-
నిబద్ధతే శ్వాసగా సాగిన వ్యక్తి
‘ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డి.వెంకట్రామయ్య‘ అన్న ఒక స్పష్టమైన గొంతు, విస్పష్టమైన ఉచ్చారణతో 70 దశకం నుంచి 90వ దశకం మధ్య సంవత్సరాల వరకు శ్రోతలను పలకరించేది. వృత్తిపట్ల అం కితభావం, నిబద్ధతే ఆస్తిగా జీవిం చిన ఆయన సోమవారం శాశ్వతంగా అందర్నించీ సెలవు తీసుకున్నారు. కేవలం రేడియో జర్నలిజం ఆయన వృత్తి అయితే వారి ప్రవృత్తి సాహిత్యం. 1963లో ఆకాశవాణిలో ఆయన అనౌన్సర్గా ప్రవేశించారు. తరువాత ప్రాంతీయ విభాగంలో న్యూస్ రీడర్గా చేరారు. వార్తలను ఎడిట్ చేయడంలో, అనువదించడంలో ఆయన ప్రతిభ అపారం. రైతు కుటుంబం నుంచి వచ్చిన వెంకట్రామయ్య గారికి తెలుగు రాయడంలో, చదవడంలో, ఉచ్చారణలో ప్రత్యేకమైన ఆసక్తి ఉండేది. ‘సొంతూరు దొండపాడులోని గ్రంథాలయంలోని అన్ని పుస్తకాలను చదివేసిన ఘనత నాది‘ అని ఆయన చెబుతుండేవారు. చిన్నప్పటి నుంచి నాటకం, బుర్రకథ వంటి కళారూపాలపట్ల ఉన్న ఆసక్తి ఆయనను రేడియో నాటక రచనవైపు పురికొల్పింది. రంగస్థలంపై షేక్స్పియర్ నాటకాల్లో ఆంగ్ల పాత్రలు ధరించేవారు. అయితే సాహిత్యంపై ఆయనకు వున్న ప్రేమ తరువాత కాలంతో రంగస్థలానికి వారిని దూరం చేసింది. వెంకట్రామయ్యగారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో చేరినప్పుడు స్థానం నరసింహారావు, పాలగుమ్మి విశ్వనాథం, బుచ్చిబాబు, రావూరి భరద్వాజ, శారదాశ్రీనివాస్, చిత్తరంజన్ వంటి అతిరథ మహారథులుండేవారు. వారి సాన్నిహిత్యం, ఆయన ప్రతిభకు మెరుగులు దిద్దింది. వృత్తి ప్రవృత్తిలను ఆయన సమన్వయపరిచిన తీరు అమోఘం. 76 ప్రాంతంలో వారు నారాయణగూడలో ఉన్నప్పుడు శని, ఆదివారాల్లో వారి ఇల్లు భువన విజయంలా ఉండేది. నగ్నముని, ఎ.రాజారామ్మోహనరావు, ఆర్టిస్టు చంద్ర, రాజగోపాల్, భైరవయ్య వంటివారు అక్కడ చేరి సాహిత్యగోష్టి నిర్వహిస్తుండేవారు. ఆయన పంతులమ్మ చిత్రానికి మాటలు రాశారు. కార్మికుల కార్యక్రమంలో రాంబాబుగా స్టార్ క్యారెక్టర్ పోషిస్తుండేవారు. ‘నేను రాసిన నాటికలు, రూపకాలు ఎన్నో ప్రసారమయ్యాయి. వాటి స్క్రిప్ట్స్ దాచుకోలేకపోయాను. అలా అవి నిజంగా గాలిలో కలసి పోయాయి’అని ఒకమారు చమత్కరించారు. వారి పువ్వుల మేడ, వెన్నెలవాన, రంగు వెలసిన మనుషులు సీరియల్స్ అప్పటితరం వారికి గుర్తే. వెంకట్రామయ్య గారి సమయపాలన చాలా గొప్పది. ఆయన పాటించడమే కాదు అవతలవారు కూడా పాటించాలని ఆయన కోరుతుండేవారు. ఉద్యోగాన్ని ప్రేమతో, ఆపేక్షతో చేయాలని ఆచరించి చూపిన మహనీయుడాయన. సున్నితమైన వ్యక్తిత్వం, సున్నితమయిన మాట ఆయనది. కానీ చెప్పడంలో మొహమాటపడరు. ఎవరితోనూ పరుషంగా మాట్లాడినట్టు కనిపించరు. ఆయన ముఖ కవళికలే ఆయన మూడ్ని పట్టిచ్చేవి. పద్ధతైన మనిషి. ఒకరు మనలను వేలెత్తి చూపకూడదన్న కోరిక అంతర్లీనంగా ఉండేది.మరొక విషయం ఏమిటంటే మన వలన మరొకరు ఇబ్బంది పడకూడదన్న ఎరుక వారిలో నిత్యమూ ఉండేది. ఉద్యోగవిరమణ చేసిన తరువాత చాలా తక్కువ సంద ర్భాల్లో వారు ఆకాశవాణికి వస్తుండేవారు. ఎంతో బలవంతపెడితే తప్ప గత సంవత్సరం ఆకాశవాణికి కథ చదవలేదు. కథకు సంబంధించి వారి అభిప్రాయాలను శ్రోతలతో పంచుకునేందుకు అతికష్టం మీద ఒప్పుకున్నారు. కొన్ని నెలల క్రితం తమ తరం వారందరినీ, ముఖ్యంగా ఆకాశవాణిలో తనతో పనిచేసి ప్రస్తుతం విశ్రాంత జీవితం గడుపుతున్న వారిని ఒకచోట చేర్చి,, జ్ఞాపికల వరదను సృష్టించి ఔరా వెంకట్రామయ్య గారు అనిపించుకున్నారు. చాలా సందర్భాలలో ఆయన చిరునవ్వే చాలా ప్రశ్నలకు సమాధానంగా ఉండేది. అనవసర విషయాలపై సంభాషణను పొడిగించడం బొత్తిగా ఆయనకు గిట్టని విషయం. కథా రచన ఆయనకు ఇష్టమయిన ప్రక్రియ. ఆయన కథలన్నీ అధో జగత్ జీవితాలను ప్రతిబింబించేవే. కొంత నాటకీయతను, కొంత వర్ణనలను కలుపుకుని పాఠకులను పలకరించేవి. ఎన్నో కథలకు బహుమతులు అందుకున్నారు. శిల్పం పట్ల, వస్తువు పట్ల ఆయనకు నిర్దిష్టమయిన అభిప్రాయాలుండేవి. పుంఖాను పుంఖాలుగా రాసి పేరు సంపాదించాలనో, నిత్యం పాఠకుల, శ్రోతల నోళ్లలో నానాలనో కోరిక లేని మనిషి ఆయన. కథారచన అంటే ఎంతో మధనపడాలని నమ్మేవారు. దానికి తగినట్టుగానే తన రచనా ప్రక్రియ కొనసాగించేవారు. బుచ్చిబాబు కథా పురస్కారం, కారా మాస్టారు నుంచి రావిశాస్త్రి పురస్కారం అందుకున్నారు. ఆయన సాహిత్య కృషిలో భాగంగా దాదాపు పాతిక పుస్తకాలకు పీఠికలు రాశారు. వ్యాసాలు, విమర్శలు, సమీక్షలు వంటివి వందకుపైగానే ఉంటాయి. పదునైన భాష, ప్రయోజనకరమైన ఇతివృత్తం, అరుదైన శిల్పం సమపాళ్లలో కలిపితే వెంకట్రామయ్య కథలవుతాయి. కథా రచనలో ఆయనను మెప్పించడం కష్టం అని అందరూ అంటారు. రచన పత్రికలో రాసిన ఆకాశవాణి జ్ఞాపకాలులో ఆయన ఏవిషయాన్నీ దాచుకోకుండా చెప్పేశారు. జాలీ, కరుణ ఉన్న మనుషులతో మనకు తెలియకుండానే సాన్నిహిత్యం పెరిగిపోతుంది. అలాంటి జాలిగుండె కలవారు వెంకట్రామయ్య. తనకీ, ఎదుటివారికీ కూడా ఎటువంటి ఇబ్బందీ రాకూడదనీ, ఎవరికీ వంగకూడదనీ ఆయన తాపత్రయపడేవారు. గత ఏడాది ఆగస్టు 31న జరిగిన ఆకాశవాణి సీనియర్ అనౌన్సర్ దక్షిణామూర్తి పదవీ విరమణ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. 78 ఏళ్ల వయసులోనూ చెరగని చిరునవ్వుతోనే కనిపించారు. ‘ఇది వరకులాగా స్క్రిప్టు చదవలేకపోతున్నానయ్యా, అందుకే రేడియో రికార్డింగ్ అంటే తప్పించుకుంటున్నా. ఏమీ అనుకోకండి’అని చాలా బాధగా చెప్పిన క్షణాలు ఇంకా కళ్ల ముందు మెదలుతున్నాయి. సినిమాలంటే కూడా ఆయనకు ఇష్టం ఉండేది. సినిమాలు చూడటం ఆయనకో వ్యసనం కాదుగానీ, వ్యాపకంగా మాత్రం ఉండేది. సినిమాను ఆయన ప్రేయసిగా వర్ణించారు. చివరకు ఆ ప్రేయసి ఒడి(థియేటర్)లోనే తుదిశ్వాస వదలటం యాదృచ్ఛికమేగానీ.. ఆయన తుది కోరిక అలా తీరిందేమో అనిపిస్తుంది. మరొకరితో మనం చేయించుకోకూడదు.. ఆ దశ రాకూడదు అని ఆయన తన సన్నిహితులతో అంటుండేవారు. జ్ఞాపకాలను మనకు వదిలి దివికేగిన దివి వెంకట్రామయ్యగారు అరుదైన వ్యక్తి. సీతారాంబాబు చెన్నూరి వ్యాసకర్త ఆకాశవాణి కార్యనిర్వహణ అధికారి -
అంజలీదేవికి నివాళి
పెద్దాపురం : నటనతో ప్రజలందరినీ మెప్పించిన కలియుగ సీత అంజలీ దేవి అని ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు అన్నారు. పెద్దాపురం పట్టణ ఆడపడుచు అంజలీ దేవి మూడో వర్ధంతిని బుధవారం సాయంత్రం నిర్వహించారు. అంజలీదేవి ఫౌండేష¯ŒS చైర్మ¯ŒS, ప్రముఖ పారిశ్రామిక వేత్త గోలి రామారావు అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఆమెను నేటి కళాకారులు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. గోలి రామారావు మాట్లాడుతూ అంజలీదేవి పెద్దాపురం పట్టణంలో జన్మించిడం గర్వకారణమన్నారు. అంజలిదేవి తనయుడు పీయూఎస్ చిన్నారావు మాట్లాడుతూ తన తల్లిపై పట్టణ ప్రజలకు ఉన్న ఆదరాభిమానాలను చూస్తే గర్వకారణంగా ఉందన్నారు. ఫౌండేష¯ŒS కన్వీనర్ పొలమరశెట్టి సత్తిబాబు, అంజలిదేవి మేనల్లుళ్లు గోళ్ల బాబీ, గోళ్ల శ్రీను మాట్లాడారు. తొలుత అంజలీదేవి విగ్రహానికి ఎమ్మెల్సీ బొడ్డు, గోలి తదితరులు క్షీరాభిషేకం చేసి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్ వి.ముని రామయ్య, మున్సిపల్ వైస్ చైర్మ¯ŒS త్సలికి సత్య భాస్కరరావు, కౌన్సిలర్లు వాసంశెట్టి గంగ, గోకిన ప్రభాకరరావు, విజ్జపు రాజశేఖర్, తూతిక రాజు, పాగా సురేష్కుమార్, అభిమాన సంఘం కార్యదర్శి వెలగల కృష్ణ పాల్గొన్నారు. -
శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి జాతీయ కవి
వర్ధంతి సభలో వక్తల నివాళి రాజమహేంద్రవరం కల్చరల్ : కవి సార్వభౌమ శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి జాతీయ కవి అని, స్వాతంత్య్ర ఉద్యమానికి ఆయన మద్దతు ఉండేదని ఆంధ్రకేసరి యువజన సమితి వ్యవస్థాపకుడు వైఎస్ నరసింహారావు పేర్కొన్నారు. స్థానిక నగరపాలక సంస్థ ఆవరణలోని శ్రీపాద విగ్రహం వద్ద ఆయన మునిమనుమడు కల్లూరి శ్రీరామ్ ఆధ్వర్యంలో గురువారం కృష్ణమూర్తి శాస్త్రి 56వ వర్ధంతి జరిగింది. సమకాలీన రచయితలను శ్రీపాద ఎంతగానో ప్రోత్సహించేవారని నరసింహారావు తెలిపారు. నాటి పురపాలక సంఘం ఆయనకు అరుదైన స్వేచ్ఛా పౌరసత్వాన్ని ఇచ్చిందని గుర్తు చేశారు. చిలకమర్తి ఫౌండేష¯ŒS వ్యవస్థాపక కార్యదర్శి పెరుమాళ్ల రఘునాథ్ మాట్లాడుతూ స్వాతంత్య్రం రాకమునుపు జరిగిన భారతీ జాతీయ కవిసమ్మేళనంలో తెలుగువారి తరఫున శ్రీపాద హాజరయ్యారని చెప్పారు. ప్రముఖ సాహితీవేత్త