-
కార్మికుల జీవితాలు ‘పేపర్’ ముక్కలేనా..!
మూతబడే దిశగా ఎస్పీఎం దయనీయ స్థితిలో ఎస్పీఎం కార్మికులు మూగబోనున్న కాగజ్నగరం తెలంగాణ ప్రభుత్వంపైనే ఆశలు కాగజ్నగర్ టౌన్ : పేపర్ ఫ్యాక్టరీనే నమ్ముకుని జీవిస్తున్న ఆ కార్మికుల పరిస్థితి పేపర్ ముక్కలాగే కానుందా..? కాగజ్నగర్లోని పేపర్ మిల్లు నడిపించడం కష్టమేనా..? మరి దానిపైనే ఆధారపడ్డ కార్మిక కుటుంబాల పరిస్థితి ఏంటీ..? కొత్త రాష్ట్రం.. కొత్త ప్రభుత్వమే ఆదుకుంటుందనే ధీమాతో ఎదురుచూస్తున్న ఆ కార్మికులకు భరోసా కల్పించే వారెవరు..? పాలకులూ స్పందించండి మీరే..! కాగజ్నగర్లోని సిర్పూర్ పేపర్ మిల్లు (ఎస్పీఎం) నిజాం నవాబు కాలంలో 1936 లో ఏర్పాటైంది. 1942లో ఈ ఫ్యాక్టరీలో పే పర్ ఉత్పత్తి ప్రారంభమైంది. దశాబ్దాలుగా వేలాది మందికి ఉపాధి కల్పిస్తూ వస్తున్న ఈ పేపర్ మిల్లు 2010 నుంచి నష్టాల బారిన పడింది. అప్పటి నుంచి యాజమాన్యం ప్ర క్షాళన మొదలుపెట్టింది. ఈ మిల్లుపై ప్రత్యక్షంగా.. పరోక్షంగా వేలాది కుటుంబాలు ఆధారపడి బతుకుబండి లాగిస్తున్నాయి. ఈ తరుణంలో ప్రస్తుతం మిల్లులో పేపర్ ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో ఆ కార్మికుల కుటుంబాలు దయనీయ పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 94 రోజులుగా మిల్లులో పేపర్ ఉత్పత్తి నిలిచిపోయింది. మూడు నెలలుగా మిల్లులోని యంత్రాలు మూగబోయాయి. తక్కువగానే వేతనాలు.. యాజమాన్యం ఉత్పత్తిని నిలిపివేయడానికి గల కారణాలను, తాజా పరిణామాలపై ఎటువంటి బహిరంగ ప్రకటన చేయకపోవడంతో కార్మికుల్లో రోజురోజుకూ ఆందోళన పెరుగుతోంది. మిల్లు ఉన్నతాధికారులు కూ డా ఒక్కొక్కరుగా రాజీనామాలు చేసి వెళ్తున్నట్లుగా సమాచారం. మిల్లు నిర్వహణ చీఫ్ గా వ్యవహరిస్తున్న ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ కూ డా సెలవు పెట్టి వెళ్లినట్లు తెలుస్తోంది. అసలే చాలీచాలని జీతాలు, ఆపై పెరుగుపోతున్న నిత్యావసర సరకుల ధరలు కార్మిక లోకానికి పెద్ద కష్టాలు తెచ్చిపెట్టగా, మరో వైపు తాజా గా మిల్లు మూతబడే స్థాయికి చేరడంతో ఏం చేయాలో కార్మికులకు తోచడం లేదు. ఇతర కాగిత పరిశ్రమలతో పోలిస్తే, స్థానిక మిల్లులో అతి తక్కువ వేతనాలతోనే కార్మికులు సేవలందించారు. ఆశించిన స్థాయిలో పేపర్ ఉత్పత్తి చేసి ఆదర్శంగా నిలిచారు. అయినా యాజమాన్యం ఉత్పత్తిని ఎందుకు నిలిపివేసిందో అనే అంశంపై జవాబు లేకుండాపోయింది. సెప్టెంబర్ 27వ తేదీ నుంచి ఉత్పత్తిని నిలిపివేసిన యాజమాన్యం కార్మికులకు 2 నెలల జీతాలు చెల్లించి, నవంబర్ నెల వేతనాన్ని ఇప్పటివరకు ఇవ్వలేదు. నిర్మానుష్యంగా మిల్లు.. ఎప్పటికీ కార్మికులతో కళకళలాడే మిల్లు లోపలి భాగం ప్రస్తుతం వెలవెలబోతోంది. యంత్రాలు మూగబోయాయి. ప్రతి రోజూ వందలాది సంఖ్యలో కర్ర, ఇతర ముడిసరుకులు తీసుకొచ్చే వాహనాలు పత్తా లేకుండాపోయాయి. మిల్లు ప్రాంతంలోని చిన్నచిన్న వ్యాపారులకూ ఉపాధి లేకుండాపోయింది. 1600 మంది కాంట్రాక్టు కార్మికులు మంచిర్యాల, కరీంనగర్, బల్లార్షా, చంద్రాపూర్ వంటి నగరాలకు వెళ్లి కూలీనాలీ చేసుకుంటున్నారు. కాగా, మిల్లును ఎలాగైనా తెరిపించాలనే సంకల్పంతో కార్మిక సంఘాల నాయకులు ఏకతాటిపైకొచ్చి ఉద్యమ బాట పట్టారు. ఐక్యకార్యాచరణ సమితిగా ఏర్పడి మిల్లు ఎదుట ధర్నాలు చేపడుతున్నారు. భారీ ర్యాలీలు నిర్వహిస్తూ, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమాలను తలపిస్తూ, కార్మికులతోపాటు అన్ని సంఘాల నాయకులు, ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగ, ఉపాధ్యాయులు, వ్యాపారులు, వైద్యులు ఇలా ప్రతి ఒక్కరూ ఆందోళనల్లో భాగస్వాములవుతున్నారు. కొత్త ప్రభుత్వంపైనే ఆశలు.. కొత్త రాష్ట్రం.. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో సీఎం కె.చంద్రశేఖర్రావుపైనే ఇక్కడి వాసులు ఆశుల పెట్టుకున్నారు. డిసెంబర్ 25న సీఎం జైపూర్ పర్యటనకు వచ్చినా మిల్లుపై ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో కార్మికులు నిరాశకు గురయ్యారు. స్థానిక పాలకులు స్పందించి సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లి.. మిల్లు నడిపించేలా బాధ్యత తీసుకోవాలని కార్మికులు కోరుతున్నారు. -
అప్పుల్లో గూడు!
ఆరు నెలలుగా పైసా చెల్లించని టీడీపీ ప్రభుత్వం ఇంటికి లక్షన్నర దేవుడెరుగు.. కట్టుకొన్న ఇళ్లకు బిల్లులెప్పుడో వడ్డీలకు తెచ్చి ఇళ్లు నిర్మించుకొంటున్న లబ్ధిదారులు మార్చినాటికి బకాయిరూ.16.53 కోట్లు బి.కొత్తకోట: పేదల గూడు అప్పుల్లో కూరుకుపోతోంది. కొత్త ప్రభుత్వంపై పేదలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఎన్నికల్లో ఇంటికి లక్షన్నర ఇస్తామని హామీఇచ్చి గద్దెనెక్కిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేదల నడ్డి విరుస్తున్నారు. వారిని మరింత అప్పుల్లోకి నెట్టేస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకుంటున్న పేదలకు ఆరు నెలలైనా ఒక్కపైసా చెల్లించకపోవడంతో లబోదిబోమంటున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు మార్చి 23తో ఇందిరమ్మ బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి. రూ.16.53 కోట్ల చెల్లింపులు ఆగాయి. నమోదు కాని నిర్మాణాలు మార్చి నెలాఖరుతోనే జిల్లాలో ఇందిరమ్మ గృహ నిర్మాణాల నమోదు ఆగిపోయింది. మండల స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు అధికారులు నిర్మాణాలను వదిలేశారు. జిల్లాలోని పేదలకు 4,43,009 గృహాలను మంజూరు చేశారు. వీటిలో 2,95,134 గృహ నిర్మాణాలు పూర్తయ్యాయి. 31,900 పునాదుల స్థాయి, 2,130 గోడల స్థాయి, 13,170 రూఫ్లెవల్లో ఉన్నాయి. 