-
కాఫీ బోర్డులోకి శ్రీశాంత్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రతిష్టాత్మక భారత కాఫీ బోర్డు సభ్యుడిగా సీసీఎల్ ప్రొడక్ట్స్ ఎండీ చల్లా శ్రీశాంత్ నియమితులయ్యారు. మూడేళ్లపాటు ఆయన ఈ పదవిలో ఉంటారు. ఇన్స్టాంట్ కాఫీ తయారీదార్ల తరఫున సభ్యుడిగా బోర్డు ఆయనను ఎంపిక చేసింది. ఆంధ్రప్రదేశ్ నుంచి అత్యధికంగా అయిదుగురికి బోర్డులో స్థానం దక్కడ విశేషం. ‘ఏపీలో కాఫీ సాగుపై ప్రత్యేకంగా దృష్టిసారించినట్టు దీనినిబట్టి అర్థం అవుతోంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకుంటే భారత్లో కాఫీ ఉత్పత్తి రెండింతలు అవుతుంది’ అని శ్రీశాంత్ ఈ సందర్భంగా తెలిపారు. -
రాష్ట్రపతికి నూతన ఎంపీల జాబితా సమర్పించిన ఈసీ
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన ంపీల జాబితాను ఎన్నికల కమిషన్ (ఈసీ) రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు అందజేసింది. 17వ లోక్సభ ఏర్పాటు ప్రక్రియలో భాగంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ సునిల్ ఆరోరా, ఇద్దరు కమిషనర్లు అశోక్ లావాసా, సుశీల్ చంద్రలు.. శనివారం కోవింద్ను రాష్ట్రపతి భవన్లో కలిశారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం కొత్త లోక్సభ ఏర్పాటుకు ఫలితాల్లో వెల్లడైన ఎంపీల పేర్లను రాష్ట్రపతికి అందజేశారు. ఇది లోక్సభ ఏర్పాటుకు సంబంధించి ప్రక్రియను ప్రారంభించడానికి రాష్ట్రపతికి ఉపయోగపడనుంది. ఈ సందర్భంగా ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా నిర్వహించినందుకు ఎన్నికల ప్రధానాధికారి, ఇతర కమిషనర్లను రాష్ట్రపతి కోవింద్ అభినందించారు. -
సమస్యల పరిష్కారానికి కృషి
ఎన్జీవో జిల్లా అధ్యక్షుడు దయానందరాజు నగరంపాలెం: ఉద్యోగుల సమస్యలు పరిష్కారించటానికి ఆం ధ్రప్రదేశ్ నాన్గజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ నగరశాఖ కార్యవర్గం శక్తివంచన లేకుండా కృషి చేయాల్సిఉందని ఏపీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు దయానంద రాజు సూచించారు. శనివారం ఎన్జీవో కల్యాణమండపంలో నగరశాఖ నూతన కార్యవర్గ అభినందన కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ గతం సంఘంపై ఉద్యోగుల స్పందించిన తీరుకు నిదర్శనమే ఈ ఎన్నికల ఫలితాలున్నారు. ఎన్జీవో జిల్లా కార్యదర్శి నాగవర్దన్ మాట్లాడుతూ ఉద్యోగుల ఆశయాలకనుగుణంగా నాయకులు పనిచేయాలన్నారు. అత్యధిక మేజారిటీతో గెలిపించినందుకు నగరశాఖ నూతన అధ్యక్షుడు సుకుమార్, కార్యదర్శి మూర్తి కృతజ్ఞతలు తెలిపారు. ప్రమాణ స్వీకారం .. శుక్రవారం ఉదయం జరిగిన ఏపీఎన్జీవో నగరశాఖ ఎన్నికల కౌంటింగ్ శనివారం తెల్లవారుఝామున ముగిసింది. నగరశాఖలో మొత్తం 1,536 ఓటర్లు ఉండగా 1,356 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. సుకుమార్ ప్యానల్కు 1,004 ఓట్లు లభించగా శివశంకర్ ప్యానెల్కు 274 ఓట్లు లభించాయి. దీనితో సుకుమార్ ప్యానెల్ గెలుపొందినట్లు ఎన్నికల అధికారి ఎ.భూషణం ప్రకటించారు. అధ్యక్షుడిగా సుకుమార్, కార్యదర్శిగా యం.యస్.మూర్తి, ట్రెజరర్ పి.హరికిషన్, అసోసియేట్ ప్రెసిడెంట్ యస్డి.జానీబాషా, ఆర్గనైజింగ్ సెక్రటరీ వైవి.సత్యనారాయణరావు, ఉపాధ్యక్షులుగా కె.సాంబయ్య, డి.శ్రీనివాసరావు, ఎల్.శ్రీనివాసరావు, జాయింట్ సెక్రటరీలుగా బి.కొండారెడ్డి, పి.కోటేశ్వరరావు, వై.పద్మజ, పి.రవిబాబు, కె.శివజ్యోతి, డీఈసీ మెంబర్లుగా యం.కోటేశ్వరరావు, బి.సునీల్కుమార్, సిహెచ్.వీరబ్రహ్మేశ్వరరావులతో ప్రమాణం చేయించారు.
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
రుబెల్లాపై గర్భిణులు అప్రమత్తంగా ఉండాలి
స్పైస్జెట్కు రూ.60 వేల జరిమానా
బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే పింఛన్ల పెంపు
నేడు ప్రధానమంత్రి రోడ్ షో
ఓటింగ్ శాతం పెంచాలి
ఉమ్మరకోట్ సొంతం!
సీ్త్ర, పురుష నిష్పత్తిలో తేడా తగ్గించాలి
ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
సమన్వయంతో పనిచేద్దాం: ఎస్పీ
‘12, 13 తేదీల్లో పత్రికా ప్రకటనలపై ముందస్తు అనుమతి తప్పనిసరి’
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కు వ్యతిరేకంగా యాడ్ .. బీజేపీ నేత సీరియస్
- ఐపీఎల్ మధ్యలోనే దుబాయ్ వెళ్లిన సన్రైజర్స్ కెప్టెన్..
- ఫోటో తీస్తే కవిత రాసే కెమెరా.. ఇది కదా టెక్నాలజీ అంటే!
- పాపం బ్రెజిల్.. ఎటు చూసినా వరదలే..
- కష్టాల్లో 'పద్మ శ్రీ మొగిలయ్య'.. సాయం చేసిన బుల్లితెర నటి
- మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే: సీఎం జగన్
- ‘ కృష్ణమ్మ’ మూవీ రివ్యూ
- టీడీపీ అడ్డంగా బుక్కైంది: సజ్జల కీలక వ్యాఖ్యలు
- వివేకా కేసు: సునీత దంపతులకు ఎదురుదెబ్బ
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement