-
ఒడిశా బాలికపై ఇద్దరు అత్యాచారం
మంచాల: పొట్టకూటి కోసం ఇటుక బట్టీల్లో పనిచేసేందుకు వచ్చిన ఒడిశా బాలికపై ఇద్దరు యువకులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. మంచాల మండల పరిధిలోని బోడకొండ గ్రామంలో సోమవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. బోడకొండలో కొన్నేళ్లుగా ఒడిశా రాష్ట్రంలోని బాలంగీర్ జిల్లా తురేకాన్ మండలం శ్యామల గ్రామానికి చెందిన పలువురు కూలీలు పని చేస్తున్నారు. అయితే, గ్రామానికి చెందిన యువకులు శ్రీను, మహేందర్ కూడా బట్టీలో పని చేస్తున్నారు. సోమవారం రాత్రి ఒడిశా రాష్ట్రానికి చెందిన బాలిక(15)పై వీరు అత్యాచారానికి పాల్పడ్డారు. రాత్రి చీకటి సమయం కావడంతో కూలీలు భయపడి మిన్నకుండిపోయారు. మంగళవారం ఉదయం జరిగిన సంఘటనపై కూలీలు బట్టీ యాజమాన్యంతో గొడవపడ్డారు. తాము ఇక్కడ ఉండమని, రక్షణ లేదని వెళ్లిపోవడానికి సిద్ధమయ్యారు. దీంతో వారు కూలీలకు సర్ది చెప్పి కొంత డబ్బు ఇస్తామని ఆశచూపారు. ఈ విషయం బయటకు పొక్కడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. వివరాలను సేకరించి నిందితులపై కేసు నమోదు చేశారు. బాధితురాలైన బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారు. -
పట్టపగలు అత్యంత నీచంగా లైంగిక వేధింపులు
-
ఒడిశా బాలికకు ఆరు లక్షల గూగుల్ అవార్డు
భువనేశ్వర్: ఐడియా రావాలిగానీ జీవితాలను మార్చివేసే ఆవిష్కరణలను చేయవచ్చని ఒడిశాలోని కోరాపుట్కు చెందిన 13 ఏళ్ల విద్యార్థిని లలిత ప్రసిద శ్రీపాద శ్రీసాయి నిరూపించారు. పర్యావరణ పరిరక్షణ పద్ధతిలో వాటర్ ప్యూరిఫైయర్ సాంకేతిక పరిజ్ఞానాన్ని సృష్టించినందుకుగాను ఆమె మంగళవారం కాలిఫోర్నియాలో జరిగిన ‘గూగుల్ సైన్స్ ఫేర్’లో ఆరు లక్షల రూపాయల నగదు అవార్డును అందుకున్నారు. ఆ బాలిక కనుగొన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఓ ప్రాజెక్టు కింద అభివృద్ధి చేసేందుకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తామని ఈ సందర్భంగా గూగుల్ యాజమాన్యం ప్రకటించడం ముదావహం. ఆమె కనుగొన్న ప్యూరిఫైయర్ ప్రక్రియ శ్రీసాయికి ఓ రోజున హఠాత్తుగా ఓ ఐడియా తట్టింది. వెంటనే తన ఇంటికి సమీపంలోని పొలానికి వెళ్లింది. అక్కడ వృధాగా పడేసిన గింజలు వలిచేసిన మొక్కజొన్న కంకులను సేకరించింది. వాటిని తీసుకొచ్చి దాదాపు నెల రోజుల పాటు ఎండపెట్టింది. ఓ పొడవాటి మొక్కజొన్న కంకి మధ్య గుండా నీళ్లు పోవడానికి వీలుగా ఓ రంధ్రం చేసింది. దాన్ని జగ్గులాంటి ల్యాబ్ బాటిల్లో అమర్చింది. ఆ బాటిల్ కింద మరో నాలుగు బాటిళ్లను ఏర్పాటు చేసి, వాటిలో చిన్నగా కత్తిరించిన మొక్కజొక్క కంకి ముక్కలను వేసింది. ఇంటి ముందున్న మురికి కాల్వ నుంచి మురికి నీటిని తీసుకొచ్చి పైనున్న జగ్గులాంటి బాటిళ్లో పోసింది. అది కంకి రంధ్రం గుండా ప్రవహించి మిగతా నాలుగు బాటిళ్ల ద్వారా ఫిల్టర్ అవుతూ కిందనున్న గిన్నలోకి నీళ్లు చేరాయి. ఆశ్చర్యం, పైన పోసిన మురికి నీరు కాస్త 80శాతం ఫిల్టరై అడుగునున్న గిన్నెలో పడ్డాయి. మురికి నీటిలో ఉండే రకరకాల లవణాలు, ఆమ్లాలు, డిటర్జెంట్స్, రంగులు, చమురు మొక్కజొన్న కంకులు పీల్చుకోగా స్వచ్ఛమైన నీరు అడుగుకు చేరుకొంది. ఎలాంటి విద్యుత్, అంటే కరెంట్, బ్యాటరీలు అవసరం లేకుండా, కానీ ఖర్చు లేకుండా నీటిని ఇలా ప్యూరిఫై చేసుకోవచ్చని శ్రీసాయి నిరూపించింది. పైగా వృధాగా పడేసే కంకులను ఇలా ఉపయోగించడం పర్యావరణానికి అనుకూలం కూడా. 13 నుంచి 18 ఏళ్ల క్యాటగిరీలో శ్రీసాయికి ఈ అవార్డు లభించింది. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఎంట్రీలలో నూతన ఆవిష్కరణలకుగాను మరికొంత మందికి కూడా శ్రీసాయితోపాటు అవార్డులు అందజేశారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్మన్ గిల్కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement