-
పాలరాపు గుట్టల్లో గ్రిఫెన్ రాబందులు
పెంచికల్పేట్ (సిర్పూర్): కుమురంభీం జిల్లా పెంచికల్పేట మండలంలోని ప్రాణహిత, పెద్దవాగు సంగమ ప్రాంతంలోని నందిగామ వద్ద గల పాలరాపు గుట్టల్లోకి రెండు గ్రిఫెన్ రాబందులు వలస వచ్చాయి. ఇక్కడున్న పొడుగు ముక్కు రాబందుల సంరక్షణ కేంద్రంలో భిన్నంగా ఉన్న రెండు రాబందులను గుర్తించి ఉన్నతాధికారులకు వాటి ఫొటోలను పంపారు. వాటిని హిమాలయ పర్వతశ్రేణిలో నివాసం ఉండే హిమాలయన్ గ్రిఫెన్ రాబందులుగా గుర్తించినట్లు కాగజ్నగర్ ఎఫ్డీవో రాజారమణ రెడ్డి తెలిపారు. ఏటా శీతాకాలంలో నార్త్ ఇండియా హిమాలయాల నుంచి దక్షిణ భారతదేశంలోని కేరళ, కర్ణాటక, ఏపీలోని కోస్తా ప్రాంతాలకు రాబందులు వలస వస్తుంటాయని అధికారులు తెలిపారు. కానీ తొలిసారిగా రాష్ట్రంలోని పాలరాపు గుట్ట వద్ద స్థావ రం ఏర్పరుచుకున్నాయని వివరించారు. ఇవి పొడుగుముక్కు రాబందుల కంటే పెద్దగా ఉన్నాయని, రోజూ వాటి దినచర్యను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. -
రా.. రాబందు
♦ పాలరపు సంరక్షణ కేంద్రంలో 30కి చేరిన సంఖ్య.. ♦ రాబందులకు పశుమాంసం అలవాటు చేస్తున్న అటవీ అధికారులు సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: దేశంలో వేగంగా అంతరించి పోతున్న రాబందుల జాతిని సంరక్షించేందుకు అటవీ శాఖ చేపట్టిన చర్యలు కొంతమేరకు ఫలితాలనిస్తున్నాయి. గతేడాదితో పోల్చితే వీటి సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్లు రాబందుల సంరక్షణ ప్రాజెక్టు అధికారులు గుర్తించారు. గతేడాది 19 పెద్ద రాబందులు, ఎనిమిది చిన్న రాబందులున్నట్లు గుర్తించిన అధికారులు, ఈ ఏడాది పెద్ద రాబందుల సంఖ్య 24కు పెరిగినట్లు తేల్చారు. చిన్నవి ఆరు ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా వీటి ఆహారం అలవాట్లలో కూడా మార్పులు వస్తున్నట్లు వారంటున్నారు. వేటా డే అలవాటు లేని రాబందులు చనిపోయిన జంతు కళేబరాలను మాత్రమే తిని జీవిస్తాయి. అయితే, వీటి సంరక్షణలో భాగంగా అధికారులు గతేడాది నుంచి రాబందులకు పశుమాంసాన్ని అలవాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పశువులను కొనుగోలు చేసి, చంపి వాటిని రాబందుల స్థావరాల వద్ద పడేస్తున్నారు. రాబందులు ఆకలితో అలమటించకుండా ఈ ఏర్పాటు చేశారు. అయితే, గతేడాది చేసిన ఈ ప్రయత్నం ఫలించలేదు. తాజాగా ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి మాసాల్లో ఇలాంటి ప్రయత్నం చేయగా, ఈ మాంసాన్ని రాబందులు తినడం ప్రారంభించాయని రాబందుల సంరక్షణ ప్రాజెక్టు ఫీల్డ్ రీసెర్చ్ బయోలజిస్టు రవికాంత్ పేర్కొన్నారు. పాలరపుగుట్ట స్థావరంగా.. ఆదిలాబాద్ జిల్లా బెజ్జూరు అటవీ రేంజ్ పరిధి మొర్లిగూడ శివారులోని పాలరపు గుట్ట వద్ద రాంబందుల స్థావరాలను అటవీ శాఖ అధికారులు 2014లో గుర్తించారు. ఇక్కడ తప్ప తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా వీటి ఉనికి లేదు. కేవలం మహారాష్ట్ర సరిహద్దుల్లోని ప్రాణహిత-పెద్దవాగు సంగమం సమీపంలో మాత్రమే వీటి సంచారం ఉంది. దీంతో ఈ ప్రాంతాన్ని పొడవు ముక్కు రాబందుల సంరక్షణ (లాంగ్బిల్ట్ వల్చర్స్ కన్జర్వేటివ్) ప్రాజెక్టుగా 2015లో గుర్తించారు. ఎత్తై ఈ పాలరపు గుట్టలో రాబందులు గూడు కట్టుకునేందుకు వీలుగా సహజసిద్ధమైన బొయ్యారాలున్నాయి. సుమారు 40 వరకు ఈ బొయ్యారాలున్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ఒక్కో గూటిలో ఒక్కో జంట రాబందులు నివాసముంటాయి. ప్రస్తుతం 12 గూళ్లలో 24 రాబందులున్నట్ల్లు, ఆరింటిలో జంటలతో పాటు, ఒక్కో పిల్ల రాబందులున్నట్లు గుర్తించారు. ఏటా ఫిబ్రవరి, మార్చి మాసాల్లో ఇవి గుడ్లు పెడుతుంటాయి. జంట రాబందులు కలిసి ఈ గుడ్లను పొదిగితే పిల్లలు వస్తుంటాయి. ఆరు మాసాల్లో ఈ పిల్లలు బయటకు ఎగిరిపోతున్నాయి. వీటి సంరక్షణ చర్యల్లో భాగంగా అటవీ శాఖ ఈ కొండ చుట్టు కొంత భాగం ఫెన్సింగ్ వేశారు. వీటి కదలికలను గమనించేందుకు ఎత్తై మంచెను ఏర్పాటు చేశారు. నలుగురు ఫారెస్టు వాచర్లను, ఫీల్డ్ రీసెర్చ్ బయోలజిస్టును నియమించామని ఫారెస్టు రేంజ్ అధికారి మాడిచెట్టి రాంమోహన్ తెలిపారు. మొత్తానికి అంతరించిపోతున్న రాబందుల జాతిని సంరక్షించేందుకు అధికారులు చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇస్తుండడంతో జంతు ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఫెడరల్ బ్యాంక్ ఫ్లాట్
అలా విమర్శించిన.. కాంగ్రెస్, బీజేపీపై చర్యలు
Madhumita Murgia: డీప్ఫేక్ గుట్టు ఆమెకు తెలుసు
మేనిఫెస్టోలో మోదీ.. యాడ్స్లో పవన్ ఫొటోలు ఎందుకు లేవు
కాంగ్రెస్ ‘సోషల్’ టీంలో ఐదుగురు అరెస్ట్
నేను గెలుస్తానో లేదో..
దొరుకుతున్నవన్నీ ‘పచ్చ’నోట్లే!
సెలబ్రిటీలతో ఎయిర్బీఎన్బీ జట్టు..
కర్నూలు ప్రెస్కు అరుదైన అవకాశం
14 నియోజకవర్గాల్లో 100 శాతం వీడియో నిఘా
తప్పక చదవండి
- బీజేపీతో జోడీ లేకపోతే ఈడీ
- అలా విమర్శించిన.. కాంగ్రెస్, బీజేపీపై చర్యలు
- దొరుకుతున్నవన్నీ ‘పచ్చ’నోట్లే!
- Israel-Hamas war: కాలిఫోర్నియా వర్సిటీలోకి పోలీసులు
- ఉద్యోగుల ఫ్రెండ్లీ సీఎం
- Bobbili: వాటీజ్ దిస్ ‘బేబీ’?
- ఏపీలో జగన్తోనే ముస్లిం రిజర్వేషన్లు: అసదుద్దీన్ ఒవైసీ
- ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించండి: ఎంపీ బండి సంజయ్
- బాబు మార్కు దందా.. బినామీలకే సంపద
- జయరాం.. రాం!
Advertisement