మంది జనాభా 29 రాష్ట్రాలు... 7 కేంద్రపాలిత ప్రాంతాలు అధికారికంగా గుర్తించిన 22 భాషలు... తొలిసారిగా దీన్నంతటినీ కలిపే ఏకైక మార్కెట్ వ్యవస్థ అందుబాటులోకి రానుంది. ఏ ప్రాంతమైనా, ఏ రాష్ట్రమైనా అన్నిచోట్లా ఒక వస్తువుకు ఒకే పన్నును ప్రతిపాదిస్తున్న ‘గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్’ బిల్లును సుదీర్ఘ రాజకీయ వ్యూహాల అనంతరం బుధవారం రాత్రి రాజ్యసభ కొన్ని సవరణలతో ఆమోదించింది. ఇంకా సమయం పడుతుందిలే... అని కాస్త పట్టనట్లుగా ఉన్న కంపెనీలు దీన్ని అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాయా? ‘‘అసలు పని ఇప్పుడే మొదలైంది’’ అన్న రెవెన్యూ కార్యదర్శి శక్తికాంతదాస్ మాటల్ని చూస్తే కంపెనీలు సిద్ధంగా లేవనే అనిపిస్తుంది. ఎందుకంటే కేంద్రం, రాష్ట్రం వేరువేరుగా విధించే సెంట్రల్ జీఎస్టీ, స్టేట్ జీఎస్టీలను ఒకేసారి ఉత్పత్తులపై విధించడానికి, ప్రభుత్వం చెబుతున్నట్లు అన్నిటినీ ఆన్లైన్లోకి తేవటానికి భారీ ఐటీ వ్యవస్థ కావాలి. పన్ను వసూలుదార్లకు శిక్షణా ఇవ్వాలి. మొదట చిన్న కంపెనీలకు దీనిపై ఉన్న ఆందోళనలు పోవాలి. వస్తువును బట్టి పన్ను రేట్లు ఉంటాయి కనక తాము పెద్ద కంపెనీలతో పోటీ పడలేమన్న వాటి భయాలకు తగిన భరోసా కావాలి. నిజానికి జీఎస్టీని అమలు చేసిన పలు దేశాలు... దాని ఫలితాలు అందుకునే ముందు ఆర్థిక మందగమనాన్ని అనుభవించినవే. ‘‘భారత వృద్ధి రేటు మార్చి త్రైమాసికంలో 7.9 శాతంగా ఉంది. జీఎస్టీ అమలుతో వచ్చే మూడు నుంచి ఐదేళ్లలో 0.8 శాతం పెరిగే అవకాశం ఉంది’’ అని హెచ్ఎస్బీసీ ఆర్థికవేత్త ఒకరు అభిప్రాయపడ్డారు. 20 శాతం కంపెనీలే సిద్ధం? పన్ను నిపుణుల అంచనాల ప్రకారం ప్రస్తుతం 20 శాతం కంపెనీలే జీఎస్టీ అమలుకు సిద్ధంగా ఉన్నాయి. తరచూ మారే పన్నులకు అలవాటు పడిన మిగతా కంపెనీలు ఇంకా దీనిగురించి ఆలోచించటంలేదు. మెజారిటీ రాష్ట్రాలు దీన్ని ఆమోదించిన తరవాత జీఎస్టీ మండలి అమల్లోకి వస్తుంది కనక... ఎప్పటి నుంచి దీన్ని అమలు చేయాలన్నది అదే నిర్ణయిస్తుంది కనక తమకింకా కొంత సమయం ఉందన్నది వాటి ఉద్దేశం. అయితే ఇదంతా జరగటానికి నవంబర్ వరకూ సమయం పట్టొచ్చు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో... వాస్తవంగా అమలుకాబోయే జీఎస్టీ బిల్లు రావచ్చు. ‘‘వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి దీన్ని అమల్లోకి తేవాలని ప్రభుత్వం యోచిస్తోంది. అది కాస్త కష్టమే కావచ్చు. బహుశా!! వచ్చే ఏడాది జూలై లేదా అక్టోబర్ నుంచి అమలయ్యే అవకాశాలైతే ఉన్నాయి’’ అనేది నిపుణుల మాట. అయితే దీన్ని ఎప్పటి నుంచి అమలు చేసినా... పూర్తి స్థాయిలో దేశం మొత్తం దీన్ని అర్థం చేసుకుని అమల్లోకి తేవటానికి, దాని ఫలితాలు అందటానికి రెండేళ్లు పడు తుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఆందోళనలో ఐటీ పరిశ్రమ..: నాస్కాం జీఎస్టీ బిల్లును ఆహ్వానిస్తున్నట్టు నాస్కాం తెలిపింది. అయితే సర్వీసు, ఐటీ రంగం ఆందోళన చెందుతోదని, ఈ విషయాన్ని ప్రభుత్వానికి తెలిపామని నాస్కాం ప్రెసిడెంట్ ఆర్. చంద్రశేఖర్ అన్నారు. ‘ప్రస్తుతం ఐటీ రంగానికి ఉన్న పన్నుల విధానం సులభంగా ఉంది. సెంట్రల్ సర్వీస్ ట్యాక్స్, సింగిల్ పాయింట్ రిజిస్ట్రేషన్, ఒకే ఇన్వాయిస్. అలాగే రిఫండ్కు ఒకేచోటకు వెళితే చాలు. అదే జీఎస్టీ విధానంలో సెంట్రల్ జీఎస్టీ, ఇంటర్స్టేట్ జీఎస్టీ, స్టేట్ జీఎస్టీ వంటివి ఉంటాయి. ఈ పరిణామం పరిశ్రమకు సవాల్గా నిలుస్తుంది. ఐటీ సేవల రంగానికి జీఎస్టీ కాలరాత్రిగా ఉండరాదు’ అని అన్నారు. సెంట్రల్ జీఎస్టీ, ఇంటర్స్టేట్ జీఎస్టీని ఒకే పన్ను కిందకు తీసుకు రావాలని ప్రభుత్వాన్ని కోరినట్టు చెప్పారు. కీలకమైన చట్టానికి ప్రతిపక్షం అందించిన సహకారంతో దేశంలో సంస్కరణల ప్రగతిపై పరిశ్రమ రంగానికి ఎన్నో ఆశలు చిగురించాయి. - హర్షవర్దన్ నియోతియా, ఫిక్కి ప్రెసిడెంట్ వేగంగా అమలుపైనే విజయం.. ఆటోమొబైల్ పరిశ్రమ హృదయపూర్వకంగా స్వాగతిస్తోంది. పన్నుల వ్యవస్థను విస్తృతం చేస్తుంది. వ్యవస్థ అంతటా సమర్థతను పెంచుతుంది. మార్కెట్ను ఏకం చేస్తుంది. విజయం సాధించడంలో వేగంగా అమలు అన్నది కీలకం అవుతుంది. - కెనిచి అయుకువ, ఎండీ, మారుతి సుజుకి ఇండియా పెట్టుబడులు వస్తాయి..: సెల్కాన్ ‘‘టెలికం ఉత్పత్తులకు దేశవ్యాప్తంగా 5 శాతం మాత్రమే పన్ను ఉంచాలని ఇండియన్ సెల్యులార్ అసోసియేషన్ తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని కోరాం. ప్రధానంగా మేక్ ఇన్ ఇండియా ఉత్పత్తులకు దీనిని వర్తింపజేయాలి. మేక్ ఇన్ ఇండియా కాని పక్షంలో ఎక్కువ పన్ను వసూలు చేయాలి. ఇక జీఎస్టీ అమలైతే రవాణాతో ముడి పడిన వ్యయాలు తగ్గుతాయి. పన్ను సమస్యలుండవు. ఈ రంగంలోకి విదేశీ పెట్టుబడులు పెరిగేందుకు అవకాశం ఏర్పడుతుంది’’ - సెల్కాన్ మొబైల్స్ సీఎండీ వై.గురు వినియోగదారులకే లాభం • ఉత్పత్తులు, సేవల ధరలు తగ్గుతాయి • ‘సాక్షి’తో ఫ్యాప్సీ ప్రెసిడెంట్ రవీంద్ర మోడీ జీఎస్టీ అమలు కోసం కంపెనీలు, వర్తకులు ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్నారని ఫ్యాప్సీ తెలిపింది. పన్నుల విషయంలో స్వాతంత్రం అనంతరం జరిగిన అతిపెద్ద సంస్కరణగా జీఎస్టీని అభివర్ణించింది. ప్రస్తుతం పన్నులు సగటున 25-30 శాతం ఉన్నాయని, జీఎస్టీతో ఇది 17-18 శాతానికి దిగొస్తుందని ఫ్యాప్సీ ప్రెసిడెంట్ రవీంద్ర మోడీ చెప్పారు. ఆయనింకా ఏమన్నారంటే.. ‘‘పన్ను సంస్కరణలు చేపట్టింది కస్టమర్ల కోసమే. జీఎస్టీ అమలైతే అంతిమంగా లాభపడేదీ వారే. దేశవ్యాప్తంగా ఒకే ధర ఉంటుంది కనక వ్యాపారులు తమ విస్తృతి పెంచుతారు. ఎక్కువ వెరైటీలు అందుబాటులోకి వస్తాయి. ఎంచుకోవడానికి కస్టమర్లకు ఆస్కారం ఉంటుంది. ఉత్పత్తులు, సేవల ధరలు తగ్గుతాయి. అయితే సెంట్రల్ జీఎస్టీ, ఇంటర్స్టేట్ జీఎస్టీ, స్టేట్ జీఎస్టీ కోసం వర్తకులు వేర్వేరు రిటర్నులు దాఖలు చేయాలి. చిన్న, మధ్యతరహా కంపెనీలు, చిన్న వర్తకులు ఈ విషయంలో ఆందోళనగా ఉన్నమాట వాస్తవమే. వేర్వేరు రిటర్నులు దాఖలు చేయాలంటే చాలా ఇబ్బందే. ఏమాత్రం తప్పు దొర్లినా కఠిన శిక్షలున్నాయి. రిటర్నులు ఎలక్ట్రానిక్ రూపంలో దాఖలు చేయాలి. అత్యధికులకు దీనిపై అవగాహన లేదు. కాబట్టి సీఏల సేవలు వినియోగించుకోవాలి. ఇదంతా వ్యయప్రయాసలతో కూడినదని వర్తకులు అంటున్నారు. నిజానికి జీఎస్టీతో ప్రభుత్వానికి పన్ను ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. జీడీపీ 1.5-2 శాతం అధికమవుతుందన్న అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. ఎలక్ట్రానిక్ రూపంలో పన్నులు చెల్లించాలి కాబట్టి అవగాహన, శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాలి. సర్వీస్ కేంద్రాల వంటివి ప్రభుత్వమే ఏర్పాటు చేయాలి. పొరపాటున ఏవైనా తప్పులు దొర్లినా కఠిన శిక్షలు వేయకూడదు’’.
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
కాంగ్రెస్ మేనిఫెస్టో వెనుక విదేశీ హస్తం: కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- రెచ్చిపోయిన రౌడీ మూకలు
- కొత్త ఇంట్లోకి 'జబర్దస్త్' కమెడియన్.. వీడియో వైరల్
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
- స్టార్ హీరోయిన్ నుంచి కాంట్రవర్సీల వరకు.. సమంత గురించి ఇవి తెలుసా?
- అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
- Road Accident: నక్కపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
- Weekly Horoscope: ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే అన్న విధంగా ఉంటుంది
- Today Telugu Horoscope: ఈ రాశి వారు శుభకార్యాలలో పాల్గొంటారు
- శక్తులన్నీ ఏకమయ్యాయి
- ఆ పేరే... ఒక నమ్మకం!
Advertisement