-
ఇంట్లో చొరబడితే... ఇంత దారుణమా!
రాంచీ: చుట్టుపక్కల ఇంట్లో ఉండే వ్యక్తిని దారుణంగా ఉరితీసి చంపేశారు. ఈ ఘటన జార్ఖండ్ లోని జంషెడ్పూర్ జిల్లా సీతారామదేరా పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... అనిల్ దాస్(32) జంషెడ్పూర్ సమీపంలోని చాయానగర్ లో నివాసం ఉంటున్నాడు. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అదే ఏరియాలోని ఓ ఇంట్లో చోరీ చేయడానికి వెళ్లాడు. ఆ ఇంటి వాళ్లు దొంగను పట్టుకుని దారుణంగా హింసించారు. చివరికి ఆ నిందితుడి మెడకు తాడు చుట్టి ఏకంగా ఉరి తీసేశారు. సమాచారం అందుకున్న సీతారామదేరా పోలీస్ ష్టేషన్ ఇంఛార్జీ లక్ష్మణ్ ప్రసాద్ నేతృత్వంలో పోలీసులు అక్కడికి చేరుకుని ఆదారాలను సేకరించారు. అనంతరం మృతుడు అనిల్ దాస్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. చోరీకి యత్నించిన వ్యక్తిని ఉరితీసిన కేసులో నలుగురు నిందితులను గుర్తించారు. రాధేయనాథ్, గణేశ్ శర్మ అలియాస్ ధకుంద్రా అనే నిందితులను అరెస్ట్ చేసినట్లు లక్ష్మణ్ ప్రసాద్ తెలిపారు. మరో ఇద్దరు నిందితులను పట్టుకునేందు గాలింపు చర్యలు చేపట్టినట్లు వివరించారు. అయితే, అనిల్ దాస్ ఆ ఇంట్లోకి చోరీకి యత్నించాడా.. లేక నిందితులే అతడ్ని తమ ఇంట్లోకి తీసుకెళ్లి చంపివేశారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
పక్కింట్లో భోంచేశాడని.. చంపేశాడు
మధుర: ఆరేళ్ల బాలుడు ఆకలికి తట్టుకోలేక పక్కింట్లో భోజనం చేసినందుకు ఓ దుర్మార్గుడు విచక్షణారహితంగా చితకబాదాడు. పాపం తీవ్రంగా గాయపడిన ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. ఉత్తరప్రదేశ్లోని మధురలో ఈ విషాదకర ఘటన జరిగింది. రాజేంద్ర అనే ట్రక్ డ్రైవర్ మీనాక్షి అనే మహిళతో కలసి సహజీవనం చేస్తున్నాడు. ఆమెకు ఇద్దరు పిల్లలు ధర్మేంద్ర (6), జితేంద్ర (12) ఉన్నారు. మీనాక్షి తన సొంతూరుకు వెళ్తూ పిల్లలిద్దరినీ రాజేంద్ర దగ్గర విడిచి వెళ్లింది. అతను పిల్లలకు భోజనం పెట్టకపోవడంతో.. ధర్మేంద్ర పక్కింటికెళ్లి భోజనం చేసి వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న రాజేంద్ర.. ఆదివారం రాత్రి పిల్లవాడిని చితకబాదాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన ధర్మేంద్ర ఉదయం చూసేసరికి మరణించాడు. ఈ విషయం తెలియగానే రాజేంద్ర పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
తప్పక చదవండి
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement