-
కృష్ణానది ఒడ్డున కలకలం.. అర్ధరాత్రి క్షుద్ర పూజలు!
గుంటుపల్లి (ఇబ్రహీంపట్నం): ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి కృష్ణానది ఒడ్డున అర్ధరాత్రి క్షుద్ర పూజలు నిర్వహించడం కలకలం సృష్టించింది. మూడు రోజులుగా గ్రామంలోని కృష్ణానది ఒడ్డున ప్రైవేట్ ట్రావెల్స్కు చెందిన స్థలంలో పూజలు జరగడంపై స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరావు రహస్యంగా పూజల్లో పాల్గొనడంపై విస్మయం వ్యక్తమవుతోంది. పూజలకు ఆయన తన కారులో కాకుండా వేరే కారులో వెళ్లడం పలు అనుమానాలకు దారితీసింది. తాంత్రిక పూజలు తెలిసిన వ్యక్తులు, పూజారులు, హిజ్రాలతో పూజలు చేయించారనే ప్రచారం జరుగుతోంది. ఏ కార్యక్రమం చేసినా ప్రచారం కోరుకునే ఉమా పార్టీ నాయకులు, అధికారులతో పాటు ఎవరికీ తెలియకుండా అర్ధరాత్రి రహస్య పూజలు చేయడం అనుమానాలకు బలం చేకూర్చింది. పూజల అనంతరం గొల్లపూడి సమీపంలో కృష్ణానది మధ్యన లంక ప్రదేశంలో ఉన్న ఆలయంలో కూడా పూజలు చేసినట్లు తెలిసింది. గతంలో కూడా ఇటువంటి తాంత్రిక పూజలు వివిధ ప్రాంతాల్లో ఉమా చేయించారని చెబుతున్నారు. పూజల వ్యవహారం బయట పడటంతో చివరి రోజు పార్టీ నాయకులను భోజనాలకు ఆహ్వానించారు. టీడీపీ నాయకుడి కుమారుడి వివాహం సందర్భంగా శాంతి పూజలని, పితృ దేవతలకు పిండ ప్రదానమని, చంద్రబాబునాయుడు ఆరోగ్యం కోసమని పొంతన లేని సమాధానాలు చెబుతుండటం గమనార్హం. -
వామ్మో..! క్షుద్ర పూజల కోసం 'కస్తూరి పిల్లి' అవయవాలు.. అంతలోనే..
హైదరాబాద్: క్షుద్రపూజల కోసం కస్తూరి పిల్లికి సంబంధించిన అవయువాలను తరలిస్తున్న వ్యక్తిని శంషాబాద్ ఎయిర్పోర్టులో సీఐఎస్ఎఫ్ అధికారులు అదుపులోకి తీసుకుని అటవీశాఖ అధికారులకు అప్పగించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. ఆదివారం తెల్లవారు జామున సయ్యద్ అక్బర్ పాషా అనే వ్యక్తి ముంబై వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చాడు. లగేజీ స్క్రీనింగ్లో అనుమానిత వస్తువులు కనిపించడంతో సీఐఎస్ఎఫ్ అధికారులు వాటిని విప్పి చూడగా, కస్తూరి పిల్లికి సంబంధించిన అవయవాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా క్షుద్ర పూజల కోసం వాటిని తీసుకెళుతున్నట్లు తెలిపారు. కస్టమ్స్ అధికారులు అతడిని అటవీ శాఖ అధికారులకు అప్పగించడంతో వారు అతడిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే అతడు వీటిని ఎక్కడి నుంచి తీసుకొచ్చాడనే దానిపై దర్యాప్తు చేపట్టారు. కస్తూరి పిల్లి శేషాచలం అటవీ ప్రాంతంతో పాటు హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, టిబెట్ ప్రాంతాల్లో మాత్రమే ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. కస్తూరి పిల్లి అవయవాలను సుగంధ పరిమళాల ఉత్పత్తుల తయారీలో.. కొన్ని రకాల ఔషధాల్లో వినియోగిస్తున్నట్లు తెలిసింది. -
హైదరాబాద్లో క్షుద్రపూజలు.. నకిలీ ఆయుర్వేద వైద్యుడి అరెస్ట్
హైదరాబాద్: వైద్యం పేరుతో క్షుద్ర పూజలు చేస్తున్న నకిలీ డాక్టర్ను ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకుని పీఎస్లో అప్పగించారు. సీఐ అంజిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం వనస్థలిపురం సాహెబ్ నగర్లో నివాసం ఉంటున్న దేవులపల్లి కార్తీక్ రాజు ఈ నెల 13న తలనొప్పి, నరాల బాధతో ఎల్బీనగర్లోని సిరీస్ రోడ్లోని సిరినగర్ కాలనీలో ఉన్న జీఎన్ఆర్ ఆయుర్వేదిక్ సెంటర్కు వచ్చాడు. అక్కడ జ్ఞానేశ్వర్ అనే నకిలీ డాక్టర్ కార్తీక్రాజును పరీక్షించి మందులు ఇవ్వకుండా...నీకు చేతబడి చేశారని, పూజలు చేయాలంటూ సలహా ఇచ్చాడు. 22వ తేదీన అమావాస్య నాడు పూజలు జరిపిస్తానని చెప్పి రూ.50 వేలు వసూలు చేశాడు. ఇతని తీరుపై అనుమానం వచ్చిన బాధితుడు ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు పోలీసులు ఆదివారం జీఎన్ఆర్ ఆయుర్వేదిక్ హస్పిటల్పై దాడి చేసి జ్ఞానేశ్వర్ను అదుపులోకి తీసుకుని..అతని వద్ద నుంచి క్షుద్ర పూజలకు సంబంధించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఎల్బీనగర్ పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కామ మాంత్రికుడికి టీడీపీ నేతల పరామర్శ
రేణిగుంట(తిరుపతి జిల్లా): రేణిగుంట మండలం తారకరామానగర్లో క్షుద్రపూజల పేరుతో ఓ మహిళపై బలాత్కారానికి యత్నించిన కామ మాంత్రికుడు సుబ్బయ్యను బుధవారం టీడీపీ నేతలు తిరుపతి సబ్ జైల్లో పరామర్శించడంపై స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు. టీడీపీ ఎస్టీ సెల్ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడిగా ఉన్న సుబ్బయ్య శ్రీకాళహస్తి పట్టణం బహదూర్పేటలో భూత మాంత్రికుడి అవతారం ఎత్తి దాదాపు పదేళ్ల నుంచి మంత్రాలు, తాయత్తులు కడుతూ ప్రజల మూఢ విశ్వాసాలను సొమ్ముచేసుకునే వాడు. తాంత్రిక పూజల ముసుగులో అతని అకృత్యాలు నిత్యకృత్యమైనా.. ఎవ్వరూ అతనిని ఎదిరించేందుకు సాహసించలేదు. ఈ క్రమంలో ఈ నెల 14న రేణిగుంట మండలం తారకరామానగర్లో క్షుద్రపూజల నెపంతో ఓ మహిళను నగ్నంగా పూజలో కూర్చోవాలని బలవంతం చేసి ఆమె నిరాకరించడంతో బలాత్కారం చేశాడు. ఈ ఘటనతో బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు సుబ్బయ్యను అరెస్ట్ చేసి కటకటాల వెనక్కు నెట్టారు. కాగా, సబ్ జైల్లో ఉన్న నిందితుడు సుబ్బయ్యను బుధవారం టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డివారి గురవారెడ్డి, టీడీపీ పార్లమెంట్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు శ్రీపతిబాబు, రాష్ట్ర టీడీపీ ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి మనోహర్నాయక్, అమాస శివకుమార్లు కలిసి అరగంటకు పైగా అతనితో మంతనాలు జరిపారు. పార్టీ అధినాయకత్వం అండగా నిలుస్తుందని ఆయనకు భరోసా ఇచ్చారు. మహిళపై అకృత్యానికి పాల్పడి అరెస్టయిన సుబ్బయ్యను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారని టీడీపీ వర్గాలే భావించాయి. అయితే అనూహ్యంగా జైల్లో ఉన్న అతన్ని కలిసి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇవ్వడంపై టీడీపీ శ్రేణులే నివ్వెరపోతున్నాయి. మరీ ముఖ్యంగా మహిళలు చీదరించుకుంటున్నారు. టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి బొజ్జల సుదీర్రెడ్డి బలహీనతలు సుబ్బయ్యకు బాగా తెలుసని, అవెక్కడ బయటపడతాయోనని పార్టీ వర్గాలు అతన్ని కాపాడే ప్రయత్నాలు చేస్తున్నాయని ప్రచారం సాగుతోంది. -
భర్తను చంపేందుకు స్వామిజీతో కలిసి భార్య స్కెచ్
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
భువనగిరిలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలి
24గంటలూ పోలీసు నిఘా
మోదీ మళ్లీ వస్తే ప్రజాస్వామ్యం ఖూనీ
ఫ సిద్ధమవుతున్న పోలింగ్ కేంద్రాలు
రెండో విడత ర్యాండమైజేషన్
పట్టభద్రుల స్థానానికి మూడో రోజు నలుగురు నామినేషన్లు
ఉపాధి పనులకు వెళ్లిన వ్యక్తి వడదెబ్బతో మృతి
మహిళ మృతదేహం లభ్యం
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
బాబుకు భంగపాటు
తప్పక చదవండి
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement