-
అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో 'ఇడ్లీ లొల్లి'.. అసలు ఈ ఇడ్లీ కథేంటంటే..?
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్-రాధికాల ప్రీ వెడ్డింగ్ వేడుకలు చాలా అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. మూడు రోజులు జరిగిన ఈ వేడుకల్లో సిని ప్రముఖులంతా ఆడి పాడి సందడి చేశారు. అయితే ఈ వేడుకల్లో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ టాలీవుడ్ నటుడు రామ్ చరణ్ని ఇడ్లీ అని సంబోధించడం చర్చనీయాంశంగా మారింది. షారుఖ్ ఫన్నీగా పిలిచారనుకుందామన్న అంత పెద్ద వేడుకలో పిలవడం చాలమందికి నచ్చలేదు. నార్త్ ఇండియన్ హీరోలకు దక్షిణాది హీరోలంటే చులకనే అంటూ రచ్చ మొదలయ్యింది. సరదా సంబోధన కాస్త సోషల్ మీడియాలో సీరియస్ ఇష్యూగా చర్చలకు తెరలేపింది. దక్షిణాది కాబట్టి ఇడ్డీ వడ అని షారుక్ హేళనగా సంబోధించినప్పటికీ..ఇడ్డీ భారతదేశ వంటకం మాత్రం కాదు. వివాదాస్పదంగా మారిన ఈ ఇడ్లీ వ్యాఖ్య నేపథ్యంలో అసలు ఇడ్లీ వంటకం మూలం ఏమిటీ? ఎక్కడ నుంచి ఈ అల్పహారం భారతదేశానికి వచ్చిందో చూద్దామా!. మన భారతీయులకు ముఖ్యంగా దక్షిణాది వాళ్లు వేడి వేడి ఇడ్లీ, అందులోకి మంచి కొబ్బరి చట్నీ, వేడి వేడి సాంబార్ ఉంటే ప్రాణం లేచొస్తుందన్నట్లు భావిస్తారు. ఇది వారికి ఎంతో ఇష్టమైన అల్పాహారం కూడా. అయితే ఈ ఇడ్డీ వంటకం భారతీయ వంటకం కాదు. దాని మూలం భారతదేశానికి చెందింది ఎంత మాత్రం కాదు. కాస్త శరీరంలో నలతగా ఉన్న ఇడ్డీ తింటే తేలిగ్గా అరుగుతుందంటారు. ముఖ్యంగా వైద్యులు కూడా రోగులకు ఈ అల్పాహారాన్ని ప్రివర్ చేస్తారు. అలాంటి ఇడ్డీ ఎక్కడ నుంచి వచ్చిందనే విషయం గురించి కర్ణాటకకు చెందని ప్రముఖ ఆహార శాస్త్రవేత్త, పోషకాహార నిపుణుడు, కెటీ ఆచార్య సవివరంగా వెల్లడించారు. ఇడ్లీ క్రీస్తూ పూర్వం 7 లేదా 12వ శతాబ్దంలో ఇండోనేషియాల్లో ఈ వంటకాన్ని చేసేవారట. వాళ్లు ఈ వంటాకాన్ని కెడ్లీ లేదా కేదారి అనిపిలిచేవారట. అయితే మన మన హిందూ రాజులు ఈ ఇండోనేషియాని పాలించడంతో సెలవుల్లో బంధువులను కలవడానికి భారత్కి వచ్చేవారట. అలా వస్తూ వస్తూ..తమ తోపాటు రాజ్యంలో ఉండే వంటవాళ్లను కూడా వెంటపెట్టుకుని తీసుకువెళ్లేవారట. అలా ఈ ఇండోనేషియ వంటకం భారత్లోకి వచ్చి ఇడ్లీగా స్థిరపడింది. చరిత్రను పరిశీలిస్తే.. చారిత్రాత్మకంగా అరబ్బులు కూడా ఇడ్లీ వంటకంతో సంబంధం ఉందని మరో కథ చెబుతోంది. 'ఎన్సైక్లోపీడియా ఆఫ్ ఫుడ్ హిస్టరీ అనే పుస్తకంలోనూ, 'సీడ్ టు సివిలైజేషన్ - ది స్టోరీ ఆఫ్ ఫుడ్' అనే మరో పుస్తకంలో భారతదేశంలో స్థిరపడ్డ అరబ్బులు హలాల్ ఆహారాల తోపాటు రైస్బాల్స్ తినేవారని, వాటిని కొబ్బరి గ్రేవీతో తినేవారని ఉంది. ఇక్కడ అరబ్బులు ఇడ్లీలను రైస్బాల్స్ అని పిలిచే వారని తెలుస్తోంది. అలా ఇడ్లీలు మన భారతీయ వంటకాల్లో భాగమయ్యాయి. అందుకు ఆధారాలు కూడా ఉన్నాయి. ఇక ఏడోవ శతాబ్దాపు కన్నడ రచన "వద్దరాధనే" అనే గ్రంథంలో ఇడ్డీల గురించి ప్రస్తావించబడింది. వాటిని 'ఇద్దాలి'గా పిలిచినట్లు వాటి తయారీ గురించి సవివరంగా ఉంది. అలాగే పదవ శతాబ్దపు తమిళ వచనం పెరియ పురాణంలో కూడా ఈ వంటకం గురించి ప్రస్తావించబడి ఉంది. ఇది శైవ సాధువుల సముహం అయిన 63 నాయిర్ల జీవిత కథను వివరిస్తూ.. ఈ వంటకం వచ్చిన విధానం గురించి రాసి ఉంది. ఇక మరో చారిత్రక ఆధారం ప్రకారం..క్రీస్తూ శకం 10వ శతాబ్దంలో ఘజనీ మహమ్మద్ సోమనాథ్ ఆలయం దాడి తర్వాత సౌరాష్ట్ర వ్యాపారులు దక్షిణ భారతదేశానికి రావడం జరిగింది. అప్పుడే ఈ ఇడ్లీ వంటకాన్ని కనుగొనడం జరిగింది. దానికి ఈ పేరు పెట్టడం జరిగిందని ఉంది. వీటన్నింటి బట్టి చూస్తే ఇడ్డీ అనే వంటకం మూలం భారత్ కాదని పేర్లు మార్చుకుంటూ మన దేశానికి వచ్చిందని స్పష్టం అవుతోంది. ఇవన్నీ ఎలా ఉన్నా ఈ ఇడ్లీ వంటకం మన దేశంలోని భారతీయల మనసులను దోచుకుని ఇష్టమైన వంటకంగా స్థిరపడిపోయిందనే విషయం గ్రహిస్తే మంచిది. (చదవండి: నిమ్మచెక్కతో వంటింటి సమస్యలకు చెక్పెట్టండి) -
Year End 2023: ఆవిష్కరణల ఏడాది
అంతరిక్ష అన్వేషణ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ దాకా, గ్లోబల్ వారి్మంగ్ నుంచి పలు మానవ వికాసపు మూలాల దాకా శాస్త్ర సాంకేతిక రంగాల్లో 2023లో పలు నూతన ఆవిష్కరణలు చోటుచేసుకున్నాయి. ప్రపంచం దృష్టిని తమవైపుకు తిప్పుకోవడమే గాక భవిష్యత్తుపై కొంగొత్త ఆశలు కూడా కల్పించాయి. వినాశ హేతువైన గ్లోబల్ వారి్మంగ్లో కొత్త రికార్డులకూ ఈ ఏడాది వేదికైంది! 2023లో టాప్ 10 శాస్త్ర సాంకేతిక, పర్యావరణ పరిణామాలను ఓసారి చూస్తే... 