-
డయల్ 112
సాక్షి, హైదరాబాద్: దేశంలోని అత్యవసర సేవలన్నీ ఒక్కతాటిపైకి రాబోతున్నాయి. ఇందుకోసం నేషనల్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టం (ఎన్ఈఆర్ఎస్) పేరుతో మైక్రో మిషన్ను కేంద్ర హోం శాఖ చేపట్టింది. ఈ ప్రాజెక్టు కోసం ‘112’నంబర్ను కేటాయించింది. ఇప్పటికే రాష్ట్రాల్లో అమలు లో ఉన్న 100, 101, 108 తదితర ఎమర్జెన్సీ నంబర్లను దీని పరిధిలోకి తీసుకొస్తోంది. వీలైనంత త్వరగా ‘112’ను అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. రాష్ట్ర పోలీసు విభాగం కూడా కొత్త నంబర్పై ప్రచారం చేయాలని నిర్ణయించింది. డయల్ 100కు కాల్ చేసిన వారికి వచ్చే సందేశంలో 100కు బదులుగా డయల్ 112 అంటూ పొందుపరిచింది. దేశంలో 36 చోట్ల 24 గంటల కాల్ సెంటర్లు ‘112’వ్యవస్థలో భాగంగా దేశవ్యాప్తంగా 36 చోట్ల 24 గంటలు నిర్విరామంగా పనిచేసే కంట్రోల్ రూమ్ తరహా కాల్ సెంటర్లను కేంద్రం ఏర్పాటు చేసింది. పోలీసు, మెడికల్, ఫైర్, విపత్కర పరిస్థితుల్లో ఉన్న మహిళలు సహా ఇబ్బందులు, సమస్యల్లో ఉన్న బాధితులు మొత్తం 9 రకాల అత్యవసర సేవలకు ఈ కాల్ సెంటర్ను ఆశ్రయించేలా ఏర్పాటు చేస్తోంది. ల్యాండ్లైన్, సెల్ఫోన్ ద్వారా కాల్, ఎస్సెమ్మెస్, ఈ మెయిల్, చాట్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్లో ఏర్పాటు చేసే ప్యానిక్ బటన్, వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్, మొబైల్ యాప్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ).. ఇలా అన్ని మాధ్యమాల ద్వారా కంట్రోల్ రూమ్కు సమాచారం ఇచ్చేలా చర్యలు చేపట్టింది. ఫోన్ చేస్తే ఎక్కడున్నారో కనిపెట్టేలా.. అత్యవసర సాయం కోసం బాధితులు కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసేటప్పుడు.. అన్ని సందర్భాల్లో పూర్తి వివరాలు అందించే పరిస్థితిలో ఉండరు. సమాచారం అందగానే ఎంత తక్కువ సమయంలో పోలీసులు స్పందిస్తే బాధితులకు అంత ఊరట ఉంటుంది. కాబట్టి కంట్రోల్ రూమ్కు వచ్చిన కాల్, మెసేజ్, మెయిల్ ఏ ప్రాంతం నుంచి వచ్చిందో సాంకేతికంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. దీన్ని గుర్తించేందుకు రాష్ట్ర పోలీసుల దగ్గర ఇప్పటికే కొంత పరిజ్ఞానం ఉంది. తాజాగా ఎన్ఈఆర్ఎస్ అమలుతో మరింత అత్యాధునిక పరిజ్ఞానం చేకూరనుంది. ఇది పూర్తిస్థాయిలో అందు బాటులోకి వస్తే జీఐఎస్ పరిజ్ఞానంతో కూడిన వీడియో వాల్స్ కంట్రోల్ రూమ్స్లో ఉంటా యి. బాధితులు ఏ ప్రాంతం నుంచి ఫిర్యా దు చేస్తున్నారో తక్షణం గుర్తించవచ్చు. పో లీసుల రెస్పాన్స్ టైమ్ మరింత తగ్గనుంది. కేంద్ర, రాష్ట్రాలు కలిసికట్టుగా.. ఎన్ఈఆర్ఎస్ వ్యవస్థ కేంద్రం, రాష్ట్రాల ఉమ్మడి భాగస్వామ్యంతో పని చేస్తోంది. మౌలిక వసతులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని కేంద్రం అంది స్తుండగా.. సిబ్బంది, బాధితులను ఆదుకునేందుకు ఆయా ప్రాంతాలకు చేరుకోవడానికి వాహనాలు, తదితరాలను రా ష్ట్రం చూసుకుంటోంది. సిబ్బందిని రిక్రూట్మెంట్, ఔట్ సోర్సింగ్ ద్వారా నియమించనున్నారు. వాహనాలు, ఇతర సౌకర్యాలను కేంద్రం అందించే వివిధ పథకాల కింద, రాష్ట్ర నిధులతో సమీకరించుకుంటున్నారు. ఇక వైపరీత్యాలు సంభ వించినప్పుడు సత్వర స్పందన కోసం పోలీసు విభా గంతో పాటు అగ్నిమాపక, విపత్తు నిర్వహణ, వైద్యారోగ్య, మున్సి పల్ కార్పొరేషన్లకు ఒకేసారి సమాచారం అందేలా ఇంటిగ్రేటెడ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. సైబర్ నేరాల్లో బాధితులుగా మారిన వారికి సహాయం చేయడానికి కేంద్రం టోల్ ఫ్రీ నంబర్ 1930 అందుబాటులోకి తీసుకువచ్చింది. దీన్ని కూ డా 112లో కలిపేయాలని కొన్ని రాష్ట్రాలు కోరుతున్నాయి. -
అత్యవసర సేవల కోసం 112
* దేశ వ్యాప్తంగా ఒకే నంబర్ * అన్ని సేవలు దాని పరిధిలోకే సాక్షి, హైదరాబాద్: దేశ వ్యాప్తంగా అత్యవసర సేవలన్నీ ఒక్కతాటిపైకి రానున్నాయి. దీని కోసం కేంద్ర హోం శాఖ.. నేషనల్వైడ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టం(ఎన్ఈఆర్ఎస్) పేరుతో మైక్రో మిషన్ చేపట్టింది. ఈ ప్రాజెక్టుకు ఇప్పటికే ‘112’ నంబర్ను టెలికం శాఖ కేటాయిం చింది. రాష్ట్రాల్లో అమలులో ఉన్న 100, 108 తదితర ఎమర్జెన్సీ నంబర్లను దీని పరిధిలోకి తీసుకురానున్నారు. ప్రస్తుతం రాష్ట్రాలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంటున్న కేంద్ర హోం శాఖ వీలైనంత త్వరలో దీన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. దీని ఏర్పాటులో భాగంగా దేశవ్యాప్తంగా 36 చోట్ల 24 గంటలూ పని చేసే కంట్రోల్ రూమ్ తరహా కాల్ సెంటర్లు ఏర్పాటు చేయనుంది. అత్యాధునిక సాంకేతిక వ్యవస్థతో సేవలు ప్రస్తుతం కంట్రోల్రూమ్కు ఓ కాల్ వచ్చిన వెంటనే అది ఏ ప్రాంతం నుంచి వస్తోంది అనేది గుర్తించేందుకు కొంత పరిజ్ఞానం పోలీసుల వద్ద ఉంది. ఎన్ఈఆర్ఎస్ అమలుతో మరింత అత్యాధునికమైన పరిజ్ఞానం చేకూరుతుంది. ఇది అందుబాటులోకి వస్తే జీఐఎస్(జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్) పరిజ్ఞానంతో కూడిన వీడియో వాల్స్ కంట్రోల్ రూమ్స్లో ఉంటాయి. బాధితులు ఏ ప్రాంతం నుంచి ఫిర్యాదు చేస్తున్నారనేది దీని ద్వారా తక్షణం గుర్తించే అవకాశం ఉంటుంది. రక్షక్, మొబైల్ వాహనాల్లో జీపీఎస్ ఉంటుంది కాబట్టి బాధితుడికి దగ్గరలో ఉన్న వాహనాన్ని వెంటనే పంపిస్తారు. కేంద్ర, రాష్ట్రాల ఉమ్మడి భాగసామ్యం ఎన్ఈఆర్ఎస్ వ్యవస్థ కేంద్రం, రాష్ట్రాల ఉమ్మడి భాగస్వామ్యంతో పని చేయనుంది. మౌలిక వసతులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని కేంద్రం అందిస్తుండగా... వీటిలో పని చేసే సిబ్బంది, పోలీసులకు అవసరమైన వాహనాలు తదితరాలను రాష్ట్రం కేటాయించాల్సి ఉంటుంది. సిబ్బందిని రిక్రూట్మెంట్, ఔట్సోర్సింగ్ ద్వారా ఏర్పాటు చేసుకోనున్నారు. వాహనాలు, ఇతర సౌకర్యాలను కేంద్రం అందించే వివిధ పథకాల కింద సమీకరించుకోవాలని అధికారులు భావిస్తున్నారు. కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ను రాజధాని ప్రాంతమైన విజయవాడ కేంద్రంగా ఏర్పాటు చేయాలని ప్రాథమికంగానిర్ణయించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
- ‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement