-
అటెండరు నుంచి ఆఫీసరు.. ఎన్జీవోల సమ్మెబాట
సాక్షి, మచిలీపట్నం :సమైక్యాంధ్ర ఉద్యమానికి అన్నివర్గాల ప్రజల మద్దతు వెల్లువెత్తుతోంది. అటెండరు నుంచి ఆఫీసరు వరకు వేలాది మంది ఎన్జీవోలు సమ్మెబాట పట్టారు. ప్రభుత్వ యంత్రాంగం దాదాపుగా స్తంభించిందనే చెప్పాలి. శనివారం గన్నవరంలో జరిగిన మహా గర్జన సభ విజయవంతమైంది. విద్యార్థులు, మహిళలు పాల్గొని సమైక్యాంధ్ర కోసం నినదించారు. జేఏసీ జిల్లా చైర్మన్ విద్యాసాగర్తోపాటు పెద్ద సంఖ్యలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. హనుమాన్జంక్షన్లో వైఎస్సార్ సీపీ, నాన్ పొలిటికల్ జేఏసీ నేతృత్వంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. కొండపల్లిలో ముస్లిం సోదరులు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఇబ్రహీంపట్నంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. నందిగామ పట్టణంలో రిలే నిరాహారదీక్షలు, ర్యాలీలు, రాస్తారోకోలు యథావిధిగా కొనసాగాయి. జగ్గయ్యపేట పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయం వద్ద జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రిలే దీక్షలో 216 మంది విద్యార్థులు కూర్చుని సంఘీభావం తెలిపారు. సీనియర్ రాజకీయ నేత సామినేని విశ్వనాథం, శాసనసభ్యుడు శ్రీరాం రాజగోపాల్ దీక్షాశిబిరాన్ని సందర్శించారు. తిరువూరులో ఎన్జీవోలు బోసు సెంటర్లో, గురుకుల ఉపాధ్యాయులు కళాశాల ఆవరణలో ఆందోళన నిర్వహించారు. విస్సన్నపేటలో జేఏసీ నాయకులు సమైక్యాంధ్ర కోరుతూ అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. నూజివీడులో ఐకేపీ ఉద్యోగుల రిలే దీక్షలు 38వ రోజుకు, న్యాయవాదులు చేస్తున్న రిలేదీక్షలు 27వ రోజుకు చేరాయి. విద్యుత్ ఉద్యోగులు చిన్నగాంధీబొమ్మ సెంటర్లో ఆందోళన నిర్వహించారు. వైఎస్సార్ సీపీ నాయకుల రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. దీక్షలను పార్టీ యువజన విభాగం పట్టణ కన్వీనర్ పిళ్లా చరణ్, నియోజకవర్గ సమన్వయకర్త మేకా వెంకట ప్రతాప్అప్పారావు ప్రారంభించారు. కైకలూరులో వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్ద నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కొనసాగుతున్న దీక్షలు 39వ రోజుకు చేరాయి. తాలూకా సెంటర్లో ఎన్జీవోల దీక్షలు 32వ రోజుకు చేరాయి. వారికి మద్దతుగా భుజబలపట్నం పంచాయతీ పాలకవర్గం రిలే దీక్షలు చేపట్టింది. కైకలూరులో 1000 మంది మహిళలతో పొలికేక కార్యక్రమం జరిగింది. కలిదిండిలో ఏఎన్ఎం సిబ్బంది రిలే దీక్షలు చేశారు. మండవల్లిలో జేఏసీ ఆధ్వర్యంలో వీఆర్వోలు రిలే దీక్షలు చేశారు. ముదినేపల్లిలో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే దీక్షలు 20వ రోజుకు చేరాయి. బంటుమిల్లిలో రైతు గర్జన జరిగింది. నియోజకవర్గానికి చెందిన పలువురు అన్నదాతలు పాల్గొన్నారు. మైలవరంలో రైతన్నలు రోడ్డెక్కారు. ఎడ్లబళ్లు, ట్రాక్టర్లు, ఇతర వ్యవసాయ పరికరాలతో రైతులు సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం ఉద్యమించారు. అనంతరం బోసు బొమ్మ సెంటర్ లో జరిగిన సభలో వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ ఎం.వి.ఎస్.నాగిరెడ్డి తదితరులు ప్రసంగించారు. జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలేదీక్షలు 18వ రోజుకు చేరాయి. మాదిగ సంఘం ర్యాలీ నిర్వహించింది. జి. కొండూరులో పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే దీక్షలు 22వ రోజుకు చేరుకున్నాయి. బెజవాడలో... మొన్నటివరకు ఉద్యమానికి దూరంగా ఉన్న ప్రైవేటు బస్సు ఆపరేటర్లు రంగంలోకి దిగారు. శుక్రవారం ఉదయం నుంచి బంద్ పాటిస్తున్న వారు శనివారం విజయవాడలో మహా బస్ ర్యాలీ చేశారు. హనుమాన్పేట నుంచి బయలుదేరిన ర్యాలీ బందరురోడ్డు, బెంజిసర్కిల్, రింగ్రోడ్డుల మీదగా ఏలూరు రోడ్డుకు చేరుకుని అక్కడ నుంచి హనుమాన్పేటకు వెనుదిరిగింది. చార్టెర్డ్ అకౌంటెంట్స్ పాదయాత్ర నిర్వహించారు. సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఉపాధ్యాయులు కళ్లకు గంతలు కట్టుకుని రిలే దీక్షలు చేశారు. పంచాయతీరాజ్ కార్యాలయం వద్ద వికలాంగులు రిలేదీక్షల్లో పాల్గొన్నారు. దేవాదాయ, ధర్మాదాయ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బందరురోడ్డులోని అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయం వద్ద రిలే దీక్షలు నిర్వహించారు. విద్యుత్ఎంప్లాయిస్ జేఏసీ ఆధ్వర్యంలో ఎస్ఈ కార్యాలయం నుంచి ర్యాలీ నిర్వహించి బందరు రోడ్డులో మానవహారం నిర్మించారు. -
ఉయ్యూరులో లక్ష గళ ఘోష విజయవంతం
సాక్షి, విజయవాడ : సమైక్యాంధ్ర ఉద్యమం 32వ రోజూ ఉధృతంగా సాగింది. శనివారం వినూత్న పద్ధతుల్లో సమైక్యవాదులు తమ నిరసన తెలిపారు. రాష్ట్ర విభజన ప్రతిపాదన వెనక్కి తీసుకునేవరకు ఉద్యమిస్తామని నొక్కివక్కాణించారు. ఉయ్యూరులో నిర్వహించిన లక్ష గళ ఘోష కార్యక్రమం విజయవంతమైంది. వేలాదిగా హాజరైన ప్రజలతో ఉయ్యూరు జన సంద్రమైంది. సంపూర్ణ బంద్ విజయవంతమైంది. తిరువూరులో సమైక్య జనగళఘోష నిర్వహించారు. పెద్ద ఎత్తున సమైక్యవాదులు రోడ్డుపైకి వచ్చి రాష్ట్రం ఐక్యంగా ఉండాలని నినదించారు. కార్యాలయాలు, దుకాణాలు బంద్ చేశారు. కైకలూరులో నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులతో గళ ఘోష కార్యక్రమం జరిగింది. కైకలూరు తాలూకా సెంటర్లో ఎన్జీవోలు చేస్తున్న రిలే దీక్షలు 18వ రోజుకు చేరాయి. రేషన్ డీలర్లు దీక్షలు చేపట్టారు. కలిదిండి మండలంలో రోడ్డుపై వీఆర్వోలు మోకాళ్లపై నడిచి నిరసన తెలిపారు. మండవల్లిలో బంద్ నిర్వహించి రోడ్లపై ఆటలు ఆడారు. రాష్ట్ర విభజన జరిగితే అభివృద్ధి కుంటుపడుతుందంటూ నూజీవీడులో విద్యార్థులు వెనక్కి నడిచి నిరసన తెలిపారు. జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు మండలాల్లో సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు కొనసాగాయి. జగ్గయ్యపేటలో రేషన్ డీలర్లు దీక్షలో పాల్గొన్నారు. జేఏసీ నాయకులు భిక్షాటన చేశారు. రాష్ట్ర విభజన జరిగితే తాము భిక్షాటనే చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా మైలవరంలోని తెలుగు తల్లి సెంటర్లో ఆరువేల మందితో ప్రదర్శన నిర్వహించి సమైక్య గర్జన చేశారు. ఆటో డ్రైవర్లు ర్యాలీ నిర్వహించారు. జి.కొండూరు మండలం దుగ్గిరాలపాడులో గ్రామస్తులు ప్రధాన రహదారిపై వంటావార్పు నిర్వహించారు. విజయవాడలో పశుసంవర్ధక శాఖ మహిళా వైద్యులు, సిబ్బంది ఆధ్వర్యంలో ఉండమ్మా బొట్టుపెడతా కార్యక్రమం నిర్వహించారు. బీఆర్టీఎస్ రోడ్డులోని ఫుడ్ జంక్షన్ వద్ద విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో సర్వమత ప్రార్థనలు జరిగాయి. వైఎస్సార్ సీపీ సెంట్రల్ నియోజకవర్గ ఇన్చార్జి పి.గౌతంరెడ్డి ఆధ్వర్యంలో 108 మందితో లలితా సహస్రనామ కార్యక్రమం జరిగింది. జననేత జగన్కు మద్దతుగా.. రాష్ట్ర విభజన చేయకూడదంటూ వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి చేస్తున్న నిరాహారదీక్షకు మద్దతుగా జిల్లాలో పలువురు నాయకులు, కార్యకర్తలు దీక్షలు కొనసాగిస్తున్నారు. పెడన నియోజకవర్గ సమన్వయకర్త వాకా వాసుదేవరావు, పార్టీ బీసీ విభాగం రాష్ట్ర అడ్హాక్ కమిటీ సభ్యుడు గూడవల్లి వెంకట కేదారేశ్వరరావుల నాలుగోరోజు దీక్షను శనివారం రాత్రి పోలీసులు భగ్నం చేశారు. వారిని మచిలీపట్నం ఆస్పత్రికి తరలించారు. విజయవాడలో తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త వంగవీటి రాధాకృష్ణ ఆధ్వర్యంలో 10 మంది బందరు రోడ్డుపై రిలే నిరాహారదీక్షలు నిర్వహించగా, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ వారిని పరామర్శించారు. సాయంత్రం రాధాకృష్ణ నిమ్మరసమిచ్చి దీక్ష విరమింపజేశారు. కైకలూరు నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో రిలే దీక్షలు ఏడో రోజు కొనసాగాయి. నూజివీడులో ఐదోరోజు రిలేదీక్షల్లో నియోజకవర్గ సమన్వయకర్త మేకా ప్రతాప్ అప్పారావు పాల్గొన్నారు. గుడివాడలో పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఆంజనేయస్వామి ఆలయంలో జగన్ పేరిట పూజలు నిర్వహించి, 101 కొబ్బరికాయలు కొట్టారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- పోస్టల్ బ్యాలెట్తో 3.03 లక్షల మంది ఓటు
- చంద్రబాబును మరోసారి నమ్మొద్దు
- మహామహులకూ తప్పని... ఓటమి
- 22 మంది బిలియనీర్లయ్యారు
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
Advertisement