-
Manipur Violence: నిరసనలతో దద్దరిల్లిన ఇంఫాల్
ఇంఫాల్: మణిపూర్లో యువ జంట హత్యతో మొదలైన నిరసనలు గురువారం సైతం కొనసాగాయి. ఆందోళనకారులు ఇంఫాల్ వెస్ట్లోని డిప్యూటీ కమిషనర్ కార్యాలయంపై దాడికి దిగారు. అక్కడున్న రెండు కార్లకు నిప్పుపెట్టారు. సీఆర్పీఎఫ్ బలగాలు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. బుధవారం రాత్రి పలు చోట్ల నిరసనకారులు భద్రతా బలగాలపై దాడులకు దిగారు. దీంతో, బలగాలు టియర్ గ్యాస్ను ప్రయోగించాల్సి వచ్చిందని అధికారులు చెప్పారు. పోలీసు వాహనానికి నిప్పుపెట్టడంతోపాటు పోలీసు వద్ద ఉన్న ఆయుధాన్ని లాక్కెళ్లారు. థౌబల్ జిల్లా ఖొంగ్జమ్లో బీజేపీ కార్యాలయానికి దుండగులు నిప్పుపెట్టారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో అధికారులు ఇంఫాల్ ఈస్ట్, వెస్ట్ ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. గురువారం రాత్రి సీఎం బిరేన్ సింగ్ పూరీ్వకుల ఇంటిపై దాడికి జరిగిన ప్రయత్నాన్ని పోలీసులు వమ్ము చేశారు. మా వాళ్ల మృతదేహాలు ఎక్కడున్నాయో గుర్తించండి దుండగుల చేతుల్లో దారుణ హత్యకు గురైన తమ పిల్లల మృతదేహాల జాడ చెబితే అంత్యక్రియలు జరుపుకుంటామని వారి తల్లిదండ్రులు పోలీసులను కోరారు. మెయితీ వర్గానికి చెందిన యువతి, యువకుడు జూన్లో గుర్తు తెలియని దుండగుల చేతుల్లో హత్యకు గురి కావడం, వారి ఫొటోలు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షం కావడం తెలిసిందే. ఈ హత్య ఘటన మణిపూర్లో మరోసారి ఉద్రిక్తతలకు కారణమైంది. మెయితీల ఆచారం ప్రకారం..అంతిమ సంస్కారాలు జరపడానికి మృతులు ధరించిన దుస్తులకు సంబంధించిన చిన్న గుడ్డ ముక్కయినా ఉండాలి. అంత్యక్రియలు జరిపేవరకు వారి ఫొటోల వద్ద మృతుల తల్లులు అగరొత్తులు, క్యాండిల్ వెలిగిస్తూ రోజూ ఆహారం నివేదన చేస్తూ ఉండాలి. వారి లేని లోటు ఎవ్వరూ పూడ్చలేరు. కనీసం వారికి తగు గౌరవంతో అంత్యక్రియలు జరపాలనుకుంటున్నామని యువతి తండ్రి హిజామ్ కులజిత్ చెప్పారు. తాజాగా, సీబీఐ దర్యాప్తుతోనయినా తమ కోరిక నెరవేరుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. మణిపూర్కు శ్రీనగర్ ఎస్ఎస్పీ బల్వాల్ బదిలీ న్యూఢిల్లీ: ఉగ్ర సంబంధ కేసులను డీల్ చేయడంలో సమర్థుడిగా పేరున్న శ్రీనగర్ సీనియర్ ఎస్పీ రాకేశ్ బల్వాల్ను కేంద్రం మణిపూర్కు బదిలీ చేసింది. మణిపూర్లో మరోసారి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడం, శాంతిభద్రతలు దారుణంగా దెబ్బతినడంతో కేంద్రం ఈ చర్య తీసుకుంది. 2012 ఐపీఎస్ అధికారి అయిన రాకేశ్ బల్వాల్ను డిసెంబర్ 2021లో అరుణాచల్ప్రదేశ్, గోవా, మిజోరం, కేంద్రపాలిత ప్రాంతాల కేడర్కు మార్చారు. తాజాగా ఆయన్ను మణిపూర్ కేడర్కు మారుస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన హోం వ్యవహారాల శాఖ ప్రతిపాదనకు నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది. మణిపూర్లో ఆయన కొత్త బాధ్యతలను చేపడతారని తెలిపింది. జమ్మూలోని ఉధంపూర్కు చెందిన బల్వాల్ మణిపూర్లోని చురాచంద్పూర్కు 2017లో సీనియర్ ఎస్పీగా పనిచేసిన అనుభవం ఉంది. -
రెచ్చిపోయిన ఉగ్రవాదులు: 14 మంది మృతి
కాబూల్: అఫ్ఘానిస్థాన్లోని ఓ హోటల్లో సాయుధులు తెగబడ్డారు. కాబూల్లోని విదేశీయుల అతిథి గృహంలోకి చొరబడి విచక్షణ రహితంగా కాల్పులకు పాల్పడ్డారు. దీంతో ఇద్దరు భారతీయులు సహా మొత్తం 14 మంది ప్రాణాలు కోల్పోయారు. భారతీయ మృతులు ఇద్దరిలో ఒకరు తెలుగువారు కూడా ఉన్నట్లు అనధికారికంగా సమాచారం వచ్చింది. దీన్ని ఇంకా ఎవరూ నిర్ధారించలేదు. పార్క్ ప్యాలెస్ హోటల్ అనే భవనాన్ని వారు లక్ష్యంగా చేసుకొని దాడికి పాల్పడ్డారు. ఉగ్రవాదులను కూడా పోలీసులు హతమార్చారు. కాబూల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇప్పటికీ తాలిబన్లు స్థావరాలు ఏర్పాటు చేసుకునే ఉన్నారు. దీంతో కాబూల్ లక్ష్యంగా ఇటీవలి కాలంలో దాడులు ఎక్కువయ్యాయి. అందులోనూ విదేశీయులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతున్నారు. ఈ హోటల్లో సాయుధుల చెరలో చాలామంది ఉన్నారు. వీరిలో ఎక్కువమంది భారతీయులు, ఇతర దేశీయులే ఉన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ అందరి క్షేమం ఆకాంక్షించారు. వారికి ఎలాంటి హాని జరగకుండా సురక్షితంగా బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆయన చైనా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. -
కేజ్రీవాల్కు జెడ్ కేటగిరి భద్రత?
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రధాన కార్యాలయంపై దాడి నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు జెడ్ కేటగిరి భద్రత కల్పించాలని ఉత్తరప్రదేశ్ సర్కారు భావిస్తోంది. జమ్మూకాశ్మీర్లో రిఫరెండం నిర్వహించాలన్న ఆప్ నేత ప్రశాంత్ భూషణ్ వ్యాఖ్యలకు నిరసనగా హిందు రక్షాదళ్ కార్యకర్తలు ఈ దాడికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్కు జెడ్ కేటగిరి భద్రత కల్పించాలని యూపీ ప్రభుత్వం భావిస్తోంది. కేజ్రీవాల్ భద్రతకు సంబంధించి ఎటువంటి రిస్క్ తీసుకోకూడదని, ఏదైనా అనుకోని సంఘటన జరిగితే యూపీ పోలీసులపైనే విమర్శలు వస్తాయని ఉన్నతాధికారులు ఆందోళన చెందుతున్నారు. దీంతో జెడ్ కేటగిరి భద్రతను తీసుకునే విధంగా ఢిల్లీ సీఎంను ఒప్పించాలని వారు భావిస్తున్నారు. గతంలో కేజ్రీవాల్కు, ఆప్ కార్యాలయానికి యూపీ పోలీసులు భద్రత ఇచ్చేందుకు ముందుకొచ్చినా.. దానిని ఆయన తిరస్కరించిన విషయం తెలిసిందే. -
ఆప్ కార్యాలయంపై దాడి
సాక్షి, న్యూఢిల్లీ: కౌశంబీలోని ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాల యం పై హిందూ రక్షా దళ్కు చెందిన కొందరు వ్యక్తులు బుధవారం ఉదయం దాడిచేశారు. ఎర్ర జెండాలు, లాఠీలతో ఆప్ కార్యాలయానికి వచ్చిన కొందరు వ్యక్తులు ఆప్ కార్యాలయం బయట ఉన్న పూల కుం డీలు ధ్వంసం చేశారు. కిటికీల అద్దాలు పగులగొట్టారు. ఆప్ నేత ప్రశాంత్ భూషణ్ కాశ్మీర్ైలో సైన్యం ఉపసంహరణపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈ దాడి జరిగింది. దాడికి పాల్పడినవారిలో ఒకడైన పింకీ చౌదరిని సాహిబాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. కౌశంబీలో ఆప్కు మూడంతస్తుల కార్యాల యం ఉంది. ఇది ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి చాలా దగ్గరలో ఉంది. ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో నాలుగైదు వాహనాలలో వచ్చిన వ్యక్తులు ప్రశాంత్భూషణ్కు, అరవిం ద్ కేజ్రీవాల్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ జైశ్రీరామ్ అంటూ కార్యాలయంపై దాడిచేశారు. ఆ సమయంలో కార్యాలయంలో కొద్దిమంది మాత్రమే కార్యకర్తలు ఉన్నారు. కానీ దాడిలో వారెవరికీ గాయాలు కాలేదు. దాడికి వచ్చిన వారిని చూసిన కార్యకర్తలు వెంటనే లోపలికి వెళ్లి తలుపులు మూసుకున్నారు. సుమారు 50 మంది లాఠీలు, కర్రలతో హఠాత్తుగా కార్యాలయంలోకి ప్రవేశించి దాడిచే శారని ఆప్ ప్రతినిధి దిలీప్ పాండే చెప్పారు. మరికొందరు ఇటుకలు, రాళ్లు కూడా విసిరారని ఆయన చెప్పారు. ఆ సమయంలో అక్కడ ఉన్న ఆప్ కార్యాకర్తలు లోపలకు పరుగెత్తి తలుపులు మూసుకుని పై అంతస్తుకు వెళ్లిపోయారని ఆయన చెప్పా రు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని ఆయన చెప్పారు. సీసీటీవీ పుటేజ్ ద్వారా ఆప్ కార్యాలయంపై దాడిచేసిన వారి ని గుర్తించామని, వారిని అదుపులోకి తీసుకునేందు కు ప్రయత్నిస్తున్నామని ఘజి యాబాద్ ఎస్ఎస్పీ ధర్మేందర్ సింగ్ చెప్పారు. దాడికి పాల్పడినవారు వచ్చిన వాహనాల నంబర్ల ను కూడా నమోదు చేసుకున్నట్లు ఆయన చెప్పారు. దాడి ఘటనలో ప్రధాన నిందితుడైన పింకీ చౌదరితో పాటు మరో 12మందిని సాహిబాబాద్లో యూపీ పోలీసులు అరెస్టుచేశారు. కాగా, కార్యాలయంపై దాడిని తామే చేసినట్లు హిందూ రక్షా దళ్ అధ్యక్షుడు విష్ణు గుప్తా అంగీకరించారు. కాశ్మీర్పై ప్రశాంత్ భూషణ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా తాము ఈ దాడికి పాల్పడినట్లు ఆయన చెప్పారు. ప్రశాంత్ భూషణ్ను వెంటనే ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో కూడా తాను ప్రశాంత్భూషణ్పై దాడికి పాల్పడినట్లు ఆయన చెప్పారు. స్థానిక భజరంగ్ దళ్, శ్రీరామ్ సేన కార్యకర్తలు కూడా ఈ దాడిలో పాల్గొన్నట్లు గుప్తా చెప్పారు. అయితే ఈ దాడితో తమకు సంబంధం లేదని భజరంగ్ దళ్ తెలిపింది. కాశ్మీర్లో సైన్యం ఉండా లా వ ద్దా అన్న దానిపై ప్రజాభిప్రాయసేకరణ జరపాలని, సైన్యం ఉండనవసరం లేదని కాశ్మీరీలు అభిప్రాయపడినట్లయితే సైన్యాన్ని అక్కడ నుంచి తొలగించాలని భూషణ్ ఇటీవల ఓ టీవీ కార్యక్రమంలో చెప్పారు. కాగా, అది ప్రశాం త్ భూషణ్ వ్యక్తగత అభిప్రాయమని, కాశ్మీర్లో ఎలాంటి ప్రజాబిప్రాయ సేకరణను ఆమ్ ఆద్మీ పార్టీ కోరడం లేదని ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇదివరకే స్పష్టం చేశారు. భద్రత పెంపు ఆప్ కార్యాలయంపై జరిగిన దాడితో కౌశంబీలోని అరవింద్ కేజ్రీవాల్ నివాసం, పార్టీ కార్యాలయాల వద్ద యూపీ పోలీసులు భద్రత పెంచారు. ప్రశాంత్ భూషణ్ కార్యాలయం వద్ద సైతం భద్రతను పటిష్టం చేశా రు. ఢిల్లీ సచివాలయంలో ఎస్ఎస్బీ జవాన్లను మోహరించారు. జనతా దర్బార్ కోసం తెరచిన గేట్ నంబర్ 4 వద్ద ఎస్ఎస్బీ జవాన్లను మోహరించడంతో పాటు బారికేడ్లను అమర్చారు. ఇదిలా ఉండగా దాడి తర్వాత కూడా భద్రతను స్వీకరించడానికి కేజ్రీవాల్ నిరాకరించారు. తనకు భద్ర త అవసరం లేదని, ఇలాంటి దాడుల ముసుగులో భద్రతను పెంచుకోవడాన్ని తాను వ్యతిరేకిస్తానని ఆయన స్పష్టం చేశారు.అయితే భద్రత తీసుకోవాలా లేదా అనేదానిపై కార్యకర్తల అభిప్రాయం తెలసుకుంటానని, వారు అంగీకరిస్తే కార్యాలయం లో భద్రత కోరుతానని కేజ్రీవాల్ చెప్పారు. కాగా ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయంపై జరిగిన దాడిని ఆ పార్టీతో పాటు కాంగ్రెస్, బీజేపీ, ఆర్ఎస్ఎస్లు ఖండించాయి. ‘ప్రశాంత్’వ్యాఖ్యలపై భజరంగ్దళ్ ఆందోళన జమ్మూకాశ్మీర్ అంశంపై ఆమ్ఆద్మీపార్టీ నాయకుడు ప్రశాంత్భూషన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు కారణమవుతున్నాయి. ప్రశాంత్భూషన్ వ్యాఖ్యలను నిరసిస్తూ భజరంగ్దళ్ సభ్యులు బుధవారం జంతర్మంతర్లో ఆందోళన నిర్వహించారు. ప్రశాంత్భూషన్పై చర్యలు తీసుకోవాలంటూ వా రు రాష్ట్రపతికి ఓ లేఖ రాశారు. జంతర్మంతర్లో ప్రదర్శనలో భాగంగా ఆమ్నేత కే జ్రీవాల్,ప్రశాంత్భూషణ్ ఫొటోలను దహ నం చేశారు. భజరంగ్దళ్ ఢిల్లీ నాయకులు శివ్కుమార్ ఈ ఆందోళనకు నేతృత్వం వహించారు. జమ్మూకాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమని, దాని పై అనుచిత వ్యాఖ్యలు చేసేవారంతా దేశద్రోహులుగానే పరిగణిస్తామని ఆయన పేర్కొన్నారు. దేశప్రజలకు ప్రశాం త్భూషణ్తోపాటు ఆప్ నాయకులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లోనూ ఇదే అంశంపై నిరసన ప్రదర్శనలు కొనసాగాయి. దుండగులకు బీజేపీతో సంబంధాలు ప్రశాంత్ భూషణ్ విమర్శ ఆప్ కార్యాలయంపై దాడికి పాల్పడిన వారికి భారతీయ జనతాపార్టీతో సంబంధాలున్నాయి. ఆప్కు పెరుగుతున్న ప్రజాదరణ చూసి భయంతోనే బీజే పీ, సంఘ్పరివార్ ఇలా పరోక్షంగా దాడులకు దెగబడుతున్నాయి. ఇప్పటి దాడికి పాల్పడినట్లు చెప్పుకుంటున్న విష్ణు గుప్తా 2011లో తేజేందర్ సింగ్ బగ్గాతో కలిసి సుప్రీం కోర్టులోని నా చాంబర్లోనే నాపై దాడికి పాల్పడ్డారు. బగ్గాకు బీజేపీకి చాలా సన్నిహితమైన వ్యక్తి. బీజేపీ హస్తముంది: కుమార్ విశ్వాస్ దాడిలో బీజేపీ హస్తముంది. ఢిల్లీ ఎన్నికల్లో వారు ఊహించిన దానికి వ్యతిరేకంగా జరగడంతో, ఇప్పు డు లోక్సభ ఎన్నికల్లో కూడా అదే పరిస్థితి ఎదురవుతుందనే భయంతోనే ఆప్ కార్యాలయంపై దాడిచేయించారు. ఇది కరెక్ట్ కాదు... ఎవరి వ్యాఖ్యలైనా నచ్చకపోతే ఆందోళనలు చేయొచ్చు.. ధర్నాలు నిర్వహించవచ్చు.. లేదా కోర్టుకు వెళ్లవచ్చు.. అంతేకాని భౌతిక దాడులకు దిగడం వల్ల సమస్య మరింత జటిలమవుతుందే తప్ప పరిష్కారం కాదు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి: బీజేపీ నే అబ్బాస్ నఖ్వీ ఆప్ కార్యాలయంపై దాడిని ఖండిస్తున్నాం. నింది తులు ఎవరైనా సరే.. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందే. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే హక్కు ఎవరికీ లేదు. అలాగే ప్రశాంత్ భూషణ్ వ్యాఖ్యలపై మేం ఇంతకుముందే స్పందించాం. ఆయన వ్యాఖ్యలు దేశ సమగ్రత ముప్పు అని అప్పుడే వ్యాఖ్యానించాం. దాడి అహేతుకం: కాంగ్రెస్ నేత రాషిద్ అల్వీ ఆప్ కార్యాలయంపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. చట్టాన్ని ఎవరు అతిక్రమించినా చర్యలు తీసుకోవాల్సిందే. శాంతి భద్రతల విషయంలో యూపీ ప్రభుత్వం మరింత జాగ్రత్తగా వ్యవహరిం చాలి. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలి. ఎవరిని చంపాలనుకుంటున్నారు..? ఆప్ కార్యాలయంపై దాడి హేతుకం కాదు. హింసతో సమస్యలు పరిష్కా రం కావు. దాడికి పాల్పడిన వారు నాతో చర్చకు రావాలి. వారు ఏం కోరుకుంటున్నారు.. ప్రశాంత్జీని చంపాలనుకుంటున్నారా..లేక నన్ను చంపాలనుకుం టున్నారా.. మమ్మల్ని చంపడం ద్వారా కాశ్మీర్ సమస్య పరిష్కా రం అవుతుందనుకుంటే చావడానికి మేం సిద్ధం. కాశ్మీర్ సమస్యపై ప్రశాంత్ జీ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని, దానికి పార్టీతో ఎటువంటి సంబంధం లేదని మేం పార్టీ తరఫున ఎన్నో సార్లు స్పష్టం చేశాం. అయి నా ఇంకా వారు దాడులు కొనసాగిస్తున్నారు అంటే వివాదాన్ని సజీవంగా ఉంచడం కోసమే వారు ఇలా ప్రవర్తిస్తున్నారనిపిస్తోంది. దీనిపై చర్చకు రమ్మంటే ఎక్కడకు రమ్మన్నా రావడానికి నేను సిద్ధం..
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
ప్రశాంతంగా జాతర జరుపుకోవాలి
నేరచరిత లేనివారిని బైండోవర్ చేయొద్దు
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
టమాట సీజన్ ప్రారంభం
No Headline
కూడేరులో జూనియర్ కాలేజ్ ఏర్పాటు
బాధ్యతగా విధులు నిర్వర్తించండి
ఆ ఇద్దరు టీచర్లపై విద్యాశాఖ ప్రేమ
ఆకట్టుకున్న మాక్డ్రిల్
27 నుంచి విజయవాడ రైలు రద్దు
తప్పక చదవండి
- భూతల్లి పై ఒట్టేయ్...
- ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్లో..?
- పేటీఎంకు పెరిగిన నష్టాలు
- Lok Sabha Election 2024: కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు పాకిస్తాన్ సానుభూతిపరులు
- పాలస్తీనా స్వతంత్ర దేశం
- సోనియాను ఏ ప్రాతిపదికన, ఎలా పిలుస్తారు? : జి.కిషన్రెడ్డి
- విమానంలో స్టాండింగ్
- ఇబ్రహీం రైసీకి ఇరాన్ వీడ్కోలు
- సన్న విత్తనాలు సిద్ధం
- ‘పంటల బీమా’కి రూ.3 వేల కోట్లు
Advertisement