1. చంద్రయాన్ దశాబ్దాల కృషి అనంతరం భారత్ ఎట్టకేలకు చందమామను చేరింది. తద్వారా చంద్రయాన్–3 ప్రయోగం చరిత్ర సృష్టించింది. పైగా ఇప్పటిదాకా ఏ దేశమూ దిగని విధంగా చంద్రుని దక్షిణ ధ్రువంవైపు చీకటి ఉపరితలంపై దిగిన రికార్డును కూడా చంద్రయాన్–3 సొంతంచేసుకుంది. ఇంతటి ప్రయోగాన్ని ఇస్రో కేవలం 7.5 కోట్ల డాలర్ల వ్యయంతో దిగి్వజయంగా నిర్వహించడం ప్రపంచాన్ని అబ్బురపరిచిందనే చెప్పాలి. చంద్రుని ఉపరితలంపై సల్ఫర్ జాడలున్నట్టు చంద్రయాన్–3 ప్రయోగం ధ్రువీకరించింది. రెండు వారాల పాటు చురుగ్గా పని చేసి దాన్ని ప్రయోగించిన లక్ష్యాన్ని నెరవేర్చింది. 2. కృత్రిమ మేధ ఈ రంగంలో కీలక ప్రగతికి 2023 వేదికైంది. 2022 చివర్లో ఓపెన్ఏఐ విడుదల చేసిన ఏఐ చాట్బాట్ చాట్జీపీటీ ఈ ఏడాది అక్షరాలా సంచలనమే సృష్టించింది. ఆకా శమే హద్దుగా అన్ని రంగాల్లోకి చొచ్చుకుపోయింది. లీవ్ లెటర్లు ప్రిపేర్ చేసినంత సులువుగా సృజనాత్మకమైన లవ్ లెటర్లనూ పొందికగా రాసి పెడుతూ వైవిధ్యం చాటుకుంది. అప్పుడప్పుడూ తడబడ్డా, మొత్తమ్మీద అన్ని అంశాల్లోనూ అపారమైన పరిజ్ఞానం, నైపుణ్యంతో యూజర్ల మనసు దోచుకుంది. గూగుల్ తదితర దిగ్గజాలు కూడా సొంత ఏఐ చాట్బోట్లతో బరిలో దిగుతుండటంతో ఏఐ రంగంలో మరిన్ని విప్లవాత్మక పరిణామాలు వచ్చేలా ఉన్నాయి. 3. ఆదిమ ‘జాతులు’! మనిషి పుట్టిల్లు ఏదంటే తడుముకోకుండా వచ్చే సమాధానం... ఆఫ్రికా. అంతవరకూ నిజమే అయినా, మనమంతా ఒకే ఆదిమ జాతి నుంచి పుట్టుకొచ్చామని ఇప్పటిదాకా నమ్ముతున్న సిద్ధాంతం తప్పని 2023లో ఓ అధ్యయనం చెప్పింది. మన మూలాలు కనీసం రెండు ఆదిమ జాతుల్లో ఉన్నట్టు తేలి్చంది! 10 లక్షల ఏళ్ల కింద ఆఫ్రికాలో ఉనికిలో ఉన్న పలు ఆదిమ జాతులు హోమోసెపియన్ల ఆవిర్భావానికి దారి తీసినట్టు డీఎన్ఏ విశ్లేషణ ఆధారంగా అది చెప్పడం విశేషం! మూలవాసులైన అమెరికన్లు దాదాపు 20 వేల ఏళ్ల కింద ఉత్తర అమెరికాకు వలస వెళ్లి యురేషియాకు తిరుగు పయనమైనట్టు మరో అధ్యయనం తేల్చింది. 4. గ్రహశకలం ఓసిరిస్ నాసా ప్రయోగించిన ఒసిరిస్ రెక్స్ రోబోటిక్ అంతరిక్ష నౌక ఏడేళ్ల ప్రయాణం అనంతరం బెన్నూ గ్రహశకలంపై దిగింది. అక్కడి దాదాపు పావు కిలో పరిమాణంలో రాళ్లు, ధూళి నమూనాలను సేకరించి భూమికిపైకి పంపింది. అవి సెపె్టంబర్ 24న అమెరికాలోని ఉటా ఎడారి ప్రాంతంలో దిగాయి. వాటిని విశ్లేషించిన సైంటిస్టులు నీటితో పాటు భారీ మొత్తంలో కార్బన్ జాడలున్నట్టు తేల్చారు. బెన్నూ గ్రహశకలం భూమి కంటే పురాతనమైనది. దాని నమూనాల విశ్లేషణ ద్వారా భూమిపై జీవం ఆవిర్భావానికి సంబంధించిన కీలకమైన రహస్యాలు వెలుగు చూడవచ్చని భావిస్తున్నారు. 5. అత్యంత వేడి ఏడాది చరిత్రలో ఇప్పటిదాకా నమోదైన అత్యంత వేడి ఏడాదిగా 2023 ఓ అవాంఛనీయ రికార్డును సొంతం చేసుకుంది. ఏప్రిల్ నుంచి నవంబర్ దాకా ప్రతి నెలా ఇప్పటిదాకా అత్యంత వేడిమి మాసంగా నమోదవుతూ వచి్చంది! ఫలితంగా ఏడాది పొడవునా లిబియా నుంచి అమెరికా దాకా తీవ్ర తుఫాన్లు, వరదలు, కార్చిచ్చులు ఉత్పాతాలు సృష్టిస్తూనే వచ్చాయి. పైగా నవంబర్లో అయితే 17వ తేదీన భూ తాపంలో చరిత్రలోనే తొలిసారిగా 2 డిగ్రీల పెరుగుదల నమోదైంది! 2 డిగ్రీల లక్ష్మణ రేఖను తాకితే సర్వనాశనం తప్పదని సైంటిస్టులు ఎప్పటినుంచో హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం వణికిస్తోంది. 6. సికిల్ సెల్కు తొలి జన్యుచికిత్స సికిల్ సెల్, బెటా థలస్సీమియా వ్యాధులకు తొలిసారిగా జన్యు చికిత్స అందుబాటులోకి వచి్చంది. వాటికి చికిత్స నిమిత్తం కాస్జెవీ 9క్రిస్పర్ కేస్9) జన్యు ఎడిటింగ్ టూల్ వాడకానికి బ్రిటన్ ఔషధ నియంత్రణ సంస్థ ఆమోదం లభించింది. ఈ థెరపీ ద్వారా రోగులకు నొప్పి నిదానించిందని, ఎర్ర రక్త కణాల మారి్పడి ఆవశ్యకత కూడా తగ్గుముఖం పట్టిందని తేలింది. కాకపోతే ఈ చికిత్స ఖరీదే ఏకంగా 20 లక్షల డాలర్లు! పైగా భద్రత అంశాలు, దీర్ఘకాలిక పనితీరు తదితరాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. 7. ఊబకాయానికి మందు మధుమేహానికి ఔషధంగా పేరుబడ్డ వెగోవీ ఊబకాయాన్ని తగ్గించే మందుగా కూడా తెరపైకి వచ్చి సంచలనం సృష్టించింది. బరువును తగ్గించడం మాత్రమే గాక గుండెపోటు, స్ట్రోక్ తదితర ముప్పులను కూడా ఇది బాగా తగ్గిస్తుందని తేలడం విశేషం. వీటితో పాటు పలురకాల అడిక్షన్లకు చికిత్సగా కూడా వెగోవీ ప్రభావవంతంగా ఉపయోగపడుతోందని తేలింది. అయితే దీని వాడకం వల్ల థైరాయిడ్ క్యాన్సర్ వంటి సైడ్ ఎఫెక్టులు రావచ్చంటున్నారు! 8. పాపం పక్షిజాలం ప్రపంచవ్యాప్తంగా జంతుజాలానికి, మరీ ముఖ్యంగా పక్షిజాలానికి మరణశాసనం రాసిన ఏడాదిగా 2023 నిలిచింది! ప్రపంచ వ్యాప్తంగా లక్షల కొద్దీ పక్షి జాతుల జనాభాలో ఈ ఏడాది విపరీతమైన తగ్గుదల నమోదైనట్టు సైంటిస్టులు తేల్చారు. గత నాలుగు దశాబ్దాలుగా పెరుగుతూ వస్తున్న ఈ ధోరణి 2023లో బాగా వేగం పుంజుకున్నట్టు పలు పరిశోధనల్లో తేలింది. పురుగుమందుల విచ్చలవిడి వాడకమే పక్షుల మనుగడకు ముప్పుగా మారిందని తేలింది! 9. మూల కణాధారిత పిండం అండం, శుక్ర కణాలతో నిమిత్తం లేకుండానే కేవలం మూల కణాల సాయంతో మానవ పిండాన్ని సృష్టించి ఇజ్రాయెల్ సైంటిస్టులు సంచలనం సృష్టించారు. అది కూడా మహిళ గర్భంతో నిమిత్తం లేకుండా ప్రయోగశాలలో వారీ ఘనత సాధించారు. ఈ నమూనా పిండం ప్రయోగశాలలో 14 రోజుల పాటు పెరిగింది. ఆ సమయానికి సహజంగా తల్లి గర్భంలో ఎలా ఉంటుందో అచ్చం అలాగే ఎదిగిందని తేలింది. మానవ పునరుత్పత్తి రంగంలో దీన్ని కీలక మైలురాయిగా భావిస్తున్నారు. ఇలాంటి మరిన్ని ప్రయోగాలకు ఇది ప్రేరణగా నిలుస్తుందని భావిస్తున్నారు. 10. కార్చిచ్చులు 2023లో కార్చిచ్చులు కొత్త రికార్డులు సృష్టించాయి. ముఖ్యంగా కెనడాలోనైతే పెను వినాశనానికే దారి తీశాయి. వీటి దెబ్బకు అక్కడ గత అక్టోబర్ నాటికే ఏకంగా 4.5 కోట్ల ఎకరాలు బుగ్గి పాలయ్యాయి! అక్కడ 1989లో నమోదైన పాత రికార్డుతో పోలిస్తే ఇది ఏకంగా రెట్టింపు విధ్వంసం. అమెరికా, బ్రిటన్, స్పెయిన్, నార్వే వంటి పలు ఇతర దేశాల్లోనూ కార్చిచ్చులు విధ్వంసమే సృష్టించాయి. వీటి దెబ్బకు జూన్ నెలంతా అమెరికాలో వాయు నాణ్యత ఎన్నడూ లేనంతగా తగ్గిపోయింది. హవాయి దీవుల్లో కార్చిచ్చుకు ఏకంగా 100 మంది బలయ్యారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ప్రపంచ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న భారత సంతతి నేతలు
భారత సంతతికి చెందిన పలువురు నేతలు ప్రపంచంలోని వివిధ దేశాల్లో తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి మరో దేశం చేరింది. సింగపూర్ నూతన అధ్యక్షునిగా భారత సంతతికి చెందిన థర్మన్ షణ్ముగరత్నం బాధ్యతలు చేపట్టారు. ఫలితంగా ప్రపంచంలోని పలు దేశాల రాజకీయాల్లో ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న భారతీయ మూలాలు కలిగిన నేతల జాబితాలో షణ్ముగరత్నం చేశారు. షణ్ముగరత్నం 70 శాతం ఓట్లతో ఘనవిజయం సాధించారు. ఆయన సింగపూర్ తొమ్మిదవ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. షణ్ముగరత్నం పదవీకాలం ఆరు సంవత్సరాలు. పెరుగుతున్న భారత సంతతినేతల ప్రభావం సింగపూర్ ప్రధాని లీ సీన్ లూంగ్ నూతన అధ్యక్షుడు థర్మన్ షణ్ముగరత్నం అభినందించారు. ప్రపంచ స్థాయిలో ఉన్నత పదవికి ఎన్నికైన భారతీయ వారసత్వానికి చెందిన అనేక మంది నాయకులలో థర్మన్ షణ్ముగరత్నం కూడా చేరారని ఆయన అన్నారు. షణ్ముగరత్నం విజయం ప్రపంచ వ్యాప్తంగా భారతీయుల ప్రభావానికి ప్రతీక అని లూంగ్ అన్నారు. ప్రపంచ రాజకీయాల్లో భారత సంతతి నేతలు.. 1. అమెరికాలో భారతీయ-అమెరికన్ కమ్యూనిటీకి పెరుగుతున్న ప్రభావం కమలా హారిస్ విజయంతో స్పష్టంగా కనిపిస్తుంది. అమెరికాకు తొలి మహిళా వైస్ ప్రెసిడెంట్గా భారతీయ సంతతికి చెందిన హారిస్ నియమితులయ్యారు. దీనికి ముందు ఆమె 2017 నుండి 2021 వరకు కాలిఫోర్నియా సెనేటర్గా ఉన్నారు. డెమొక్రాట్ అయిన హారిస్ 2011 నుండి 2017 వరకు కాలిఫోర్నియా అటార్నీ జనరల్గా కూడా పనిచేశారు. ఆమె కాలిఫోర్నియాలో ఇండియన్, జమైకన్ తల్లిదండ్రులకు జన్మించారు. 2. అమెరికా మధ్యంతర ఎన్నికలలో అధికార డెమొక్రాట్ పార్టీ నుండి ఐదుగురు భారతీయ మూలాలు కలిగిన నేతలు తమ హవా చాటారు. వారిలోరాజా కృష్ణమూర్తి, రో ఖన్నా, ప్రమీలా జయపాల్, అమీ బెరా, శ్రీ తానేదార్ ఉన్నారు. వీరు యూఎస్ ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. ఇది కూడా చదవండి: 10 అనవసర విషయాలు.. వీటి జోలికి వెళ్లకపోవడమే శ్రేయస్కరం! 3. కాలిఫోర్నియాలో భారత సంతతికి చెందిన చెందిన ప్రముఖ రాజకీయ నేత హర్మీత్ ధిల్లాన్ ఇటీవలే రిపబ్లికన్ నేషనల్ కమిటీ (ఆర్ఎన్సీ) చైర్మన్ ఎన్నికలలో పోటీ చేశారు. 4. భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ, వివేక్ రామస్వామి వంటి నేతలు వచ్చే ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి తమ అభ్యర్థిత్వాన్ని సమర్పించారు. 5. రిషి సునాక్ గత ఏడాది బ్రిటన్కు మొదటి భారతీయ సంతతికి చెందిన ప్రధాన మంత్రి అయ్యారు. గోవాకు చెందిన సుయెల్లా బ్రేవర్మన్ అతని హోం సెక్రటరీగా పనిచేస్తున్నారు. బ్రేవర్మాన్ తర్వాత సునాక్ క్యాబినెట్లో గోవా మూలాలు కలిగిన రెండవ మంత్రి క్లైర్ కౌటిన్హో. కౌటిన్హో ఇటీవలే నూతన ఎనర్జీ సెక్యూరిటీ, నెట్ జీరో సెక్రటరీగా ప్రమోషన్ అందుకున్నారు. 6. సునాక్ కంటే ముందు ప్రీతి పటేల్.. బోరిస్ జాన్సన్ క్యాబినెట్లో హోం సెక్రటరీగా ఉన్నారు. జాన్సన్ క్యాబినెట్లో అలోక్ శర్మ అంతర్జాతీయ అభివృద్ధి కార్యదర్శిగా వ్యవహరించారు. 7. ఐర్లాండ్ ప్రధాన మంత్రి లియో ఎరిక్ వరద్కర్ కూడా భారతీయ సంతతికి చెందిన వారే కావడం గమనార్హం. వరద్కర్.. అశోక్, మిరియం వరద్కర్ దంపతుల మూడవ సంతానం. ఎరిక్ వరద్కర్ తండ్రి ముంబైలో జన్మించారు. 1960లలో యునైటెడ్ కింగ్డమ్కు తరలి వెళ్లారు. 8. ఆంటోనియో కోస్టా 2015 నుండి పోర్చుగల్ ప్రధాన మంత్రిగా ఉన్నారు. అతను సగం భారతీయుడు.. సగం పోర్చుగీస్. 9. కెనడాలో ఫెడరల్ మంత్రి అయిన మొదటి హిందువు అనితా ఆనంద్. ఆనంద్ ఈ ఏడాది జూలైలో ట్రెజరీ బోర్డు ఛైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. ఆమె తల్లిదండ్రులు భారతీయులు. తండ్రి తమిళనాడు, తల్లి పంజాబ్కు చెందినవారు. 10. కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో మంత్రివర్గంలో మరో ఇద్దరు భారతీయ సంతతికి చెందిన సభ్యులు కూడా ఉన్నారు. వారు హర్జిత్ సజ్జన్, కమల్ ఖేరా. 11. ప్రియాంక రాధాకృష్ణన్ న్యూజిలాండ్లో మంత్రి అయిన మొదటి భారతీయ సంతతికి చెందిన వ్యక్తి. మలయాళీ తల్లిదండ్రులకు చెన్నైలో జన్మించిన ఆమె ప్రస్తుతం కమ్యూనిటీ, వాలంటరీ సెక్టార్కు మంత్రిగా ఉన్నారు. 12. ట్రినిడాడ్, టొబాగో అధ్యక్షునిగా ఎన్నికైన క్రిస్టీన్ కార్లా కంగాలూ.. ఇండో-ట్రినిడాడియన్ కుటుంబంలో జన్మించారు. 13. భారత సంతతికి చెందిన న్యాయవాది, రచయిత ప్రీతమ్ సింగ్ 2020 నుండి సింగపూర్లో ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు. 14. దేవానంద్ శర్మ 2019లో ఆస్ట్రేలియన్ పార్లమెంట్ సభ్యుడైన మొదటి భారతీయ సంతతికి చెందిన వ్యక్తిగా నిలిచారు. 15. గయానా అధ్యక్షుడు మహమ్మద్ ఇర్ఫాన్ అలీ లియోనోరాలో ముస్లిం ఇండో-గయానీస్ కుటుంబంలో జన్మించారు. 16. ప్రవింద్ జుగ్నాథ్ జనవరి 2017 నుండి మారిషస్ ప్రధాన మంత్రిగా ఉన్నారు. అతను 1961లో హిందూ యదువంశీ కుటుంబంలో జన్మించారు. అతని ముత్తాత 1870లలో భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుండి మారిషస్కు వలస వెళ్లారు. 17. 2019 నుండి మారిషస్ అధ్యక్షుడు పృథ్వీరాజ్ సింగ్ రూపన్ భారతీయ ఆర్య సమాజ్ హిందూ కుటుంబంలో జన్మించారు. 18. చంద్రికాప్రసాద్ సంతోఖి 2020 నుండి సురినామ్ అధ్యక్షుడిగా ఉన్నారు. సంతోఖి 1959లో లెలీడోర్ప్లో ఇండో-సురినామ్ హిందూ కుటుంబంలో జన్మించారు. 19. వేవెల్ రాంకలవాన్ అక్టోబర్ 2020 నుండి సీషెల్స్ అధ్యక్షుడిగా ఉన్నారు. అతని తాత బీహార్కు చెందినవారు. భారతీయ వారసత్వానికి చెందిన 200 మందికి పైగా నాయకులు ప్రపంచవ్యాప్తంగా 15 దేశాల్లో ప్రజా సేవలో ఉన్నత స్థానాల్లో ఉన్నారని ఇండియాస్పోరా గవర్నమెంట్ లీడర్స్ లిస్ట్ తెలియజేస్తోంది. వీరిలో 60 మందికిపైగా నేతలు కేబినెట్ పదవుల్లో ఉన్నారు. ఇది కూడా చదవండి: నగరాలకు చెట్లు అందించే 12 ప్రయోజనాలివే! -
గ్రావిటీ హోల్లో భూ ఆవిర్భావ నమూనా?
నేటికీ భూమి మూలం ఏమిటనేది శాస్త్రవేత్తలకు సైతం అంతుచిక్కని ప్రశ్నగా మిగిలింది. భూమి చరిత్ర ఏమిటి? అది ఎలా పుట్టింది? దీనిపై జీవం ఎలా మొదలైంది?.. ఇలాంటి కొన్ని ప్రశ్నలకు ఖచ్చితమైన సమాధానాలు ఇప్పటి వరకు వెల్లడికాలేదు. అయితే ఇప్పుడు గ్రావిటీ హోల్ దీనికి సరైన సమాధానం చెప్పనున్నది. దీని సాయంతో శాస్త్రవేత్తలు భూమి ఆవిర్భావానికి గల కారణాలను తెలుసుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. పరిశోధనలో ఏమి తేలింది? ఇటీవల బెంగుళూరులోని సెంటర్ ఫర్ ఎర్త్ సైన్సెస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ సంయుక్తంగా ఒక పరిశోధనను నిర్వహించాయి. హిందూ మహాసముద్రంలో గ్రావిటీ హోల్ ఉందన్న విషయాన్ని వారు గుర్తించారు. ఈ గురుత్వాకర్షణ కేంద్రం ఒక పురాతన సముద్ర అవశేషం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. లక్షల సంవత్సరాల క్రితమే ఈ సముద్రం భూమి నుండి కనుమరుగైంది. ఈ పరిశోధన భూ ఆవిర్భావ రహస్యాల పొరలను తెరిచింది. దీని సాయంతో రానున్న కాలంలో వీటి ఆధారంగా భూమి మూలానికి సంబంధించిన పలు విషయాలు తెలుసుకోగలమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. గురుత్వాకర్షణ రంధ్రం ఎంత లోతున ఉంది? పరిశోధకులు ఈ గురుత్వాకర్షణ రంధ్రంనకు ఐఓజీఎల్ అనే పేరు పెట్టారు. ఇది హిందూ మహాసముద్రంలో సుమారు రెండు మిలియన్ చదరపు మైళ్ల మేరకు విస్తరించి ఉంది. ఇక దీనిలోతు విషయానికి వస్తే ఇది భూమి క్రస్ట్ కింద 600 మైళ్లకు మించిన లోతున ఉంది. ఈ ఐఓజీఎల్ ఏనాడో అదృశ్యమైన టెథిస్ మహాసముద్రంలోని ఒక భాగమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం ఇది భూమి లోతుల్లో మునిగిపోయివుంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాగా గోండ్వానా, లారాసియా ఖండాలను టెథిస్ మహాసముద్రం వేరుచేసిందని కూడా శాస్త్రవేత్తలు చెబుతుంటారు. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం.. శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం ఈ గురుత్వాకర్షణ రంధ్రం సుమారు రెండు కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడి ఉంటుందని, ఇది రాబోయే కొన్ని మిలియన్ సంవత్సరాల వరకు అలాగే ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలా జరగడం వెనుక గురుత్వాకర్షణ శక్తి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమి విపరీతమైన గురుత్వాకర్షణ శక్తి గుండా వెళుతున్నప్పుడు ఈ గ్రావిటీ హోల్ ఏర్పడివుంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ గురుత్వాకర్షణ రంధ్రంపై జరిగిన పరిశోధన వివరాలు జియోఫిజికల్ రీసెర్చ్ లెటర్స్లో ప్రచురితమయ్యాయి. ఇది కూడా చదవండి: ‘స్మైలింగ్ డెత్’ అంటే ఏమిటి? చనిపోయే ముందు ఎందుకు నవ్వుతుంటారు? -
సుందర్ పిచాయ్,సత్య నాదెళ్ల మాత్రమేకాదు, ఈ టాప్ సీఈవోల గురించి తెలుసా?
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement