-
పోటీకి దీటుగా రాణించాలి
విజయవాడ(వన్టౌన్): పోటీ ప్రపంచానికి దీటుగా రాణించేందుకు విద్యార్థులు కృషి చేయాలని పారిశ్రామికవేత్త ఎంవీకే హరగోపాల్ అన్నారు. కేబీఎన్ కళాశాల ఎంసీఏ అండ్ ఎంఎస్సీ(కంప్యూటర్స్) విభాగం ఆధ్వర్యంలో ‘ఇమేజ్ ప్రొసెసింగ్ యూజింగ్ ఆర్ ప్రోగ్రామింగ్’ అంశంపై జాతీయ స్థాయి వర్క్షాప్ బుధవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కంప్యూటర్ రంగంలో చోటుచేసుకుంటున్న ప్రగతితో యావత్ ప్రపంచం పరుగులు తీస్తుందన్నారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ విద్యార్థులు నూతన అంశాలపై శ్రద్ధ చూపాలన్నారు. కళాశాల పీజీ కో–కన్వీనర్ కే.వీ.రామకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు అభ్యున్నతికి కళాశాల యజమాన్యం నిర్వహిస్తున్న కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. రిసోర్స్పర్సన్, యోగివేమన విశ్వవిద్యాలయం సీఎస్ఈ విభాగ ఆచార్యులు డాక్టర్ సి.నాగరాజు మాట్లాడుతూ ‘ఇమేజ్ ప్రాసెసింగ్ యూజింగ్ ఆర్ ప్రోగ్రామింగ్’ అంశం ప్రస్తుతం చాలా కీలకంగా మారిందన్నారు. కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ ఎస్.రజిత్కుమార్ మాట్లాడారు. సభలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వీ.నారాయణరావు, పీజీ డైరెక్టర్ డాక్టర్ డీ.వీ.రమణమూర్తి, పీజీ కోర్సెస్ డైరెక్టర్ డాక్టర్ వై.నరసింహారావు, విభాగాధిపతి పీఎల్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఆధునికత దిశగా అడుగులు
పులివెందుల రూరల్ : ప్రతి విద్యార్థిని ఉన్నతస్థాయికి ఎదగాలని ఆకాంక్షించే అధ్యాపకులు తప్పనిసరిగా ఆధునిక టెక్నాలజీ వైపు అడుగులు వేయాలని అనంతపురం జెఎన్టీయూ వైస్ చాన్సలర్ ఎం.ఎం.ఎం.సర్కార్ సూచించారు. శుక్రవారం పట్టణంలోని ఈఈఈ విభాగంలో ‘‘వీఎల్ఎస్ఐ డిజైన్ అడ్వాన్స్మెంటు యూజింగ్ టాల్స్’’ అనే అంశంపై రెండు రోజుల జాతీయస్థాయి వర్క్షాపు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశోధన శోధకులు, అధ్యాపకులు నిత్య విద్యార్థులేనన్నారు. కావున అధ్యాపకులు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వచ్చిన మార్పులను ఎప్పటికప్పుడు కనుగొని వాటిని విద్యార్థులకు తెలియజేయాలన్నారు. జాతీయస్థాయి వర్క్షాపులలో ఎన్నోతెలియని విషయాలు తెలుసుకొని వాటిని విద్యార్థులకు అందించాలన్నారు. ప్రస్తుతం ఐవోటీ(ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్), ఎలక్ట్రానిక్స్ పరికరాలు మానవ జీవితంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయన్నారు. కావున వీటికి ఎంతో ఆవశ్యకత ఉందని వివరించారు. కళాశాల ప్రిన్సిపల్ గోవిందరాజులు మాట్లాడుతూ కళాశాలలో అధ్యాపకులకు టెక్విప్ నిధులతో ఇలాంటి జాతీయస్థాయి వర్క్షాపులను ప్రతినెలా నిర్వహిస్తున్నామన్నారు. కావున వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ సుబ్బారెడ్డి, ప్రొగ్రాం కన్వీనర్ చంద్రమోహన్రెడ్డి, కళాశాల ప్లేస్మెంటు అధికారి అపర్ణ, హైదరాబాద్కు చెందిన కోరిన్ టెక్నాలజీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ జోనల్ మేనేజర్ రమేష్నాయుడు, ట్రై నీ స్పెషలిస్ట్ ప్రకాష్, రాయలసీమతోపాటు నెల్లూరు, బెంగుళూరు, హైదరాబాద్లకు చెందిన అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
కూటమి కక్కిన విషం.. నలుగురు వృద్ధులు మృతి
తొడలు కొట్టే నేత.. ప్రజాసేవలో తొండాట
ఏపీలో జగన్తోనే ముస్లిం రిజర్వేషన్లు: అసదుద్దీన్ ఒవైసీ
ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించండి: ఎంపీ బండి సంజయ్
తీరం మారింది
నిర్మాత బండ్ల గణేష్పై కేసు నమోదు
ఢిల్లీ సుల్తాన్లను ఎదిరిస్తాం: సీఎం రేవంత్రెడ్డి
బాబు మార్కు దందా.. బినామీలకే సంపద
హస్తిన ‘దండు’యాత్ర
హార్సిలీహిల్స్ ఘాట్రోడ్డుపై తలకిందులైన కారు
తప్పక చదవండి
- ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించండి: ఎంపీ బండి సంజయ్
- బాబు మార్కు దందా.. బినామీలకే సంపద
- జయరాం.. రాం!
- కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై మండిపడ్డ మమతా బెనర్జీ
- 'కుబేర' సినిమా నుంచి నాగార్జున ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్
- ఓపెనర్గా కోహ్లి.. రోహిత్ శర్మ ఏమన్నాడంటే?
- T20 WC: కోహ్లిపై విమర్శలు.. చీఫ్ సెలక్టర్ స్పందన ఇదే
- రజనీకాంత్ సినిమా మేకర్స్కు ఇళయరాజా నోటీసులు
- ఏపీలో 4.14 కోట్ల మంది ఓటర్లు: ఏపీ ఎన్నికల అధికారి ఎంకే మీనా
- ప్రజ్వల్ రేవణ్ణపై లుక్ అవుట్ నోటీసులు..
Advertisement