-
గిరిజన సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పాలి
సీతంపేట: గిరిజన సంస్కృతి సంప్రదాయాలను బయట ప్రపంచానికి చాటిచెప్పాలని పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి పిలుపునిచ్చారు. సీతంపేట బాలికల గిరిజన గురుకుల బాలికల పాఠశాలలో జరుగుతున్న రాష్ట్రస్థాయి ఆదివాసీ నృత్యాల శిక్షణా రీతులను మంగళవారం ఎమ్మెల్యే పరిశీలించారు. గిరిజన బాలికలతో కలిసి కాసేపు నృత్యాలు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ ఎస్.లక్ష్మి, ఎంపీటీసీ సభ్యురాలు బి.జయలక్ష్మి, డిప్యూటీ డీఈవో వి.మల్లయ్య, గురుకుల సెల్ ఇన్చార్జి వెంకటేశ్వర్లు, ప్రిన్సిపాళ్లు సురేష్, యుగంధర్, యూత్కన్వినర్ మోహన్రావు, గణేష్ పాల్గొన్నారు. -
ప్రచారం కోసమే గిరిజనులకు మోసం
పాలకొండ రూరల్: ప్రభుత్వం కేవలం తమ ప్రచారం కోసం గిరిజనులను మోసం చేస్తోందని పాలకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి అన్నారు. మంగళవారం పాలకొండలో విలేకరులతో మాట్లాడారు. సీతంపేట ఐటీడీఏకు చంద్రన్న సంక్షేమ పథకాల పంపిణీకి రానున్న గిరిజన మంత్రి రావెల కిషోర్బాబు కేవలం ప్రచారం చేసుకునేందుకు వస్తున్నారే తప్ప గిరిజనులపై ప్రేమతో కాదన్నారు. ఇటీవల జరిగిన గవర్నింగ్బాడీ సమావేశాల్లో ఇక్కడ పేరుకుపోయిన సమస్యలు చర్చించడానికి వీలుకుదుర్చుకోలేని మంత్రి గిరిజనుల శ్రేయస్సుకు ఏం చేయగలని ప్రశ్నించారు. ఒక్కనాడైనా రాష్ట్రాంలో ఉన్న ఆరుగురు గిరిజన ఎమ్మెల్యేలతో చర్చించని మంత్రి నిర్లక్ష్యధోరణి వల్ల గిరిజన యువత, విద్యార్థులు, వసతి గృహాలు, సంక్షేమ, అభివృద్ధి పనులకు ఆటంకం వాటిల్లిందన్నారు. స్థానికంగా విద్యార్థుల పుస్తకాలు, యూనిఫారాలు, క్రీడా పరికరాలు, మైదానాలు పూర్తిస్థాయిలో లేని విషయాన్ని గుర్తించారా అని, కరువు మండలాలుగా ప్రకటించిన బామిని, సీతంపేటలకు ఏం లాభం ఒనగూర్చారని ప్రశ్నించారు. కేవలం 1300ల మందికి లబ్ధిచేకూర్చేందుకు వస్తున్న మంత్రి వల్ల గిరిజనుల సొమ్ము వృథాగా పోతుందన్నారు. జిల్లాలో లక్షల మంది గిరిపుత్రులు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్నారని, వీటిపై దృష్టిసారించడంలో విఫలమయ్యారని పేర్కొన్నారు. సీతంపేటలో ఒకరోజు పర్యటిస్తే ప్రజల సమస్యలు అర్ధమవుతాయన్నారు. సమావేశంలో సీతంపేట ఎంపీపీ, జెడ్పీటీసీలు సవర లక్ష్మి, పి.రాజబాబు, జిల్లా వైఎస్సార్ సీపీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు దుర్గారావు, సర్పంచ్లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సికింద్రాబాద్–ఖుర్దారోడ్ మధ్య స్పెషల్ రైళ్లు
అవినీతి శ్రీశైలం కొండంత
బీజేపీ అభ్యర్థిపై ‘ఆప్’ ఆంక్షలు.. తగ్గేదే లేదన్న క్యాండిడేట్!
చంద్రబాబు బాటలోనే రెండు కళ్ల సిద్ధాంతం అంది పుచ్చుకున్న బిజెపి
జిల్లాలో 14,162 వేల మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగం
సింహగిరి.. భక్త ఝరి
ఎన్నికల విధుల్లో ట్రైనీ ఐపీఎస్ అధికారులు
వైఎస్సార్సీపీలో భారీగా చేరికలు
రేపే అప్పన్న చందనోత్సవం
రాజకీయ పోరు
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ఐదో విడత బరిలో..695 మంది
- అ్రస్టాజెనెకా టీకాలు వెనక్కి
- ఐఏఎఫ్ కాన్వాయ్పై దాడి ఘటన..
- నాడు తిట్లు.. నేడు కౌగిలింతలు!
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- ‘సూపర్ సీఎం’ పాండియన్!
- షర్మిలా.. మా బకాయిలిచ్చేయ్!
- భరత్.. వైజాగ్ ఇప్పుడు గుర్తొచ్చిందా?
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
Advertisement