-
విల్ పకోవ్స్కీకి తొలి అవకాశం
మెల్బోర్న్: ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్లో అదరగొడుతున్న 22 ఏళ్ల విల్ పకోవ్స్కీకి జాతీయ జట్టు పిలుపు లభించింది. భారత్తో జరిగే నాలుగు టెస్టుల బోర్డర్–గావస్కర్ ట్రోఫీ కోసం సెలక్టర్లు పకోవ్స్కీని ఎంపిక చేశారు. వార్నర్తో పాటు అతను ఓపెనర్గా ఆడే అవకాశం ఉంది. విక్టోరియాకు చెందిన పకోవ్స్కీ షెఫీల్డ్ షీల్ట్ టోర్నీలో గత రెండు మ్యాచ్లలో వరుసగా రెండు డబుల్ సెంచరీలు నమోదు చేయడం విశేషం. ఓవరాల్గా 22 ఫస్ట్క్లాస్ మ్యాచ్లలో 55.48 సగటుతో అతను 1720 పరుగులు సాధించాడు. 17 మంది సభ్యుల బృందంలో పకోవ్స్కీతో పాటు చోటు లభించిన మరో నలుగురు ఆటగాళ్లు కూడా ఇప్పటి వరకు ఆస్ట్రేలియా తరఫున టెస్టులు ఆడలేదు. కామెరాన్ గ్రీన్, మిషెల్ స్వెప్సన్, మైకేల్ నెసెర్, సీన్ అబాట్లు జట్టులోకి ఎంపికయ్యారు. ఇరు జట్ల మధ్య డిసెంబర్ 17నుంచి అడిలైడ్లో తొలి టెస్టు జరుగుతుంది. జట్టు వివరాలు: టిమ్ పైన్ (కెప్టెన్), సీన్ అబాట్, జో బర్న్స్, ప్యాట్ కమిన్స్, కామెరాన్ గ్రీన్, హాజల్వుడ్, ట్రవిస్ హెడ్, లబ్షేన్, లయన్, నెసెర్, ప్యాటిన్సన్, పకోవ్స్కీ, స్టీవ్ స్మిత్, స్టార్క్, స్వెప్సన్, వేడ్, వార్నర్ -
నేను ఎందుకు నవ్వనంటే...
న్యూఢిల్లీ: పేరుకు తగినట్లుగానే క్రికెటర్ గౌతం గంభీర్ వదనం ఎప్పుడూ గంభీరంగానే కనిపించేది. ఏ స్థాయి మ్యాచ్లోనైనా అతను మనసారా నవ్వడాన్ని దాదాపుగా ఎవరూ చూసి ఉండరు! ఇటీవలే రిటైర్ అయిన గంభీర్ దీనికి కారణాన్ని వెల్లడించాడు. జీవితంలో తనకు ఏదీ సునాయాసంగా దక్కలేదని, ప్రతీదాని కోసం శ్రమించాల్సి రావడంతో అదే తరహాలో ఉండటం అలవాటైందని అతను చెప్పాడు. ‘చాలా మంది నన్ను ఈ విషయం గురించి అడిగారు. కానీ దానికో నేపథ్యం ఉంది. ప్రతీ ఒక్కరు హాయిగా నవ్వాలని, సరదాగా ఉండాలని భావిస్తారు. కానీ అండర్–12 స్థాయినుంచి జాతీయ జట్టులోకి వచ్చే వరకు నేను చాలా కష్టపడ్డాను. బాగా ఆడినా జట్టు నుంచి తప్పించిన రోజులు, ప్రతీసారి జట్టులో చోటు కోసం పోరాడాల్సి వచ్చిన రోజులు ఎన్నో ఉన్నాయి. 2007 వరల్డ్కప్లో చోటు దక్కకపోయేసరికి నేను మరింత సీరియస్గా మారిపోయాను. బహుశా అదే నేను నవ్వకపోవడానికి, సరదాగా గడపకపోవటానికి కారణమైంది. ఐపీఎల్లో కూడా భారీ మొత్తానికి నన్ను తీసుకోవడం వల్ల తీవ్రమైన ఒత్తిడి ఉండేది. నాకు తగినంత స్వేచ్ఛ ఇచ్చినా, రెండు సార్లు టైటిల్ గెలిచినా ఆ ఒత్తిడి మాత్రం తగ్గలేదు. బహుశా షారుఖ్ కొంత తక్కువ మొత్తం ఇస్తే బాగుండేదేమో’ అని గంభీర్ వివరించాడు. -
రిషభ్ బ్యాటింగ్ ఘనం
న్యూఢిల్లీ: పరిస్థితులకు తగినట్లుగా బ్యాటింగ్ చేయగల నైపుణ్యం, పట్టుదల రిషభ్ పంత్లో బలంగా ఉన్నాయని భారత ‘ఎ’ జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ వ్యాఖ్యానించాడు. ‘సాధారణంగా పంత్ దూకుడుగా ఆడటాన్ని ఇష్టపడతాడు. అదే అతని శైలి. అయితే ఎర్ర బంతితో ఆడినప్పుడు కూడా జట్టు అవసరానికి తగినట్లు తనను తాను మలచుకోగలడు. అతను జాతీయ జట్టులోకి ఎంపిక కావడం సంతోషంగా ఉంది. ఇప్పటినుంచి అతను తన కెరీర్ మరింత బాగా మలచుకోగలడని నమ్ముతున్నా’ అని ద్రవిడ్ అన్నాడు. ‘ప్రస్తుత ఇంగ్లండ్ ‘ఎ’ పర్యటనలో వివిధ సవాళ్లకు తగినట్లుగా ఆడే విధంగా రిషభ్కు అవకాశం కల్పించాం. వన్డే టోర్నీ ఫైనల్లో అర్ధ సెంచరీ, విండీస్ ‘ఎ’తో నాలుగు రోజుల మ్యాచ్లో జయంత్తో వందకు పైగా భాగస్వామ్యం నెలకొల్పడం మనం చూశాం’ అని ద్రవిడ్ వివరించాడు. మరోవైపు భారత మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ మాట్లాడుతూ ఇంగ్లండ్పై గెలవాలంటే కోహ్లి సేన ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో ఆడాలని సూచించాడు. -
పెళ్లి నుంచి తప్పించుకొని.. జాతీయ జట్టుకు ఆడుతూ
సాక్షి, హైదరాబాద్ : బాల్యవివాహం నుంచి తప్పించుకున్న హైదరాబాద్కు యువ క్రీడాకారిణి నేడు జాతీయ రగ్బీ జట్టుకు ఎంపికైంది. వివరాల్లోకి వెళ్తే గత ఏడాది హైదరాబాద్కు చెందిన బి అనూష అనే విద్యార్థి పదో తరగతి చదువుతున్న సమయంలో పెళ్లి చేయాలని కుటుంబసభ్యులు నిర్ణయించారు. వివాహం ఇష్టం లేని అనూష చైల్డ్లైన్ అధికారులను ఆశ్రయించింది. పెళ్లికి పదిరోజుల ముందు చైల్డ్లైన్ అధికారులు, స్థానిక పోలీసుల సహకారంతో అనూష వివాహాన్ని అడ్డుకున్నారు. బాల్య వివాహం నేరమౌతుందని తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. బాల్యవివాహం నుంచి బయటపడిన అనూష ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతోంది. అంతే కాకుండా మహిళల రగ్బీఆటలో ప్రతిభ చూపింది. జాతీయ జట్టుకు ఎంపికైంది. అంతర్జాతీయ మ్యాచ్లు ఆడటం తన లక్ష్యం అని అనూష తెలిపింది. గతంలో మధ్యప్రదేశ్ ఇండోర్లో జరిగిన మహిళల అండర్-19 క్రికెట్ టోర్నమెంట్లో తెలంగాణ తరపున ఆడింది. -
జాతీయ జట్టులో చోటు సాధించాలి
హకీ రాష్ట్ర జట్టుకు ఎంపికైన వీకే రాయపురం విద్యార్థి సామర్లకోట : జాతీయ స్థాయి హాకీ జట్టులో స్థానం సంపాదించి, పాకిస్థా¯ŒSతో ఆడి విజయం సాధించాలనేది తన లక్ష్యమని గొలుసు వీరబాబు తెలిపాడు. సామర్లకోట మండలం వీకే రాయపురం గ్రామానికి చెందిన ఇతడు జెడ్పీ హైస్కూల్లో పదో తరగతి చదువుతూ రాష్ట్ర స్థాయి హకీ జట్టుకు ఎంపికయ్యాడు. ఈనెల 22 నుంచి 26 వరకు బోపాల్లో జరిగే జాతీయ స్థాయి చాంపియ¯ŒS షిప్ పోటీలలో అండర్- 17 విభాగంలో పాల్గొంటున్నాడు. ఇటీవల అండర్-17 విభాగంలో నెల్లూరు జిల్లాలో 12, 13, 14 తేదీలల్లో జరిగిన రాష్ట్ర స్థాయి హాకీ పోటీలో జిల్లా జట్టు తరఫున ప్రతిభ కనబరిచి రాష్ట్ర జట్టుకు ఎంపికైనట్టు హకీ జిల్లా కోచ్ రవిరాజ్ ‘సాక్షి’కి తెలిపారు. 2014లో పైకా టోర్నమెంటులో పాల్గొన్న వీరబాబు 2015లో జిల్లా జట్టులో స్థానాన్ని స్థిరం చేసుకున్నాడని తెలిపారు. వ్యవసాయ కూలీ కుటుంబం నుంచి వచ్చి పాఠశాలలో చదువుకొంటున్నాడని, తల్లి అదే పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకురాలిగా పని చేస్తోందన్నారు. డిగ్రీ పూర్తి చేసి స్పోర్ట్స్ కోటాలో పోలీసు ఉద్యోగం సంపాదించాలని ఉందని వీరబాబు ఆశాభావం వ్యక్తం చేశాడు. రాష్ట్ర హాకీ జట్టుకు ఎంపికైన విద్యార్థి వీరబాబును పాఠశాల హెచ్ఎం అనురాధ, గ్రామ సర్పంచ్ కుర్రా నారాయణస్వామి, కోచ్ రవిరాజ్లు, గ్రామ నాయకులు అభినందించారు. జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనడానికి బోపాల్ బయలు దేరాడు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement