-
కర్నాటక రోడ్డు ప్రమాదం.. మృతదేహాలు హైదరాబాద్కు తరలింపు
-
కర్నాటక రోడ్డు ప్రమాదం.. మృతదేహాలు హైదరాబాద్కు తరలింపు
కర్నాటకలోని కల్బూర్గిలో శుక్రవారం ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. వేసవి సెలవుల నేపథ్యంలో విహార యాత్రకు వెళ్లి తిరిగి వస్తుండగా.. ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు రాంగ్ రూట్లో వచ్చిన టెంపో.. బస్సును ఢీ కొట్టింది. దీంతో, అదుపు తప్పిన బస్సు జాతీయ రహదారిపై ఉన్న కల్వర్టును ఢీ కొని కిందకు పడిపోయింది. ఈ ధాటికి వాహనం డీజిల్ ట్యాంక్ పగిలిపోగా... బస్సుకు మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు సజీవ దహనం కాగా.. మరో 13 మంది గాయపడ్డారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. హైదరాబాద్కు చెందిన పలు కుటుంబాల్లో పెను విషాదం నింపిన ఈ దుర్ఘటన వివరాలు.. బాధితులు, కలబురిగి జిల్లా ఎస్పీ ఇషా పంత్, స్థానిక బంధువుల కథనం ప్రకారం ఇలా ఉన్నాయి. కాగా, ప్రమాదం చనిపోయిన వారి మృతదేహాలను హైదరాబాద్ తరలించారు. గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులకు మృతదేహాలను తరలించారు. ఇక, మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు. అల్వాల్ బంజారా కాలనీకి చెందిన అర్జున్ కుమార్ 36, అతని భార్య సరళాదేవి 34, కుమారుడు వివాన్3, మేనత్త అనిత 58. గోలికబర్కు చెందిన రవళి 30, భర్త శివకుమార్ 35, పెద్ద కుమారుడు ధీక్షిత్ 11 ఉన్నారు. ఇక, అర్జున్ సోదరుడు అమెరికా నుండి వచ్చేంతవరకు మృతదేహాలు ఆసుపత్రిలోనే ఉండనున్నాయి. ఇది కూడా చదవండి: విహారయాత్ర విషాదాంతం -
ట్రావెల్స్ బస్సు దగ్ధం
పర్చూరు: అకస్మాత్తుగా ఇంజిన్లో మంటలొచ్చి ఓ ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. అయితే డ్రైవర్ అప్రమత్తతతో అందులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ప్రకాశం జిల్లాలోని పర్చూరు–చిలకలూరిపేట ఆర్ అండ్ బీ రోడ్డుపై.. పర్చూరు మండలంలోని తిమ్మరాజుపాలెంలో గురువారం వేకువ జామున ఈ ఘటన జరిగింది. ఆరెంజ్ ట్రావెల్స్కు చెందిన బస్సు హైదరాబాద్లోని పఠాన్చెరువు నుంచి బుధవారం రాత్రి 10.30 గంటల సమయంలో 20 మంది ప్రయాణికులతో బయలుదేరింది. గుంటూరు జిల్లా నరసరావుపేటలో 11 మందిని, చిలకలూరిపేటలో ఒకరిని దించింది. పర్చూరు, చీరాల మీదుగా గుంటూరు జిల్లా బాపట్లకు బస్సు వెళ్లాల్సి ఉంది. పర్చూరు మండలం తిమ్మరాజుపాలెం వచ్చేసరికి గేర్ రాడ్డు పక్క నుంచి పొగలు రావడాన్ని డ్రైవర్ గమనించాడు. వెంటనే బస్సును రోడ్డు పక్కన ఆపి అందులో ఉన్న మిగిలిన 8 మంది ప్రయాణికులను కిందికి దించాడు. అంతలోనే ఇంజిన్ నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగి బస్సు మొత్తం వ్యాపించాయి. బస్సు పూర్తిగా దగ్ధమైంది. చిలకలూరిపేట అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా.. వారు అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ప్రయాణికులతో పాటు ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకుండా సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఘటనాస్థలాన్ని ఆర్డీవో ప్రభాకరరెడ్డి తదితరులు పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు యద్ధనపూడి ఎస్ఐ రత్నకుమారి చెప్పారు. చదవండి: ఒమిక్రాన్ గుట్టు ‘గాంధీ’లో తేలుస్తారు -
కంటైనర్ను ఢీకొన్న కారు, ముగ్గురు మృతి
-
వైఎస్సార్ జిల్లాలో ఘోర ప్రమాదం
సాక్షి, అమరావతి : వైఎస్సార్ జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. రెడ్డిపల్లి చెరువుకట్ట సమీపంలో కారు అదుపు తప్పి కంటైనర్ను ఢీకొంది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో తల్లీకొడుకు సహా కారు డ్రైవర్ ఉన్నారు. వీరంతా నందలూరు మండలం నీలిపల్లె గ్రామస్తులు. కడప నుంచి చెన్నైకి వెళుతుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మృతులు దాసరి మణెమ్మ (45), సాయి కిరణ్, (19), పవన్ కల్యాణ్ (25)గా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్ట్మార్టంకు తరలించారు. డివైడర్ను ఢీకొన్న ఆరెంట్ ట్రావెల్స్ బస్ కాగా విజయవాడ గుణదల సమీపంలో ఆరెంట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి డివైడర్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. రాజమహేంద్రవరం నుంచి హైదరాబాద్ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. బోల్తా పడిన బస్సును పోలీసులు క్రేన్ సాయంతో పక్కకి తొలగించారు. గాయపడిన ప్రయాణికుల్ని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. కంటైనర్ను ఢీకొన్న కారు, ముగ్గురు మృతి మరోవైపు తెలంగాణలో సిద్ధిపేట జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ప్రజ్ఞాపూర్ రాజీవ్ రహదారిపై ఆగివున్న కంటైనర్ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు మానకొండూరు మండలం వేగురుపల్లికి చెందినవారు. వీరంతా హైదరాబాద్లో జరిగిన ఓ సినిమా ఆడియో ఫంక్షన్కు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సాక్షి కార్టూన్ 02-05-2024
Lok sabha elections 2024: ఓటేస్తే డైమండ్ రింగ్
Pallavi Dempo: సంపన్న పల్లవి..రాజకీయ వంట కుదిరేనా!
దీనికి జవాబు లేదా బాబూ?
ప్రభుత్వ ఉద్యోగులతో మరో మాట!
సత్యానికి సవాల్!
సీఎస్కేకు బిగ్ షాకిచ్చిన పంజాబ్.. 7 వికెట్ల తేడాతో ఘన విజయం
చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు
నేహా కుటుంబానికి అండగా అమిత్షా..
ఆ టాలీవుడ్ హీరోతో కలిసి పని చేయాలని ఉంది: అల్లరి నరేశ్
తప్పక చదవండి
- సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్ విషాద మరణాలు (ఫొటోలు)
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
- కేసీఆర్పై ఈసీ చర్యలు, ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం
- తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న భారీ బడ్జెట్ వెబ్ సిరీస్..!
- నా కుమారుడు వరల్డ్కప్ జట్టుకు ఎంపికవుతాడని స్వీట్లు, టపాసులు తెచ్చా: రింకూ తండ్రి ఆవేదన
- సుల్తాన్పూర్ లోక్సభ స్థానానికి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు
- ‘దిశ’ ఎన్కౌంటర్ కేసు.. సిర్పూర్ కర్ కమిషన్ రిపోర్ట్పై స్టే
- జనసేన నేతలకు అవమానం.. టీడీపీ ప్రచార రథంపై నుంచి గెంటేసి..
- రాయ్బరేలీ, అమేథి స్థానాలపై 24 గంటల్లో తుది నిర్ణయం
Advertisement