1,00671 మంది లబ్ధిదారులు గృహ నిర్మాణాలు చేపట్టనేలేదని తేల్చారు. మే 24 వరకు జిల్లాలో ఇళ్ల నిర్మాణాలకు రూ.1,236.2కోట్లను ఖర్చు చేశారు. అప్పటి నుంచి రికార్డు పరంగా ఈ లెక్కలో మార్పులేదు. ఎందుకంటే క్షేత్రస్థాయిలో నిర్మాణాలను నమోదు చేయడం మానేశారు. బకాయిలు రూ.60 కోట్లు జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు సుమారు రూ.60కోట్ల బకాయిలు చెల్లించాల్సి వస్తుందని అంచనా. వివిధ దశల్లోని నిర్మాణాలు కొనసాగుతూనే ఉన్నాయి. లబ్ధిదారులు వడ్డీ వ్యాపారుల నుంచి అధిక వడ్డీలకు రుణాలు తీసుకొస్తున్నారు. మార్చి నుంచి ప్రభుత్వం బిల్లులు చెల్లించడం ప్రారంభిస్తే రూ.60 కోట్ల వరకు ఇవ్వాల్సి వస్తుందని భావిస్తున్నారు. ఇదిగాక మార్చిలోపున్న బకాయిలు కలుపుకుంటే రూ.75 కోట్లకుపైనే చెల్లించాల్సి వస్తుందని అంటున్నారు. లక్షన్నర ఎప్పుడో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇంటికి రూ.లక్షన్నర ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. దీనిపై ఇప్పటివరకు స్పష్టత లేకపోవడంతో కనీసం కట్టుకుంటున్న ఇళ్లకైనా బిల్లులు ఇవ్వాలని కోరుతున్నారు. ప్రస్తుతం ఇంటి నిర్మాణానికి ఎస్టీలకు రూ.1.05 లక్షలు, ఎస్సీలకు రూ.లక్ష, బీసీ, ఓసీలకు రూ.70వేలు ఇస్తున్నారు. వడ్డీలకు తెచ్చి కడుతున్నాం నా భార్య నాగరత్నమ్మకు ఇందిరమ్మ గృహం మం జూరైంది. పునాది దశలో రూ.14 వేలు, గోడల దశలో 34 వేల బిల్లులు చెల్లించారు. ఈ ఏడాది మార్చి నెలాఖరులోగా పైకప్పుకు మోల్డింగ్ వేస్తేనే బిల్లులు వస్తాయి లేకుంటే రావని అధికారులు చెప్పడంతో రూ.20 వేలు అప్పుతెచ్చి పైకప్పు నిర్మాణం పూర్తి చేశాం. ఇంతవరకు బిల్లులు చేతికందలేదు. -డీ.వెంకట్రమణ, పెద్దతిప్పసముద్రం అప్పులెలా తీర్చాలి ఇందిరమ్మ పథకంలో ఇల్లిచ్చారు. బిల్లులివ్వకుంటే చేసిన ఎలా కట్టుకోవాలి. గతంలో రెండు దఫాలుగా రూ.39 వేలు ఇచ్చారు. సుమారు లక్ష మేరకు అప్పుచేశాం. మిగిలిన బిల్లు కోసం అధికారులను అడిగితే ఎవరూ సమాధానం ఇవ్వరు. ఇంటి పనులు ఆపేశాం, అప్పులు మిగిలిపోయాయి. -బి.వల్లెమ్మ, పెద్దకొండామర్రి మోల్డింగ్ పనులతో ఆపేశాం.. ఇందిరమ్మ ఇల్లు మంజూరైందని ఆనందమేసింది. పనులు ప్రారంభించి వెంటనే పూర్తి చేయండి బిల్లులు ఇస్తామని అధికారులు చెప్పారు. పూర్తిచేసినా ఇప్పటివరకూ రూ.16 వేలు ఇచ్చారు. మిగిలిన బిల్లు ఇస్తే పనులు పూర్తి చేస్తామని అధికారులకు తెలిపినా పట్టించుకునేవారు లేరు. -టీ.అలివేలమ్మ, పెద్దకొండమర్రి పట్టించుకునేదెవరు ఇందిరమ్మ ఇంటికి పునాది, గోడల దశ వరకు మాత్రమే బిల్లులిచ్చారు. మూడు నెలల క్రితం ఇంటి పైకప్పు కోసం రూ.30 వేలు అప్పుచేసి నిర్మాణం పూర్తి చేయించాం. ఇంతవరకు బిల్లు మంజూరు చేయలేదు. నిర్మాణం పూర్తిచేస్తే బిల్లులు తొందరగా మంజూరు చేస్తామని చెప్పిన అధికారులు పత్తాలేరు. అప్పులకు వడ్డీలు కడుతున్నాం. -కే. రెడ్డెమ్మ, పెద్దతిప్పసముద్రం -
ఆమెకు రక్షణ
ఖమ్మం క్రైం : మహిళా భద్రతకు భరోసా ఇచ్చేలా నూతన ప్రభుత్వం ముందుకు కదిలింది. ఇటీవల జరుగుతున్న సంఘటనలు మహిళలను ఆందోళనకు గురిచేస్తుండడంతో ప్రభుత్వం వారి భద్రతపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. మహిళా రక్షణపై సీనియర్ ఐఏఎస్, ఏపీఎస్ అధికారులు ముఖ్యమంత్రి కేసీఆర్కు నివేదిక అందజేశారు. ఈ నివేదికలో సూచనల ఆధారంగా ప్రభుత్వం జిల్లా స్థాయిలో మహిళల భద్రతపై తీసుకునే చర్యలకు సంబంధించి కసరత్తు చేస్తోంది. ప్రతి సబ్ డివిజన్లో మహిళాపోలీస్ స్టేషన్.. ప్రస్తుతం ఒక్క జిల్లా కేంద్రంలో మాత్రమే మహిళా పోలీస్స్టేషన్ ఉంది. దీంతో దూర ప్రాంతాల మహిళలు ఇంతదూరం వచ్చి ఫిర్యాదు చేయలేకపోతున్నారు. అయితే ప్రతి సబ్డివిజన్లో ఒక మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని మహిళ రక్షణ కమిటీ సూచించటంతో జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు దీనిపై దృష్టి సారించారు. జిల్లాలో ఏడు సబ్ డివిజన్లు ఉండగా ఖమ్మం సబ్ డివిజన్లో భాగంగా జిల్లా కేంద్రంలో మాత్రమే మహిళా పోలీస్ స్టేషన్ ఉంది. ఇప్పుడు మిగతా ఆరు డివిజన్లతో పాటు ఖమ్మం సబ్ డివిజన్లో మరో స్టేషన్ ఏర్పాటుకు ఉన్నతాధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో మహిళారక్షక్ ఏర్పాటుకు ప్రతిపాదనలు.. మహిళలపై జరుగుతున్న దాడులతోపాటు అఘూయిత్యాలను యుద్ధ ప్రాతిపదికన ఆరికట్టడానికి ఢిల్లీ పోలీసుల తరహాలో మహిళారక్షక్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి అనుమతి లభించిన తర్వాత మహిళా రక్షక్ విధివిధానాలు తెలిసే అవకాశం ఉందని అధికారులు చెపుతున్నారు. మహిళలు, యువతుల అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి.. మహిళలు, యువతుల అక్రమ రవాణాపై జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇల్లెందు, ఖమ్మం, కొత్తగూడెం సబ్ డివిజన్లలోని పలు తండాల్లో కొంతకాలంగా మహిళలు, యువతులను అక్రమ రవాణా చేస్తున్నట్లు తెలిసింది. మహిళా రక్షణ కమిటీ సూచనలతో దీన్ని అరికట్టేందుకు జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. మహిళల వేధించిన ఎన్ఆర్ఐలనూ వదిలేది లేదు.. వరకట్న వేధింపులతోపాటు, మహిళల పట్ల ఇతర నేరాలకు పాల్పడి విదేశాలలో ఉన్న ఎన్ఆర్ఐలను స్వదేశానికి రప్పించాలనే కమిటీ సూచనలపై కూడా పోలీసులు దృష్టి సారించారు. అలాంటి ఎన్ఆర్ఐల జాబితా సిద్ధం చేయాటానికి సమాయత్తమవుతున్నారు. విద్యా సంస్థల్లో ప్రత్యేక శిబిరాలు.. మహిళల భద్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించాలనే కమిటీ సూచన మేరకు జిల్లా పోలీసులు విద్యాసంస్థలలో ప్రత్యేక క్యాంపులు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించగానే దీనిని ఆచరణలో పెట్టాలని పోలీస్ శాఖ నిర్ణయించింది. మహిళలపై దాడులు, అఘాయిత్యాలకు పాల్పడితే అత్యంత కఠినంగా, నేరగాళ్లకు భయం పుట్టేలా చర్యలు ఉంటాయని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పటంతో పాటు పోలీస్శాఖకు సైతం ఆదేశాలు అందాయి. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారెవరైనా ఉపేక్షించేది లేదని అధికారులు సైతం హెచ్చరిస్తున్నారు. కేసు నమోదైన ఒక్క రోజులోనే వారిపై చర్యలు తీసుకోవటానికి ఏర్పాట్లు చేస్తున్నారు. తమ భద్రతకు ప్రభుత్వం సంరక్షణ చర్యలు తీసుకుంటుండడంతో పలువురు మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మహిళలకు భద్రత అవసరం .. - బత్తిన సాయిశ్రీ, వైరా డీఎస్పీ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేక రక్షణ ఏర్పాటు చేయడం హర్షనీయం. మహిళలు నిర్భయంగా జరిగిన అన్యాయాన్ని తెలియజేసినప్పుడే చట్టాలు వారికి రక్షణగా నిలుస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మహిళా భద్రతపై కమిటీ, మహిళలకు వారి వారి స్థానాల్లో కల్పిస్తున్న సౌకర్యాలు ఎంతో ఉపయోగపడుతాయి. చిన్నతనం నుంచే తల్లిదండ్రులు పిల్లలకు ప్రోత్సాహం ఇచ్చి ఇంటి నుంచే మంచి నడువడిక అలవడేలా చూడాలి. సమాజం కూడా మహిళలకు రక్షణగా ఉంటే చట్టాలకు మరింత మద్దతు లభించినట్లు అవుతుంది. -
ఇక ఎన్టీఆర్ కూపన్లు
నరసన్నపేట రూరల్ : కొత్త ప్రభుత్వం కొలవుదీరింది ఇంకేముంది ఇప్పటి వరకు అందని రేషన్ కార్డులు అందేస్తారుులే అని ఎదురు చూసిన లబ్దిదారులకు నిరాశే ఎదురవుతోంది. పాత ప్రభుత్వ విధానంలోనే కొత్తగా ఎన్టీఆర్ ప్రజాపంపిణీ పేరుతో కూపన్లు ప్రభుత్వం సరఫరా చేస్తోంది. పథకం పేరు మార్చి ఆరు నెలలకు సరిపడా కొత్త కూపన్లు అందిస్తుడడంతో లబ్దిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రచ్చబండ వన్లో కూపన్లు అందించిన వారికి ఇప్పటి వరకు కొత్త కార్డులు జారీ కాలేదు. కుటుంబ సభ్యుల గ్రూపు ఫొటో, ఆధార్ కార్డులతో డిక్లరేషన్ సమర్పించినప్పటికీ హైదరాబాద్ నుంచి కార్డుల ప్రింటింగ్ కాలేదని చెబుతూ వీరికి కార్డులు అందించలేదు. ఈ విధంగానే నరసన్నపేట నియోజకవర్గంలో 3 వేల మంది వరకూ లబ్దిదారులు ఉన్నారు.కొత్తగా కార్డుల కోసం మరో 6 వేల దరఖాస్తులు నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్నాయి. ప్రస్తుతం ప్రతి పనికి రేషన్ కార్డు జిరాక్స్ తప్పనిసరి కావడంతో కొత్త కార్డులు అందించాల్సిందే అంటూ లబ్దిదారులు ఆందోళన చెందుతున్నారు. అయితే బియ్యం, ఇతర నిత్యవసర సరుకులు ఇస్తున్నాం కదా కార్డు కోసం అంత తొందర ఎందుకు అని రెవెన్యూ సిబ్బంది అంటున్నారు. కార్డుల్లేకపోవడంతో సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకోలేకపోతున్నామని లబ్దిదారులు వాపోతున్నారు. కాగా గత నెలలో నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో 3 వేల మంది లబ్దిదారులకు కూపన్లు అందించారు. డిసెంబర్ వరకూ సరిపడా కూపన్లు లబ్దిదారులకు మంజూరు చేశారు. ఆగష్టు నుంచి ఈ కూపన్లు వినియోగంలోకి వచ్చాయి. కాగా రచ్చబండ -3లో వచ్చిన దరఖాస్తులు పరిశీలన అనంతరం కార్డులు మంజూరు చేయాల్సి ఉంది. ఈ దశలో మళ్లీ కూపన్లు మాత్రమే సరఫరా చేయడంతో లబ్దిదారులు నిరశన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందంచి కూపన్లు స్థానంలో కార్డులు మంజూరు చేయాలని వినియోగదారులు కోరుతున్నారు. -
ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం: స్వామిగౌడ్
సాక్షి,సిటీబ్యూరో: కొత్త ప్రభుత్వంలో అందరం ఏకమై ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామని తెలంగాణ శాసనమండలి అధ్యక్షుడు స్వామిగౌడ్ పిలుపునిచ్చారు. రవీంద్రభారతిలో శుక్రవారం సత్కళా భారతి హైదరాబాద్ ఆధ్వర్యంలో ‘జయ జయహే తెలంగాణ’ సంగీత నత్యరూపకం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ జయజయహే నృత్యరూపకాన్ని తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో నిర్వహించాలని సూచించారు. 60 ఏళ్ల తెలంగాణ పోరాట ఘట్టాలను ఒక గంటలో చూపించడం మహాద్భుతమన్నారు. నృత్య రూపకానికి దర్శకత్వం వహించిన డాక్టర్ కోట్ల హనుమంతరావు, సంగీతం సమకూర్చిన డీఎస్వీ శాస్త్రి, రచన చేసిన డాక్టర్ వడ్డేపల్లి కష్ణలు అభినందనీయులన్నారు. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి.రమణ మాట్లాడుతూ నృత్యరూపక కళాకారులకు అభినందనలు తెలిపారు. రాష్ట్ర ప్రెస్ అకాడమీ అధ్యక్షుడు అల్లం నారాయణ మాట్లాడుతూ తెలంగాణ స్వీయ రాజకీయ చిత్తం కోసం పోరాడి...చివరికి సాధించుకున్నదని చెప్పారు. రాజకీయాలు మాట్లాడేవారు తెలంగాణ పోరాటం విముక్తి కోసం జరిగిన పోరాటంగా గుర్తించడం లేదన్నారు. గురుకుల భూములను ప్రభుత్వం తీసుకోవాలనుకుంటోందన్నారు. ఉద్యమకారుల ఆకాంక్షను ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఎల్లూరి శివారెడ్డి మాట్లాడుతూ జయ జయహే తెలంగాణ నృత్యరూపకం, తెలంగాణ జనపద గేయాలు భేషుగ్గా ఉన్నాయని ప్రశంసించారు. అనంతరం నృత్య రూపకంలో పాల్గొన్న కళాకారులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో సత్కళా భారతి అధ్యక్షుడు జి.సత్యనారాయణ, ఎమ్మెల్సీ పూల రవీందర్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యమ ఘట్టాలను గుర్తుచేసిన రూపకం జయ జయహే తెలంగాణ సంగీత నృత్య రూపకం 60 ఏళ్ల తెలంగాణ పోరాటంలోని కీలక ఘట్టాలను ఒక గంటలో కళ్ల ముందుంచింది. దీన్ని తిలకించేందుకు వచ్చిన ప్రజలు, నేతలు ఉత్కంఠగా సన్నివేశాలను తిలకించారు. రవీంద్రభారతి ప్రాంగణంలో ఉన్న యావన్మంది రూపకాన్ని రచించిన డాక్టర్ వడ్డేపల్లి కష్ణ, దర్శకత్వం వ హించిన డాక్టర్ అనితారావు, డాక్టర్ కోట్ల హనుమంతరావు, సంగీతం సమకూర్చిన డీఎస్వీ శాస్త్రిలను ప్రశంసించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement