-
నన్ను తప్పించాలని చూస్తున్నారు
పట్నా: దేశం నుంచి ఉగ్రవాదాన్ని తరిమికొట్టాలని తాను ప్రయత్నిస్తుంటే తనను పదవి నుంచి తప్పించేందుకు కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాలు కంకణం కట్టుకున్నాయని ప్రధాని మోదీ ఆరోపించారు. పట్నాలో ఆదివారం బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తదితరులు పాల్గొన్న ఎన్డీఏ ‘సంకల్ప్ర్యాలీ’లో ఆయన మాట్లాడారు. వైరి దేశం పాక్కు లాభించేలా ప్రతిపక్ష పార్టీలు మాట్లాడటం సమంజసమేనా అని ప్రశ్నించారు. ప్రతిపక్షాలు వ్యక్తం చేస్తున్న అనుమానాలతో ఆ దేశ నాయకత్వం చాలా సంతోషంగా ఉందని మోదీ అన్నారు. ‘నేను ఉగ్రవాదాన్ని రూపుమాపాలని ప్రయత్నిస్తుంటే, ప్రతిపక్ష నేతలు మాత్రం నన్ను తప్పించేందుకు కుట్ర పన్నుతున్నారు. దేశమంతా ఒకే గొంతుక వినిపించాల్సిన ఈ సమయంలో 21 పార్టీల నేతలు ఢిల్లీలో సమావేశమై ప్రభుత్వ చర్యలను ఖండించారు. మన జవాన్లు చూపిన ధైర్య సాహసాలపై వారికి ఆధారాలు చూపాలట’ అంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ను పరోక్షంగా ప్రస్తావిస్తూ ఆయన ‘పేదల పేరుతో రాజకీయాలు సాగించేవారు, తమ వారసత్వ రాజకీయాలను తప్ప ఎవరినీ పట్టించుకోరు. వీరికి చౌకీదార్తోనే ఇబ్బందులున్నాయి. కానీ, చౌకీదార్ చాలా జాగ్రత్తగా తన కర్తవ్య నిర్వహణలో ఉన్నాడు’ అని తిప్పికొట్టారు. కాగా, మోదీ, బిహార్ సీఎం నితీశ్ కుమార్ కలిసి 2009లో పంజాబ్లోని లూథియానాలో ఇలా ఒకే వేదికపై కనిపించారు. 2005 ఎన్నికల తర్వాత జరిగిన ఈ ఎన్డీఏ ర్యాలీకి జనాన్ని తరలించేందుకు 18 రైళ్లు, 5వేల బస్సులను వినియోగించారు. అమేథీలో ఏకే–203 7 లక్షల రైఫిళ్ల తయారీ లక్ష్యం పట్నా సభ అనంతరం ప్రధాని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ సొంత నియోజకవర్గం అమేథీలో ఏకే–203 రైఫిళ్ల తయారీ కర్మాగారానికి శంకుస్థాపన చేశారు. అక్కడ జరిగిన సభలో ప్రసంగిస్తూ.. ‘గత ఎన్నికల్లో ఈ సీటు మేం గెలవలేకపోయినా మీ హృదయాల్లో మాత్రం స్థానం సంపాదించగలిగాం. ఇక్కడ గెలిచిన వారి(రాహుల్) కంటే కూడా కేంద్రమంత్రి స్మృతీఇరానీ చాలా అభివృద్ధి పనులు చేపట్టారు’ అని అన్నారు. ‘భారత్–రష్యా ఉమ్మడి భాగస్వామ్యంలో తయారయ్యే ఏకే–203 రైఫిళ్లపై ‘మేడ్ ఇన్ అమేథీ’ అని ఉంటుంది. ఉగ్రవాదులు, మావోయిస్టులపై జరిపే పోరాటంలో మన జవాన్లకు ఇవి ఎంతో సాయపడతాయి. వీటితో అమేథీకి ఇక కొత్త గుర్తింపు లభించనుంది’ అని మోదీ తెలిపారు. కాగా, 2014 ఎన్నికల తర్వాత అమేథీలో మోదీ పర్యటించడం ఇదే ప్రథమం. రష్యా అధ్యక్షుడు పుతిన్ సందేశం అమేథీలో తయారయ్యే ఏకే–203 రైఫిళ్లతో భారత రక్షణ బలగాల చిన్న ఆయుధాల అవసరాలు తీరుతాయని రష్యా అధ్యక్షుడు పుతిన్ పేర్కొన్నారు. ఆయన పంపిన సందేశాన్ని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ అమేథీ సభలో చదివి వినిపించారు. ‘ఈ కర్మాగారం భారత రక్షణ– పారిశ్రామిక రంగం జాతీయ రక్షణ సంస్థల చిన్న ఆయుధాల తీర్చగలుగుతుంది. ఇందుకు రష్యా ఆధునిక సాంకేతికత తోడవుతుంది. దశాబ్దాలుగా సైనిక, సాంకేతిక రంగాల్లో కొనసాగుతున్న సహకారంతో భారత్లో 170కిపైగా సంస్థలను నెలకొల్పాం’ అని పేర్కొన్నారు. గత ఏడాది అక్టోబర్లో భారత్లో పుతిన్ పర్యటన సందర్భంగా ఈ ఒప్పందం కుదిరింది. ఈ కర్మాగారంలో 7 లక్షల రైఫిళ్లను తక్షణం తయారు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. వీటిని ప్రస్తుతం భద్రతా బలగాలు వాడుతున్న ఇన్సాస్ రైఫిళ్ల స్థానంలో అందజేయనున్నారు. -
విపక్షాల నిరసనల మధ్యే ప్రశ్నోత్తరాలు
న్యూఢిల్లీ : పార్లమెంట్ సమావేశాల చివరి రోజు కూడా సేమ్ సీన్ రిపీట్. గురువారం ఉదయం ఉభయ సభలు విపక్షాల నిరసనలు, నినాదాలు, ఆందోళనలతోనే ప్రారంభం అయ్యాయి. ఉభయ సభల్లో విపక్షాల ఆందోళన కొనసాగుతోంది. లోక్సభలో ప్రతిపక్ష సభ్యుల నినాదాల మధ్య ప్రశ్నోత్తరాలు కొనసాగుతోంది. రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మరోవైపు ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంటూ ఎన్డీయే ఎంపీలు ర్యాలీ నిర్వహించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 12.30 గంటలకు విజయ్ చౌక్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకూ ఎన్డీఏ ఎంపీలు పాదయాత్ర చేయనున్నారు.
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
- కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
- ప్రజా సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తా
- రెచ్చిపోయిన రౌడీ మూకలు
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
- Rishabh Pant: భారీ ప్రమాదం నుంచి మైదానం వరకు..
- అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Advertisement