-
అర్ధరాత్రి మృత్యుఘోష
ఖమ్మం జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం.. 10 మంది మృతి సాక్షి ప్రతినిధి, ఖమ్మం/కూసుమంచి: సమయం.. అర్ధరాత్రి 2.40 గంటలు.. అందరూ గాఢ నిద్రలో ఉన్నారు.. బస్సు వేగంగా పోతోంది.. ఇంతలో ఊహిం చని ఉత్పాతం.. రోడ్డుపై ఆగివున్న బస్సును తప్పించబోయే క్రమంలో ఘోర ప్రమాదం.. బ్రిడ్జిపై నుంచి 25 అడుగుల లోతు కాల్వలో బస్సు పడిపోయింది.. ప్రయాణికులు తేరుకునేలోపే బస్సులోకి నీరు చేరింది.. తీవ్రగాయాలతో కొందరు.. ఊపిరాడక మరికొందరు.. మొత్తంగా పది మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి!! సోమవారం తెల్లవారుజామున ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్గూడెం వద్ద ఈ ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. మృతుల్లో నలుగురు తూర్పుగోదావరి జిల్లా, ముగ్గురు పశ్చిమగోదావరి జిల్లా, ఒకరు ప్రకాశం జిల్లాకు చెందినవారు. మిగతా ఇద్దరిలో ఒకరు కరీంనగర్కు, మరొకరు హైదరాబాద్కు చెందినవారు. ప్రమాదంలో మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారికి ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఒక డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకోగా.. మరో డ్రైవర్ పరారీలో ఉన్నాడు. ప్రమాదం జరిగింది ఇలా..! ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో హైదరాబాద్లోని మియాపూర్ నుంచి ఇద్దరు డ్రైవర్లు, క్లీనర్ సహా 31 మంది ప్రయాణికులతో నెల్లూరు జిల్లాకు చెందిన యాత్రాజీని ప్రైవేటు టూరిస్టు బస్సు(ఏపీ 26 టీసీ 9512) ఆంధ్రప్రదేశ్లోని కాకినాడకు బయల్దేరింది. సూర్యాపేటకు చేరుకున్న తర్వాత టీ కోసం కాసేపు బస్సు ఆపారు. వాస్తవానికి బస్సు హైదరాబాద్ నుంచి విజయవాడ హైవే మీదుగా కాకినాడ వెళ్లాలి. కానీ అటువైపు పుష్కర యాత్రికులతో రద్దీగా ఉండటంతో.. ఖమ్మం, తల్లాడ మీదుగా విజయవాడ వెళ్లేందుకు బస్సును ఖమ్మం వైపు మళ్లించారు. సూర్యాపేట వరకు డ్రైవింగ్ చేసిన శ్రీను విశ్రాంతి తీసుకోగా.. అక్కడ్నుంచి కిషోర్ డ్రైవింగ్ చేశాడు. సూర్యాపేట నుంచి ఖమ్మం వస్తున్న బస్సు అర్ధరాత్రి 2.40 గంటల సమయంలో కూసుమంచి మండలంలోని నాయకన్గూడెం వద్దకు చేరింది. నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ ఇన్ఫాల్ రెగ్యులేటరీ గేట్ల బ్రిడ్జి వద్దకు వేగంగా దూసుకొచ్చింది. ఇక్కడ అప్పటికే ఓ ప్రమాదం జరిగి, రెండు బస్సులు ఢీకొన్నాయి. అందులో ఒక బస్సు రోడ్డుపై ఆగి ఉంది. ఆ బస్సును తప్పించబోయే క్రమంలో బస్సు అదుపు తప్పి బ్రిడ్జిపై నుంచి సుమారు 25 అడుగుల లోతున్న కాల్వలోకి పడిపోయింది. క్రేన్ల సాయంతో బయటకు తీసి.. బస్సు కాల్వలోకి పడిపోవడంతో పెద్ద శబ్దం వచ్చింది. దీంతో స్థానికులు బ్రిడ్జి వద్దకు చేరుకుని పోలీసులకు సమాచారమిచ్చారు. కాల్వలోని గేట్ల వద్ద నాలుగు అడుగుల మేర నీరుంది. బోల్తాపడిన బస్సులోకి క్రమంగా నీళ్లు వచ్చాయి. ఏసీ బస్సు కావడం.. అద్దాలన్నీ మూసుకుని ఉండటంతో ప్రయాణికులు బయటకు రావడం కష్టమైంది. కొందరు ప్రయాణికులు సీట్ల మధ్య ఇరుక్కుపోవడం, వారిపై లగేజీ పడడంతో బస్సులోనే చాలామంది ఉండిపోయారు. స్థానికులతోపాటు కొందరు మత్స్యకారులు చీకట్లో సెల్ఫోన్ లైట్లు వేసుకుని బస్సు అద్దాలు పగులగొట్టి కొందరిని బయటకు తీశారు. అప్పటికే ఐదుగురు చనిపోయారు. ఉదయం వరకు బస్సులో ఇరుక్కున్న మృతదేహాలను బయటకు తీసే పరిస్థితి లేకపోవడంతో 8 గంటల సమయంలో రెండు భారీ క్రేన్లను తెప్పించారు. బస్సును తాళ్లతో కట్టి బయటకు తీశారు. బస్సులో ఇరుక్కుని బయటకు వేలాడుతున్న మృతదేహాలు పలుమార్లు బ్రిడ్జి పిల్లర్లకు తగలడం అక్కడి వారిని తీవ్రంగా కలచివేసింది. డ్రైవర్పై కేసు.. బస్సు ప్రమాద ఘటనపై కూసుమంచి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. బస్సును అతివేగంగా, నిర్లక్ష్యంగా నడిపినందుకు బస్సు డ్రైవర్ కిషోర్పై కేసులు నమోదు చేసినట్లు సీఐ కిరణ్కుమార్ తెలిపారు. కాగా ఈ ఘటనపై విచారణాధికారిగా డీఎస్పీ సురేష్ కుమార్ వ్యవహరిస్తారన్నారు. ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి ఖమ్మం జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. బాధితుల సమాచారాన్ని వారి కుటుంబీకులకు చేరవేయడంతోపాటు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. పని కోసం వెళ్తూ.. ప్రమాదంలో కరీంనగర్ జిల్లా రామగుండం ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీకి చెందిన అశోక్ చనిపోయాడు. అనువాల కాంతయ్య-పద్మల రెండో కుమారుడైన ఈయన బీటెక్ పూర్తి చేశాడు. తండ్రి వెల్డర్గా పనిచేస్తుండగా, ఆయన వద్ద పని నేర్చుకున్నాడు. కాకినాడలోని ఓ ప్రైవేటు కంపెనీలో చేరేందుకు వెళ్తూ బస్సు ప్రమాదంలో మృతి చెందాడు. ఏఎస్సై కుమారుడు.. బస్సు ప్రమాదంలో మరణించిన అజారుద్దీన్ది ప్రకాశం జిల్లా మార్కాపురం. ఈయన తండ్రి షేక్ రఫీవుద్దీన్ యర్రగొండపాలెం ఏఎస్సైగా పనిచేస్తున్నారు. ఈయనకు ముగ్గురు కుమారులు. వారిలో పెద్ద కుమారుడు అజారుద్దీన్.. కాకినాడ జేఎన్టీయూలో ఎంటెక్ సెకండియర్ చదువుతున్నాడు. ఎదిగిన కొడుకు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోతున్నారు. మృతుల వివరాలు 1. వాసంశెట్టి దుర్గాశ్రావణి (19) చింతాకులవారిపేట, తాళ్లరేవు, తూర్పుగోదావరి జిల్లా 2. ఎస్.కె.అజారుద్దీన్ (22) మార్కాపురం, ప్రకాశం జిల్లా 3. తోకల సత్య ప్రశాంత్ (22) పూళ్లవారి వీధి, కాకినాడ, తూర్పుగోదావరి 4. జ్ఞాన సుమంత్ సాయి (25) బండవారి వీధి, వేల్పూరు, పశ్చిమగోదావరి జిల్లా 5. ఆల్వాల అశోక్ (25) మేడేపల్లి కాలని, జ్యోతినగర్, రామగుండం, కరీంనగర్ జిల్లా 6. పట్నాల రమేష్ పసలపూడి, తూర్పుగోదావరి జిల్లా 7. కొత్తల వెంకట త్రినాథ దుర్గారావు (41)ఉంగుటూరు, పశ్చిమగోదావరి జిల్లా 8. చిన్నవెంకట సుబ్బారెడ్డి (50) భరత్నగర్, హైదరాబాద్ 9. టేకు వరలక్ష్మి (50) మలిశాల గ్రామం, తూర్పుగోదావరి జిల్లా 10. పెద్దిరాజు (28) నిడమర్రు, పశ్చిమగోదావరి జిల్లా అయ్యో.. అలా వెళ్తే బతికేవారేమో? ఖమ్మం: హైదరాబాద్-కాకినాడ వెళ్లే బస్సులు సాధారణంగా సూర్యాపేట, కోదాడ, విజయవాడ మీదుగా కాకినాడ వెళ్తాయి. కానీ డ్రైవర్ ఈ మార్గంలో కాకుండా బస్సును వేరే దారిలోకి మళ్లించాడు. కృష్ణా పుష్కరాలు కావడం, ట్రాఫిక్ జామ్ కావడంతో డ్రైవర్ సూర్యాపేట నుంచి ఖమ్మం మీదుగా సత్తుపల్లి, అశ్వారావుపేట మీదుగా కాకినాడ వెళ్లాలని భావించాడు. ఈ రూట్పై పెద్దగా అవగాహన లేకపోవడంతోపాటు నాయకన్గూడెం వద్ద ఉన్న మూల మలుపును డ్రైవర్ గుర్తించలేదు. ఇక్కడ అప్పటికే మరో బస్ ఆగిపోవడంతో సడన్ బ్రేక్ వేశాడు. దీంతో వంతెన రెయిలింగ్ను ఢీకొని బస్సు కాల్వలో పడింది. ఆలస్యమైనా విజయవాడ మీదుగా వెళ్లి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదని మృతుల బంధువులు రోదిస్తున్నారు. కళ్లు తెరవని అధికారులు తరచూ ఇక్కడే ప్రమాదాలు.. అయినా పట్టించుకోని వైనం కూసుమంచి: అధికారుల నిర్లక్ష్యం.. అలసత్వంతో ప్రయాణికుల నిండు ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. ప్రస్తు తం బస్సు ప్రమాదం జరిగిన సాగర్ ఇన్ఫాల్ కాల్వ రెగ్యులేటర్ గేట్ల వద్ద తరచూ దుర్ఘటనలు జరుగుతున్నా అధికారులు కళ్లు తెరవడంలేదు. 2 నెలల క్రితం మణుగూరు డిపోకు చెం దిన ఆర్టీసీ బస్సు ఇక్కడే కాల్వలో పడింది. ఈ ఘటనలో ఓ చిన్నారి మృతిచెందగా.. పది మందికి పైగా గాయాలపాలయ్యారు. సోమవారం తెల్లవారుజామున ఇదే ప్రాంతంలో హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తున్న ప్రైవేట్ బస్సు కాల్వలో పడింది. సూ ర్యాపేట-ఖమ్మం రహదారి మలుపులతో ప్రమాదకరంగా ఉంది. నాయకన్గూడెం నుంచి పాలేరు వరకు రహదారి మృత్యుకుహరంగా మారింది. నాయకన్గూడెం వద్ద పాలేరు రిజర్వాయర్కు వచ్చే ఇన్ఫాల్ కాల్వపై ఉన్న వంతెన ఇరుకుగా ఉండటం.. పై భాగాన రోడ్డు ముందు వచ్చే వాహనాలు కనిపించని విధంగా మూలమలుపులు ఉండటంతో తర చు ప్రమాదాలు జరుగుతున్నాయి. అటు పాలేరు ఔట్ఫాల్ కాల్వపై ఉన్న వంతెనకు రెయిలింగ్ పూర్తిస్థాయిలో లేకపోవడం ప్రమాదాలకు కారణమవుతోంది. కాల్వలు నిండుగా ప్రవహిస్తున్నప్పుడు ప్రమా దం జరిగితే వాహనాల అడ్రస్ దొరకని పరిస్థితి. సమీపంలోనే ఉన్న మినీ హైడల్ విద్యుత్ ప్రాజెక్టు కాల్వ కూడా ప్రమాదకరంగా మారింది. గతంలో ఓ డీసీఎం,కారు కాల్వలోకి దూసుకెళ్లగా.. పలువురు మృత్యువాత పడ్డారు. -
మృత్యుయాత్ర
ఎన్నెస్పీ కాల్వలో పడిన ప్రైవేటు బస్సు తెల్లవారుజామున 2.40 గంటలకు ఘటన పది మంది మృతి.. 21 మందికి గాయాలు కాల్వ బ్రిడ్జిపై అంతకుముందే రెండు బస్సులు ఢీ ఆగి ఉన్న బస్సును తప్పించబోయిన కాల్వలోకి.. బస్సులో ఇరుక్కున్న వారిని తీసేందుకు యాతన సాక్షి ప్రతినిధి, ఖమ్మం/కూసుమంచి : ఒక్కొక్కరిదీ ఒక్కో పని.. రేషన్ కార్డుల పరిశీలన కోసం కొందరు.. పెళ్లికొచ్చి తిరుగు పయనమైన వారు మరికొందరు.. హైదరాబాద్లో సంస్థ సమావేశం ముగించుకొని ఇంకొందరు.. చాలాకాలం తర్వాత స్వస్థలాలకు వెళ్తున్న వారు.. హైదరాబాద్ నుంచి గంటలకొద్దీ సాగుతున్న ప్రయాణంలో కాసేపు టీ విరామం.. మళ్లీ బయలుదేరిన బస్సు.. గమ్యస్థానాలకు ఇన్ని గంటలకు చేరుకుంటామని తమ వారికి ఫోన్ చేస్తూ నిద్రలోకి.. ఇంతలోనే జరిగిన ఘోర ప్రమాదంతో వీరి బతుకులన్నీ తెల్లారిపోయాయి. బస్సు కింద నలిగిపోతూ.. నీటిలో మునిగిపోతూ నరకయాతనతో ప్రాణాలు వదిలారు. బస్సు ఎప్పుడు.. ఎంత మందితో బయలుదేరింది.. హైదరాబాద్లోని మియాపూర్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లాకు చెందిన యాత్రాజీని టూరిస్టు బస్సు(ఏపీ 26 టీసీ 9512, యజమాని : కొండూరు జనార్దన్రెడ్డి) కాకినాడకు ఆదివారం రాత్రి 11.00 గంటల సమయంలో బయలుదేరింది. ఇద్దరు డ్రైవర్లు, ఒక క్లీనర్తో సహా 31 మంది ప్రయాణికులు బస్సులో ఉన్నారు. హైదరాబాద్ నుంచి బయలుదేరిన అనంతరం సూర్యాపేటకు సోమవారం తెల్లవారుజామున 1.10 గంటలకు బస్సు చేరుకోగా.. అక్కడే కృష్ణ హోటల్ వద్ద బస్సు నిలిపారు. టీ తాగిన తర్వాత తిరిగి బస్సు 1.30 గంటలకు బయలుదేరింది. సూర్యాపేట వరకు బస్సును శ్రీను అనే డ్రైవర్ నడపగా.. అక్కడి నుంచి కిషోర్ అనే డ్రైవర్ నడిపాడు. తెల్లవారుజామున 2.40 గంటల ప్రాంతంలో కూసుమంచి మండలం నాయకన్గూడెం వద్ద ఉన్న సాగర్ ఇన్ఫాల్ రెగ్యులేటరీ గేట్ల వద్ద బస్సు ప్రమాదానికి గురైంది. 10 మంది అక్కడికక్కడే మృతిచెందగా.. 18 మందికి తీవ్ర.. మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. మృతులంతా ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లావాసులే. అమాంతం కాల్వలోకి.. హైదరాబాద్ నుంచి కాకినాడకు బయలుదేరిన యాత్రాజీని ప్రైవేటు బస్సు కూసుమంచిలోని నాయకన్గూడెం వద్ద ఎన్నెస్పీ ఇన్ఫాల్ రెగ్యులేటరీ గేట్ల వద్ద ప్రమాదానికి గురైంది. కాగా.. అదే బ్రిడ్జిపై ప్రమాద ఘటనకు కొద్దిసేపు ముందు రెండు బస్సులు ఢీకొనడంతో పోలీసులు, స్థానికులు సంఘటన స్థలానికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. అందులో ఒక బస్సు బ్రిడ్జిపై నిలిచిపోయి ఉంది. యాత్రాజీని టూరిస్టు బస్సు సోమవారం తెల్లవారుజామున 2.40 గంటల సమయంలో బ్రిడ్జి వద్దకు అతివేగంగా చేరుకోగానే.. మరో బస్సు నిలిచి ఉంచడంతో దానిని తప్పించబోయి అదుపుతప్పి ఒక్కసారిగా ఇన్ఫాల్ కాల్వలోకి దూసుకెళ్లింది. బస్సు కాల్వలో బోల్తాపడటంతో అందులో చిక్కుకున్న ప్రయాణికులు బయటకు రాలేకపోయారు. సంఘటన జరిగినప్పుడు పెద్ద పెట్టున శబ్దం రావడంతో స్థానికులు భయభ్రాంతులకు గురై సంఘటన స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. పోలీసులు సైతం సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. చిమ్మ చీకటి.. ఆర్తనాదాలు.. బస్సు కాల్వలో పడిన సమయంలో అంతా చిమ్మ చీకటే. ఏం జరిగిందో తెలుసుకునేలోపే పెద్ద ప్రమాదం జరిగిపోయింది. పెద్ద శబ్దాలు విన్న స్థానికులు సంఘటన స్థలానికి చేరుకుని చూసేసరికి చిమ్మ చీకట్లో ఆర్తనాదాలు.. హాహాకారాలు వినిపించాయి. వెంటనే మత్స్యకారులు కాల్వలో సెల్ఫోన్ లైట్ల వెలుతురులో చూడగా.. బస్సు బోల్తాపడిపోయి ఉంది. తేరుకున్న మత్స్యకారులు కాల్వలోకి దూకి ప్రయాణికులను రక్షించే ప్రయత్నం చేశారు. అప్పటికే కొందరు ప్రాణాలు విడవగా.. మత్స్యకారులు బస్సు అద్దాలను పగులగొట్టి కొంతమంది ప్రయాణికులను బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన వారిని ఖమ్మం, నేలకొండపల్లి నుంచి వచ్చిన 108 వాహనాల్లో ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బస్సు తిరగలబడి.. ఎన్నెస్పీ ఇన్ఫాల్ రెగ్యులేటర్ గేట్ల వద్ద ప్రమాదం జరగగా.. ఆ స్థలంలో వంతెన పైనుంచి 25 అడుగుల లోతులో కాలువ ఉంది. బ్రిడ్జి వద్ద ఇన్ఫాల్ రెగ్యులేటర్ గేట్లు ఉండటంతో సుమారు 5 అడుగుల మేర నీళ్లు నిలిచి ఉన్నాయి. కాగా.. బస్సు ప్రమాదానికి గురైనప్పుడు బ్రిడ్జి పైనుంచి కాల్వలో బోల్తాపడింది. ఏసీ బస్సు కావడంతో అద్దాలు తొలగించే పరిస్థితి లేకపోవడంతో ప్రయాణికులంతా బస్సులోపలే ఉండిపోయారు. కాల్వలో నిలిచి ఉన్న నీళ్లు నెమ్మదిగా బస్సులోకి చేరుకోవడం.. సంఘటనను గమనించడంలో ఆలస్యం కావడంతో ఊపిరి ఆడక ఎక్కువ సంఖ్యలో మృత్యువాతపడ్డారు. ప్రమాద విషయాన్ని తెలుసుకున్న కూసుమంచి సీఐ కిరణ్కుమార్, ప్రొబేషనరీ ఎస్సై ప్రవీణ్ హుటాహుటిన నాయకన్గూడెం చేరుకుని.. బస్సులోని మృతదేహాలను బయటకు తీయించారు. ఇరుక్కుపోయిన మృతదేహాలు బస్సు తలకిందులుగా బోల్తాపడటంతో లోపల ఉన్న ప్రయాణికులు సీట్ల మధ్య ఇరుక్కుపోవడం, వారిపై లగేజీ పడటంతో బయటకు రాలేక మృత్యువాతపడ్డారు. రాత్రి సమయంలో ఐదు మృతదేహాలను బయటకు తీయగా.. మరికొందరి మృతదేహాలు బస్సులో నుంచి బయటకు తీయడం కష్టతరంగా మారింది. దీంతో ఉదయం 8 గంటల సమయంలో రెండు భారీ క్రేన్లు తెప్పించి బస్సును కాల్వ నుంచి బయటకు తీశారు. కాగా.. అప్పటికే బస్సులో ఇరుక్కుపోయిన మృతదేహాలు వేలాడుతూ కనిపించాయి. బస్సును క్రేన్ల సాయంతో బయటకు తీసే సమయంలో పలుమార్లు వేలాడుతున్న మృతదేహాలు బ్రిడ్జి పిల్లర్లకు తగలడం అక్కడి వారిని తీవ్రంగా కలచివేసింది. బస్సు వెలుపలికి తీసిన అనంతరం కూడా మృతదేహాలను బయటకు తీసేందుకు నానా యాతన పడాల్సి వచ్చింది. సుమారు రెండు గంటలు కష్టించి ఐదు మృతదేహాలను బస్సు నుంచి బయటకు తీశారు. డీఎస్పీ సురేష్కుమార్ ఆధ్వర్యంలో పలువురు సీఐలు, ఎస్సైలు సహాయక చర్యలు పూర్తయ్యేంత వరకు నాయకన్గూడెంలోనే ఉన్నారు. తరలివచ్చిన జనం నాయకన్గూడెం వద్ద జరిగిన బస్సు ప్రమాద ఘటన విషయాన్ని మీడియా, సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న కూసుమంచి మండల ప్రజలతోపాటు సమీప నల్లగొండ జిల్లాలోని పలు గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో నాయకన్గూడెం జనసందోహంగా మారింది. మోతె, నడిగూడెం, వరంగల్ జిల్లా మరిపెడ మండలాల నుంచి ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. కాల్వలో బస్సు పడిన విషయం తెలిసిన వెంటనే గ్రామానికి చెందిన ప్రజలు బస్సులోని ప్రయాణికులను రక్షించేందుకు వచ్చారు. పెద్ద ఎత్తున తాళ్లు, ఇతర సామగ్రిని తెచ్చి ప్రయాణికులను బయటకు తీశారు. మృతదేహాలను బయటకు తీస్తుంటే సంఘటన స్థలానికి వచ్చిన ప్రజలు కన్నీటి పర్యంతమయ్యారు. తమ వారు కాకపోయినా బస్సులో మృతదేహాలు వేలాడుతున్న తీరును చూసి హృదయ విదారకంగా రోదించారు. ఆస్పత్రిలో మృత్యుఘోష బస్సు ప్రమాద సంఘటనలో 10 మంది మృతిచెందడంతో వారి మృతదేహాలను ఖమ్మంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన 18 మందిని కూడా ఆస్పత్రికి తీసుకువచ్చి వైద్యం అందించారు. కాగా.. ఒకవైపు మృతదేహాలు, మరోవైపు క్షతగాత్రులతో ఆస్పత్రి వాతావరణం మొత్తం విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుల వివరాలు తెలుసుకునేందుకు స్థానికులు ఆసక్తి చూపించారు. క్షతగాత్రుల వద్దకు వచ్చి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న క్షతగాత్రులు, మృతుల బంధువులు ఆస్పత్రికి చేరుకుని రోదిస్తున్న తీరు అక్కడున్న వారి హృదయాలను కలచివేసింది. క్షతగాత్రుల వద్ద తమకు దిక్కు లేకపోవడంతో వారు కన్నీటì æపర్యంతమయ్యారు. కాగా, ప్రభుత్వాస్పత్రిలో మృతదేహాలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మంత్రులను పరిశీలించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement