-
ఏపీ: ముగిసిన స్థానిక సంస్థల నామినేషన్ల ప్రక్రియ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థలు ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం ముగిసింది. ఎన్నికలు నిలిచిన 14 జెడ్పీటీసీ స్థానాలతోపాటు 176 ఎంపీటీసీ, 69 సర్పంచ్, 533 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ►గ్రామపంచాయతీల నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 9 చివరితేదీ. ►మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు: 8వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ►పరిషత్ ఎన్నికలు: ఈ నెల 9న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఈ నెల 14న పంచాయతీ ఎన్నికలు నిర్వహణ, ఓట్ల లెక్కింపు జరగనుండగా.. ఈ నెల 15న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించనున్నారు. 17న వీటి కౌంటింగ్ జరగనుంది. ఈ నెల 16న పరిషత్ ఎన్నికలు నిర్వహిస్తుండగా.. 18న కౌంటింగ్ జరగనుంది. నెల్లూరు కార్పొరేషన్తో, 12 మునిసిపాలిటీలు, నగర పంచాయతీల్లోని 54 డివిజన్లు, 353 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. అలాగే 7 కార్పొరేషన్లు, 13 మునిసిపాలిటీల్లో కార్పొరేటర్లు, కౌన్సిలర్ల మరణంతో ఖాళీ అయిన స్థానాలకు.. ఈ ఏడాది మార్చిలో ఎన్నికలు జరగని డివిజన్లు, వార్డులకు కూడా ఎన్నికలు నిర్వహించనున్నారు. -
ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ.. బద్వేలు బరిలో 15 మంది
సాక్షి, వైఎస్సార్ కడప: బద్వేలు ఉపఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. బద్వేలు బరిలో నామినేషన్ వేసిన పలువురు అభ్యర్థులు తమ నామినేషన్లను బుధవారం ఉపసంహరించుకున్నారు. పలువురు అభ్యర్థుల నామినేషన్ ఉపసంహరణ అనంతరం పోటీలో 15 మంది అభ్యర్థులు నిలిచారు. ఈ రోజు ముగ్గురు స్వతంత్ర అభ్యర్ధులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత నుంచి నామినేషన్ గడువు వరకూ 27 మంది నామినేషన్ వేశారు. నామినేషన్ల పరిశీలనలో 9 మంది తిరస్కరణకు గురయ్యారు. చివరగా నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 15 మంది అభ్యర్థులు బద్వేల్ ఉపఎన్నిక పోటీలో నిలిచారు. హుజూరాబాద్ బరిలో 30 మంది అభ్యర్థులు సాక్షి, కరీంనగర్: హుజూరాబాద్ ఉప ఎన్నిక నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. ఉప ఎన్నిక పోటీ నుంచి 12 మంది నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. హుజూరాబాద్ బరిలో 30 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. హుజురాబాద్లో నామినేషన్ వేసిన మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటెల రాజేందర్ సతీమణి జమున తన నామినేషన్ను విత్ డ్రా చేసుకున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థి ఒంటెల లింగారెడ్డి, ఇండిపెండెంట్ అభ్యర్తులు సుమన్ నాయక్, వినోద్ కుమార్, రాజ్ కుమార్, నూర్జహాన్ బేగం, మల్లికార్జున్ తదితరులు తమ నామినేషన్లను విత్ డ్రా చేసుకున్నారు. దీంతో 30 మంది అభ్యర్థులకు గాను రెండు ఈవీఎంలతో హుజూరాబాద్ ఉప ఎన్నిక జరగనుంది. -
నామినేషన్లు ముగిశాయి.. ఇక ప్రచారమే
సాక్షి, హైదరాబాద్: వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లతోపాటు ఐదు మున్సిపాలిటీల్లో గురువారం నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియగా, డివిజన్లు, వార్డుల వారీగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. తిరుగుబాటు అభ్యర్థుల బెడద లేకుండా పార్టీ అభ్యర్థులను ఖరారు చేసేందుకు టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా చివరి నిమిషంలో బీ ఫారాలు జారీ చేసింది. వరంగల్ కార్పొరేషన్ పరిధిలో అభ్యర్థుల ఎంపికపై చివరి నిమిషం వరకు ఉత్కంఠ నెలకొనగా, ఖమ్మం కార్పొరేషన్తోపాటు మిగతా ఐదు మున్సిపాలిటీల్లో గురువారం మధ్యాహ్నమే అధికారికంగా అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ఈ నెల 30న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరగనుండగా, కోవిడ్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ నెల 27వ తేదీ సాయంత్రం ఐదు గంటలకే ప్రచారాన్ని ముగించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంతో ఎన్నికల ప్రచారానికి కేవలం ఐదు రోజుల సమయం మాత్రమే ఉండటంతో శుక్రవారం నుంచి క్ష్రేతస్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేయాలని పార్టీ భావిస్తోంది. కోవిడ్ పరిస్థితుల్లో నేతలు, అభ్యర్థులను కలిసేందుకు ఓటర్లు విముఖత చూపుతుండటంతో ప్రతీ ఓటరును చేరుకునేందుకు కార్యకర్తల యంత్రాంగంపైనే ఆధారపడి ప్రచారం చేయాలని యోచిస్తోంది. చివరి నిమిషంలో వచ్చిన వారికి కొత్తూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ అధ్యక్షుడు సుదర్శన్గౌడ్ను టీఆర్ఎస్లో చేర్చుకుని ఆయన భార్యకు టికెట్ ఇచ్చారు. సుదర్శన్గౌడ్తో పాటు చివరి నిమిషంలో పార్టీలోకి వచ్చిన ఆయన అనుచరులు ఒకరిద్దరికి టీఆర్ఎస్ తరపున కౌన్సిలర్ టికెట్ దక్కింది. జడ్చర్ల మున్సిపాలిటీలో బీజేవైఎం మహబూబ్నగర్ జిల్లా మాజీ అధ్యక్షులు రామ్మోహన్ భార్య సారికకు చివరి నిమిషంలో టీఆర్ఎస్ బీ ఫారం దక్కగా, టీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన శోభ పోటీ నుంచి వైదొలిగారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో 10వ డివిజన్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన వంగవీటి ధనలక్ష్మి ఏకంగా అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకుని టీఆర్ఎస్లో చేరారు. దీంతో టీఆర్ఎస్ అభ్యర్థి చావా మాధురి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రిజర్వేషన్లు కలిసిరాకపోవడం, పనితీరుపై వ్యతిరేకత వంటి కారణాలతో చాలాచోట్ల సిట్టింగ్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లకు టీఆర్ఎస్ అభ్యర్థిత్వం దక్కలేదు. సిద్దిపేట మున్సిపాలిటీలో గతంలో వివిధ పార్టీల తరపున, స్వతంత్రులుగా గెలిచి తర్వాతి కాలంలో టీఆర్ఎస్లో చేరిన సిట్టింగ్లకు మళ్లీ టీఆర్ఎస్ తరపున అవకాశం దక్కింది. అసంతృప్తులకు బుజ్జగింపులు టీఆర్ఎస్ టికెట్ ఆశిస్తూ నామినేషన్ దాఖ లు చేసినా అవకాశం దక్కని క్షేత్రస్థాయి నేతలు, క్రియాశీల కార్యకర్తలను ఎన్నికల బరి నుంచి తప్పించేందుకు సంబంధిత జిల్లా మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు సర్వశక్తులూ ఒడ్డారు. పార్టీ టికెట్ ఆశిస్తూ లేదా స్వతంత్రులుగా నామినేషన్ వేసిన అభ్యర్థులను డివిజన్లు, వార్డుల వారీగా టీఆర్ఎస్ గుర్తించింది. పార్టీ తరపున గెలుపు గుర్రాలు మాత్రమే బరిలో ఉండాలనే ఉద్దేశంతో అవకాశం దక్కని ఆశావహులు, బలమైన స్వతంత్రులను పోటీ నుంచి తప్పించేందుకు సామ దాన భేద దండోపాయాలను ప్రయోగించారు. దీనికోసం పార్టీ ప్రత్యేక వ్యూహాన్ని అనుసరించింది. పార్టీలో చాలాకాలంగా పనిచేస్తున్న వారితో పాటు ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో వ్యాపార, వాణిజ్య రంగాల్లో బలమైన వారిని గుర్తించి అవకాశమిచ్చింది. అక్కడక్కడా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి కూడా టికెట్ల కేటాయింపులో ప్రాధాన్యతనిచ్చింది. సామాజిక న్యాయం, ఉద్యమకారులు, సీనియారిటీ తదితరాలను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులను ఎంపిక చేసినట్లు పార్టీ ప్రకటించింది. -
నేటితో ముగిసిన తొలి విడత నామినేషన్లు
సాక్షి, అమరావతి: ఏపీలో నేటితో తొలి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్లు ముగిసాయి. రాష్ట్ర వ్యాప్తంగా 168 మండలాల్లో 3,249 పంచాయతీలు, 32,504 వార్డులకు తొలి దశలో ఎన్నికలు జరుగనుండగా, సర్పంచ్ పదవులకు 13వేలకు పైగా నామినేషన్లు, వార్డు మెంబర్ పదవులకు 35వేలకు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. రేపు (ఫిబ్రవరి 3న) తొలి విడత నామినేషన్ల పరిశీలన, అనంతరం నామినేషన్ల అభ్యంతరాలపై తుది నిర్ణయం వెలువడుతుంది. ఫిబ్రవరి 4న మధ్యాహ్నం 3గంటల్లోపు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. తొలి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 9న ఉదయం 6:30 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు సాగుతుంది. అదే రోజు సాయంత్రం 4 గంటలకు ఓట్ల లెక్కింపు, అనంతరం ఫలితాల వెల్లడి. ఫిబ్రవరి 9న సాయంత్రం ఉప సర్పంచ్ ఎన్నిక జరుగనుంది. -
తొలి అంకానికి తెర
సాక్షి, మెదక్: ప్రాదేశిక ఎన్నికల పోరులో తొలి విడతకు సంబంధించి నామినేషన్ల ఘట్టానికి తెరపడింది. చివరిరోజు బుధవారం భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. తొలి విడతలో ఎన్నికలు జరిగే ఆరు మండలాల (హవేళిఘణాపూర్, పాపన్నపేట, టేక్మాల్, రేగోడ్, అల్లాదుర్గం, పెద్దశంకరంపేట) పరిధిలో ఎంపీటీసీ స్థానాలకు 357, జెడ్పీటీసీ స్థానాలకు 32 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు. ఈ మండలాల పరిధిలో మొత్తంగా 65 ఎంపీటీసీ స్థానాలుండగా.. 433 నామినేషన్లు, ఆరు జెడ్పీటీసీ స్థానాలకు 41 నామినేషన్లు దాఖలు కావడం విశేషం. ఈ నెల 25న (నేడు) నామినేషన్లను పరిశీలించి అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. 26న విజ్ఞప్తుల స్వీకరణతోపాటు 27న స్క్రూటినీ నిర్వహించనున్నారు. 28న ఉపసంహరణ అనంతరం అదే రోజు బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. మే ఆరో తేదీన తొలి విడత పోలింగ్ జరగనుంది. మండలాలు, పార్టీల వారీగా ఇలా.. హవేళిఘణాపూర్ మండలంలో మొత్తం 12 ఎంపీటీసీ స్థానాలకు బీజేపీ నుంచి 9, సీపీఎం, టీడీపీ నుంచి ఒకటి చొప్పున, కాంగ్రెస్ నుంచి 22, టీఆర్ఎస్ నుంచి 40, స్వతంత్రుల నుంచి 15 నామినేషన్ల చొప్పున మొత్తం 88 దాఖలయ్యాయి. అదేవిధంగా ఒక జెడ్పీటీసీ స్థానానికి బీజేపీ, కాంగ్రెస్ నుంచి ఒకటి చొప్పున, టీఆర్ఎస్ నుంచి రెండు.. మొత్తం నాలుగు నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు వెల్లడించారు. పాపన్నపేట మండలంలో మొత్తం 15 ఎంపీటీసీ స్థానాలకు బీజేపీ నుంచి మూడు, కాంగ్రెస్ నుంచి 36, టీఆర్ఎస్ నుంచి 57, స్వతంత్రుల నుంచి 11.. మొత్తం 107 నామినేషన్లు దాఖలయ్యాయి. అదేవిధంగా జెడ్పీటీసీ స్థానానికి కాంగ్రెస్ నుంచి మూడు, టీఆర్ఎస్ నుంచి రెండు.. మొత్తం ఐదు నామినేషన్లు దాఖలయ్యాయి. టేక్మాల్ మండలంలో మొత్తం 10 ఎంపీటీసీ స్థానాలకు బీజేపీ నుంచి నాలుగు, కాంగ్రెస్ నుంచి 26, టీఆర్ఎస్ నుంచి 31, స్వతంత్రుల నుంచి తొమ్మిది.. మొత్తం70 నామినేషన్లు దాఖలయ్యాయి. అదేవిధంగా జెడ్పీటీసీ స్థానానికి బీజేపీ నుంచి ఒకటి, కాంగ్రెస్ నుంచి రెండు, టీఆర్ఎస్ నుంచి నాలుగు.. మొత్తం ఏడు నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు. అల్లాదుర్గం మండలంలో మొత్తం తొమ్మిది ఎంపీటీసీ స్థానాలకు బీజేపీ నుంచి రెండు, కాంగ్రెస్ నుంచి 20, టీఆర్ఎస్ నుంచి 26, టీజేఎస్ ఒకటి, స్వతంత్రుల నుంచి 13.. మొత్తం 62 నామినేషన్లు దాఖలయ్యాయి. అదేవిధంగా జెడ్పీటీసీ స్థానానికి బీజేపీ నుంచి ఒకటి, కాంగ్రెస్ నుంచి 5, టీఆర్ఎస్ నుంచి 4, స్వతంత్ర ఒకటి.. మొత్తం 11 నామినేషన్లు దాఖలయ్యాయి. పెద్దశంకరంపేట మండలంలో మొత్తం 12 ఎంపీటీసీ స్థానాలకు కాంగ్రెస్ నుంచి 17, టీఆర్ఎస్ నుంచి 32, స్వతంత్రుల నుంచి 10.. మొత్తం 59 నామినేషన్లు దాఖలయ్యాయి. అదేవిధంగా జెడ్పీటీసీ స్థానానికి కాంగ్రెస్ నుంచి రెండు, టీఆర్ఎస్ నుంచి మూడు.. మొత్తం ఐదు నామినేషన్లు దాఖలయ్యాయి. రేగోడ్ మండలంలో మొత్తం ఏడు ఎంపీటీసీ స్థానాలకు బీజేపీ నుంచి ఒకటి, కాంగ్రెస్ నుంచి 18, టీఆర్ఎస్ నుంచి 27, స్వతంత్రుల నుంచి ఒక నామినేషన్.. మొత్తం 47 నామినేషన్లు దాఖలయ్యాయి. అదేవిధంగా జెడ్పీటీసీ స్థానానికి కాంగ్రెస్ నుంచి మూడు, టీఆర్ఎస్ నుంచి నాలుగు, స్వతంత్ర రెండు.. మొత్తం తొమ్మిది నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు వివరించారు. ఇక ప్రచార పర్వం తొలి విడత ప్రాదేశిక ఎన్నికల నామినేషన్ల ఘట్టం పూర్తయిన నేపథ్యంలో గురువారం నుంచి ప్రచారం ఊపందుకోనుంది. పార్టీ గుర్తులపై జరిగే ఎన్నికలు కావడంతో పోరు రసవత్తరంగా కొనసాగనున్నట్లు తెలుస్తోంది. ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ స్థానాలను క్లీన్ స్వీప్ చేయాలనే లక్ష్యంతో అధికార పార్టీ టీఆర్ఎస్ ఇప్పటికే తగిన కార్యాచరణ రూపొందించుకుని ముందుకు సాగుతోంది. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు సైతం ప్రచారానికి కసరత్తు చేస్తున్నారు. టీడీపీ కనుమరుగు.. ఒకప్పుడు స్థానిక ఎన్నికల్లో ప్రభావం చూపిన టీడీపీ.. ప్రస్తుతం కనుమరుగైందనే చెప్పాలి. మొత్తం 65 ఎంపీటీసీ స్థానాలకు గాను ఆ పార్టీ నుంచి ఒక్కచోట మాత్రమే నామినేషన్ దాఖలైంది. హవేళి ఘణాపూర్లో టీడీపీ అభ్యర్థి ఒకరు నామినేషన్ దాఖలు చేశారు. జెడ్పీటీసీ స్థానాల్లో పోటీకి ఎవరూ ముందుకు రాలేదు. వామపక్షాల ప్రాబల్యం తగ్గిందనడానికి తొలి విడతలో దాఖలైన నామినేషన్లే నిదర్శనంగా నిలుస్తున్నాయి. హవేళిఘణాపూర్ నుంచి ఒకరు సీపీఎం తరఫున నామినేషన్ దాఖలు చేశారు. సీపీఐ అభ్యర్థులు ఎవరు కూడా పోటీకి ముందుకు రాకపోవడం గమనార్హం. టీజేఎస్ సైతం ఈ ఎన్నికల బరిలో లేదు. అల్లాదుర్గం మండలంలో టీజేఎస్ తరఫున ఒకరు మాత్రమే దాఖలు చేయడం విశేషం. తొలి అంకానికి తెర
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్మన్ గిల్కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement