-
'తానా ప్రపంచ సాహిత్యవేదిక' గా 64 వ సాహిత్య సమావేశం
డాలస్, టెక్సాస్: తానా సాహిత్య విభాగం ‘తానా ప్రపంచ సాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో ప్రతి నెలా ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశంలో భాగంగా ఆదివారం నిర్వహించిన 64 వ సాహిత్య సమావేశం మన సినారె “విశ్వంభర” సంబురం ఘనంగా జరిగింది. తానా అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు అతిథులందరినీ ఆహ్వానించి తన స్వాగతోపన్యాసంతో సభను ప్రారంభించారు. సభాప్రారంభకులుగా హాజరైన తెలంగాణా సారస్వత పరిషత్తు, సుశీలా నారాయణ రెడ్డి ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి అయిన డా. జుర్రు చెన్నయ్య పద్మభూషణ్ ఆచార్య డా. సింగిరెడ్డి నారాయణ రెడ్డి జీవనరేఖలను ఆయన విద్యార్ధి దశ, సాహిత్య ప్రయాణం, నిర్వహించిన పదవులు, సాధించిన విజయాలు, చేసిన రచనలు, అందుకున్న సన్మాన సత్కారాలను సోదాహరణంగా ఒక విహంగ వీక్షణంలా నారాయణ రెడ్డి గారి ప్రతిభను గొప్పగా ఆవిష్కరించారు. తానా ప్రపంచ సాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “ప్రముఖ కవి, పూర్వ రాజ్యసభ సభ్యులు, పూర్వ ఉపకులపతి, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, ప్రముఖ సినీగీత రచయిత, పద్మభూషణ్, ఆచార్య డా. సి. నారాయణ రెడ్డి గారు తన జీవితకాలంలో అలంకరించిన పదవులు, సమవర్ధవంతంగా నిర్వహించిన బాధ్యతలు, సాధించిన విజయాలు ఏ సాహితీవేత్తకు దక్కని గౌరవాలు అన్నారు. ఆయన కలం నుండి జాలువారిన దీర్ఘ కావ్యం ‘విశ్వంభర’ కు సాహిత్యంలో అత్యున్నత జ్ఞానపీఠ పురస్కారం దక్కడం ప్రతీ తెలుగువాడు గర్వించదగ్గ విషయం అన్నారు. ప్రస్తుతం అదే విశ్వంభర కావ్యాన్ని ఇప్పుడు ప్రముఖ సినీ కథారచయిత జే.కే భారవి అత్యున్నత ప్రమాణాలతో శ్రవణరూపంలో ముద్రించడం హర్షదాయకం” అన్నారు. తానా అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు మాట్లాడుతూ “తెలుగు భాషాసాహిత్య వికాసాలకోసం తానా ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉంటుందని, ప్రముఖ కవి డా. సినారె రాసిన విశ్వంభర కావ్యాన్ని ప్రముఖ సినీ కథారచయిత జే.కే భారవి తన విశిష్టగళంలో ఆడియో రూపంలో ముద్రించడం ముదావహమని, ఇప్పుడు దానిని సాహితీలోకానికి తానా ప్రపంచ సాహిత్యవేదికగా విడుదలజేయడం ఆనందదాయకం అన్నారు.” సుప్రసిద్ధ సినీ కథారచయిత చిన్నికృష్ణ మాట్లాడుతూ.. తాను పలుమార్లు జే.కే భారవి రూపొందించిన విశ్వంభర ఆడియో విన్నానని, చాలా శ్రవణానందకరంగా ఉన్నదని, దీన్నే వీడియో రూపంలో తన స్వంత ఖర్చులతో దృశ్యమాలికగా తీసుకువచ్చే ఆసక్తి ఉన్నదని, త్వరలోనే ఈ విషయంలో సినారె కుటుంబసభ్యులను సంప్రదిస్తానన్నారు. సుప్రసిద్ధ కథారచయిత జే.కే భారవి మాట్లాడుతూ.. డా. సినారె విరచిత విశ్వంభర కావ్యాన్ని ఒక పిచ్చి వ్యామోహంతో ఎన్నో సార్లు చదివానని, ఎంతో ఆసక్తితో ఎన్నో వ్యవ ప్రయాసలకోర్చి దీన్ని అత్యున్నత ప్రమాణాలతో నేను రూపొందించిన ఆడియోని ఇప్పుడు తానా ప్రపంచ సాహిత్యవేదికగా విడుదలజేయడం చాల సంతోషంగా ఉన్నదని చెప్పారు. అలాగే దీనికి కారకులైన తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు, తానా పూర్వధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూరకు ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు. ప్రముఖ ప్రేరణాత్మక ప్రసంగకర్త ఆకెళ్ళ రాఘవేంద్ర విశ్వంభర కావ్యంలోని అనేక విషయాలను ఉటంకించి, ఆ కావ్య లోతుపాతుల్ని, కావ్య వైభవాన్ని ప్రతిభావంతంగా విశ్లేషించి సినారె సాహిత్య ప్రతిభను గొప్పగా ఆవిష్కరించారు. పద్మభూషణ్ డా. సినారె కలం నుండి వెలువడిన “విశ్వంభర” కావ్యం మొత్తాన్ని ప్రముఖ సినీ కథా రచయిత జే.కే భారవి గళంలో మీకోసం ప్రత్యేక కానుకగా ఈ క్రింది లింక్ను క్లిక్ చేసి వినవచ్చు. https://youtube.com/playlist?list=PL0GYHgMt2OQyx6qWv-kWt2bCxAl6GB5XO&si=D4SS-jzDXYhmqFQX -
మార్కెట్లోకి మళ్లీ హీరో కరిజ్మా..
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తాజాగా కరిజ్మా బ్రాండ్ను మళ్లీ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. కరిజ్మా ఎక్స్ఎంఆర్ 210 సీసీ బైక్ను ఆవిష్కరించింది. దీని ప్రారంభ ధర రూ. 1.72 లక్షలుగా (ఎక్స్షోరూం) ఉంటుంది. ప్రీమియం సెగ్మెంట్లో తమ వాటాన్ని పెంచుకునే దిశగా తమకు ఇది మరో మైలురాయి అని హీరో మోటోకార్ప్ సీఈవో నిరంజన్ గుప్తా తెలిపారు. తాము ప్రస్తుతం ఈ విభాగంలో ఇప్పుడిప్పుడే కార్యకలాపాలు ప్రారంభిస్తున్నామని, మార్కెట్ వాటా 4–5 శాతం మాత్రమే ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రీమియం ఉత్పత్తుల పోర్ట్ఫోలియోను పూర్తి స్థాయిలో వేగవంతంగా రూపొందించుకోనున్నట్లు గుప్తా చెప్పారు. ప్రస్తుతం 150 సీసీ లోపు సెగ్మెంట్లో అగ్రస్థానంలో ఉన్న హీరో మోటోకార్ప్ ఇకపై 150 సీసీ నుంచి 450 సీసీ వరకు బైక్ల సెగ్మెంట్లో స్థానాన్ని పటిష్టం చేసుకోవడంపై దృష్టి పెట్టనుంది. ఇందులో భాగంగా వచ్చే ఏడాది వ్యవధిలో ప్రతి మూడు నెలలకోసారి ఒక కొత్త ఉత్పత్తిని ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. -
హీరో మోటోకార్ప్ కొత్త సీఈవో ఎవరో తెలుసా?
సాక్షి, ముంబై: ప్రపంచంలోనే అతిపెద్ద మోటార్సైకిల్ స్కూటర్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ కొత్త సీఈవోను ప్రటించింది. ప్రస్తుతం సీఎఫ్వోగా ఉన్న నిరంజన్ గుప్తాకు ప్రమోషన్ ఇచ్చి మరీ సీఈవోగా నియమించింది. గుప్తా నియామకం 2023 మే 1వ తేదీ నుండి బాధ్యతలు స్వీకరిస్తారని కంపెనీ ప్రకటించింది. అయితే కొత్త సీఎఫ్వో ఎవరుఅనేది ఇంకా ప్రకటించలేదు. (ఇదీ చదవండి: IPL 2023: ఆ క్రికెటర్కు లక్కీ చాన్స్, టియోగో ఈవీ ఓనర్లకు బంపర్ ఆఫర్లు) ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ ప్రకారం, హార్లే డేవిడ్సన్, జీరో మోటార్సైకిల్స్ వంటి గ్లోబల్ బ్రాండ్లతో హీరో మోటోకార్ప్ భాగస్వామ్యంలో నిరంజన్ కీలక పాత్ర పోషించారు. గుప్తా ఏథర్ ఎనర్జీ, హెచ్ఎంసిఎల్ కొలంబియా, హెచ్ఎంసి ఎంఎం ఆటో ప్రైవేట్ లిమిటెడ్ బోర్డులలో కూడా సేవలందిస్తున్నారు. నిరంజన్ హీరో మోటోకార్ప్లో చేరడానికి ముందు మూడేళ్లు వేదాంతలో, 20 సంవత్సరాలు యూనిలీవర్లో పనిచేశారు. గుప్తా సీఈవోగా ఎదగడంపై హీరో మోటోకార్ప్ఎగ్జిక్యూటివ్ చైర్మన్ హోల్ టైమ్ డైరెక్టర్ పవన్ ముంజాల్ సంతోషంప్రకటించారు. కాగా బోర్డు ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా, హోల్టైమ్ డైరెక్టర్గా పవన్ ముంజాల్ కొనసాగనున్నారు. -
