-
నామినేటెడ్ ఎమ్మెల్యేగా స్టీఫెన్సన్
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ప్రొటెం స్పీకర్గా ముంతాజ్ అహ్మద్ఖాన్ను, నామినేటెడ్ ఎమ్మెల్యే (ఆంగ్లో ఇండియన్)గా ఎల్విస్ స్టీఫెన్సన్ను నియమించాలని రాష్ట్ర మంత్రివర్గ తొలి సమావేశం నిర్ణయించింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో సమావేశం జరిగింది. సాధారణంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణం చేసిన తర్వాత నామినేటెడ్ ఎమ్మెల్యే నియామకం జరిగేది. అయితే.. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. ఎన్నికైన ఎమ్మెల్యేలతోపాటే నామినేటెడ్ సభ్యుడు సైతం ప్రమాణం చేసేలా మంత్రివర్గం నిర్ణయించింది. నామినేటెడ్ ఎమ్మెల్యే తన విలువైన పదవీకాలం కోల్పోకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. తెలంగాణలో మతసామరస్య సంప్రదాయాన్ని కొనసాగిస్తున్న ట్లుగానే.. అసెంబ్లీ వ్యవహరాల్లోనూ ముందుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అసెంబ్లీ తాత్కాలిక స్పీకర్గా ముస్లిం వర్గానికి చెందిన ముంతాజ్ అహ్మద్ఖాన్ను, నామినేటెడ్ సభ్యుడిగా క్రిస్టియన్ మతానికి చెందిన ఎల్విస్ స్టీఫెన్సన్ను నియమించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ మేరకు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్కు ప్రతిపాదనలు పంపగా.. వీటికి గవర్నర్ ఆమోదం తెలిపారు. అనంతరం ఈ ప్రతిపాదనలను తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయానికి పంపారు. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజత్కుమార్ కూడా దీనికి ఆమోదిస్తూ.. స్టీఫెన్సన్ నియామకాన్ని ధ్రువీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. స్టీఫెన్సన్ తెలంగాణ శాసనసభకు నామినేటెడ్ ఎమ్మెల్యేగా నియమితులవడం ఇది రెండోసారి. తెలంగాణ తొలిశాసనసభలోనూ ఈయన నామినేటెడ్ ఎమ్మెల్యేగా వ్యవహరించారు. 2018 డిసెంబర్లో తెలంగాణ శాసనసభ ఎన్నికలను ప్రశాంతంగా విజయవంతంగా నిర్వహించినందుకు భారత ఎన్నికల సంఘాన్ని రాష్ట్ర మంత్రి వర్గం అభినందించింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజత్ కుమార్ను, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా కేబినెట్ ప్రత్యేకంగా అభినందించింది. ఎమ్మెల్యేలకు రాజ్యాంగం ప్రతులు తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికైన శాసనసభ్యులకు భారత రాజ్యాంగ ప్రతులను, అసెంబ్లీ నిబంధనల పుస్తకాలను, బుక్లెట్లను, ఇతర సమాచారాన్ని అందివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ భాషల్లో వీటిని అందివ్వనుంది. దీనికి సబంధించిన ప్రతులను అసెంబ్లీ కార్యదర్శి వేదాంతం నరసింహాచార్యులు సోమవారం ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్కు చూపించారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తేదీలను ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. జనవరి 17న ఉదయం 11.30 గంటలకు శాసనసభ తొలి సమావేశం.. 19న ఉదయం 11.30 గంటలకు శాసనమండలి సమావేశాలు జరగనున్నాయి. గవర్నర్ ఈఎస్ఎల్ నర్సింహన్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. 19న ఉదయం 11.30 గంటలకు శాసనసభ, శాసనమండలి సంయుక్త సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. -
మా బాసే పంపించాడు
* నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్తో రేవంత్రెడ్డి సంభాషణ * ఏదైనా ప్రాబ్లం వస్తే ఏపీలో నామినేటెడ్ ఎమ్మెల్యే పోస్టు * 5 కోట్లు డీల్.. చాలా కాన్ఫిడెన్షియల్.. రెండు, రెండున్నర అయితే ఇప్పుడే ఇస్తా * సెంట్రల్లో, ఏపీలో మాదే గవర్నమెంట్.. తెలంగాణలో నేనే పార్టీ కీ పర్సన్ * ఆంధ్రలో జగన్ ఉన్నాడు కాబట్టి తెలంగాణలో చంద్రబాబు రెడ్లను ప్రమోట్ చేస్తున్నాడని వెల్లడి సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ఆశీస్సులతోనే ఎమ్మెల్యే కొనుగోలు డీల్ నడిచింది. ఈ విషయాన్ని ఆ పార్టీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి స్వయంగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు చెప్పారు. రెండు రోజుల కింద రేవంత్రెడ్డి నేరుగా స్టీఫెన్సన్ బంధువు ఇంటికి వచ్చి డీల్ కుదిర్చిన వ్యవహారంతో పాటు ఆదివారం ఏసీబీకి పట్టుబడక ముందు రూ.50 లక్షలు అడ్వాన్సుగా ఇస్తూ జరిపిన సంభాషణ మొత్తం రహస్య కెమెరాల్లో రికార్డయింది. రెండు రోజుల కింద డీల్ కుదిర్చినప్పుడు రేవంత్ చెప్పిన మాటలు.. ‘తెలంగాణలో నేనే పార్టీ కీ పర్సన్ను. మీ(స్టీఫెన్సన్) మీద కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టే జిమ్మి, మట్టయ్య(స్టీఫెన్సన్ సన్నిహితులు)లను అప్రోచ్ అయ్యా. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటేయాలి. మా బాస్(చంద్రబాబు)కు విషయం చెప్పా. బాసే మీ దగ్గరికి పంపించాడు. మీరేదైనా నెంబర్ చెబితే దాని గురించి ఆయనతో మాట్లాడుతా. ఈ వ్యవహారాన్ని మీ పార్టీ గుర్తించలేదు. మీరేం కావాలన్నా బాబు దగ్గరికి తీసుకెళ్తా. ఇది వంద శాతం కాన్ఫిడెన్షియల్. ఫైనాన్షియల్గా అయితే రెండూ రెండున్నర ఇవ్వగలం. టీడీపీలో నేనో ఇంపార్టెంట్ పర్సన్ను. నేనే తెలంగాణలో పార్టీని చూసుకుంటున్నా. బాబు కూడా నా వర్త్ గుర్తించారు. నావల్లే ఎమ్మెల్సీ అభ్యర్థిని నిలబెట్టారు. నేను వేం నరేందర్రెడ్డికి ఫైనాన్స్ చేస్తున్నా. మీరు ఓటేస్తారనే క్లారిటీ ఉంది కాబట్టే ఇంత దూరం వచ్చాను. ఏపీలో ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే ఇంకా ఫైనల్ కాలేదు. మీకేమైనా ప్రాబ్లం వస్తే ఏపీలో ఇప్పిస్తా. నన్నెప్పుడైనా కలవొచ్చు. హైదరాబాద్లో జూబ్లీహిల్స్లో ఉంటాను. కొంత అడ్వాన్స్ ఇస్తాం. మరికొంత డిపాజిట్ చేస్తాం. మీకు అమౌంట్ కావాలంటే ఇప్పుడే ఇస్తాం. మీరెక్కడ కావాలంటే అక్కడ అందిస్తాం. ఈ ఎమ్మెల్సీ సీటు గెలవడం, ఓడడం వల్ల ఒరిగేదేమీ లేదు. కానీ చంద్రబాబు వర్సెస్ కేసీఆర్ నడుస్తోంది. దట్స్ వై దిస్ గేమ్ స్టార్టెడ్. మీకు ఏప్రాబ్లం రాదు. ఏదైనా ప్రాబ్లం వస్తే ఐ విల్ టేక్ కేర్. బాబు దగ్గర కూచోబెడతా. మాట్లాడిస్తా. నేను మధ్యవర్తిని. మీకు ఏ అవసరమొచ్చినా అవుట్ అండ్ అవుట్. నేనే ఎమ్మెల్సీని నిలబెట్టా. అతను నాకు కావలసిన వ్యక్తి. ఆరునెలల్లో పార్టీ ప్రెసిడెంట్ను నేనే అవుతున్నా. ఇప్పుడే మహానాడులో ఇస్తానంటే నేనే వద్దన్నా. నా కూతురి పెళ్లి తరువాత ఫ్రీ అవుతా. తెలంగాణలోని ఆరు జిల్లాల్లో రెడ్డీస్దే డామినేషన్. కేసీఆర్ను అప్పోజ్ చేసే గ్రూప్ ఇదే. ఆంధ్రా, రాయలసీమకు చెందిన రెడ్డీస్ కూడా తెలంగాణలో మాకే సపోర్టు చేస్తారు. ఆంధ్రాలో జగన్ రెడ్డి ఉన్నారు కాబట్టి తెలంగాణలో బాస్ రెడ్డీస్ను ప్రమోట్ చేస్తున్నారు. ఇక్కడున్న కమ్మలు కూడా కేసీఆర్కు వ్యతిరేకంగా రెడ్డీస్ను ప్రమోట్ చేస్తున్నారు. నేను 25 ఏళ్లు పాలిటిక్స్లో ఉంటాను. నాకు క్యాస్ట్ ఉంది. బంధువులు ఉన్నారు. జైపాల్రెడ్డి నాకు మామ అవుతాడు. జానారెడ్డి కూడా నాకు బంధువే. జానారెడ్డి పని అయిపోయింది. కేసీఆర్తో మేం కొట్లాడలేమని జానారెడ్డి అన్నరు. నా వెనకాలే ఉండి జానారెడ్డి ప్రమోట్ చేస్తానన్నారు. సెంట్రల్లో, ఏపీలో మేమే గవర్నమెంట్లో ఉన్నం. కేంద్రంలో కూడా ఏమైనా కావాలంటే ఇస్తం..’ ఒకరు ఓటేయలేదనే తెలుస్తుంది.. ‘ఒక్కో ఎమ్మెల్సీకి 17 మంది ఎమ్మెల్యేలను కేటాయిస్తరు. మీకు ఒక ఎమ్మెల్సీకి ఓటేయాలని లెక్క చెపుతారు. మీరు మాకు ఓటేసినా పిన్పాయింట్గా మీరేనని తెలియదు. 20 ఏళ్లుగా మేం చూస్తున్నాం కదా. ఆ గ్రూప్లో ఒకరు తగ్గారని తెలుస్తుంది అంతే. కూకట్పల్లి కృష్ణారావు వేస్తానంటున్నాడు కానీ డౌటే. ఏపీలో, సెంట్రల్లో ఏమైనా చేయగలం. నేను పోయి బాస్తో మాట్లాడుతా. ఇవ్వాళ జరిగింది నేను వెళ్లి బాస్తో ఫీడ్ చేస్తా.’ ఆదివారం ఏసీబీ ట్రాప్కు ముందు సంభాషణ.. రేవంత్రెడ్డి: 50 లక్షలు తెచ్చాను. అడ్వాన్స్. నాకు మీ హెల్ప్ కావాలి. మీకు ఏం కావాలో చెప్పండి. స్టీఫెన్సన్: నేను సాధారణ మనిషిని. మీరేం కోరుకుంటున్నారు. ఏం ఇస్తారో చెప్పండి. రేవంత్: ఇప్పుడు ఫిఫ్టీ తీసుకోండి. మిగతా నాలుగున్నర కోట్లు ఎప్పుడు, ఎక్కడ కావాలంటే అప్పుడు ఇస్తా. బయట ఎవరికి తెలియదు. స్టీఫెన్: నా లైఫ్ రిస్క్ కదా.. రేవంత్: అవును రాజకీయంగా పెద్ద డీల్. 5 కోట్లు కదా. నేను రిస్క్ చేస్తున్నాను. మనం ఓ పనిచేద్దాం. చంద్రబాబు దగ్గరికి తీసుకెళ్తా. మీరు నాతో, తనతో (బాబు) మాట్లాడాల్సిన పనిలేదు. బాబు ఏం హామీ ఇచ్చారో అది మీకు రెండు గంటల్లో అందుతుంది. ఈ వ్యవహారం పూర్తి రహస్యంగా ఉంటుంది. నన్ను బాసే పంపించారు. నాకు మీ సపోర్టు కావాలి. మీకేం కావాలన్న చేయడానికి బాబు ఉన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నాలుగు ముక్కలు
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- వైఎస్ భాస్కర్రెడ్డికి బెయిల్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
Advertisement