చాగంటి శరత్బాబు మాట్లాడుతూ శ్రీపాద ఒంటిచేత్తో భారత, భాగవత, రామాయణాలను అనువదించారని కొనియాడారు. శ్రీపాద మునిమనుమడు కల్లూరి శ్రీరామ్ మాట్లాడుతూ శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి రచనలను వెలుగులోకి తేవాలని కోరారు. రత్నం పె¯Œ్స అధినేత కేవీ రమణమూర్తి, విశ్రాంత బ్యాంకు అధికారి చావలి రామ్మూర్తిశాస్త్రి తదితరులు ప్రసంగించారు. సాహితీవేత్తలు డీవీ హనుమంతరావు, పెమ్మరాజు గోపాలకృష్ణ, కొంపెల్ల సుబ్బరాయశాస్త్రి, బలరామనాయుడు తదితరులు పాల్గొన్నారు. శ్రీపాద స్వీయచరిత్ర పునర్ముద్రణకు కృషి ‘సాక్షి’తో కృష్ణమూర్తి శాస్త్రి మునిమనుమడు కల్లూరి శ్రీరామ్ ‘కవిసార్వభౌముడు శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి స్వీయచరిత్ర ’శ్రీకృష్ణస్వీయచరిత్రము’ నేడు అలభ్యంగా ఉంది, నా వద్ద సైతం జిరాక్సు ప్రతి మాత్రమే ఉంది’ అని శ్రీపాద మునిమనుమడు కల్లూరి శ్రీరామ్ పేర్కొన్నారు. శ్రీపాద వర్ధంతి సందర్భంగా నగరానికి వచ్చిన ఆయనను గురువారం ‘సాక్షి’ పలకరించింది. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘శ్రీపాద స్వీయచరిత్రలో నాటి సమకాలీన కవులు, సమాజం–ముఖ్యంగా గోదావరి జిల్లాలకు సంబంధించి చూడవచ్చు. తిరుపతి వేంకట కవుల్లో ఒకరైన చెళ్లపిళ్ల వేంకటశాస్రి్తతో ఆయనకు న్యాయస్థానంలో వివాదాలుండేవి. ఇద్దరూ కలసి భోజనం చేసి, ఒకే జట్కాలో న్యాయస్థానానికి వెళ్లేవారని చెబుతారు. ఈ వివరాలు సాహిత్యపరంగా వెలుగులోకి రావలసిన అవసరం ఉంది. కొంతమంది ప్రచురణకర్తలు పునర్ముద్రణకు సానుకూలంగా ఉన్నారని తెలుస్తోంది. వారితో సంప్రదించి, త్వరలో ఒక నిర్ణయానికి వస్తాను. సుమారు వంద శ్రీపాద రచనలు కూడా అలభ్యంగానే ఉన్నాయి. శ్రీపాద సంపాదకత్వంలో వెలువడిన వజ్రాయుధం అనే పత్రికలో శ్రీపాద నాటి కవుల గుణదోషాలను నిర్మొహమాటంగా ఎత్తిచూపేవారు. దీనికి సంబంధించిన ప్రతి ఒకటి నా వద్ద ఉంది. పరిశోధకులకు ఇది ఎంతగానో ఉపకరిస్తుంది. గ్రంథాలయాల్లో వీటి ప్రతులు ఉన్నాయోమో పరిశీలిస్తున్నాను. శ్రీపాద సమగ్ర సాహిత్యం తెలుగువారికి అందించే యజ్ఞంలో నేనూ ఒక సమిధనైతే.. అంతకన్నా అదృష్టం మరొకటి ఏముంటుంది?’ -
జీవధార ఘంటసాల గానం
ఘనంగా అమర గాయకుడి జయంతి రాజమహేంద్రవరం కల్చరల్ : వేదనాదమే ఘంటసాల గళం నుంచి సంగీతంగా రూపుదిద్దుకుని జీవధారలు కురిపించిందని ఎమ్మెల్సీ సోము వీర్రాజు కొనియాడారు. గోదావరి సింగర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం అమర గాయకుడు ఘంటసాల జయంతిని ఘనంగా నిర్వహించారు. గోదావరి గట్టుపై ఉన్న ఆయన విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సోము మాట్లాడుతూ ఘంటసాల సంగీతంలో జీవించారని, పాటను రక్తి కట్టించడంలో, అందరినీ పాట ద్వారా రంజింపచేయడంలో ఆయనకు ఆయనే సాటిని పేర్కొన్నారు. ఘంటసాల మనసున్న గాయకుడు... మనసు విప్పి పాడారు... అందుకే నేటికీ ఆయన పాటలు అందర్నీ అలరింపజేస్తున్నాయని చెప్పారు. ఘంటసాల స్వాతంత్య్ర పోరాటంలో కూడా పాల్గొన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేసీ నాయకుడు ధార్వాడ రామకృష్ణ, ఘంటసాల విగ్రహ వ్యవస్థాపకుడు రాయడు చంద్రకుమార్, పిరాట్ల శ్రీహరి, ఘంటసాల శ్యామలాకుమారి, కోసూరి చండీప్రియ, రాళ్ళపల్లి నీలాద్రి, రాళ్ళపల్లి శ్రీనివాస్, సన్నిధానం శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. -
సాహసవీరుడా.. ఇక సెలవ్!
వైవీయూ: కడప సాహసవీరుడు.. శాశ్వతంగా సెలవు తీసుకున్నాడు.. మళ్లీ జన్మంటు ఉంటే సాహసవీరుడుగానే పుడతానంటూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో లేవాకు మదన్మోహన్రెడ్డి అంత్యక్రియలు నిర్వహించారు. నగరంలోని హౌసింగ్బోర్డు కాలనీ నుంచి దివ్యధామరామం వాహనంలో పబ్బాపురం సమీపంలోని యాదవాపురానికి తీసుకెళ్లి అక్కడ ఆయన అన్న కుమారుడి చేతుల మీదుగా అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన భౌతికకాయం వద్ద చిన్నారులు సెల్యూట్ చేసి జాతీయగీతాలపన చేసి నివాళులర్పించారు. తల్లిదండ్రులు ప్రమీల, నరసింహారెడ్డి, ఆయన సతీమణి లతల రోదనలు అక్కడి వారికి కన్నీళ్లు తెప్పించాయి. నివాళులర్పించిన మేయర్, ఎమ్మెల్యే... నగరంలోని హౌసింగ్బోర్డు కాలనీలో మదన్మోహన్రెడ్డి భౌతికకాయానికి కడప నగర మేయర్ కె. సురేష్బాబు, ఎమ్మెల్యే ఎస్బీ అంజద్బాషా నివాళులర్పించారు. సాహసకృత్యాలతో జిల్లాకు పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చిన మదన్మోహన్రెడ్డి మరణం అందరినీ కలిచివేసిందని వారు పేర్కొన్నారు. అనంతరం కుటుంబసభ్యులను పరామర్శించారు. మదన్మోహన్రెడ్డి పేరుతో సాహస అవార్డు... పారామోటార్ గ్లైడర్ లేవాకు మదన్మోహన్రెడ్డి పేరుతో సాహస అవార్డును పెట్టేందుకు నేషనల్ అడ్వెంచర్ ఫౌండేషన్ (ఎన్ఏఎఫ్) నిర్ణయించిందని ఎన్ఏఎఫ్ జాయింట్ సెక్రటరీ, పారామోటార్ పైలెట్ సి.వి. సూర్యతేజ తెలిపారు. పూర్తి విధివిదానాలు త్వరలో తెలియజేస్తామని తెలిపారు. ఈయన స్మారకార్థం జనవరిలో విజయవాడ, విశాఖ, కడప నగరాల్లో క్రీడాపోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. మదన్మోహన్రెడ్డి భౌతికకాయానికి ఎయిర్ఫోర్స్ అధికారులు దామోదర్పటేల్, సుకుమార్, రిటైర్డ్ గ్రూప్ కెప్టెన్ ఎం.ఐ.కె. రెడ్డి, వింగ్ కమాండర్ జయశంకర్, ఎన్ఏఎఫ్ డైరెక్టర్ వై. శ్రీనివాసరావు తదితరులు మదన్మోహన్రెడ్డికి నివాళులర్పించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్మన్ గిల్కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement