-
మహిళలు కలలు కనే ధైర్యం చేయాలి: ఫల్గుణి నాయర్
సౌందర్య, సంరక్షణ ఉత్పత్తుల ఈ- కామర్స్ కంపెనీ ‘నైకా’ లిస్టింగ్లో అదరగొట్టింది. బీఎస్ఈలో ఇష్యూ ధర రూ.1,125తో పోలిస్తే 80 శాతం ప్రీమియంతో రూ.2,018 వద్ద లిస్ట్ అయ్యింది. స్టాక్ మార్కెట్ అమ్మకాల ఒత్తిడిలో ట్రేడ్ అవుతున్నప్పటి.. ఈ షేరుకు ఏ మాత్రం డిమాండ్ తగ్గలేదు. ఓ దశలో ఏకంగా 100% శాతం దూసుకెళ్లి రూ.2,248 స్థాయిని అందుకుంది. చివర్లో అతి స్వల్ప లాభాల స్వీకరణ జరగడంతో 96 శాతం లాభంతో రూ.2,206 ట్రేడింగ్ను ముగిచింది. మార్కెట్ ముగిసే సరికి కంపెనీ మార్కెట్ విలువ లక్ష కోట్ల పైన రూ.1.04 లక్షల వద్ద స్థిరపడింది. ఫల్గుణి నాయర్ ప్రారంభించిన బ్యూటీ స్టార్టప్ ఆమెను ప్రపంచంలోని అత్యంత సంపన్నుల ర్యాంక్ల సరసన నిలిపింది. ఆమె స్థాపించిన ఈ కామర్స్ కంపెనీ నైకాలో సగం షేర్లు ఆమెవే. ఇప్పుడా ఆ షేర్లు 89% వరకు పెరగడంతో ఇప్పుడు 7 బిలియన్ డాలర్లతో అత్యంత సంపన్నురాలుగా మారారు. బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ఆమె భారతదేశపు అత్యంత సంపన్న స్వీయ-నిర్మిత మహిళా బిలియనీర్గా నిలిచారు. ఇప్పుడు ఆమె జీవితంలో స్వీయ నియంత్రణ సాధించడానికి ఎక్కువ మంది మహిళలను ప్రోత్సహిస్తోంది. స్వంత స్టార్ట్-అప్ ప్రారంభించాలని చూస్తున్న మహిళలకు ఫల్గుణి నాయర్ కొన్ని సలహాలు ఇచ్చింది. (చదవండి: తనను చెంప దెబ్బలు కొట్టడానికి మహిళను పనిలో పెట్టుకున్న ఓనర్!) "నాలాంటి మహిళలు తమ కోసం కలలు కనే ధైర్యం చేస్తారని నేను ఆశిస్తున్నాను" అని ఒక మీడియా ఇంటర్వ్యూలో తెలిపింది. "భవిష్యత్ ప్రతి ఒక్కరికీ అవకాశాలను ఇస్తుంది, వాటిని సద్వినియోగం చేసుకోవాలని" ఆమె సూచించింది. 2005లో ఒక బ్యాంక్కి మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతలు చేపట్టి, 2012లో తన 50వ ఏట ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఇందుకు రెండు కారణాలు చెబుతారు ఫల్గుణీ నాయర్. ‘‘నాకు మేకప్ అంటే చాలా ఇష్టం. అలాగే ఆన్లైన్ మార్కెట్ ప్లాట్ఫామ్ను ఉపయోగించుకోవాలనే కోరిక బలంగా ఉంది. ఈ రెండు కారణాల వల్లే నేను ఉద్యోగానికి రాజీనామా చేశాను’’ అంటున్న ఫల్గుణీ నాయర్ తల్లిదండ్రులు గుజరాతీలు. కాని ముంబైలో పుట్టి పెరిగారు. ఆమె తండ్రి వ్యాపారవేత్త. ‘‘మా నాన్న గారి నుంచే నాకు చిన్నతనంలోనే వ్యాపారం చేయాలనే వచ్చింది. మా ఇంట్లో అందరూ స్టాక్ మార్కెట్, ట్రేడ్ గురించి మాట్లాడుకునే వాళ్లం. అలా నాకు వ్యాపారం మీద అవగాహన కలిగింది’’ అంటారు. అప్పట్లో, చాలా మంది భారతీయ మహిళలు తమ దగ్గరలో ఉన్న మామ్-అండ్-పాప్ దుకాణాలలో సౌందర్య, సంరక్షణ ఉత్పత్తులను కొనుగోలు చేసేవారు. అక్కడ వారికి తక్కువ ఆప్షన్లు ఉండేవి, ట్రయల్స్ చేసే అవకాశం లేదు. ట్యుటోరియల్స్ & టెస్టిమోనియల్స్ సహాయంతో సౌందర్య, సంరక్షణ ఉత్పత్తులను కస్టమర్లకు సులభమైన ఆన్లైన్ ద్వారా విక్రయించాలని భావించింది. బ్యూటీకి సంబంధించిన ఉత్పత్తులకు భారతదేశంలో మంచి మార్కెట్ ఉందనీ, ఆ వ్యాపారం ప్రారంభించటం వల్ల తన కల నెరవేరుతుందని భావించారు. అందుకే, 2012లో మాజీ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ ఫల్గుని నాయర్ నైకాను మొదలుపెట్టారు. నైకా సౌందర్య ఉత్పత్తులను సేల్ చేస్తోంది. అంతేకాకుండా ఈ కంపెనీకి సొంతంగా రిటైల్ స్టోర్లు కూడా ఉన్నాయి. (చదవండి: ప్లాస్టిక్ నుంచి పెట్రోల్..అందుబాటులో ఎప్పుడంటే?) -
మగువలు మెచ్చిన ఈ-కామర్స్ కంపెనీ..ఐపీవో దిశగా అడుగులు..!
బెంగళూరు: ఇండియన్ ఈ- కామర్స్ బ్యూటీ కంపెనీ నైకా ఐపీవో ద్వారా సుమారు 500 మిలియన్ల డాలర్లను సమీకరించాలని ప్రణాళికలను రచిస్తోంది. నైకా స్టార్టప్ కంపెనీ నుంచి ఐపీవో ఇస్యూ వరకు ఎదిగింది. అందుకు సంబంధించిన పత్రాలను మార్కెట్ రెగ్యులేటర్ సెబీకి దాఖలు చేసినట్లుగా తెలుస్తోంది. 2012లో మాజీ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ ఫల్గుని నాయర్ నైకాను మొదలుపెట్టారు. నైకా సౌందర్య ఉత్పత్తులను సేల్ చేస్తోంది. అంతేకాకుండా ఈ కంపెనీకి సొంతంగా రిటైల్ స్టోర్లు కూడా ఉన్నాయి. నైకా ఈ-కామర్స్ వెబ్సైట్కు కొన్ని రోజుల్లోనే గణనీయంగా మహిళల ఆదరణ పొందింది. గత ఆర్ధిక సంవత్సరంలో నైకా సుమారు రూ.1860 కోట్లను ఆదాయంగా చూపించింది. కంపెనీ డీఆర్హెచ్పీ కాపీ ప్రకారం ఐపీవోలో రూ. 525 కోట్ల ప్రైమరీ మార్కెట్ ఉంటుందని తెలుస్తోంది. కంపెనీ పోర్ట్ఫోలియోలో 1,500 కి పైగా బ్రాండ్లను కలిగి ఉంది. కోటక్ మహీంద్రా క్యాపిటల్, బోఫా సెక్యూరిటీస్, సిటీ, మోర్గాన్ స్టాన్లీ, ఐసిఐసిఐ సెక్యూరిటీలు కంపెనీ ఐపీఓ నిర్వహిస్తున్నాయి. 2021 మార్చి 31 వరకు నైకా యాప్ను సుమారు 43.7 మిలియన్ల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. దేశవ్యాప్తంగా 38 నగరాల్లో 73 స్టోర్స్ను నైకా కలిగి ఉంది. -
బ్యూటీ అవార్డులో మెరిసిన తారలు
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హోం ఓటింగ్ పరిశీలన
నిప్పుతో చెలగాటమా!
మాదిగలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ
‘రాహుల్ పేరు చెబితే ఓట్లు పడవు’
కాంగ్రెస్తోనే అన్నివర్గాలకు సముచిత న్యాయం
హామీలు నెరవేర్చడంలో రేవంత్ విఫలం
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
పార్లమెంట్ ఎన్నికలు బహిష్కరిస్తాం..
మూడోసారి మోదీ సర్కారే..
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement