-
ముంబైలో శశికుమార్
నటుడు శశికుమార్ ముంబైలో మకాం పెట్టారు. అంతే కాదు అక్కడి తమిళులు తనపై చూపిన అభిమానానికి తబ్బిబ్బైపోతున్నారు కూడా. గ్రామీణ చిత్రాలకు పేటెంట్ హీరోగా మారిన ఈయన ఇప్పుడు సిటీస్లోనూ అలరించడానికి సిద్ధమైపోయారు. అలా శశికుమార్ తాజాగా నటిస్తున్న చిత్రాన్ని కల్పతరు పిక్చర్స్ పతాకంపై పీకే.మోహన్ నిర్మిస్తున్నారు. భారీ యాక్షన్తో పాటు వినోదభరిత సన్నివేశాలతో కూడిన కమర్శియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మరో ప్రధాన పాత్రను నటుడు శరత్కుమార్ పోషించడం విశేషం. ఎన్వీ.నిర్మల్కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం గురించి ఆయన తెలుపుతూ ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని యాక్షన్ సన్నివేశాలను ముంబైలో బాగా జన సంచారం ఉన్న రోడ్లపై చిత్రీకరించామని తెలిపారు. షూటింగ్ అని తెలియకుండా కెమెరాలను చాటుగా ఉంచి ఈ సన్నివేశాలను చిత్రీకరించినట్లు చెప్పారు. దీంతో అక్కడేదో గొడవ జరుగుతుందని భావించిన ఆ ప్రాంత ప్రజలు వెంటనే పోలీసులకు ఫోన్ చేసి సమాచారాన్ని అందించారన్నారు. దీంతో అక్కడకు పోలీసులు రావడంతో తాము పరిస్థితిని వారికి వివరించినట్లు చెప్పారు. ముంబైలో శశికుమార్ సినిమాకు సంబంధించిన షూటింగ్ జరుగుతుందని తెలుసుకున్న కొంత మంది తమిళులు శశికుమార్ ను చూసేందుకు షూటింగ్ లోకేషన్కు చేరుకున్నారు. ముంబైలో ఉన్న తమిళులు కూడా తన పట్ల చూపిస్తున్న అభిమానానికి ముగ్ధుడైన శశికుమార్ అందరితో ఫోటోలు దిగి వారిని సంతృప్తి పరిచారు. తమ పొరుగు రాష్ట్రాల్లోనూ ఇంతటి అభిమానులను సంపాదించుకోవడం చాలా సంతోషంగా ఉందని, వారి రుణం తీర్చుకోవడానికి మంచి మంచి కథా చిత్రాలను ఎంపిక చేసుకుని నటించాలని కోరుకుంటున్నానని శశికుమార్ తెలిపారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ సినిమాకు హీరోయిన్ను ఫైనల్ చేయాల్సి ఉంది. అదేవిధంగా ఒక ప్రముఖ సంగీత దర్శకుడు దీనికి సంగీతాన్ని అందించనున్నారని, ఆ వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు. ఇకపోతే తొలి షెడ్యూల్ షూటింగ్ను చెన్నైలో పూర్తి చేసినట్లు, ప్రస్తుతం ముంబైలో 15 రోజుల పాటు రెండవ షెడ్యూల్ను నిర్వహిస్తున్నట్లు దర్శకుడు తెలిపారు. -
ఫుల్ యాక్షన్
ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు నటుడు అరవింద్ స్వామి. ఎందుకంటే తన తర్వాతి చిత్రం కోసం. అవును... ఆయన నెక్ట్స్ చిత్రం ఖరారు అయ్యింది. నిర్మల్ కుమార్ దర్శకత్వంలో అరవింద్ స్వామి హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. ‘‘ఫుల్ యాక్షన్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో ఒక లుక్తో కనిపించిన అరవింద్ స్వామి సెకండాఫ్లో మరో లుక్తో సర్ప్రైజ్ చేస్తారు. ఈ లుక్స్కు సంబంధించి ఆయన ఆల్రెడీ ట్రైనింగ్ కూడా స్టార్ట్ చేశారు. మార్చిలో అరవింద్ స్వామి లుక్, టైటిల్ను అనౌన్స్ చేస్తాం. మార్చి 20న ఈ సినిమా షూటింగ్ చెన్నైలో స్టార్ట్ అవుతుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకన్నా ముందు నిర్మల్కుమార్ దర్శకత్వంలో అరవింద్ స్వామి ‘చతురంగ వేటై్ట 2’ అనే సినిమా చేశారు. ఇక ఆయన కీలక పాత్ర చేసిన ‘నరగాసురన్’ (తెలుగులో ‘నరకాసురుడు’) చిత్రం కూడా రిలీజ్కు దగ్గరపడుతోంది. ఇలా క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోగా అరవింద్ స్వామి ఫుల్ బిజీగా ఉన్నారు. -
‘పెంటావలెంట్’తో ప్రాణాంతక వ్యాధులు దూరం
తాండూరు: పెంటావలెంట్ టీకాతో ఐదు ప్రాణాంతక వ్యాధుల నుంచి శిశువులను రక్షించవచ్చని జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డా.నిర్మల్కుమార్ పేర్కొన్నారు. సోమవారం తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి(పీపీయూనిట్)లో నిర్వహించిన నియోజకవర్గంలోని నాలుగు మండలాల ఏఎన్ఎంల శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పెంటావలెంట్ టీకా శిశువులకు ఇచ్చే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఏఎన్ఎంలకు అవగాహన కల్పించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పెంటావలెంట్ టీకాతో శిశువుకు ఇచ్చే ఇంజెక్షన్లు 9 నుంచి 3కు తగ్గుతాయన్నారు. ఈ టీకాతో ప్రాణాంతకమైన కంఠస్పర్పి, కోరింత దగ్గు, ధనుర్వాతం, హైపటైటీస్-బీ, హెమోఫిలస్ ఇన్ల్ఫూయెంజా అనే ఐదు ప్రాణాంతక వ్యాధుల నుంచి చిన్నారులను కాపాడవచ్చన్నారు. అంతేకాకుండా పెంటావలెంట్తో హెమోయెంజా టైప్బీ(హిబ్) బాక్టీరియా వల్ల కలిగే న్యుమోనియా, మెనింజైటీస్, చెవిటితనం వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయన్నారు. ఏఎన్ఎంలు వచ్చే నెల డిసెంబర్లో పెంటావలెంట్ టీకాలను శిశువులకు ఇస్తారని వివరించారు. కార్యక్రమంలో అధికారులు డా.సూర్యప్రకాష్, డా.శ్రీనివాస్, రవి, బాలరాజ్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
నేడు పల్స్పోలియో
ఐదు సంవత్సరాలలోపు పిల్లలు : 7,12,169 చుక్కలు వేసే కేంద్రాలు : 2,790 సిబ్బంది : 11,450 మొబైల్ బూత్లు : 58 మొబైల్ బృందాలు : 65 పర్యవేక్షణ అధికారులు : 24 సాక్షి, రంగారెడ్డి జిల్లా : పల్స్పోలియో కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. పోలియో డ్రాప్స్ వేసేందుకు కేంద్రాలతో పాటు సంచార వాహనాలను ఏర్పాటు చేసి సిబ్బందిని నియమించారు. ఆదివారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్ర ం వరకు జిల్లాలోని ఐదేళ్లలోపు ఉన్న చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయనున్నారు. మొత్తంగా 7.12లక్షల మంది పిల్లలున్నట్లు గుర్తించిన వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు వందశాతం లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు సిద్ధమయ్యారు. అదేవిధంగా సోమ, మంగళవారాల్లోనూ ఇంటింటికీ తిరిగి చుక్కల మందు వేయనున్నట్లు జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి నిర్మల్కుమార్ తెలిపారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
చిన్నబోయిన చిన్నబొంకూరు
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement