-
టెక్ దిగ్గజాలకు పద్మభూషణ్
న్యూఢిల్లీ: రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. మొత్తం 128 మందికి పద్మ అవార్డులకు రాష్ట్రపతి ఆమోద ముద్ర లభించింది. సీడీఎస్ బిపిన్ రావత్కు పద్మ విభూషణ్ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. టాటా గ్రూప్ చైర్ పర్సన్ నటరాజన్ చంద్రశేఖర్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎండి సైరస్ పూనావాలాలకు పద్మభూషణ్ పురస్కారం ప్రకటించింది. అలాగే, కొవాగ్జిన్ టీకా తయారీ సంస్థ భారత్ బయోటెక్ చైర్మన్ కృష్ణ ఎల్లా, సహ వ్యవస్థాపకులు సుచిత్ర ఎల్లాకు పద్మభూషణ్ పురస్కారం అనౌన్స్ చేసింది. ట్రేడ్ & ఇండస్ట్రీ రంగానికి చెందిన ఐదుగురికి పద్మభూషణ్ అవార్డ్స్ లభించడంతో పాటు ఇద్దరికీ పద్మశ్రీ పురస్కారం లభించింది. దేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మ అవార్డులను పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అనే మూడు విభాగాల్లో ప్రదానం చేస్తున్నారు. కళలు, సామాజిక సేవ, ప్రజావ్యవహారాలు, సైన్స్ అండ్ ఇంజినీరింగ్, వర్తకం, వాణిజ్యం, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, సివిల్ సర్వీసెస్ వంటి రంగాల్లో అత్యుత్తమ సేవని కనబరిచిన వారికి పద్మ అవార్డులు ప్రదానం చేస్తారు. The President of India has approved conferment of 128 Padma Awards this year.#PadmaAwards#RepublicDay2022 The list is as below - pic.twitter.com/4xf9UHOZ2H — DD News (@DDNewslive) January 25, 2022 (చదవండి: Padma Awards 2022: బిపిన్ రావత్కు పద్మ విభూషణ్!) -
పట్టుదలతోనే కలలు సాకారం
జేఎన్టీయూహెచ్ స్నాతకోత్సవంలో టీసీఎస్ సీఈవో నటరాజన్ చంద్రశేఖరన్ సాక్షి, హైదరాబాద్ : ‘‘కలలు కనే అవకాశం మీలో ప్రతి ఒక్కరికీ ఉంది. ఆ కలలు అప్పటికప్పుడు నెరవేరకపోవచ్చు. పట్టుదలతో శ్రమిస్తే వాటిని సాకారం చేసుకునే ఎన్నో అవకాశాలు మీ చెంతకు వస్తాయి’’అని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సీఈవో డాక్టర్ నటరాజన్ చంద్రశేఖరన్ భావి ఇంజనీర్లకు పిలుపునిచ్చారు. గురువారం జరిగిన జేఎన్టీయూహెచ్ ఐదో స్నాతకోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన చంద్రశేఖరన్, వర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ రామేశ్వర్రావు చేతుల మీదుగా గౌరవ డాక్టరేట్ను అందుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సక్సెస్ అంటే ఎక్కువ డిగ్రీలు పొందడమే కాదన్నారు. అవకాశాలను అందిపుచ్చుకొని తమ కలలను సాకారం చేసుకుంటే.. కుటుంబ సభ్యులతోపాటు ప్రపంచమంతా పండగ చేసుకుంటుందన్నారు. 27ఏళ్ల కిందట ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చే శాక తన లక్ష్యాలను అందుకోవడానికి ఎంతో శ్రమించాల్సి వచ్చిందన్నారు. సవాళ్లను ఎదుర్కొనే ప్రయత్నం చేయాలన్నారు. చదువు కేవలం ఉద్యోగం కోసమేనని భావించకుండా సమాజ అభివృద్ధికి దోహద పడేలా కృషిచేయాలని కోరారు. గౌరవ డాక్టరేట్ కు తనను ఎంపిక చేసిన జేఎన్టీయూహెచ్ అధికారులందరికీ చంద్రశేఖరన్ కృతజ్ఞతలు తెలిపారు. వీసీ రామేశ్వరరావు మాట్లాడుతూ ప్రపంచస్థాయి ప్రమాణాలను అందుకునే దిశగా జేఎన్టీయూహెచ్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. 98 మందికి విద్యార్థులకు బంగారు పతకాలు, 158 మందికి పీహెచ్డీలను ప్రదానం చేశారు. పీహెచ్డీలను అందుకున్న వారిలో డీఆర్డీవో డెరైక్టర్ జనరల్ అవినాష్ చందర్ కూడా ఉండడం విశేషం. మీ సేవలు అవసరం: కేసీఆర్ రాష్ట్ర పునర్నిర్మాణంలో సాఫ్ట్వేర్ దిగ్గజ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) సేవలను వినియోగించుకుంటామని సీఎం కేసీఆర్ చెప్పారు. టీసీఎస్ రాష్ట్రంలో ఎంతో మంది యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తోందని ప్రశంసించారు. సంస్థ వ్యాపార విస్తరణ కార్యక్రమాలకు ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు. టీసీఎస్ సీఈవో చంద్రశేఖరన్, వైస్ ప్రెసిడెంట్ వి.రాజన్నలు గురువారం సచివాలయంలో కేసీఆర్ను కలుసుకున్నారు. సాఫ్ట్వేర్ రంగం విస్తరిస్తున్న ఆదిభట్ల ప్రాంతంలో పోలీసుస్టేషన్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే హైదరాబాద్లో 26 వేల మంది ఐటీ ఉద్యోగులు తమ సంస్థలో పనిచేస్తున్నారని, త్వరలో మరో 28 వేల మంది ఐటీ నిపుణులకు ఉద్యోగవకాశాలు కల్పిస్తామని టీసీఎస్ ప్రతినిధులు సీఎంకు చెప్పారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
తప్పక చదవండి
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement