-
భారత ఆర్థిక వ్యవస్థకు చమురు సెగ!
లండన్: అంతర్జాతీయ మార్కెట్ బ్రెంట్ ధర బేరల్కు గురువారం మూడేళ్ల గరిష్టస్థాయి 77.75 డాలర్లను తాకింది. ఈ వార్త రాస్తున్న రాత్రి 9.30 గంటల సమయంలో ఇదే రేటు వద్ద ట్రేడవుతోంది. ఇక నైమెక్స్ క్రూడ్ కూడా 74.75 వద్ద గరిష్ట స్థాయిల వద్ద ట్రేడవుతోంది. మధ్య ప్రాశ్చ్య దేశాల్లో ఉద్రిక్తతలు, అమెరికాలో పెరిగిన క్రూడ్ డిమాండ్, క్రూడ్ 100 డాలర్లకు చేరాలని సౌదీ అరేబియా భావిస్తున్నట్లు వస్తున్న వార్తలు ఈ కమోడిటీ పరుగుకు దారితీస్తున్నాయి. తన చమురు అవసరాల్లో 80 శాతం దిగుమతులపై ఆధారపడే భారత్ ఆర్థిక వ్యవస్థపై క్రూడ్ ధరల పెరుగుదల తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఎగుమతులు–దిగుమతులకు మధ్య వ్యత్యాసం వాణిజ్యలోటు, తద్వారా క్యాడ్ (ఎఫ్డీఐ, ఎఫ్ఐఐ, ఈసీబీలు మినహా దేశానికి వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్య నిల్వల మధ్య నికర వ్యత్యాసం) ప్రతికూలతలు, ఈ నేపథ్యంలో డాలర్ మారకంలో రూపాయి బలహీనతలు, స్టాక్ మార్కెట్లో తీవ్ర అనిశ్చితి పరిస్థితులు భారత్ ఆర్థిక వ్యవస్థలో ఇప్పటికే కనబడుతున్న సంగతి తెలిసిందే. చతికిలపడిన చమురు షేర్లు... చమురు ధరల పెరుగుదల నేపథ్యంలో ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు–బీపీసీఎల్, హెచ్పీసీఎల్, ఐఓసీ 4–7 శాతం రేంజ్లో పతనమయ్యాయి. ఇంట్రాడేలో హెచ్పీసీఎల్, బీపీసీఎల్, ఎమ్ఆర్పీఎల్ షేర్లు ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. -
సబ్సిడీ తోడ్పాటుతో బీపీసీఎల్కు లాభాలు
నికర లాభం రూ.551 కోట్లు న్యూఢిల్లీ: భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్) ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలానికి రూ.551 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఇంధన అమ్మకాలపై వచ్చిన నష్టాలకు పూర్తి పరిహారం లభించడమే దీనికి కారణమని వివరించింది. అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా తగ్గడంతో నిల్వ నష్టాలు రూ.1,600 కోట్లుగా ఉన్నప్పటికీ ఈ స్థాయి నికర లాభం సాధించామని బీపీసీఎల్ పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం రూ.1,080 కోట్ల నగదు సబ్సిడీని, ఓఎన్జీసీ వంటి అయిల్ అప్స్ట్రీమ్ కంపెనీలు రూ.2,333 కోట్లు చెల్లించాయని వివరించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి రూ.1,089 కోట్ల నికర నష్టాలు వచ్చాయని వివరించింది. గత క్యూ3లో రూ.64,768 కోట్లుగా ఉన్న అమ్మకాలు ఈ క్యూ3లో రూ.57,915 కోట్లకు, స్థూల రిఫైనింగ్ మార్జిన్ 1.76 డాలర్ల నుంచి 1.54 డాలర్లకు తగ్గిందని తెలిపింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేర్ ఎన్ఎస్ఈలో 2.7 శాతం వృద్ధితో రూ.725కు పెరిగింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement