-
డ్రోన్ కెమెరా ఆర్డర్ చేస్తే...ప్యాకేజీ చూసి కస్టమర్ షాక్!
సాక్షి, ముంబై: ఆన్లైన్ షాపింగ్ సైట్లలో షాపింగ్ అంటే కత్తి మీద సామే అనిపిస్తోంది. పార్సిల్ వచ్చి దాన్ని విప్పి, వస్తువు క్వాలిటీ చెక్ చేసే దాకా ఎలాంటి గ్యారంటీ లేదు. కట్ చేస్తే ..ఆన్లైన్లో డ్రోన్ కెమెరా ఆర్డర్ చేస్తే..అలుగడ్డలతో వచ్చిన ప్యాకేజీ చూసి కస్టమర్ షాక్ అయ్యాడు. ఇదీ చదవండి: పీకల్లోతు కష్టాల్లో వొడాఫోన్ ఐడియా: కస్టమర్లకు బ్యాడ్ న్యూస్ వివరాల్లోకి వెళితే బిహార్కు చెందిన చేతన్ కుమార్ అనే వ్యాపారవేత్త, ఆన్లైన్లో డ్రోన్ కెమెరాను ఆర్డర్ చేశాడు. ఎందుకు అనుమానం వచ్చిందో ఏమో గానీ, ప్యాకెట్ డెలివరీ చేస్తున్న బాయ్ ద్వారానే దాన్ని ఆన్బాక్స్ తీస్తూ వీడియో తీశాడు. దీంతోకస్టమర్తోపాటు,డెలివరీ బాయ్ తెల్లముఖం వేశాడు. ఎందుకంటే అందులో గుండ్రటి బంగాళా దుంపలు వెక్కిరించాయి. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ట్విటర్లో వైరల్ అవుతోంది. దీనిపై స్పందిస్తూ, లేదా బాధ్యత వహిస్తూ ఇంతవరకూ ఏ ఆన్లైన్ కంపెనీ ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. (28 రోజుల మొబైల్ రీఛార్జ్ ప్లాన్ వెనక మతలబు ఇదే!) ऑनलाइन शॉपिंग करना पड़ा महँगा, युवक ने मंगाया ड्रोन, निकला आलू | Unseen India पूरा वीडियो- https://t.co/KxZ0RsZwUl pic.twitter.com/s81XVfE5Vb — UnSeen India (@USIndia_) September 26, 2022 -
డబ్బు ఆదా : ఆన్లైన్లో షాపింగ్ చేస్తున్నారా? అయితే ఈ సీక్రెట్ మీకోసమే
ఫెస్టివల్ సీజన్ సందర్భంగా ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు ప్రత్యేక సేల్స్ను నిర్వహిస్తుంటాయి. ఆ సేల్లో పలు ప్రొడక్ట్లపై భారీ ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. అదే సమయంలో కొనుగోలు దారుల్ని ఆకర్షించేందుకు ప్రొడక్ట్ అసలు ధర ఎంతో దాచిపెట్టేస్తుంటాయి. ధరను భారీ ఎత్తున తగ్గిస్తాయి. ఈ ప్రొడక్ట్ అసలు ధర ఇంత ఉంది. మేం నిర్వహించే ఈ సేల్లో ఆ ప్రొడక్ట్ను కొనుగోలు చేస్తే మీకు ఇంత ధరకే వస్తాయని ఊరిస్తుంటాయి. అంతే ఆ ప్రకటనతో కొనుగోలు దారులు ఆ ప్రొడక్ట్ను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతారు. తీరా సదరు ఈకామర్స్ వెబ్సైట్లో ఆ ప్రొడక్ట్ కొనుగోలు ప్రాసెస్ పూర్తి చేసి పేమెంట్ చేసే సమయానికి అసలు ధర కనిపిస్తుంటుంది. ఒక్కోసారి అత్యవసర పరిస్థితుల్లో యూజర్లు ఆ ప్రొడక్ట్లను కొనుగోలు చేసి జేబుకి చిల్లు పెట్టుకుంటుంటారు. అందుకే అలాంటి ఇబ్బందులు పడకుండా ఉండాలంటే కొన్ని చిట్కాల్ని పాటించాల్సి ఉంటుంది. ఫెస్టివల్ సీజన్లో ఈకామర్స్ సంస్థలు నిర్వహించే సేల్లో ఉదాహారణకు ఓ స్మార్ట్ ఫోన్ ధర రూ.45వేలు ఉంటే.. ఆ ఫోన్ను రూ.30వేలకే సొంతం చేసుకోవచ్చని ఆఫర్ ప్రకటిస్తాయి. కానీ కస్టమర్ల నుంచి వసూలు చేసే వాస్తవ ధరకు సదరు ఈకామర్స్ వెబ్ సైట్లో చూపించే అసలు ధరకు చాలా వ్యత్యాసం ఉంటుంది. అలాంటి ప్రత్యేక సేల్ జరిగే సమయాల్లో మనం కొనుగోలు చేయాలనుకుంటున్న ప్రొడక్ట్ అసలు ధర ఎంతో తెలుసుకుంటే డబ్బుల్ని ఆదా చేసుకోవచ్చు. ముందుగా డెస్క్ టాప్లో గూగుల్ క్రోమ్, మోజిల్లా ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ను వినియోగిస్తుంటే బ్రౌజర్ ఎక్స్ టెన్షన్ను ఇన్ స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం యూజర్లు క్రోమ్ వెబ్ స్టోర్లోకి వెళ్లి అక్కడ్ కీపా (keepa)ఎక్స్టెన్షన్ను సెర్చ్ చేసి.. ఆ క్రోమ్ను ఇన్స్టాల్ చేసుకోండి. ఆ తర్వాత క్రోమ్, మోజిల్లాలో యాడ్ చేసుకోవాలి. అనంతరం అదే ఎక్స్టెన్షన్ ఓపెన్ చేసి.. మీరు ఏ ఈకామర్స్కు సంబంధించిన వెబ్సైట్లో ప్రొడక్ట్ను కొనుగోలు చేయాలనుకుంటున్నారో ఆ సంస్థ సైట్ను ఓపెన్ చేసి ప్రొడక్ట్ను ఎంటర్ చేస్తే మీకు చూపించే ప్రొడక్ట్ అసలు ధర గ్రాఫ్ రూపంలో మనకు కనిపిస్తుంది. -
ఫెస్టివల్ సీజన్: ఆన్లైన్ షాపింగ్లో ఆఫర్లే ఆఫర్లు! ఇక 'పండగ' చేస్కోండి!
న్యూఢిల్లీ: పండుగల సందర్భంగా ఆన్లైన్ ప్లాట్ఫామ్లు విక్రయాలను పెంచుకునేందుకు తగ్గింపులను ఆఫర్ చేస్తున్నాయి.ఈ సీజన్లో వినియోగ డిమాండ్ పుంజుకుంటుందని వస్త్రాలు, ఇంటి డెకరేటివ్ ఉత్పత్తులు, గృహోపకరణాల కంపెనీలు అంచనా వేస్తున్నాయి. ఉగాదితో పండుగల సందడి మొదలైంది. త్వరలో శ్రీరామనవమి రానుంది. అలాగే రంజాన్ మాసం మొదలైంది. దీంతో విక్రయాలు పెంచుకోవడంపై కంపెనీలు దృష్టి సారించాయి. ద్రవ్యోల్బణం అధికంగా ఉన్నప్పటికీ డిస్కౌంట్ (ఎంఆర్పీపై తగ్గింపు)లను ఎక్కువగానే ఆఫర్ చేస్తున్నట్టు కంపెనీల ప్రతినిధులు తెలిపారు. గత రెండు వేసవి సీజన్లలో కరోనా తీవ్రత కంపెనీల అమ్మకాలపై పడడంతో.. ప్రస్తుత సీజన్ సానుకూలంగా ఉంటుందని అంచనాతో ఉన్నాయి. అమెజాన్, మింత్రా, షాపర్స్స్టాప్, లైఫ్స్టయిల్ సంస్థలు 20–50 శాతం మేర వస్త్రాలు, ఫ్యాషన్ ఉత్పత్తులపై తగ్గింపును ఆఫర్ చేస్తున్నాయి. వస్త్రాలు, కాస్మొటిక్స్, వాచీలు, గహోపకరణాలు, డైరెక్ట్ టు కన్జ్యూమర్ బ్రాండ్లపై ఆఫర్లు అమలు చేస్తున్నట్టు ఆయా ప్లాట్ఫామ్ల ఎగ్జిక్యూటివ్లు తెలిపారు. వస్త్రాలు, సౌందర్య ఉత్పత్తులపై.. అమెజాన్ అయితే షావోమీ, వన్ప్లస్, మేబెల్లిన్ (సౌందర్య ఉత్పత్తులు), షుగర్ కాస్మెటిక్స్, సోనీ, అలెక్సా స్పీకర్లపై ప్రస్తుతం ఆఫర్లను అమలు చేస్తోంది. శామ్సంగ్ అయితే ఖరీదైన టీవీలు, ఏసీలు, వాషింగ్ మెషిన్లపై బ్లూఫెస్ట్ ఆఫర్ను ప్రకటించింది. ఈ నెల చివరి వరకు ఇది అందుబాటులో ఉంటుంది. ఆదిదాస్, పూమ ఉత్పత్తులపై షాపర్స్స్టాప్ 50 శాతం డిస్కౌంట్ ఇస్తోంది. నైకా కూడా షుగర్, ప్లమ్, మామాఎర్త్ సౌందర్య ఉత్పత్తులపై డిస్కౌంట్స్ ప్రకటించింది. ఫర్నిచర్ బ్రాండ్ (ఆన్లైన్, ఆఫ్లైన్) పెప్పర్ఫ్రై, జేబీఎస్ స్పీకర్స్ 25–40 శాతం మధ్యలో తగ్గింపు ఇస్తున్నాయి. అధిక నిల్వలు.. ‘‘చాలా ఈ కామర్స్ సంస్థల పరిధిలో ఉత్పత్తుల నిల్వలు పేరుకున్నాయి. జనవరి నుంచి వీటిని తగ్గించకోవడంపై అవి దృష్టి సారించాయి. కానీ, కరోనా మూడో విడత ప్రతికూలతల వల్ల ఇది సాధ్యపడలేదు. పైగా ఆన్లైన్లో షాపింగ్ చేసే కస్టమర్లు ప్రధానంగా డిస్కౌంట్స్, ఆఫర్స్ చూస్తారు’’ అని రిటైల్ కన్సల్టెన్సీ సంస్థ ‘థర్డ్ ఐసైట్’కు చెందిన దేవాన్షు దత్తా తెలిపారు. జివామే, వావ్ స్కిన్ సైన్స్, మింత్రా, అజియో, ఎంకెఫైన్ తదితర బ్రాండ్లు ఆఫర్ చేసే డిస్కౌంట్లకు ఆన్లైన్ షాపర్స్ నుంచి మంచి స్పందన కనిపిస్తోందని క్యాష్కరో సహ వ్యవస్థాపకుడు రోహన్ భార్గవ తెలిపారు. ఆన్లైన్ షాపింగ్ పోర్టళ్లపై క్యాష్బ్యాక్ కూపన్లను క్యాష్ కరో ఆఫర్ చేస్తుంటుంది. ‘‘ఆన్లైన్ ఆఫర్ల విషయానికొస్తే డీ2సీ బ్రాండ్స్ ముందున్నాయి. దీంతో యూజర్ల నుంచి కూడా డిమాండ్ పెరిగింది’’ అని భార్గవ వివరించారు. హోలి పండుగ నుంచే డిస్కౌంట్స్, ఆఫర్ల సందడి మొదలైనట్టు కంపెనీల ఎగ్జిక్యూటివ్లు తెలిపారు. ముఖ్యంగా టైర్–2, టైర్–3 పట్టణాల నుంచి ఎక్కువ స్పందన వస్తోందని పేర్కొన్నారు. కన్సల్టింగ్ సంస్థ రెడ్సీర్ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం.. మధ్యాదాయ వర్గాల కొనుగోలుదారులే 80 శాతంగా ఉంటారు. 2021 నాటికి 7.8 కోట్లుగా ఉన్న వీరి సంఖ్య 2026 నాటికి మూడు రెట్లు పెరిగి 25.6 కోట్లకు చేరుకుంటుందని అంచనా. ‘‘రష్యా యుద్ధం వల్ల తయారీ వ్యయాలు పెరిగి, సరఫరా సమస్యలు నెలకొన్నప్పటికీ.. దేశవ్యాప్తంగా, ప్రాంతీయంగా పండుగలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకమైన ఆఫర్లు, ప్రోత్సాహక కార్యక్రమాలను అమలు చేస్తున్నాం’’అని గృహోపకరణాల సంస్థ వండచర్చెఫ్ ఎండీ రవి సక్సేనా వెల్లడించారు. చదవండి: ఆన్లైన్లో వస్తువులు కొని మోసపోయారా? అయితే వెంటనే ఇలా చేయండి? -
తక్కువ రేట్లకే బ్రాండెడ్ వస్తువులు.. డబ్బు కట్టాక రివ్యూలు చూస్తే!
Hyderabad Fraud Shopping Website: బంజారాహిల్స్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఫేస్బుక్ పేజీలో కళ్ల జోడు యాడ్ వచ్చింది. దానిపై ప్రముఖ కంపెనీ పేరు ఉండటంతో పాటు క్లియరెన్స్ సేల్ అని కనిపించడంతో ఆయన ముందుకు వెళ్లారు. మార్కెట్లో కనీసం రూ.10 వేలు ఖరీదు చేసే చలువ కళ్లజోడు కేవలం రూ.2 వేలకే అంటూ అందులో ఉంది. ఆ మొత్తం ఫోన్ పే ద్వారా చెల్లించిన ఆయన కొన్ని రోజులకు మోసపోయినట్లు గుర్తించారు. ఇటీవల కాలంలో అనేకమంది ఇలాంటి ఆన్లైన్ ప్రకటనల బారినపడి మోసపోతున్నారు. నష్టపోయేది చిన్న మొత్తాలు కావడంతో పోలీసుల వరకు వెళ్లకుండా మిన్నకుండిపోతున్నారు. ఇదే మోసగాళ్లకు కలిసి వచ్చే అంశంగా మారిపోయింది. నగరంలో ప్రతి రోజూ వందలాది మంది ఈ యాడ్స్ బారినపడుతున్నారని తెలుస్తోంది. క్లియరెన్స్ సేల్ పేరుతో... ఫేస్బుక్ సహా వివిధ సోషల్మీడియా సైట్ల ద్వారా నకిలీ కంపెనీలు ప్రకటనలు గుప్పిస్తున్నారు. కళ్లజోళ్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, సెల్ఫోన్లు, ఉడెన్ ఫర్నిచర్.. ఇలా అనేక ఉత్పత్తులకు సంబంధించి ఈ ప్రకటనలు కనిపిస్తున్నాయి. అత్యంత ఆకర్షణీయంగా ఉంటున్న ఆ ప్రకటనల్లో ఉత్పత్తుల ఫోటోలు అదే స్థాయిలో ఉంటున్నాయి. బహిరంగ మార్కెట్లో దొరికే వాటి కంటే ఆకట్టుకునేలా, అతి తక్కువ రేటుతో కనిపిస్తున్నాయి. ప్రతి దాంట్లోనూ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ సేల్స్, క్లియరెన్స్ సేల్ అంటూ మోసగాళ్లు పొందుపరుస్తున్నారు. వీటిని చూసిన ఎవరైనా తక్కువ ధరకు ఎందుకు విక్రయిస్తున్నారని అనుమానించట్లేదు. ‘పైన’ ఒకటి.. ‘అడ్రస్’ మరోటి.. ► ఈ ప్రకటనలు సైతం చూసే వారికి ఎలాంటి అనుమానం రాకుండా ఉంటున్నాయి. సదరు వెబ్ పేజీ తెరిచిన వెంటనే పైన ప్రముఖ కంపెనీల పేర్లు దర్శనమిస్తున్నాయి. మోసగాళ్లు ఎక్కువగా ఈ–కామర్స్ రంగంలో పేరెన్నికగన్న కంపెనీల పేర్లు, లోగోలు వాడుతున్నారు. ► ఆయా సైట్లలో షాపింగ్ చేయడానికి పొందు పరచాల్సిన ఫోన్ నంబర్, చిరునామా తదితరాలకు సంబంధించిన అంశాలన్నీ ఈ పేజీలోనూ ఉంటున్నాయి. ఆ పేజీలకు సంబంధించిన అడ్రస్ బార్లో మాత్రం ఆయా కంపెనీ అడ్రస్లు ఉండట్లేదు. ► సాధారణంగా ప్రముఖ కంపెనీల నుంచి ఆన్లైన్లో ఖరీదు చేస్తే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది. కొన్ని ప్రాంతాలు, ఉత్పత్తులకు మినహాయిస్తే మిగిలిన వాటికి ఇది కచ్చితంగా కనిపిస్తుంటుంది. ► బోగస్ వెబ్సైట్లలో మాత్రం ఈ అవకాశం ఉండదు. ఖరీదు చేసే వాళ్లు కచ్చితంగా అప్పటికప్పుడే గూగుల్ పే, ఫోన్ పే వంటి యూపీఐలు లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా డబ్బు చెల్లించిన తర్వాతే ఆర్డర్ ఖరారు అవుతోంది. చదవండి: ఆ శాఖలోనే అత్యధిక ఖాళీలు..హైదరాబాద్లోనే 25 వేల మందికిపైగా అభ్యర్థులు ‘మార్కెటింగ్ ఇంటెలిజెన్స్’ ఏమైనట్లు? ► బాధితులు నష్టపోయేది తక్కువ మొత్తాలే కావడంతో కనీసం 5 శాతం మందీ పోలీసు వరకు వచ్చి ఫిర్యాదు చేయట్లేదు. డబ్బు తిరిగి రాదు సరికదా ఠాణా చుట్టూ తిరగాల్సి వస్తుందని వారు భావిస్తుండటమే దీనికి కారణం. సైబర్ స్పేస్లో జరిగే ఈ తరహా మోసాలను ముందుగానే కనిపెట్టాల్సిన అవసరం ఉంది ► నానాటికీ పెరిగిపోతున్న సైబర్ నేరాలు, కేసుల దర్యాప్తులో తలమునకలై ఉంటున్న సైబర్ క్రైమ్ పోలీసులు ఇప్పుడు ఈ విషయాలు పట్టించుకోవట్లేదు. ఫలితంగా మోసగాళ్లు అనునిత్యం అందినకాడికి దండుకుంటున్నారు. ► ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి మార్కెటింగ్ ఇంటెలిజెన్స్ టీమ్లను పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. సైబర్ నేరాలకు నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ లేదా టోల్ఫ్రీ నంబర్ 1930 ద్వారా ఫిర్యాదు చేయాలని అధికారులు కోరుతున్నారు. డబ్బు కట్టాక రివ్యూలు చూస్తే... ► డబ్బు చెల్లించిన వినియోగదారులకు కన్ఫర్మేషన్ ఈ–మెయిల్స్, ఎస్సెమ్మెస్లు రావట్లేదు. మరోసారి ఆ పేజ్లోకి వెళ్లి తనిఖీ చేయాలని ప్రయత్నిస్తే గతంలో లావాదేవీలు చేసిన పేరుతో కనిపించట్లేదు. ► కొన్నిసార్లు యూపీఐ విధానంలో డబ్బు చెల్లించిన తర్వాత ఆయా సైట్లలోనే ఏదో సాంకేతిక పొరపాటు జరిగింది. మళ్లీ ప్రయత్నించండి’ అంటూ వస్తోంది. ► అప్పటికే చెల్లించిన డబ్బు మాత్రం వినియోగదారులకు తిరిగి రావట్లేదు. అతికష్టమ్మీద షాపింగ్ చేసిన పేజ్ను గుర్తించి, పరిశీలిస్తే మాత్రం రివ్యూల ద్వారా అసలు విషయం తెలుస్తోంది. వాటిలో వందల మంది తాము మోసపోయాంటూ రాస్తున్నారు. -
ఆన్లైన్లో వస్తువులు కొని మోసపోయారా? అయితే వెంటనే ఇలా చేయండి?
కోవిడ్ కారణంగా ఆన్లైన్ వినియోగం పెరిగిపోయింది. మనకు కావాల్సిన నిత్యవసర సరుకుల నుంచి గాడ్జెట్స్ వరకు అన్నీ ఆన్లైన్లోనే కొనుగోలు చేస్తుంటాం. అయితే ఆన్లైన్ వినియోగం పెరగడంతో మోసాలు పెరిగిపోయాయి. ముఖ్యంగా ఆన్లైన్లో ఫోన్ బుక్ చేస్తే ఇటుక బిళ్ల, సబ్బులు, శానిటైజర్ డబ్బాలు రావడం మనం గమనిస్తుంటాం. ఇలాంటి సమయాల్లో మీరు మోసపోయారని గుర్తిస్తే ఫిర్యాదు చేసుకోవచ్చు. మీకు తప్పక న్యాయం జరుగుతుంది. వీటితో పాటు కొన్ని టిప్స్ పాటించాల్సి ఉంటుంది. అవేంటో తెలుసుకుందాం. ►అమెజాన్లో మీరు ప్రొడక్ట్ బుక్ చేస్తే అది ఆ సంస్థది కాదని గుర్తించాలి. అమెజాన్లో కోట్లాది మంది సెల్లర్స్ ఉంటారు. వాళ్ల వస్తువుల్ని అమ్మేందుకు మధ్య వర్తిగా ఈకామర్స్ ఫ్లాట్ఫామ్స్ అమెజాన్, ఫ్లిప్ కార్ట్లు ఉంటాయి. ►ఇక ఈ - కామర్స్ సంస్థలకు చెందిన వస్తువులైతే ప్రొడక్ట్ పక్కన ఉదాహరణకు అమెజాన్ ఫుల్ ఫిల్, ఫ్లిప్ కార్ట్ ఎస్యూర్డ్ పేర్లు ఉంటాయి. వాటిని గుర్తించుకోవాలి. ►ప్రొడక్ట్ కొనేముందుకు క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకోవాలి ►మీకు డెలివరీ వచ్చిన ప్రొడక్ట్ను ఓపెన్ చేసే ముందు నుంచి వీడియో తీసి పెట్టుకుంటే మీకు ఒక ప్రూఫ్గా ఉంటుంది ►ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒక్కోసారి మీరు ఆర్డర్ పెట్టిన ప్రొడక్ట్ మీకు వచ్చినా..ఆ ప్రొడక్ట్ పనిచేయకపోవడం,డ్యామేజ్ అవ్వడంలాంటివి జరుగుతుంటాయి. ►అలా జరిగితే ఈ - కామర్స్ ప్లాట్ ఫామ్లోని కొంతమంది సెల్లర్స్ మనకు డబ్బుల్నిరిటన్ చేయడం లేదంటే మీకు కావాల్సిన ఐటమ్ వారం రోజుల్లో రిప్లెస్ చేసి పంపిస్తారు. కొంత మంది పంపించరు. అలాంటి సమయాల్లో తిరిగి మీకు కావాల్సిన ప్రొడక్ట్ లేదంటే డబ్బులు తిరిగి పొందాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. ►ఈకామర్స్ కంపెనీలు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ కస్టమర్ కేర్కి కాల్ చేస్తే మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ►మీకు కస్టమర్ కేర్కి కాల్ చేసినా పట్టించుకోలేదంటే..మీ వైపు కరెక్ట్గా ఉంటే రిపోర్ట్ చేయోచ్చు. ►మీ ప్రొడక్ట్ డ్యామేజ్ అయినా లేదంటే మీరు తీసుకునే ప్రొడక్ట్ గురించి వెబ్ సైట్లో ఒకలా మీకు డెలివరీ అయిన తరువాత మరోలా ఉంటే కన్జ్యూమర్ కోర్ట్లో ఫిర్యాదు చేయోచ్చు. ►కన్జ్యూమర్ ప్రొటస్ట్ యాక్ట్ -2019కింద కంప్లెయింట్ చేయోచ్చు.సెక్షన్-2 లో 10,11,16,28 సెక్షన్లు ఉంటాయి. ఆ సెక్షన్లలో మీరు ఏ సెక్షన్ బాధితులో తెలుసుకోవాలి. ఉదాహరణకు ఫుడ్ డెలివరీ, బ్యాంక్ ట్రాన్సక్షన్, ఆన్లైన్ టికెట్ బుకింగ్ ఇలాంటి వాటిల్లో మీరు మోసపోతే ఫిర్యాదు చేసుకోవచ్చు. ►https://consumerhelpline.gov.in/.లో లేదంటే టోల్ ఫ్రీ నెంబర్ .1800-11-4000,14404కి ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5.30 లోపు ఫోన్ చేయోచ్చు. ►ఎస్ఎంఎస్ అయితే 8130009809కి చేయోచ్చు. ఎన్సీహెచ్,యూఎంఏఎన్జీ యాప్లో కంప్లెయింట్ చేయోచ్చు. ఇలా డైరక్ట్గా ప్రభుత్వానికి ఫిర్యాదు చేయోచ్చు. ఇలా చేస్తే మీ న్యాయం జరుగుతుంది. అలా జరగకపోతే ప్రైవేట్ సంస్థల్ని సంప్రదించొచ్చు. ►వాటిలో https://icrpc.org/,https://voxya.com/,https://www.onlinelegalindia.com/కి ఫిర్యాదు చేయోచ్చు. వీళ్లు మాత్రం ఫిర్యాదును బట్టి కంప్లెయింట్ తీసుకుంటారు. ► పై వాటితో సంబంధం లేకుండా డైరెక్ట్గా కోర్ట్లో ఫిర్యాదు చేయాలంటే ఆన్లైన్లో https://edaakhil.nic.in/index.html లో కంప్లెయింట్, అడ్వికేట్ సెక్షన్లో రిజిస్టరై ఫిర్యాదు చేయోచ్చు. కాకపోతే ఇక్కడ మీరు కంప్లెయింట్కు ముందుగా ఓ లాయర్ను నియమించుకోవాల్సి ఉంటుంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- 25 కిలోల బంగారం స్మగ్లింగ్.. భారత్లోని అఫ్గనిస్తాన్ దౌత్యవేత్త రాజీనామా
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
Advertisement