వైద్య దిక్సూచి ‘కేర్ మోటో’!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘‘పండగొస్తుంది. షాపింగ్కెళతాం. అక్కడి డ్రెస్సుల్లో ఒకటి ఎంపిక చేసి.. మనకు నప్పుతుందో లేదో ట్రయల్ వేసుకొని మరీ చూస్తాం. నచ్చితే ఒకే! లేకపోతే ఇంకోటి చూస్తాం! కుదరకపోతే వేరే షాపుకెళతాం’’ ఇందులో మనకయ్యే ఖర్చేమీ ఉండదు! మరి దీన్నే వైద్య సేవలకు అన్వయిస్తే...‘‘సుస్తీ చేస్తే దగ్గర్లోని ఆసుపత్రికెళతాం. మందులు వాడతాం. తగ్గలేదంటే మరో ఆసుపత్రికెళతాం. మళ్లీ మందులు వాడతాం. ఈ లోపు స్నేహితులో, బంధువులో మరో వైద్యుడిని సూచిస్తే అక్కడికీ వెళతాం’’ కానీ వెళ్లిన ప్రతి ఆసుపత్రిలో డాక్టర్ కన్సల్టేషన్, పరీక్షలు, మందులు ఖర్చులు తడిసిమోపడవుతాయి! పై రెండు ఉదాహరణలతో తెలిసిందొక్కటే.. విండో షాపింగ్లా ట్రీట్మెంట్ షాపింగ్ ఉచితంగా దొరకదని! దీన్నే వ్యాపారంగా మార్చుకున్నారు నిమ్స్లో గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ సర్జన్గా ఉన్న డాక్టర్ నిరంజన్ రావూరి. 2016 ఏప్రిల్లో హైదరాబాద్ కేంద్రంగా కేర్మోటో.కామ్ను ఆరంభించారు. సంస్థ సేవలు, ఇతర వివరాలను ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. సాధారణంగా పేషెంట్లు 3 రకాలు. ఆరోగ్య బీమాతో చికిత్స చేయించుకునేవాళ్లు, బీమా లేకుండా డబ్బుతో చికిత్స చేయించుకునే వాళ్లు, ఆరోగ్యశ్రీ వంటి ప్రభుత్వ పథకాలను వినియోగించుకునే వాళ్లు. నిజానికి 60 శాతం పేషెంట్లు బీమాతో చేయించుకునేవారే. వీళ్ల సమస్యేంటంటే.. ఏ జబ్బుకు ఏ ఆసుపత్రి, ఏ వైద్యుడు సరైన చికిత్స చేస్తాడో తెలియదు. డబ్బులు వృథా చేస్తుంటారు. రోజూ పేషెంట్లు వచ్చి నాకు చెప్పే బాధలే కేర్మోటో.కామ్కు పునాది వేశాయి. ట్రీట్మెంట్ షాపింగ్ ఖర్చును నివారించి ఏ రోగానికి ఏ ఆసుపత్రిలో సరైన చికిత్స అందుతుందో.. అది కూడా అందుబాటు ధరల్లో ఎక్కడ ఉంటుందో చెప్పడమే కేర్మోటో.కామ్ పని. 6 నెలల్లో మార్కెట్లోకి ఐఓటీ పరికరం.. ప్రస్తుతం మా వద్ద 30 మంది ఉద్యోగులున్నారు. వైద్య పరిభాషతో పాటూ ఏ జబ్బుకు ఎలాంటి చికిత్స ఉంటుందనే అంశాలపై శిక్షణ ఇచ్చిన తర్వాతే ఉద్యోగులను నియమించుకుంటాం. ఐఓటీ ఆధారిత మెడికల్ డివైజ్ను అభివృద్ధి చేస్తున్నాం. 40 శాతం అభివృద్ధి పూర్తయింది. మరో 6 నెలల్లో మార్కెట్లోకి విడుదల చేస్తాం. ఇదేంటంటే.. డివైజ్ను కొన్న కస్టమర్ బీపీ, షుగర్, హృదయ స్పందన వంటి వివరాలు ఎప్పటికప్పుడు క్లౌడ్ ఆధారంగా కేర్మోటోకు చేరుతాయి. ఎలాంటి తేడాను గుర్తించినా.. వెంటనే కస్టమర్కు సమాచారం పంపిస్తాం. వెంటనే కస్టమర్ దగ్గర్లోని వైద్యుడిని సంప్రదించే వీలుంటుంది. 3 నెలల్లో రూ.6 కోట్ల సమీకరణ.. 2 నెలల్లో డయోగ్నస్టిక్, ఆరోగ్య బీమా, ఫిజియోథెరపీ విభాగాల్లోనూ సేవలు ప్రారంభిస్తాం. తొలిదశలో 10 సెంటర్లతో ఒప్పందం చేసుకుంటాం. ఇప్పటివరకు కేర్మోటోలో వ్యక్తిగతంగా రూ.కోటి పెట్టుబడి పెట్టా. విస్తరణ కోసం రూ.6 కోట్లు సమీకరిస్తున్నాం. ఒకరిద్దరు వీసీ ఇన్వెస్టర్లతో చర్చించాం.3 నెల ల్లో డీల్ క్లోజవుతుంది. కర్ణాటక, తమిళనాడులో 40 ఆసుపత్రులతో ఒప్పందం చేసుకుని విస్తరిస్తున్నాం. 100 ఆసుపత్రులు.. 300 మంది వైద్యులు.. ప్రస్తుతం హైదరాబాద్తో పాటూ విజయవాడ, వైజాగ్, ఒంగోలు, నెల్లూరు, గుంటూరు, కాకినాడల్లోని సుమారు 100 ఆసుపత్రులు, 300 మంది వైద్యులతో ఒప్పందం చేసుకున్నాం. వైద్య ఖర్చులను సమకూర్చేందుకు మిలాప్, ఇంపాక్ట్ గురు వంటి క్రౌడ్ఫండింగ్ సంస్థలతోనూ ఒప్పందం చేసుకున్నాం. ఈ మధ్యే శ్రీకాకుళానికి చెందిన ఓ వ్యక్తికి కాలేయ మార్పిడికి మిలాప్ ద్వారా నిధులు సమీకరించాం. కాలేయ దాత దొరకగానే చికిత్స మొదలవుతుంది. కేర్మోటోకు 2.64 లక్షల యూజర్లున్నారు. 4,767 కన్సల్టేషన్స్ పూర్తి చేశాం. మా ద్వారా 1,049 సర్జరీలు జరిగాయి. ప్రస్తుతం రోజుకు 120 కాల్స్ వస్తున్నాయి. వీటిల్లో మెకాళ్ల మార్పిడి, కంటి శుక్షాల చికిత్స, కాలేయ మార్పిడి వంటి వ్యాధులకు సంబంధించిన ఫోన్లే ఎక్కువగా ఉంటున్నాయి. 70 శాతం కేసులను నిమ్స్, ఎంఎన్జే, పుట్టపర్తి ఆసుపత్రులకే సూచిస్తుంటాం. -
465... అసలేం జరిగింది?
కార్తీక్ రాజా, నిరంజన, మనోబాల ముఖ్య పాత్రల్లో సాయిసత్యం దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ సినిమా ‘465’. శివపుత్ర క్రియేషన్స్ పతాకంపై అడ్డా వెంకట్రావు సమర్పణలో కుసుమ రామ్సాగర్ ఈ చిత్రాన్ని అదే పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ– ‘‘హారర్ నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘465’. ఈ చిత్రం తమిళనాడులో ఘనవిజయం సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఇంతవరకు వచ్చిన హారర్ చిత్రాలకు భిన్నంగా ఈ సినిమా ఉంటుంది. శశాంక్ రవిచంద్రన్ రీ–రికార్డింగ్ ఈ చిత్రానికి హైలైట్. అనువాద కార్యక్రమాలు, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. తెలుగు ప్రేక్షకులు తప్పకుండా చూడాల్సిన చిత్రమిది. తమిళంలోలా తెలుగులోనూ మా చిత్రం విజయవంతం అవుతుందనే నమ్మకం ఉంది. త్వరలో ఆడియో, సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శశాంక్ రవిచంద్రన్, మాటలు: శశాంక్ వెన్నెలకంటి, కెమెరా: పి.ఆర్.సుందర్, నిర్వహణ: యస్.కె. రఫీ, ఎ.టి. కృష్ణన్.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
టైటానిక్ ప్రమాదంలో మరణించిన వ్యాపారవేత్త గోల్డ్ వాచ్ వేలం : ధర తెలిస్తే
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
- అసభ్య వీడియోల వివాదం: స్పందించిన హెచ్డీ రేవణ్ణ
- ఈ పాపని గుర్తుపట్టారా? లేటెస్ట్ సెన్సేషన్.. రూ.100 కోట్ల మూవీ హీరోయిన్
- నామినేషన్ దాఖలు చేసిన రాజ్నాథ్ సింగ్
- గుడిలో ప్రముఖ నటికి చేదు అనుభవం.. పోస్ట్ వైరల్
- అరుదైన ఘనత సాధించే పనిలో స్టార్ హీరోయిన్ జ్యోతిక
Advertisement