-
మెడకు మొబైల్ఉచ్చు
ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా మొబైల్ ఫోన్లను విపరీతంగా వాడుతుండటం వల్ల కోట్లాది మంది కంటి సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. ఇప్పుడు వీరిలో మెడనొప్పి కూడా ఎక్కువవుతున్నట్లు తేలింది. తాజాగా అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో స్టేట్ యూనివర్సిటీ ఓ నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం.. మొబైల్ ఫోన్ను ఎక్కువగా వినియోగించే వారిలో విపరీత పరిణామాలు చోటుచేసుకుంటున్నట్టు, భారత్ లాంటి దేశాల్లో ఎక్కువగా ‘టెక్ట్స్నెక్ సిండ్రోమ్’కు గురవుతున్నట్టు తెలిపింది. అంటే మొబైల్ ఫోన్ను ఉపయోగిస్తున్నవారిలో ఎక్కువ మంది మెడ నొప్పితో బాధపడుతున్నారు. ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ ఎర్గొనోమిక్స్ అనే జర్నల్ సైతం టెక్ట్స్నెక్ సిండ్రోమ్ పెద్ద భూతంలా వేధిస్తోందని వెల్లడించింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో అత్యంత చిన్న వయసులోనే మెడనొప్పితో బాధపడుతూ న్యూరో ఫిజీషియన్లు, వెన్నుపూస వైద్య నిపుణుల దగ్గరకు పరుగులు పెడుతున్న తీరు వైద్య వర్గాలను కూడా కలవరపెడుతోంది. ఈ సిండ్రోమ్ కారణంగా నాడీ వ్యవస్థ దెబ్బతిని భవిష్యత్లో అనేక సమస్యలు తలెత్తుతాయని వైద్యులు హెచ్చరిస్తుండటం గమనార్హం. సాక్షి, అమరావతి: ప్రధానంగా ఫోన్లో టెక్ట్స్మెసేజ్లు ఎక్కువసేపు చూస్తూండటంవల్ల మెడ తీవ్ర ఒత్తిడికి గురవుతుంది. దీంతో మెడ కండరాలు, నరాలు ఒత్తిడికి గురై నాడీ వ్యవస్థపై ప్రభావం పడుతుంది. దీనివల్ల విపరీతమైన తలనొప్పి, భుజాల నొప్పి వస్తుంది. ఇవి ఇలాగే కొనసాగి తొడ నుంచి పాదం వరకూ జాలుగా నొప్పితో ఇబ్బందిపడతారు. దీనివల్ల 80 శాతం మంది నిద్రలేమిని ఎదుర్కొంటున్నారు. ప్రతి చిన్న విషయానికి చిరాకుపడటం, ఆందోళన, మానసిక ఒత్తిడికి గురవడం వంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మెడ నరాలు అరిగిపోవడం లేదా ఒత్తిడికి గురికావడం వల్ల వెన్నుపూసపై కూడా ప్రభావం పడుతున్నట్టు ఏఎస్ఎస్ఏపీ (అసోసియేషన్ ఆఫ్ స్పైన్ సర్జన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్) వైద్య బృందం ధ్రువీకరించింది. నాడీ వ్యవస్థపై తీవ్ర దుష్ప్రభావం చూపిస్తున్న వాటిలో ‘టెక్ట్స్ నెక్ సిండ్రోమ్’ ప్రధానమైందిగా ఈ బృందం పేర్కొంది. చిన్న వయసులోనే సిండ్రోమ్.. తెలుగు రాష్ట్రాల్లో ఏడు కోట్ల మందిపైనే స్మార్ట్ ఫోన్లు వాడుతున్నట్టు ప్రాథమిక అంచనా. 18 నుంచి 43 ఏళ్ల మధ్య ఉన్నవారు స్మార్ట్ఫోన్లు ఎక్కువగా వినియోగిస్తున్నారు. వీరిలో టెక్ట్స్నెక్ సిండ్రోమ్ బారిన పడి ఏదో ఒక దశలో వైద్యానికి వెళ్తున్నవారు 53 శాతం మంది ఉన్నట్టు తేలింది. వీరిలో తీవ్ర మెడ నొప్పితో బాధపడుతున్నవారు 31 శాతం మంది పైనే ఉన్నట్టు వైద్య నిపుణుల అంచనా. వీరిలో 20 ఏళ్ల యువతీయువకులూ ఉన్నారు. 30 ఏళ్లకు పైనున్నవారిలో తీవ్రత ఎక్కువ. సగటున 110 నిమిషాలు మెడలు పూర్తిగా వంచి మెసేజ్లు చూస్తున్నట్టు న్యూరో నిపుణుల సర్వేలో వెల్లడైంది. వాస్తవానికి మెడ 10 నుంచి 12 పౌండ్ల బరువు మోయగలదని, కానీ మెసేజ్లు చదవడానికి మెడను వంచడంవల్ల 60 పౌండ్లు మోయాల్సి వస్తుందని తేల్చారు. పెరుగుతున్న బాధితుల సంఖ్య పద్నాలుగేళ్ల చిన్నారులు కూడా టెక్స్›్టనెక్ సిండ్రోమ్ బారిన పడి వైద్యం కోసం వస్తున్న తీరు చూస్తుంటే విస్మయం కలుగుతోంది. దీన్నిబట్టి మొబైల్ ఫోన్ వాడకం ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. మెడ నరాలు, కండరాలపై తీవ్ర ప్రభావం పడకముందే జాగ్రత్త పడాలి. లేదంటే జీవితాంతం ఇబ్బంది పడాల్సి వస్తుంది. కొంతమంది తల్లిదండ్రులు చిన్నారుల అల్లరి నుంచి బయటపడేందుకు వారికి సెల్ఫోన్లు ఇచ్చి వీడియో గేమ్లు ఆడిస్తున్నారు. దీంతో చిన్నతనంలోనే వారిపై దుష్ప్రభావం పడుతోంది. రోజుకు ఐదారుగురు మెడనొప్పితో మా దగ్గరకు వస్తున్నారు. అయితే మందుల వాడకం, శస్త్రచికిత్స కంటే వ్యాయామమే దీనికి సరైన మందు. – డా. జె. నరేశ్బాబు, వెన్నుపూస వైద్య నిపుణులు, గుంటూరు టెక్ట్స్ నెక్ సిండ్రోమ్కు వైద్యుల సూచనలు.. సలహాలు.. - రెండు మూడు నిమిషాల కంటే ఎక్కువగా మెడ వంచి మెసేజ్లు చూడకూడదు. - మెడను కుడి నుంచి ఎడమకు, ఎడమ నుంచి కుడికి తిప్పుతూ ఉండాలి. - తరచూ అర చేతులు ఆన్చి గట్టిగా తలను వెనక్కు, ముందుకు నెడుతుండాలి. - పదే పదే చేతులను పైకెత్తి కిందికి దించడం వల్ల భుజాలకు కాస్త వ్యాయామం ఉంటుంది. - తరచూ సూర్య నమస్కారాలతోపాటు కొన్ని రకాల ఆసనాలు వేస్తే మెడకు, తలకు, భుజాలకు వ్యాయామం చేకూరుతుంది. -
ఆల్జీమర్స్పై అప్రమత్తత అవసరం
వరల్డ్ ఆల్జీమర్స్ యాక్షన్ డే సందర్భంగా ఇటీవల అల్జైమర్స్ రోగుల సంఖ్య పెరుగుతోంది. గతంలో కంటే ఇప్పుడు ఆయుఃప్రమాణాలు పెరగడంతో వృద్ధుల సంఖ్య కూడా పెరుగుతోంది. దాంతో అల్జైమర్స్ బారిన పడేవారి సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. అల్జైమర్స్ అంటే అదేదో మతిమరపు వ్యాధి మాత్రమేనని చాలామంది అనుకుంటారు. కానీ దీని తీవ్రత అంతకంటే ఎక్కువే. నేడు వరల్డ్ అల్జైమర్స్ యాక్షన్ డే సందర్భంగా అల్జైమర్స్ వ్యాధిపై అవగాహన కోసం ఈ కథనం. మనందరం ఏదో ఒక విషయాన్ని మరచిపోతుంటాం. ఇలా మరచిపోవడం వల్ల కలిగే నష్టం తాత్కాలికంగా ఇబ్బంది కలిగించినా దాని వల్ల మన రోజువారీ పనులకు ఏ మాత్రం ఆటంకం ఉండదు. కాస్త వయసు పైబడ్డ తర్వాత మతిమరపు వచ్చిందనుకోండి. దానివల్ల కొన్ని నష్టాలున్నా జీవితం పెద్దగా అస్తవ్యస్తం కాదు. కానీ అల్జైమర్స్ అలా కాదు. మరపు, మతిమరపునకు తారస్థాయిగా అల్జైమర్స్ను పేర్కొనవచ్చు. అల్జైమర్స్కు ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. అగ్గిపెట్టెను ఉపయోగించి మంటను పుట్టించవచ్చన్న సంగతి తెలిసిందే. మార్కెట్నుంచి వచ్చేటప్పుడు అగ్గిపెట్టెను తెమ్మంటే మరచిపోయేవారు చాలామందే ఉంటారు. కానీ అగ్గి అన్నదాన్నే మరచిపోతే...? వంట చేయడానికి అగ్గిపెట్టెను మరచిపోయారనుకోండి. పర్లేదు. కానీ స్టౌ వెలిగించాక అగ్నితో కలిగే ప్రయోజనాలు, నష్టాలు అన్నింటినీ మరచిపోయారనుకోండి. అలాగే జరిగితే ఓ వృద్ధురాలు వంట మొదలయ్యాక మంటను మరచిపోయి... అది ఒంటిని అంటుకున్నా ప్రమాదమే, ఇంటికి అంటుకున్నా ప్రమాదమే! అల్జైమర్స్లో జరిగేది ఇదే! తాము రోజూ చేసే పనులనే మరచిపోతుంటారు. నిర్ణయాలు తీసుకోవడంలో విచక్షణ కోల్పోతారు. ప్రవర్తనలో ఎంతగానో మార్పు వస్తుంది. టాయ్లెట్కు వెళ్లడం, స్నానం చేయడం, అన్నం కలుపుకోవడం, బట్టలు వేసుకోవడం, తాము రోజూ నడిచే దారిని, ఎన్నో దశాబ్దాలుగా తాము నివాసం ఉంటున్న తమ సొంత ఇంటినే మరచిపోవచ్చు. ఎందుకిలా జరుగుతుంది? అల్జైమర్స్ రోగుల్లో మెదడు క్రమంగా కుంచించుకుపోతుంటుంది. దాంతో మెదడుకణాలు క్రమంగా నశించిపోతాయి. అయితే ఎందుకిలా జరుగుతుందన్న అంశంపై ఇప్పటికీ పూర్తి స్పష్టత లేదు. ఈ విషయంపై పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే లభ్యమవుతున్న ప్రాథమిక సమాచారాన్ని బట్టి పర్యావరణ అంశాలతో పాటు, జన్యుపరమైన కారణాలూ ఈ వ్యాధికి దోహదపడుతున్నాయని కొందరు నిపుణుల భావన. అల్జైమర్స్ మతిమరపుతో కలిగే నష్టాలిలా...? ఈరోజు ఏ వారం... అన్నది మరచిపోవడం అందరి విషయంలోనూ సాధారణంగా జరిగే పరిణామమే. కానీ అసలు తేదీలు, వారాలు, నెలలు అన్న భావననే మరచిపోతే...? అల్జైమర్స్ రోగుల్లో జరిగేదిదే. అయితే కొన్నిసార్లు అకస్మాత్తుగా మరచిన విషయాలు గుర్తుకు రావచ్చు కూడా. ఇలా మనం చూసే వృద్ధులే ఒక్కోసారి మామూలుగా మరికొన్నిసార్లు అన్ని విషయాలనూ మరచిపోయినట్లుగా కనిపిస్తుంటారు. తమలో కలుగుతున్న మార్పులతో ఒక్కోసారి వారు చికాకుకు లోనవుతుంటారు. కొందరు భ్రాంతులకూ లోనవుతుంటారు. అల్జైమర్స్ను గుర్తించడం ఎలా? చాలా కారణాలు మతిమరపునకు దోహదం చేస్తాయి. ఉదాహరణకు పక్షవాతం, మెదడులో గడ్డలు (ట్యూమర్స్), మెదడులో రక్తస్రావం (హ్యామరేజ్) వంటివి. అయితే రోగికి వచ్చిన మతిమరపు అన్నది అల్జైమర్స్ కారణంగానే అని నిర్ధారణ చేయడం ఒకింత కష్టమైన ప్రక్రియ. దీనికి సీటీ స్కాన్, ఎమ్మారై (బ్రెయిన్) వంటి పరీక్షలు దోహదపడతాయి. ఇందులో మెదడు కుంచించుకుపోయినట్లుగా కనిపించడాన్ని బట్టి అల్జైమర్స్ను గుర్తించవచ్చు. అలాగే రోగి చెప్పే లక్షణాలతో, వైద్యపరీక్షల ఫలితాలను సరిపోల్చి దీన్ని నిర్ధారణ చేయవచ్చు. నివారణ: పక్షవాతాన్ని, డయాబెటిస్ను నివారించడానికి అనుసరించే సాధారణ జీవనశైలి సూచనలే అల్జైమర్స్నూ నివారిస్తాయి. అంటే ఆరోగ్యకరమైన జీవనశైలి, పొగతాగడం, మద్యం వంటి అలవాట్లకు దూరంగా ఉండటం, శరీరానికి అలసట రాని విధంగా తేలికపాటి వ్యాయామం (నడక వంటివి) చేయడం ద్వారా దీన్ని నివారించవచ్చు. మధ్యవయసువారిలో సాధారణంగా కలిగే ఒత్తిళ్ల నుంచి దూరంగా ఉండాలి. స్నేహితులతో, కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపటం కూడా అల్జైమర్స్ వ్యాధికి మంచి నివారణ. చికిత్స / మందులు: ప్రస్తుతం అల్జైమర్స్ వ్యాధి వచ్చేందుకు పట్టే సమయాన్ని, ఒకవేళ వస్తే దాని తీవ్రత ముదరడానికి పట్టే సమయాన్ని వీలైనంతగా ఆలస్యం చేసేందుకు మాత్రమే మందులు ఉన్నాయి. అల్జైమర్స్ను పూర్తిగా తగ్గించే మందుల కోసం ఇంకా పరిశోధనలు కొనసాగుతున్నాయి. అల్జైమర్స్ అసలు రాకుండానే నివారించడం కోసం వ్యాక్సిన్ను రూపొందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రోగుల బంధువులకు సూచనలు న్యూరో ఫిజీషియన్లు చెప్పే సూచనలను పూర్తిగా పాటించాలి. రోగులను ఎప్పుడూ ఒంటరిగా ఉండనివ్వకూడదు. వారిని జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండాలి. నిర్వహణ: యాసీన్ డాక్టర్ ముదిరెడ్డి చంద్రశేఖర్రెడ్డి సీనియర్ న్యూరో ఫిజీషియన్ ప్రసాద్ హాస్పిటల్స్, కేపీహెచ్బీ, హైదరాబాద్
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
IPL 2024: ఇవెక్కడి క్యాచ్లు రా బాబు.. చూస్తే ఫ్యూజ్లు ఎగిరిపోవాల్సిందే..!
'ఛీ, నీ బతుకు'.. చురకలంటించిన కలర్స్ స్వాతి
12 పరుగులకే ఆలౌట్.. టీ20ల్లో రెండో అత్యల్ప స్కోర్
జగనన్న పాలనతో పెత్తందార్ల కడుపు మండుతోంది: నాగార్జున యాదవ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
ఆది సాయికుమార్ కొత్త మూవీ.. గోవాలో మ్యూజిక్ సిట్టింగ్స్
కాంగ్రెస్కు శామ్ పిట్రోడా రాజీనామా
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
తప్పక చదవండి
- భారత్లోకి గూగుల్ వాలెట్ వచ్చేసింది.. ఎలా వాడొచ్చంటే?
- ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement