-
టెండర్
సాక్షి ప్రతినిధి, కడప: ‘వడ్డించేవారు మనవారైతే కడబంతి అయితేనేం’ అన్నట్లుగా బడా పారిశ్రామికవేత్తలకు అనుగుణంగా అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. చిత్తశుద్ధితో టెండర్లు నిర్వహిస్తున్నామని చెప్పుకుంటూనే, పాలకపక్షాన్ని నమ్ముకున్న వారికి న్యాయం చేసే పనిలో నిమగ్నమయ్యారు. మంగంపేటలో సీ, డీ గ్రేడ్ బెరైటీస్ టెండర్ల ప్రక్రియతో బెరైటీస్నే నమ్ముకొని జీవిస్తున్న 150 పల్వరైజింగ్ మిల్లులు, వాటిలో పనిచేస్తున్న ఐదువేల మందికి పైగా కార్మికుల ఉపాధి భవిష్యత్ ప్రశ్నార్థకం కానుంది. ఓపెన్ టెండర్ల ప్రక్రియ పొడవు చేతుల పందేరంగా మారిందని ఈ- ప్రొక్యూర్మెంట్ టెండర్లకు పాలకులు శ్రీకారం చుట్టారు. అందులో కూడా ఆంధ్రప్రదేశ్ మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎండీసీ) చేతివాటం ప్రదర్శిస్తోంది. బడా బయ్యర్లకు అనుకూలంగా టెండర్ల నిర్వహణ ప్రక్రియను పొందుపర్చిందనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. అందుకు ఈనెల 10న నిర్వహించనున్న ఆన్లైన్ టెండర్లను పలువురు ప్రశ్నిస్తున్నారు. కోటీశ్వరులు మినహా మధ్యతరగతి పారిశ్రామికవేత్తలు పాల్గొనకుండా ఆన్లైన్ టెండర్లను రూపొందించారని పలువురు ఆరోపిస్తున్నారు. ఎగుమతిదారులకే అనుకూలం... ప్రస్తుత ఆన్లైన్ టెండర్లు బెరైటీస్ ఎగుమతిదారులకే అనుకూలంగా ఉన్నాయని పలువురు పారిశ్రామికవేత్తలు పేర్కొంటున్నారు. కనీసం 2లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలని నిబంధనలు పొందుపర్చారు. టెండర్లలో పాల్గొన్న బయ్యర్లు ప్రతి టన్నుకు రూ.25 ఈఎండీ చెల్లించాల్సి ఉంది. అంటే కనీసం రూ.50 లక్షలు ఈఎండీ చెల్లించగల్గిగన వారు మాత్రమే టెండర్లలో పాల్గొనేందుకు అర్హులుగా నిర్ధారించారు. గత ఏడాది మార్చిలో ప్రవేశ పెట్టిన ఆన్లైన్ టెండర్లలో 25వేల మెట్రిక్ టన్నులు ఒక బిడ్గా పొందుపర్చారు. అంటే అప్పట్లో రూ.6.25లక్షలు మాత్రమే ఈఎండీ రేటు బయ్యర్కు పడేది. ఈ లెక్కన గత ఏడాది 12మంది బయ్యర్లు టెండర్లలో పాల్గొన్నారు. ఈమారు కనీసం బిడ్ 2లక్షల మెట్రిక్ టన్నులు పరిమాణం కారణంగా రూ.50లక్షలు ఈఎండి చెల్లించాల్సిన స్థితి ఏర్పడింది. ప్రస్తుతం టన్ను ధర రూ.1120 గా నిర్ణయించారు. అంటే కనీస బిడ్కు టెండరుకు వెళ్లదలిచిన వారు ఈఎండీతో కలిపి దాదాపు రూ.23కోట్లకు పెట్టుబడి పెట్టగల్గిన వారు మాత్రమే అర్హులుగా అధికారిక లెక్కల ద్వారా రూఢీ అవుతోంది. మంగంపేట బెరైటీస్ టెండర్లు కేవలం ఎగుమతిదారులు మినహా పల్వరైజింగ్ మిల్లుల యజమానులు పాల్గొనేందుకు వీలులేకుండా పొందుపర్చారనే పలువురి ఆరోపణలు నిజం చేస్తున్నాయి. ప్రశ్నార్థకంగా మారిన చిన్నతరహా పరిశ్రమలు... చిన్నతరహా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించాలని పారిశ్రామిక ప్రగతి సాధించాలని ఓవైపు ప్రభుత్వ పెద్దలు ఊకదంపుడు ఉపన్యాసం ఇస్తుంటారు. కానీ ఏపీఎండీసీ చర్యలు అందుకు భిన్నంగా ఉన్నాయని పలువురు పేర్కొంటున్నారు. మంగంపేట బెరైటీస్ ఆధారంగా నెలకొల్పిన సుమారు 150 పల్వరైజింగ్ మిల్లుల భవిష్యత్ ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారనుంది. ఈనెల 10న నిర్వహించనున్న ఆన్లైన్ టెండర్లలో పాల్గొన్నవారికి మాత్రమే సీ,డీ గ్రేడ్ బెరైటీస్ అప్పగించనున్నట్లు నిబంధనలు పెట్టారు. గత ఏడాది మార్చిలో నిర్వహించిన ఆన్లైన్ టెండర్లలో హెచ్చు పాటదారుడు రేటు చెల్లించిన ప్రతి మిల్లు యజమానికి సంవత్సరంలో 5వేల మెట్రిక్ టన్నుల బెరైటీస్ అప్పగించేలా చర్యలు తీసుకున్నారు. ఈమారు టెండర్లలో పాల్గొన్నవారు మినహా ఇతరులకు ఖనిజం కేటాయించే అవకాశాలు లేవని స్పష్టంగా నిబంధనల్లో పొందుపర్చారు. అంటే రూ.50లక్షలు ఈఎండీ చెల్లించగల్గిన స్థోమత ఉన్న మిల్లర్లకు మాత్రమే బెరైటీస్ దక్కేఅవకాశం ఉంది. లేదంటే టెండర్లు దక్కించుకున్న వారి నుంచి వారు నిర్ణయించే రేటుకు బెరైటీస్ కొనుగోలు చేయాల్సిన దుస్థితిని ఏపీఎండీసీ కల్పించిందని పలువురు పల్వరైజింగ్ మిల్లుల యజమానులు పేర్కొంటున్నారు. వారి నిర్ణయం కారణంగా మిల్లులు మూసుకోవాల్సిన దుస్థితి ఉత్పన్నం కానుందని, తద్వార 5వేల మందికి పైబడి కార్మికులకు అన్యాయం జరగనుందని పలువురు వాపోతున్నారు. ధర నిర్ణయించడంలో వ్యత్యాసం.... ప్రస్తుతం మంగంపేట బెరైటీస్లో రూ.1926 టన్నుల బెరైటీస్ కొనుగోలు చేస్తున్నారు. అయితే ఆన్లైన్ టెండర్లలో టన్ను ధర రూ.1120లకే నిర్ణయించారు. గత ఏడాది 25వేల మెట్రిక్ టన్నులకు ఒక బిడ్గా టెండర్లు నిర్వహించడంతోనే 12మంది మాత్రమే పాల్గొన్నారు. ఈమారు ఒక్కో బిడ్ 2లక్షల మెట్రిక్ టన్నులుగా నిర్ణయించడంతో టెండర్లలో పాల్గొనే వారి సంఖ్య బాగా తగ్గుతోంది. ఎగుమతిదారులు మినహా ఇతరులు పాల్గొనే అవకాశం లేదని పలువురు పేర్కొంటున్నారు. ప్రస్తుతం 15లక్షల మెట్రిక్ టన్నులకు టెండర్లను ఆహ్వానించారు. కేవలం ఐదుగురు మాత్రమే ఆస్థాయిలో ఖనిజం తీసుకోగల్గిన వారు ఉన్నారు. అంటే టెండర్లలో పాల్గొన్న వారందరికి ఖనిజం దక్కే అవకాశం ఉంది. దీంతో ప్రస్తుత టన్ను ధర రూ.1926 కంటే బాగా తగ్గే అవకాశం ఉందని తద్వారా ఏపీఎండీసీకి గణనీయంగా ఆదాయం పడిపోయే స్థితి ఉందని పలువురు పేర్కొంటున్నారు. పాలకపక్షం కనుసన్నల్లోనే... సీ,డీ గ్రేడ్ బెరైటీస్ దక్కించుకునే వ్యూహాత్మక ఎత్తుగడల్లో భాగంగా పాలకపక్షం కనుసన్నల్లోనే టెండర్ల ప్రక్రియ ఉండేలా అధికారులు వ్యవహరించారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. మంగంపేట పరిధిలో(పాతది) 30లక్షల మెట్రిక్ టన్నులు డంప్ ఒక చోట, కొత్తగా14లక్షల మెట్రిక్ టన్నుల డంప్ మరో చోట నిల్వచేశారు. అయితే టెండర్ల ప్రక్రియలో ఒకే డంప్ 15లక్షల మెట్రిక్ టన్నులు చూపారు. కొత్తగా నిల్వచేసిన డంప్లో వేస్టేజీ తక్కువ ఉన్నట్లు పలువురు పారిశ్రామికవేత్తలు పేర్కొంటున్నారు. అనుకున్న వారికి అనుకున్న విధంగా బెరైటీస్ అప్పగించేందుకు పాలకపక్షం వ్యూహాత్మకంగా టెండర్ల నిబంధనల నుంచి ఖనిజం నిల్వల వరకూ వ్యవహరించారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎండీ ఆదేశాల మేరకే ఏపీఎండీసీ మేనే జింగ్ డెరైక్టర్ ఆదేశాల మేరకే టెండర్లలో కనీస బిడ్ 2లక్షల మెట్రిక్ టన్నులుగా నిర్ణయించాం. బిడ్ ఎక్కువ టన్నులు పెట్టడం వల్ల టెండర్లలో పాల్గొనే వారి సంఖ్య తగ్గవచ్చు. టెండర్లలో పాల్గొనని మిల్లరుకు ఖనిజం ఇవ్వమని చెప్పిన విషయం వాస్తవమే. మంగంపేట మిల్లర్ల అభ్యర్థనను బోర్డు దృష్టికి తీసుకెళ్లి ఖనిజం సరఫరాకు చర్యలు తీసుకుంటాం. టెండరుదారుడు కోట్ చేసిన ధరకే చిన్నతరహా మిల్లులకు కూడా సరఫరా చేసేందుకు బోర్డు అనుమతి తీసుకుంటాం. ప్రస్తుతం ఉన్న ధర కంటే తక్కువ ధరను పొందుపర్చడం వెనుక పోటీ పెంచడమే అసలు ఉద్దేశం. -
అనుకున్నోళ్లకే పనులు..!
=అదీ 4.95 శాతం ఎక్సెస్తో =రూ.50లక్షల భారం =ఖరారైన మేడారం స్నానఘట్టాల టెండర్లు జిల్లా పరిషత్, న్యూస్లైన్ : మేడారం జాతర పనుల్లో అంతా అనుకున్నట్లే జరిగింది. ఎవరేమనుకుంటే మాకేంది అన్నట్లుగా ఇరిగేషన్ అధికారులు తమ కనుసన్నల్లో మెలిగే కంపెనీకే పనిని కట్టబెట్టారు. పేరుకే టెండర్లు, నిబంధనలు అంటూ కొంత డ్రామా నడిపించినా చివరి నిమిషంలో ఎలాంటి ఉత్కంఠకు తావివ్వకుండా సజావుగా పని కానిచ్చేశారు. టెండర్లు ఓపెన్ చేయకముందే పనులు ప్రారంభించిన కంపెనీకే ఇప్పుడు అధికారికంగా పనిని ఎక్సెస్తో అప్పగించారు. నిబంధనలు తమకు అనుకూలంగా మార్చుకోవడంలో తమకు తామే సాటి అని నిరూపించుకున్నారు సంబంధిత శాఖ అధికారులు. పోటాపోటీ.. జాతర సందర్భంగా జంపన్నవాగు వద్ద నిర్మిస్తున్న స్నానఘట్టాల టెండర్లు ఎట్టకేలకు మంగళవారం ఖరారు అయినట్లు తెలిసింది. ఈ ఏడాది అదనంగా 420 మీటర్ల పొడవుతో స్నానఘట్టాలు, బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ ఏర్పాటు, ఇన్ఫిల్టరేషన్ వెల్స్లో పూడికతీత, కొత్త బావుల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.9.30కోట్లు నీటిపారుదల శాఖకు కేటాయించింది. వీటి కోసం ఈ-ప్రొక్యూర్మెంట్ ద్వారా టెండర్లను ఆహ్వానించగా ఆరు ఏజెన్సీలు పోటీ పడ్డాయి. వీటిలో సాయిదత్తా, జంగా, సాయిరాం, శ్రీరామ, సుజల, నందిత కంపెనీలు ఉన్నాయి. రెండు కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం ఉండడంతో ఈ టెండర్ల వ్యవహారం ఈఎన్సీ అధ్వర్యంలోని సీఓటీ నిర్వహిస్తోంది. ఈనెల 13న టెక్నికల్ బిడ్ ఓపెన్ చేయాల్సిన సీఓటీ అధికారులు 16న ఓపెన్ చేశారు. ముందు పనులు.. ఆ తర్వాత టెండర్లు.. టెండర్ల ప్రక్రియ ప్రారంభం కాకముందే ఓ కంపెనీ ముందస్తుగా పనులు ప్రారంభించడం వివాస్పదమైంది. మరోవైపు పనులు ప్రారంభించిన కంపెనీకే కాంట్రాక్టు దక్కేలా అనుభవం పేరిట నిబంధనలు మారుస్తున్నారని పోటీలో ఉన్న ఇతర కంపెనీలు కోర్టులను ఆశ్రయించినట్లు సమాచారం. కాగా, టెండర్ల వ్యవహారం వివాదాస్పదం కావడంతో సోమవారమే కాంట్రాక్టు ఖరారు చేయాల్సి ఉన్నప్పటీకీ మంగళవారం రాత్రి పొద్దుపోయే వరకు వాయిదా వేస్తూ వచ్చారు. చివరికి పోటీలో జిల్లాకు చెందిన రెండు కాంట్రాక్ట్ ఏజెన్సీలు పోటీపడ్డాయి. అయితే అంతా ముందే ఊహించినట్లు అనుభవం పేరుతో గత జాతరలో పనులు చేసిన సాయిదత్తా ఏజెన్సీ 4.95 శాతం ఎక్సెస్తో టెండర్ దక్కించుకున్నట్లు తెలిసింది. పనులు ఎక్సెస్కు ఖరారు కావడంతో సుమారు రూ.50లక్షల వరకు ప్రభుత్వంపై అదనపు భారం పడుతుందని ఇంజినీరింగ్ వర్గాలు తెలిపాయి. అయితే రెండు రోజుల్లో పనులు పొందిన కాంట్రాక్టర్ను సీఓటీ అధికారులు ప్రకటిస్తారని తెలిసింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఒక్కరోజులోనే రూ.800 కోట్లు నష్టపోయిన ఇన్వెస్టర్..!
సీఎం జగన్ కోసం రాజానగరం సిద్ధం(ఫొటోలు)
ఓటర్లపై తేనెటీగల దాడి.. ఎనిమిదిమందికి గాయాలు!
'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
టీడీపీ నేతల దౌర్జన్యాలు అరికట్టాలి
'ఇరానీ చాయ్'ని పరిచయం చేసిందెవరో తెలుసా! ది బెస్ట్ ఎక్కడంటే..
కేజ్రీవాల్కు ఎందుకు బెయిల్ ఇవ్వొద్దు : ఈడీని ప్రశ్నించిన సుప్రీం
టీడీపీ గూండాగిరి
కౌంటింగ్కు పకడ్బందీ ఏర్పాట్లు
తప్పక చదవండి
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వారందరి జీవితాలను మార్చేసిన 'ఆర్య'కు 20 ఏళ్లు
- షర్మిల.. ఎందుకిలా..!
- నరేష్ గోయెల్కు బెయిల్ మంజూరు.. ఏం జరిగిందంటే..
- Modi-CBN: దొందూ దొందే!
- వైజాగ్ మాల్యా.. వంశీ!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- LS Elections 3rd Phase: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్
Advertisement