-
పెట్రో ధరల బాదుడుపై వామపక్షాల నిరసన
వన్టౌన్ (విజయవాడ పశ్చిమ): కేంద్ర ప్రభుత్వం ప్రజలపై వేసిన పెట్రో భారాలతో పేదల బతుకులు దుర్భరంగా మారాయని పలువురు వామపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీగా పెరిగిపోతున్న పెట్రో ధరలకు నిరసనగా సీపీఎం, సీపీఐ, ఇతర పది వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడలోని కాళేశ్వరరావు మార్కెట్ సెంటర్ వద్ద భారీ నిరసన కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు మాట్లాడుతూ.. మరో నెల రోజుల్లో పెట్రోల్ ధర లీటరు రూ.130కి చేరే ప్రమాదముందన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ.. పెట్రో ధరలతో పాటు, గ్యాస్, నిత్యావసరాల ధరలు అదుపు చేయటంలో మోదీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. నిరసనలో భాగంగా పి.మధు, కె.రామకృష్ణల నాయకత్వంలో వామపక్షాల నాయకులు ఒక్కసారిగా రాస్తారోకోలకు దిగారు. దీంతో ట్రాఫిక్ భారీగా స్తంభించింది. ఫలితంగా నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకొని వాహనాల్లో పోలీసుస్టేషన్లకు తరలించారు. నిరసనల్లో ప్రత్యేక హోదా సాధాన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్, సీపీఎం, సీపీఐ నేతలు సీహెచ్ బాబారావు, దోనేపూడి కాశీనాథ్, దోనేపూడి శంకర్, జి.కోటేశ్వరరావు తదితరులు పాల్గొని ప్రసంగించారు. -
చంద్రబాబూ.. అలాంటివి మానుకోండి
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, గవర్నర్ నరసింహన్ భేటి చూస్తే రాష్ట్రాన్ని కేంద్రం బెదిరించి లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నట్టు కనబడుతోందని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. మధు అన్నారు. అదే నిజమైతే బీజేపీకి రాష్ట్ర ప్రజలు తగిన బుద్ది చెప్తారని హెచ్చరించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... గవర్నర్ రాజకీయాల్లో తలదూర్చడం మంచిది కాదని సూచించారు. స్పీకర్ కోడెల శివప్రసాదరావు టీడీపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. స్వతంత్రంగా వ్యవహరించాల్సిన స్పీకర్ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని తెలిపారు. గవర్నర్, స్పీకర్ వ్యవహారంపై విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. హోదా పేరుతో దీక్షలు, హోమాలు చేస్తూ ముఖ్యమంత్రి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని విమర్శించారు. ఇలాంటి కార్యకలాపాలకు చంద్రబాబు వెంటనే స్వస్తి చెప్పాలని హితవు పలికారు. ముఖ్యమంత్రి దీక్షకు ఎంత ఖర్చు అయ్యిందో, ఎంతమంది విద్యార్థులను, డ్వాక్రా మహిళలను తీసుకువచ్చారో చంద్రబాబు చెప్పాలన్నారు. దక్షిణాది రాష్ట్రాల వాటాను దెబ్బతీసే విధంగా కేంద్రం వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోందని మధు పేర్కొన్నారు. రాష్ట్రాల ఆదాయ వనరులు కుచించుకుపోయే విధంగా పన్నుల్లో రాష్ట్రాల వాటాను కేంద్ర ప్రభుత్వం లాగేసుకుంటోందని ఆరోపించారు. ఆర్థిక సంఘాన్ని అడ్డుపెట్టుకుని రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీస్తోందని మండిపడ్డారు. ప్రత్యేక హోదాకు మద్దతుగా రేపు(మంగళవారం) సాయంత్రం 7 నుంచి 7.30 వరకు అరగంటపాటు విద్యుత్ నిలిపివేసి నిరసన తెలపాలని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
‘బాబూ..కమ్యూనిస్టులపై తప్పుడు ప్రచారం ఆపు’
పేదల కడుపుకొట్టి పెద్దలకు పరిశ్రమల పేరుతో భూములు కట్టబెట్టే చంద్రబాబు ప్రభుత్వ తీరు మారాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు డిమాండ్ చేశారు. కమ్యూనిస్టులు పరిశ్రమలను అడ్డుకుంటున్నారంటూ శాసనమండలిలో చంద్రబాబు వ్యాఖ్యానించడాన్ని మధు తప్పుబట్టారు. విజయవాడలోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. పరిశ్రమలకు తాము వ్యతిరేకం కాదని, పేదలు, రైతులను దెబ్బతీసి భూములను బడా పారిశ్రామికవేత్తలకు అప్పగించే చర్యలను మాత్రమే వ్యతిరేకిస్తామన్నారు. తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలంలో దివీస్ మందుల కంపెనీకి భూములు ఇవ్వడం వల్ల రైతులు, పేదలు, హేచరీలకు తీవ్ర నష్టం కలుగుతుందన్నారు. దాదాపు 2094 ఎకరాలను ఏపీఐఐసీ స్వాధీనం చేసుకుందని, వాటిలో 505 ఎకరాలను దివీస్ కంపెనీకి కట్టబెట్టారన్నారు. 600 మంది రైతులను పోలీసులతో బెదిరించి ప్రభుత్వం భూములు స్వాధీనం చేసుకుందని, ఇంకా 220మందికి పరిహారం ఇవ్వలేదన్నారు. ప్రభుత్వ తీరు వల్ల ఆ ప్రాంతంలో రూ.50 లక్షల నుంచి రూ. 3 కోట్ల చొప్పున పెట్టుబడులు పెట్టి ఏర్పాటు చేసుకున్న సుమారు 250 రొయ్య పిల్లల (సీడ్ ఉత్పత్తి) హేచరీలు మూతపడి 10 వేల మంది ఉపాధిని కోల్పోతారన్నారు. అక్కడ జీడిమామిడి తోటల సాగు జరుగుతోందని, ఎకరానికి ఏడాదికి కనీసం రూ.1.20 లక్షల ఆదాయం వస్తుందని చెప్పారు. ప్రభుత్వం మాత్రం ఆ భూమిని లాగేసుకుని రూ.1.80 లక్షల నుంచి రూ.3 లక్షల వరకే ధర నిర్ణయించడం సరికాదని అభ్యంతరం వ్యక్తం చేశారు. దివీస్ ప్యాక్టరీ ఏర్పాటుతో సముద్ర జలాలు కలుషితమై చేపలు చనిపోయి మత్స్యకారులు జీవన భతి దెబ్బతింటుందని, గాలి నీరు కలుషితమై ప్రజలు అనారోగ్యంబారిన పడతారని ఆందోళన వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తుందుర్రు ప్రాంతంలోను ప్రభుత్వం మెగా ఆక్వా ఫుడ్పార్క్కు అనుమతించి ప్రజలు, మత్స్యకారులు, రైతుల జీవనాన్ని దెబ్బతీస్తోందని ఆరోపించారు. రోజుకు 150 టన్నుల రొయ్యలు ప్రోసెసింగ్ జరిగే ఆక్వా ఫుడ్పార్క్ ఏర్పాటుతో వచ్చే వ్యర్థాలవల్ల గొంతేరు డ్రై న్ కాలుష్యం బారిన పడుతుందన్నారు. దీనివల్ల 4 మండలాల్లోని 40గ్రామాలకు కలుషిత నీరు దిక్కవుతుందన్నారు. చిరంజీవి స్వగ్రామం ఉన్న మొగల్తూరు కూడా కాలుష్యం కోరల్లో చిక్కుకుందని గుర్తు చేశారు. దీన్ని ఆపాలని ప్రజలు అనేక ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం మంకుపట్టు వదలకుండా పోలీసులను దించి భయాందోళనలకు గురిచేస్తోందని మండిపడ్డారు. ప్రజలకు ఇబ్బంది లేని ప్రాంతాల్లో పరిశ్రమలను ఏర్పాటుచేసుకోవాలన్నారు. దివీస్ మందుల ఫ్యాక్టరీని కాకినాడ సెజ్ ప్రాంతంలోను, తుందుర్రు ఆక్వా ఫుడ్పార్క్ తీర ప్రాంతంలోను ఏర్పాటుచేసుకోవాలని మధు విజ్ఞప్తి చేశారు. విలేకరుల సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వై.వెంకటేశ్వరరావు(వైవీ) కూడా పాల్గొన్నారు. -
బాబూ బుద్ధి తెచ్చుకో: మధు
రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్షంతో సహా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలు ఏకతాటిపై కదులుతున్నారని, ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుద్ధి తెచ్చుకుని రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు ధ్వజమెత్తారు. విభజన హామీల అమలు కోరుతూ విజయవాడ లెనిన్ సెంటర్లో వామపక్షాల ఆధ్వర్యంలో శుక్రవారం సామూహిక దీక్షలను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతో కలిసి మధు ప్రారంభించారు. మధు మాట్లాడుతూ చంద్రబాబుకు దిమాగ్ ఖరాబైందని, అందుకే పొంతనలేని మాటలతో అబద్ధాలు అడుతున్నారని విమర్శించారు. ప్రతిపక్షాల ఆందోళనలు అవసరం లేదని, అఖిలపక్షం అక్కర్లేదని చెబుతున్న బాబు ప్రతిపక్ష నేతగా పాదయాత్రలు, ఆందోళనలు ఎందుకు చేశారని ప్రశ్నించారు. బంద్ విజయవంతం కారణంగానే ప్రధాని మోదీ నుంచి బాబుకు పిలుపు వచ్చిందనే సంగతి గుర్తుంచుకోవాలన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం బంద్ విజయవంతం చేసిన ప్రతిపక్షాలు, ప్రజలను చంద్రబాబు అభినందించాలన్నారు. -
'చంద్రబాబు తీరు దారుణం'
నెల్లూరు : ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంకుశ ధోరణి అవలంబిస్తూ రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయాలని పిలుపునివ్వడం దారుణమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు అన్నారు. నెల్లూరు నగరంలో మంగళవారం సీపీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రచార ఆర్భాటాలు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనడం, ప్రజా సంఘాలను చీల్చడం తప్ప... ప్రజలకు చేసిందేమీ లేదని... చంద్రబాబుపై మధు నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ప్రజలు వివిధ సమస్యలతో అల్లాడుతుంటే చంద్రబాబు మాత్రం ఇతర దేశాలు పట్టుకుని తిరుగుతూ ప్రచార ఆర్భాటాలు చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కరువు ముంచుకొస్తూ ఒక పక్క రైతులు ఆత్మహత్యలు, మరో పక్క బతకలేక ఇతర రాష్ట్రాలకు వలస వెళుతుంటే ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి తీసుకురావాల్సిన నిధుల విషయంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాల్లో ఒక్క ప్రజా సమస్య కూడా చర్చకు రాకుండా ప్రతిపక్షం గొంతునొక్కే ప్రయత్నం చేయడంతోనే అధికార టీడీపీ కాలం వెళ్ల తీసిందన్నారు. ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి చండ్ర రాజగోపాల్ పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నీటికుంటలో పడి వ్యక్తి మృతి
ఐదు గ్యారెంటీలు తాత్కాలికమే
బహిరంగ ప్రచారానికి తెర
మరో బిగ్ మ్యాచ్.. సన్రైజర్స్ ముంబైని ఓడిస్తేనే!
Adaa Khan: ఏంజెల్లా మెరిసిపోతున్న సీరియల్ బ్యూటీ (ఫోటోలు)
పోలింగ్కు సర్వం సిద్ధం
ప్రజ్వల్పై కఠిన చర్యలు తీసుకోవాలి
ప్రభుత్వాలు రైతులను ఆదుకోవడం లేదు
ఎంపీ ప్రజ్వల్ను అరెస్ట్ చేయాలి
మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండండి
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- ఐపీఎల్ చరిత్రలో అత్యద్భుతమైన క్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- రూటే సెపరేటు
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement