-
కీలక నిర్ణయం: రాష్ట్రపతి ప్రసంగం బహిష్కరణ
న్యూఢిల్లీ : బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా రేపు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేయనున్న ప్రసంగాన్ని బహిష్కరిస్తున్నట్లు 16 పార్టీలు ప్రకటించాయి. వ్యవసాయ చట్టాల రద్దు డిమాండ్ కోరుతూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాయి. ప్రతిపక్షం లేకుండా చేసి, ఏకపక్షంగా చట్టాలు ఆమోదం చేసుకున్నారని ఆరోపించాయి. ఈ కొత్త వ్యవసాయ చట్టాల కారణంగా ఆహర భద్రతకు విఘాతం కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ మేరకు గురువారం 16 ప్రతిపక్ష పార్టీలు ఓ ప్రకటన విడుదల చేశాయి. ఈ మేరకు రేపు రాష్ట్రపతి ప్రసంగాన్ని కాంగ్రెస్, ఎన్సీపీ, జేకేఎన్సీ, డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, శివసేన, సమాజ్వాదీ పార్టీ, ఆర్జేడీ, సీపీఐ(ఎం), సీపీఐ, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, ఆర్ఎస్పీ, పీడీపీ, ఎండీఎంకే, కేరళ కాంగ్రెస్ (ఎం), ఏఐయూడీఎఫ్ పార్టీలు బహిష్కరించనున్నాయి. ఈ సందర్భంగా విపక్ష నాయకుడు గులాంనబీ ఆజాద్ మీడియాతో మాట్లాడారు. కొత్త వ్యవసాయ చట్టాలతో ఆహార ఉత్పత్తులను ప్రభుత్వం సేకరించడం నిలిచిపోతుందని.. దీంతో ప్రజా పంపిణీ వ్యవస్థపై ప్రభావం చూపుతుందని తెలిపారు. ఉభయ సభల్లో సాగు చట్టాలను బలవంతంగా ఆమోదం చేయించినట్లు ఆరోపించారు అందుకే రైతులు ఆ చట్టాలను వ్యతిరేకిస్తూ 64 రోజులుగా ఆందోళన చేస్తున్నారని గుర్తుచేశారు. ఈ ఆందోళనల్లో 155 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే గణతంత్రం రోజు హింసాత్మక ఘటనలు ఖండనీయమని ప్రకటించారు. ఈ దుశ్చర్యల వెనుక అసలు కుట్రదారులెవరో తేల్చాల్సిన అవసరం ఉందని 16 పార్టీలు పేర్కొన్నాయి. దీనికోసం నిష్పాక్షికంగా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశాయి. -
పార్లమెంట్లో హోరా హోరీ!
సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగాలని తాము కోరుకుంటున్నామని ప్రతి రాజకీయ పార్టీ చెబుతుంది. తీరా సమావేశాలు ప్రారంభమయ్యాక ఎవరి సత్తా మేరకు వారు గోల చేస్తారు. తప్పు మీదంటే మీదంటూ పాలక, ప్రతిపక్ష సమావేశాలు ప్రత్యక్ష ప్రసారాల సాక్షిగా పరస్పరం దుమ్మెత్తి పోసుకుంటాయి. తాజాగా బుధవారం నాడు ప్రారంభమైన పార్లమెంట్ వర్షాలకాల సమావేశాలు కూడా హోరెత్తనున్నాయి. రెండు రోజుల ముందు, అంటే సోమవారం నాడు 13 ప్రతిపక్ష పార్టీలు సమావేశమై పరస్పర సహకారంతో పార్లమెంట్ సమావేశాలకు అంతరాయం కలుగకుండా చూడాలని బలంగా నిర్ణయించుకున్నారు. దేశంలో నెలకొన్న అస్తవ్యస్థ ఆర్థిక వ్యవస్థ, నిరుద్యోగం, బ్యాంకు కుంభకోణాలు, వ్యవసాయ సంక్షోభం, దళితులు, ఆదివాసీలు, మహిళలపై వరుసగా జరుగుతున్న దాడులకు ప్రభుత్వాన్ని బాధ్యున్ని చేయడమే తమ లక్ష్యం అని కూడా సమావేశంలో అభిప్రాయపడ్డారు. తానే పార్లమెంట్ సమావేశాలకు అంతరాయం కలిగించి నిందను ప్రతిపక్షం మీద వేయడానికి ఆస్కారం ఇవ్వకుండా పరస్పర సహకారంతో సమావేశాలు నిరాటంకంగా సాగేలా చూడాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ తోటి ప్రతిపక్షాలను కోరారు. గత పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఎన్డీయే వర్గాలు ప్రదర్శించిన తీరును గుర్తు చేసింది. ఈ సమావేశాలకు సమాజ్వాది పార్టీ, బహుజన సమాజ్ పార్టీ, రాష్ట్రీయ జనతా దళ్, తణమూల్ కాంగ్రెస్. డీఎంకే, కాంగ్రెస్, వామపక్షాలు హాజరయ్యాయి. ఏప్రిల్ ఆరవ తేదీన ముగిసిన బడ్జెట్పార్లమెంట్ సమావేశాలే ఘోరమైనవని, 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని సమావేశాలకన్నా ఈ సమావేశాలే పేలవంగా ఉన్నాయని నిపుణులు తెలియజేస్తున్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్ లాంటి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలే కాకుండా సార్వత్రిక ఎన్నికలు కూడా సమీపిస్తున్న నేపథయంలో పార్లమెంట్ సమావేశాలు పాలక, ప్రతిపక్షాలకు కూడా ప్రతిష్టాత్మకంగా తయారయ్యాయి. రాహుల్ వర్సెస్ నరేంద్ర మోదీ ఈ పార్లమెంట్ సమావేశాలు కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ, ప్రధాని నరేంద్ర మోదీ వాగ్వాదం కొనసాగే అవకాశాలు ఉన్నాయి. పార్లమెంట్ వెలుపలు ఇప్పటికే ఇరువురు మాటల తూటాలతో పేల్చుకుంటున్నారు. ‘కాంగ్రెస్ పార్టీ ముస్లింల పార్టీ అని కొంత మంది ముస్లిం మేథావులతో రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు’ అంటూ ‘ఇంక్విలాబ్’ అనే ఉర్దూ పత్రిక గత గురువారం ఓ వార్తను ప్రచురించడంపై బీజేపీ వివాదం లేవదీసింది. ఆ వార్తలో ఇసుమంత కూడా నిజం లేదని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తున్నప్పటికీ బీజేపీగానీ, నరేంద్ర మోదీగానీ ఆ విషయాన్ని వదిలిపెట్టడం లేదు. ఉత్తరప్రదేశ్లోని ఆజంగఢ్లో శనివారం నాడు నరేంద్ర మోదీ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ముస్లింల పార్టీ అని ఓ పత్రికలో చదివానని, అది ఒక్క ముస్లిం పురుషుల పార్టీ మాత్రమేనా, ముస్లిం మహిళల పార్టీ కూడానా? అని ఈ సందర్భంగా తాను అడుగుతున్నానని అన్నారు. త్రిపుల్ తలాక్ను రద్దు చేస్తూ తీసుకొచ్చిన బిల్లును దష్టిలో పెట్టుకొనే మోదీ ఈ ప్రశ్న వేశారని సులభంగానే గ్రహించవచ్చు. పాలకపక్షం మెజారిటీ వున్న లోక్సభలో ఈ బిల్లును గత డిసెంబర్ నెలలోనే ఆమోదించగా, ప్రతిపక్షం మెజారిటీలో ఉన్న రాజ్యసభలో పెండింగ్లో పడిపోయిన విషయం తెల్సిందే. బిల్లులోని కొన్ని అంశాల పట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాన్ని సెలక్ట్ కంపెనీకి పంపించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ముస్లిం మహిళలను మంచి చేసుకునేందుకు మోదీ తలాక్ ప్రస్థావన తీసుకొచ్చిన నేపథ్యంలో దానికి కౌంటర్గా కాంగ్రెస్ పార్టీ చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశాన్ని ముందుకు తీసుకొచ్చింది. ఈ విషయమై రాహుల్ గాంధీ, ప్రధాని మోదీకి ఓ లేఖ కూడా రాశారు. రాజ్యసభ డిప్యూటీ చైర్పర్సన్ రాజ్యసభ డిప్యూటీ చైర్పర్సన్ ఎన్నిక కూడా పార్లమెంట్ సమావేశాలను వేడెక్కించనున్నాయి. ఈ పదవికి ఉమ్మడి అభ్యర్థిని పోటీకి నిలబెట్టాలని కూడా సోమవారం నాడు జరిగిన సమావేశంలో ప్రతిపక్షాలు నిర్ణయించాయి. అయితే ఎవరి పేరు పరిశీలనకు రాలేదు. జూలై ఒకటవ తేదీ వరకు ఆ పదవిలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పీజే కురియన్ కొనసాగారు. రాజ్యసభలో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించినప్పటికీ డిప్యూటీ చైర్పర్సన్ను ఎంపిక చేసుకునేంత మద్దతు లేదు. అయినప్పటికీ మిత్రపక్షమైన శిరోమణి అకాలీదళ్కు చెందిన నరేష్ గుజ్రాల్ను నిలబెట్టాలని యోచిస్తోంది. -
ఒక్కరోజు.. 11 వాయిదాలు!
న్యూఢిల్లీ: రాజ్యసభ కొత్త రికార్డు సృష్టించింది. నిరసనలతోపాటు అధికార, విపక్షాల మధ్య వాగ్యుద్ధం కారణంగా బుధవారం ఒక్కరోజే 11 సార్లు వాయిదా పడింది. అవినీతి నిరోధక (సవరణ) బిల్లు–2013పై చర్చ విషయంలో ప్రభుత్వ, విపక్షాల మధ్య వివాదంతో రికార్డు స్థాయిలో వాయిదాల పర్వం కొనసాగింది. విపక్షాల తీరుపై రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. విపక్షాలు రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం 11గంటలకు సమావేశమైన రాజ్యసభ 20 నిమిషాలకే వాయిదా పడింది. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు సమావేశమైనా.. సభలో నిరసనలు కొనసాగటంతో మూడు గంటల వ్యవధిలోనే మరో 10 సార్లు వాయిదా పడింది. దేశ ప్రయోజనంతో ముడిపడి ఉన్న అంశాలపై చర్చకు తాము సిద్ధంగానే ఉన్నామని.. అయితే ప్రభుత్వమే చర్చ జరగకుండా తప్పించుకుంటోందని కాంగ్రెస్ పక్షనేత గులాంనబీ ఆజాద్ విమర్శించారు. -
ఎందుకు రాజకీయం చేస్తున్నారు...
న్యూఢిల్లీ: పార్లమెంటులో ఉగ్రవాదం చర్చ జరగకపోవడంపై కేంద్ర విత్తమంత్రి అరుణ్ జైట్లీ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. ఒక టెర్రరిస్టు ఉరశిక్షపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆగ్రహించారు. ఉగ్రవాదంపై ముక్తకంఠంతో పోరాడాల్సి ఉండగా అందుకు భిన్నంగా ప్రతిపక్షాలు వ్రవర్తిస్తున్నాయని ఆరోపించారు. ముఖ్యంగా కాంగ్రెస్ గురుదాస్ పూర్ ఉగ్రవాదదాడిని రాజకీయం చేయడానికి చూస్తోందని ఆర్థిక మంత్రి మండిపడ్డారు. కాంగ్రెస్ ఎంపీలు బాధ్యతారహిత వ్యాఖ్యలు చేస్తూ విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు. ఉగ్రవాదంపై చర్చకు ఎందుకు నిరోధిస్తున్నారో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ జాతికి వివరణ ఇవ్వాలని అరుణ్ జైట్లీ డిమాండ్ చేశారు. ఉగ్రవాదంపై చర్చించడానికి ఎందుకు అంగీకరించడం లేదో చెప్పాలన్నారు. మెమన్ ను ఉరితీయడం ద్వారా దేశం రెండుగా చీలిపోయిందనే భావన తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. గురువారం రాజ్యసభలో గురుదాస్ ఘటనపై హోమంత్రి రాజ్నాధ్ సింగ్ వివరణ ఇస్తుండగా గందరగోళం నెలకొంది. కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలన్నీ అందోళనకు దిగాయి. ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కాంగ్రెస్ ఎంపీలు వెల్ లోకి దూసుకొచ్చారు. దీంతో సభలో మంత్రి వివరణ పూర్తి కాకండానే రేపటికి వాయిదా పడింది. ఈ నేపథ్యంలోనే కేంద్రమంత్రి ఆరోపణలు గుప్పించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రోహిత్ శర్మ అత్యంత చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే
సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు (నెల్లూరు జిల్లా)
పొట్ట తగ్గాలంటే.. జిమ్కే వెళ్లాలా? ఏంటి?
రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
ఎన్నికల బరిలోకి 'జస్వీర్ సింగ్ గర్హి'.. అక్కడ నుంచే పోటీ
చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్
స్కూల్కు ఆలస్యంగా వచ్చిందని.. టీచర్ను ఉతికి ఆరేసిన ప్రిన్సిపాల్
రెండేళ్లుగా గప్చుప్.. ఊహించని వార్త చెప్పిన సింగర్
పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్
బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
తప్పక చదవండి
- పొట్ట తగ్గాలంటే.. జిమ్కే వెళ్లాలా? ఏంటి?
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
- షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
- మరీ అంత చెత్త ఆటగాళ్లలా కనిపిస్తున్నారా?: సెహ్వాగ్ చురకలు
- భారీ ఆఫర్ను రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కారణం ఇదేనట
- Happy Birthday Trisha : 25 ఏళ్ల కెరియర్లో వివాదాలతో పాటు కోట్లలో ఆస్తులు
Advertisement