-
గేమింగ్లో భారీ ఉద్యోగాలు
ముంబై: గేమింగ్ పరిశ్రమ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా లక్ష మందికి (ప్రత్యక్షంగా, పరోక్షంగా) ఉపాధి కల్పించొచ్చని టీమ్లీజ్ డిజిటల్ తెలిపింది. ప్రోగ్రామింగ్, టెస్టింగ్, యానిమేషన్, డిజైన్ తదితర విభాగాల్లో ఈ ఉద్యోగాలు వస్తాయని పేర్కొంది. 20–30 శాతం మేర ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధిని సాధిస్తుందని అంచనా వేసింది. ‘గేమింగ్–రేపటి బ్లాక్ బస్టర్’పేరుతో టీమ్లీజ్ డిజిటల్ గురువారం ఒక నివేదికను విడుదల చేసింది. ఇందులోని వివరాల ప్రకారం.. గేమింగ్ పరిశ్రమ ప్రస్తుతం ప్రత్యక్షంగా 50వేల మందికి ఉపాధి కల్పిస్తోంది. ఇందులో 30 శాతం ఉద్యోగాలు ప్రోగ్రామర్లు, డెవలపర్ల రూపంలోనే ఉన్నాయి. వచ్చే ఏడాది కాలంలో ఈ రంగంలో గేమ్ డెవలపర్లు, యూనిటీ డెవలపర్లు, గేమ్స్ టెస్ట్ ఇంజనీర్లు, క్యూఏ హెడ్లు, యానిమేటర్లు, మోషన్ గ్రాఫిక్ డిజైనర్లు, వర్చువల్ రియాలిటీ డిజైనర్లు, వీఎఫ్ఎక్స్, కాన్సెప్ట్ ఆర్టిస్ట్లకు డిమాండ్ ఉంటుంది. అధిక వేతనం.. ఈ రంగంలో అత్యధికంగా గేమ్ ప్రొడ్యూసర్లకు రూ.10 లక్షల వార్షిక వేతనం ఉంటే.. గేమ్ డిజైనర్లకు 6.5 లక్షలు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు రూ.5.5 లక్షలు, గేమ్ డెవలపర్లు రూ.5.25 లక్షలు, క్వాలిటీ అష్యూరెన్స్ టెస్టర్లకు రూ.5.11 లక్షల చొప్పున వార్షిక ప్యాకేజీలున్నాయి. ‘‘గేమింగ్ పరిశ్రమ తదుపరి ఉదయించే రంగం. యూజర్ల సంఖ్య పెరుగుతుండడంతో ఈ రంగంలో ఉపాధి అవకాశాలు వెల్లువలా రానున్నాయి. తరచూ నియంత్రణపరమైన నిబంధనల మార్పు రూపంలో అడ్డంకులు ఎదురవుతున్నప్పటికీ.. గేమింగ్ పరిశ్రమ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా లక్ష మందికి ఉపాధినిస్తుంది. 2026 నాటికి 2.5 రెట్లు వృద్ధి చెందుతుంది’’అని టీమ్లీజ్ డిజిటల్ సీఈవో సునీల్ చెమ్మన్కోటిల్ తెలిపారు. 2026 నాటికి గేమింగ్ పరిశ్రమ రూ.38,097 కోట్లకు చేరుతుందని టీమ్లీజ్ అంచనా వేసింది. ఆదాయం పరంగా భారత్ గేమింగ్ పరిశ్రమ అంతర్జాతీయంగా ఆరో స్థానంలో ఉంది. అంతర్జాతీయంగా ఈ విపణి విలువ రూ.17,24,800 కోట్లుగా ఉంది. -
లక్ష కొలువులేవి?
- ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వాన్ని నిలదీసిన బీజేపీ, కాంగ్రెస్ - ఖాళీ పోస్టుల్లో నియామకాలు ఎందుకు చేపట్టడం లేదు కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఏమైంది? - సర్కారు దాటవేత వైఖరి అవలంబిస్తోంది ..ఏరు దాటాక బోడి మల్లన్న అన్నట్టుగా ఉంది ప్రభుత్వ తీరు - ఎప్పుడు, ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తారో చెప్పాలని డిమాండ్ - మా చిత్తశుద్ధిని శంకించలేరు: మంత్రి ఈటల రాజేందర్ - 11 వేల పోస్టులు భర్తీ చేశాం.. మరో 50 వేల ఉద్యోగాలిస్తాం - శాఖల నుంచి 58,831 ఖాళీలు మాత్రమే అందాయని వివరణ సాక్షి, హైదరాబాద్: ఖాళీ ఉద్యోగాల భర్తీ అంశం అసెంబ్లీని కుదిపేసింది. నీళ్లు, నిధులు, నియామకాల ప్రాతిపదికన ఏర్పడిన తెలంగాణలో నియామకాలను ఎందుకు చేపట్టడం లేదంటూ ప్రభుత్వాన్ని బీజేపీ, కాంగ్రెస్ నిలదీశాయి. ఖాళీ పోస్టులను ఎప్పుడు, ఎలా, ఎన్ని భర్తీ చేస్తారో స్పష్టమైన ప్రకటన చేయాలంటూ పట్టుబట్టాయి. రాష్ట్రం ఏర్పడి 20 నెలలు గడుస్తున్నా కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై ఎందుకు తేల్చడం లేదని ప్రశ్నించాయి. శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయంలో బీజేపీ శాసనసభ పక్ష నేత కె.లక్ష్మణ్, కాంగ్రెస్ సభ్యురాలు డీకే అరుణ ఈ అంశాన్ని లేవనెత్తారు. విపక్షాల విమర్శలను ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తిప్పికొట్టారు. పోస్టుల భర్తీ విషయంలో తమ చిత్తశుద్ధిని ఎవరూ ప్రశ్నించలేరన్నారు. ఇప్పటికే 11 వేల పోస్టులు భర్తీ చేశామని, మరో 18 వేల పోస్టుల భర్తీకి ఆదేశాలిచ్చామని, డీఎస్సీ ద్వారా కొత్తగా 10 వేల పోస్టులు, రెసిడెన్షియల్ స్కూళ్లలో 2,400 పోస్టులను భర్తీ చేస్తామన్నారు. మొత్తంగా 50 వేల ఉద్యోగాలివ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. గత ప్రభుత్వాలు ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులతో వెట్టిచాకిరి చేయించాయని, శ్రమదోపిడీకి గురి చేశాయని విమర్శించారు. ప్రభుత్వ సమాధానంతో సంతృప్తిచెందని బీజేపీ, కాంగ్రెస్ సభ్యులు తమ స్థానాల్లో నిలబడి నిరసన తెలిపారు. ఉద్యోగ భర్తీపై స్పష్టమైన ప్రకటన చేయాలని పట్టుబట్టారు. గతంలో లక్ష ఉద్యోగాలని ఇప్పుడు 57 వేలంటారా?: కె.లక్ష్మణ్ తొలుత ఉద్యోగ ఖాళీలపై బీజేపీ పక్ష నేత కె.లక్ష్మణ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ తీరును విమర్శించారు. ‘‘ఉద్యోగ కల్పనపై ఎన్నిమార్లు అడుగుతున్నా ప్రభుత్వం దాటవేత ధోరణి అవలంబిస్తోంది. నిరుద్యోగ యువత నోటిఫికేషన్ల కోసం వేచి చూస్తోంది. రాష్ట్రంలో ఖాళీ పోస్టులు 1.07 లక్షలు ఉన్నాయని గతంలో చెప్పారు. ఇప్పుడేమో కేవలం 57 వేలు మాత్రమే అంటున్నారు. దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. రేషనలైజేషన్ పేరిట టీచర్ పోస్టులను కుదించారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంశాన్ని పక్కన పెట్టారు. ఏరు దాటే దాకా ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న అన్న చందంగా ప్రభుత్వ వ్యవహార శైలి ఉంది. అలాకాకుండా ఎన్ని ఉద్యోగులను భర్తీ చేస్తారు, ఎంత మంది కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తారు? ఎప్పట్లోగా, ఎలా భర్తీ చేస్తారో ప్రభుత్వం చెప్పాలి’’ అని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. వారందరినీ ఎలా ఆదుకుంటారో చెప్పాలి: డీకే అరుణ ఎన్నికల ముందు ప్రభుత్వం నిరుద్యోగులకు ఎన్నో మాటలు చెప్పిందని కాంగ్రెస్ సభ్యురాలు డీకే అరుణ అన్నారు. ‘‘నిరుద్యోగులకు ఉద్యోగాలిస్తామన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామన్నారు. ఐకేపీ మహిళలు, కాంట్రాక్టు ఉద్యోగులు, కేంద్ర పథకాల పరిధిలో పనిచేసే ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఎందరో ఉద్యమంలో పాల్గొని స్ఫూర్తినిచ్చారు. వారందరినీ ఎలా ఆదుకుంటారో ప్రభుత్వం స్పష్టతనివ్వాలి’’ అని ఆమె పేర్కొన్నారు. మా చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదు: ఈటల విపక్ష సభ్యుల ప్రశ్నలకు మంత్రి ఈటల సమాధానమిచ్చారు. ‘‘రాష్ట్రంలో మొత్తంగా 5,23,679 పోస్టులు ఉండగా.. అందులో 1,07,744 ఖాళీలు ఉన్నాయి. ఇప్పటివరకు ఆయా శాఖల నుంచి 58,831 ఖాళీలు మాత్రమే ప్రభుత్వానికి అందాయి. ఈ విషయంలో అంకెల గారడీ చేయట్లేదు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 11,100 ఉద్యోగాలను భర్తీ చేశాం. మరో 18,423 పోస్టుల భర్తీకి ఆదేశాలు ఇచ్చాం. డీఎస్సీ ద్వారా మరో 10,927 పోస్టులు భర్తీ చేయాలని ఇటీవలే కేబినెట్లో నిర్ణయం చేశాం. మొత్తంగా 50 వేల పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించాం’’ అని తెలిపారు. గతంలో కొన్ని వందలసార్లు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా ఇందిరాపార్క్ వద్ద ధర్నాల్లో పాల్గొన్న తమకే నిరుద్యోగులపై ప్రేమ ఎక్కువుంటందన్నారు. ఉద్యోగాల కల్పనలో తమ చిత్తశుద్ధిని శంకి ంచాల్సిన అవసరం లేదన్నారు. ‘‘కాంట్రాక్టు ఉద్యోగులు క్రమబద్ధీకరణలో ప్రతిబంధకాలను కూడా పరిశీలిస్తున్నాం. వారిని క్రమబద్ధీకరించేందుకు మార్గదర్శకాలు రూపొందించాం. ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా 25,589 మంది కాంట్రాక్టు ఉద్యోగులను గుర్తించాం. కనీస వేతనాలు పెంచడం ద్వారా 50 వేల ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు లబ్ధి చేకూర్చాం. దీనిద్వారా రాష్ట్రంపై రూ.310 కోట్ల భారం పడింది’’ అని వివరించారు. అంగన్వాడీలకు కేంద్రం తన నిధుల్లో కోతలు పెట్టినా రాష్ట్రం పెంచిందని, ఆశా వర్కర్ల జీతాల పెంపు కోసం పార్టీ ఎంపీల బృందం కేంద్ర పెద్దలను కలిసిందని తెలిపారు. మైక్ ఇచ్చేందుకు నిరాకరించిన స్పీకర్.. విపక్షం నిరసన మంత్రి సమాధానంతో సంతృప్తి చెందని బీజేపీ సభ్యులు.. తమకు నిరసన తెలిపేందుకు అవకాశం ఇవ్వాలని స్పీకర్ను కోరారు. అయితే ప్రశ్నోత్తరాల్లో నిరసనలకు సమయం ఇవ్వలేమంటూ మైక్ ఇచ్చేందుకు నిరాకరించడంతో బీజేపీ సభ్యులు తమ స్థానాల్లోంచి లేచి నిరసన తెలిపారు. వీరికి మద్దతుగా కాంగ్రెస్ సభ్యులు సైతం తమ స్థానాల్లోంచి నిలుచున్నారు. మైక్ ఇవ్వాలని కోరినా ఇవ్వకపోడంతో కొద్దిసేపు సభలో గందరగోళం నెలకొంది. దీంతో స్పీకర్ సభకు టీ బ్రేక్ ప్రకటించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యదు! గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
వరల్డ్కప్ సెలక్టయ్యాడు.. వరుసగా రెండో మ్యాచ్లో గోల్డెన్ డక్
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (05-05-2024)
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
తప్పక చదవండి
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement