-
అణు యుద్ధంపై మరోమారు పుతిన్ వ్యాఖ్యలు.. ఏం జరుగుతోంది?
మాస్కో: అణ్వాయుధాల వినియోగంపై మరోమారు కీలక వ్యాఖ్యలు చేశారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ప్రస్తుతం అణు యుద్ధం ముప్పు పెరుగుతోందని, అయితే, తాము అణ్వాస్త్రాలను వినియోగించబోమని పేర్కొన్నారు. రష్యాలోని మానవ హక్కుల మండలితో వర్చువల్గా మాట్లాడారు పుతిన్. ఈ సందర్భంగా అగ్రరాజ్యం అమెరికాపై పరోక్ష విమర్శలు చేశారు. ‘ఉక్రెయిన్లో యుద్ధం సుదీర్ఘంగా సాగుతున్న ప్రక్రియ. అణు యుద్ధం ముప్పు పెరుగుతోందనడంలో అనుమానాలు లేవు. ఏ పరిస్థితిలోనూ రష్యా మొదట అణ్వాయుదాలను ప్రయోగించదు. వాటిని చూపించి బెదిరించదు. అణ్వాయుధాల సంగతి మాకు తెలుసు. అందుకే ఉన్మాదంగా వ్యవహరించబోం. ప్రపంచమంతా తిరుగుతూ ఆ ఆయుధాలను బ్రాండింగ్ చేసుకోం. ప్రపంచంలోనే అత్యాధునిక అణ్వాస్త్రాలు రష్యా వద్ద ఉన్నాయి. ఇతర దేశాల భూభాగాలపై మా అణ్వాయుధాలు లేవు.’ అని పేర్కొన్నారు పుతిన్. టర్కీ, ఇతర ఐరోపా దేశాల్లో అమెరికాకు చెందిన న్యూక్లియర్ బాంబ్స్ ఉండడాన్ని ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు. కేవలం ఆత్మ రక్షణకే రష్యా న్యూక్లియర్ వెపన్స్ వాడుతుందన్నారు. ఇదీ చదవండి: టైమ్స్ ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్’గా జెలెన్స్కీ -
తలుచుకుంటే ఉత్తర చైనా తునాతునకలే!
న్యూఢిల్లీ: అణు శక్తి సామర్ధ్యం కలిగిన అగ్ని-5 ఖండాంతర క్షిపణికి భారత్ త్వరలో చివరి పరీక్షలు నిర్వహించనుంది. దాదాపు రెండు సంవత్సరాల పాటు చివరి దశ పరీక్షలకు క్షిపణిని సిద్ధం చేసిన శాస్త్రవేత్తలు డిసెంబర్ నెలాఖరు లేదా జనవరి ప్రథమార్ధంలో ఒడిశాలోని మిస్సైల్ టెస్టింగ్ సెంటర్ నుంచి ప్రయోగించనున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే 5,000-5,500 కిలోమీటర్ల దూరంలోని టార్గెట్లను భారత్ చేధించగలదు. ఇప్పటివరకూ అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, యూకేలు మాత్రమే ఈ సామర్ధ్యం కలిగిన క్షిపణులను కలిగివున్నాయి. వాస్తవానికి 2015 జనవరిలోనే అగ్ని-5కు ఆఖరి దశ పరీక్షలు నిర్వహించాల్సివుండగా.. అంతర్గత బ్యాటరీ, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ లో సాంకేతిక సమస్యల కారణంగా వాయిదా వేశారు. అగ్ని-5 క్షిపణి ఆఖరి దశ ప్రయోగం విజయవంతమైతే భారత్ తలుచుకుంటే ఉత్తర చైనాను తునాతునకలు చేయొచ్చు. జపాన్ తో అణుఒప్పందం, మిస్సైల్ టెక్నాలజీ కంట్రోల్ రిజైమ్(ఎమ్ టీసీఆర్)లో సభ్యత్వాన్ని సంపాదించిన భారత్.. అణు ఆయుధ సరఫరా బృందం(ఎన్ఎస్ జీ)లో చేరేందుకు యత్నాలు చేస్తోంది. భారత్ ఎన్ఎస్ జీ ప్రవేశానికి, టెర్రరిస్టు మసూద్ అజర్ పై నిషేధం విధించడానికి చైనా అడ్డుపడుతున్న నేపథ్యంలో అగ్ని-5 ఆఖరి దశ ప్రయోగానికి ప్రాధాన్యత సంతరించుకుంది. 2003లో స్ధాపించిన ట్రై సర్వీస్ స్ట్రాటజిక్ ఫోర్స్ స్ కమాండ్(ఎస్ఎఫ్ సీ) క్షిపణులను పరీక్షిస్తుంది. ఏ క్షిపణినైనా రక్షణ శాఖకు అందించేముందు కనీసం రెండు సార్లైనా పరీక్షిస్తారు. అగ్ని-5ను 2012-ఏప్రిల్, 2013-సెప్టెంబర్, 2015-జనవరిలో పరీక్షించారు. పృథ్వీ, ధనుష్ క్షిపణులతో పాటు అగ్ని-1, అగ్ని-2, అగ్ని-3 క్షిపణులను పరీక్షించింది ఎస్ఎఫ్ సీనే. ఈ ఐదు క్షిపణులను పాకిస్తాన్ ను దృష్టిలో ఉంచుకుని తయారుచేయగా.. అగ్ని-4, అగ్ని-5లను చైనాను దృష్టిలో ఉంచుకుని డిజైన్ చేశారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement