-
పాలేరులో 90 శాతం పోలింగ్
ఖమ్మం: ఖమ్మం జిల్లా పాలేరు ఉపఎన్నికల్లో ఓటర్లు ఉత్సాహం కనబరిచారు. ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు ప్రజలు వెల్లువలా తరలివచ్చారు. పాలేరు ఉప ఎన్నిక సోమవారం సాయంత్రం 6 గంటలకు ముగిసింది. ఈ ఎన్నికల్లో 90.01 శాతం పోలింగ్ నమోదైంది. అన్ని కేంద్రాల్లో ఉదయ 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా ఓటర్లు పెద్ద సంఖ్యలో ముందుకు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంతో భారీగా పోలింగ్ నమోదైంది. 2014 జరిగిన ఎన్నికల్లో జిల్లాలోనే అత్యధికంగా పాలేరు నియోజకవర్గంలో 92 శాతం పోలింగ్ నమోదైంది. ఉప ఎన్నికలో సైతం అదే స్థాయిలో ఓటింగ్ నమోదయింది. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ నెల 19న ఫలితాలు వెలువడనున్నాయి. -
పోలీసులు తనిఖీలు: రూ. 8 లక్షలు స్వాధీనం
ఖమ్మం : ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలోని సుబ్లేయిడ్ వద్ద పోలీసులు గురువారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కారులో కరీంనగర్ నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న రాజు అనే వ్యాపారి నుంచి రూ.8 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. పాలేరు ఉప ఎన్నిక జరుగుతున్న విషయం తెలియక జిల్లా సరిహద్దులోకి ప్రవేశించినట్లు వ్యాపారి తెలిపాడు. రైతులకు చెల్లించాల్సిన బకాయిల కోసం ఈ డబ్బు తీసుకెళ్తున్నట్లు వ్యాపారి పోలీసులకు తెలియజేశాడు. జిల్లాలోని పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక మే 16వ తేదీన జరగనుంది.ఈ నేపథ్యంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఆ క్రమంలో పోలీసులు సదరు నగదును స్వాధీనం చేసుకున్నారు. -
వరంగల్ నేతలకు పాలేరు బాధ్యతలు
ఖమ్మం: ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికలను చాలెంజ్గా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ.. ప్రచారం బాధ్యతలను వరంగల్ జిల్లా నేతలకు అప్పగించింది. వరంగల్ జిల్లాకు చెందిన మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకట రమణారెడ్డి, వరంగల్ జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ నాయిని రాజేందర్రెడ్డి లకు ఖమ్మం ఎన్నికల కార్యాలయం, మీడియా వ్యవహారాలను అప్పగించారు. కూసుమంచి మండల బాధ్యతలను దొంతి మాధవరెడ్డికి, డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డికి తిరుమలాయపాలెం మండల బాధ్యతలను అప్పగించారు. ఎన్నికల కో ఆర్డినేటర్గా టీపీసీసీ శాశ్వత ఆహ్వానిత కమిటీ సభ్యుడు కొండపల్లి దయాసాగర్, టీ పీసీసీ ప్రధాన కార్యదర్శి బక్క జడ్సన్, సోషల్ మీడియా వ్యవహారాలను చూసుకుంటారని టీపీసీసీ ఒక ప్రకటనలో పేర్కొంది. -
‘పాలేరు’లో తిరుగులేని ‘పాచిక’
తెలంగాణలో కొడిగడుతున్న దీపం తెలుగుదేశం, తన అభ్యర్థిని పోటీ పెట్టకుండా కాంగ్రెస్కు మద్దతు ఇవ్వడం హాస్యాస్పదంగా ఉంది. బహుశా తెలంగాణ టీడీపీ నాయకత్వం మాజీ ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి సలహాలు ఇంకా తీసుకుంటున్నట్టు కనిపిస్తున్నది. కిరణ్కుమార్రెడ్డి సీఎంగా ఉన్నంత కాలం ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శాసనసభలో ఆయన (కిరణ్) చెప్పినట్టే నడుచుకున్నారు కదా! కానీ కాంగ్రెస్, టీడీపీ స్నేహం ప్రజలకు పెద్దగా రుచించదు. ఖమ్మం జిల్లా పాలేరు శాసనసభ ఉప ఎన్నిక ఏకగ్రీవంగా జరగాలని ఇంతకు ముందే కాంగ్రెస్ పార్టీ నుంచి విన్నపం వచ్చింది. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీమంత్రి, ఖమ్మం జిల్లా పాలేరు శాసనసభ్యుడు రాంరెడ్డి వెంకటరెడ్డి మరణానంతరం తెలంగాణ శాసనసభ రివాజుగా నివాళులు అర్పించింది.ఆ సందర్భంలో అదే జిల్లాకు చెందిన మరో కాంగ్రెస్ శాసన సభ్యుడు పువ్వాడ అజయ్కుమార్, పాలేరు స్థానానికి కాంగ్రెస్ ఎంపిక చేసే వెంకటరెడ్డి కుటుంబ సభ్యులెవరినైనా ఏకగ్రీవంగా గెలిపించాలని అన్ని పార్టీ లకూ విజ్ఞప్తి చేశారు. కుటుంబ సభ్యులను ఏకగ్రీవంగా గెలిపించాలన్న ప్రతిపాదనే ప్రజాస్వామ్యంలో ఆరోగ్యకరమైనది కాదు. దివంగత నేత కుటుంబంలో అర్హతలు కలిగిన వారుంటే స్వయంకృషితో రాజకీయాల్లో నిల దొక్కుకోవాలి. అలా జరగాలే తప్ప ఏకగ్రీవాల వల్ల ఎక్కువకాలం ఎవరూ మనలేరు. అయినా గతంలో కొన్ని సందర్భాలలో ఇటువంటి సంప్రదా యాన్ని పాటించారు కాబట్టి అజయ్ అట్లా అభ్యర్థించడంలో తప్పులేదు. ఆయన కూడా కొత్తగా శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. రాజకీయాలకు సంబంధించి నిన్న మొన్నటి వరకు అజయ్ తండ్రి చాటు బిడ్డే. ఆయన తండ్రి పువ్వాడ నాగేశ్వరరావు కమ్యూనిస్ట్ నాయకుడు. సుదీర్ఘ రాజకీయ జీవితం ఆయనది. మొత్తం కమ్యూనిస్ట్ పార్టీలోనే కూడా. తండ్రి అడుగుజాడల్లో కమ్యూనిస్ట్ పార్టీలో కాకుండా, కాంగ్రెస్లో చేరి శాసనసభ్యుడయ్యారు అజయ్. కొద్దిరోజులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా పనిచేశారు. అజయ్ తండ్రి ప్రస్తావన ఎందుకంటే ఖమ్మం, నల్లగొండ జిల్లాలలో ఒకప్పుడు ఉభయ కమ్యూనిస్ట్ పార్టీల ప్రభావం చాలా ఎక్కువ. ఆ వైభవం రానురాను తగ్గి ఇప్పుడు తెలంగాణ శాసనసభలో ఆ పార్టీలు రెండు స్థానాలకు పరి మితం కావలసి వచ్చింది. 2014 ఎన్నికలలో ఖమ్మం నుంచి సీపీఎం సభ్యుడు, నల్లగొండ నుంచి సీపీఐ సభ్యుడు గెలిచారు. అంతకు ముందు ఒక సారి కాంగ్రెస్తో, ఇంకొకసారి తెలుగుదేశంతో పొత్తుల కారణంగా, తమ రెండు పార్టీలకూ ఉన్న బలం కారణంగా, ఎలా అయితేనేమి కమ్యూనిస్టులు కొన్ని స్థానాలు గెలుస్త్తూ ఉండేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. ఎన్నికల రాజకీ యాల్లో కమ్యూనిస్ట్ల పరిస్థితి దేశమంతటా ఎట్లా ఉందో ఖమ్మం జిల్లాలో కూడా అట్లాగే తయారయింది. ఇవన్నీ ఆలోచించే అజయ్కుమార్ తండ్రి బాట వీడి కాంగ్రెస్ దారిన నడిచి ఉంటారు. తాను శాసనసభ్యుడిగా గెలి చారు, ఈ మధ్యనే జరిగిన ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పది డివిజన్లలో కాంగ్రెస్ గెలవడానికి కృషి చేశారు. కాంగ్రెస్లో ఉంటే మంచి భవిష్యత్ ఉంది. మరి పాలేరు ఎన్నికను ఏకగ్రీవం చేసి కాంగ్రెస్ అభ్యర్ధిని గెలిపిద్దామన్న పువ్వాడ అజయ్, సరిగ్గా ఆ ఎన్నికల ముంగిట్లో పార్టీ ఫిరా యించి తెరాసలో ఎందుకు చేరారు? కాంగ్రెస్ భవిష్యత్తు మీద నమ్మకం లేక తన భవిష్యత్తును తానే నిర్మించుకోవాలని అనుకున్నా రేమో! గులాబీ రంగుకు దూరంగా ఖమ్మం జిల్లాకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కు సరిహద్దు జిల్లా కాబట్టి తెలంగాణ వాదం ఎంత బలంగా ఉన్నదో, వ్యతిరేక వర్గం కూడా అంత బలంగానూ ఉండేది. నిజానికి మొదట తెలంగాణ ఉద్యమానికి నాంది, అంటే 1969 ఉద్యమానికి, ఖమ్మం జిల్లాలోనే. అప్పటి రాష్ట్ర హోం మంత్రి జలగం వెంగళరావు ఖమ్మం పర్యటనలో ఉండగా ఆయన కారు మీద బాంబు దాడికి విఫలయత్నం జరిగిన విషయం చాలామందికి తెలిసి ఉండదు. ఆ తరువాత దశ తెలంగాణ ఉద్యమానికి ఖమ్మం జిల్లాలో ఊతం ఇచ్చిన నాయకులు చాలామందే ఉండేవారు, ముఖ్యంగా ఉద్యోగవర్గాల్లో. 2001లో చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ర్ట సమితిని స్థాపించి ప్రత్యేక రాష్ర్ట ఉద్యమాన్ని ముందుకు ఉరికించినప్పుడు ఖమ్మం జిల్లా ఆ మార్గంలో వెనకబడి, పదో స్థానంలో ఉండేది. మలిదశ ఉద్యమ కాలంలో రెండు సార్వత్రిక ఎన్నికలొచ్చినా తెలంగాణ రాష్ర్ట సమితికి అభ్యర్థులు కూడా లభించని పరిస్థితి. ఉద్యమం ఉధృతంగా ఉన్న ఉత్తర తెలంగాణ జిల్లాలు - కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్; మెదక్ జిల్లా కొంత భాగం మాత్రమే గట్టిగా టీఆర్ఎస్ వెంట నడిచాయి. జంట నగరాలు సరే సరి. దక్షిణ తెలంగాణలో కూడా ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష బలంగా ఉన్నా ఉద్యమ నిర్మాణం ఉత్తర తెలంగాణలోనే ఎక్కువ. అయితే రాష్ర్టం ఏర్పడే నాటికి పరిస్థితి మారి దక్షిణ తెలంగాణ కూడా టీఆర్ఎస్ వశం కావడం చూశాం. ఖమ్మం మాత్రం అలాగే ఉండిపోయింది. ఉద్యమకాలంలో ఎలా ఉందో, 2014 ఎన్నికల్లో కూడా అదే పరిస్థితి కొనసాగింది. శాసనసభ స్థానాలు పది, ఒక పార్లమెంట్ స్థానం జిల్లాలో ఉంటే టీఆర్ఎస్ ఒక్క చోట కూడా గెలవని పరిస్థితి. నాలుగుచోట్ల కాంగ్రెస్, మూడుచోట్ల వైఎస్ఆర్సీపీ, ఒక్కో స్థానంలో టీడీపీ, సీపీఎం, స్వతంత్రులు గెలిచారు. రాష్ర్ట సాధన తరువాత ముఖ్య మంత్రి స్వయంగా చెప్పినట్టు ఉద్యమ పార్టీ ఫక్తు రాజకీయ పార్టీగా రూపాంతరం చెందింది కాబట్టి ఖమ్మం జిల్లాను అలా వదిలేయడానికి వీల్లేదు. మరేం చేయాలి? 2019 సార్వత్రిక ఎన్నికల వరకూ అలా వదిలేస్తే రాజకీయంగా నష్టం జరుగుతుంది. జిల్లాలో ఒక్క ప్రజా ప్రతినిధి కూడా లేకుండా వచ్చే ఎన్నికల నాటికి లేదా ఈ మధ్యలో వచ్చే ఏ ఎన్నికకయినా పార్టీని నడిపించడం ఎలా? ముఖ్యమంత్రికి ఆ జిల్లాతో మరో అనుభవం కూడా ఉంది. 2009లో ఆయన కరీంనగర్ నుంచి బయలుదేరి మెదక్ జిల్లాలో ఆమరణ నిరాహార దీక్ష చేయబూనినప్పుడు దానిని భగ్నం చేసి ఖమ్మం జిల్లాలోనే నిర్బంధించారు. అది ఆయనకు చేదు అనుభవం కూడా. ఈ కారణాలన్నింటివల్లా ఖమ్మం జిల్లాలో ఫిరాయింపులకు తెరలేపారు. తొలి నాళ్లలోనే ఒక స్వతంత్ర శాసనసభ్యుడు, ఇద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్పార్టీ సభ్యులు అధికార పార్టీలో చేరిపోయారు. ఇప్పుడు అజయ్ కూడా చేరడంతో జిల్లాలో అధికార పార్టీ బలం నాలుగుకు పెరిగింది. పాలేరుకు ఎన్నిక రావడంతో జిల్లాలో కాంగ్రెస్ బలం రెండుకు పడిపోయింది. అందులో ఒకరు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కార్యనిర్వాహకాధ్యక్షులు మల్లు భట్టివిక్రమార్క. ఇక పాలేరు ఉప ఎన్నిక దగ్గరికే వద్దాం. టీఆర్ఎస్ బరిలోకి దింపిన రాష్ర్ట మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆ జిల్లా పాత కాపు. చాలాకాలం తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రి. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావుకు సన్నిహిత మిత్రుడు. ప్రస్తుతం తుమ్మల శాసనమండలి సభ్యుడిగా మంత్రివర్గంలో కొనసాగుతున్నారు. ఆయనను పాలేరు బరిలో దింపడం ద్వారా ఖమ్మం జిల్లాలో రాజకీయ శక్తిగా బలోపేతం కావడం ముఖ్యమంత్రి ఆలోచన. పార్టీ ప్లీనరీ ఖమ్మంలో నిర్వహించాలన్న నిర్ణయం కూడా అందులో భాగంగానే చూడాలి. చేతికొచ్చిన సైకిలు ఇక కాంగ్రెస్లో ఉండగా పువ్వాడ అజయ్ చేసిన పాలేరు ఉప ఎన్నిక ఏకగ్రీవం అంశానికి వస్తే, అన్నీ సరిగ్గా ఉంటే ఏకగ్రీవాలు ఫర్వాలేదేమో కానీ, ఖమ్మం వంటి జిల్లాలో టీఆర్ఎస్ ఎందుకు ఒక స్థానాన్ని వదులు కుంటుంది? అయినా ఇంకా దుఃఖభారం నుండి కోలుకోని దివంగత నాయకుడి సతీమణిని బరిలోకి దింపి, వారి చేతనే ఏకగ్రీవం కోసం ఇతర పార్టీలను అభ్యర్ధింప చేయడం చాలా ఎబ్బెట్టుగా ఉంది. ఇక తెలంగాణలో కొడిగడుతున్న దీపం తెలుగుదేశం, తన అభ్యర్థిని పోటీ పెట్టకుండా కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వడం హాస్యాస్పదంగా ఉంది. బహుశా తెలంగాణ టీడీపీ నాయకత్వం మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్కుమార్ రెడ్డి సలహాలు ఇంకా తీసుకుంటున్నట్టు కనిపిస్తున్నది. కిరణ్కుమార్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు శాసనసభలో ఆయన(కిరణ్) చెప్పినట్టే నడుచుకున్నారు కదా! కానీ కాంగ్రెస్, టీడీపీ స్నేహం ప్రజలకు పెద్దగా రుచించదు. కాంగ్రెస్ వ్యతిరేకతే పునాదిగా పుట్టిన తెలుగుదేశం, చివరికి కాంగ్రెస్తో జతకట్టడం ఆ పార్టీ పరిస్థితిని స్పష్టం చేస్తున్నది. ఏకగ్రీవం కోసం ప్రయత్నించకుండా కాంగ్రెస్ తన సిట్టింగ్ స్థానాన్ని తానే తిరిగి పొందాలన్న ఉత్సాహంతో ఎన్నికలకు వెళ్లి ఉంటే చతుర్ముఖ పోటీలో గెలుపు అవకాశాలు ఉండేవి. తెలుగుదేశం తన అభ్యర్ధిని దింపి ఉంటే శ్రేణులు, అభిమానులు (ఇంకా మిగిలి ఉంటే) అటు పని చేసేవారు, కమ్యూనిస్టుల ఓట్లు సీపీఎం అభ్యర్ధి తీసుకునేవారు. అందరి మద్దతుతో బయటపడాలన్న దుగ్ధ వల్ల కాంగ్రెస్ పాలేరులో అసలుకే మోసం తెచ్చుకున్నట్టున్నది. తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తరువాత ఒక్క ఎమ్మెల్సీ ఎన్నిక మినహాయిస్తే అధికార పార్టీ ఓడిందెక్కడా లేదు. పాలేరు అదే బాట పట్టే సూచనలున్నాయి. మొత్తానికి పాలేరులో తుమ్మల నాగేశ్వరరావు గెలిస్తే దొడ్డిదారిన మంత్రి అయ్యారన్న విమర్శ నుంచి బయటపడతారు. ఖమ్మం జిల్లాలో పార్టీ తరఫున ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచిన నాయకుడు ఒకరయినా ఉన్నారని చెప్పుకునే వీలు అధికార పక్షానికి కలుగుతుంది. datelinehyderabad@gmail.com - దేవులపల్లి అమర్
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
ధోని నా తండ్రి లాంటి వారు: ‘బేబీ మలింగ’ కామెంట్స్ వైరల్
వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి
మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
ఏడాది తర్వాత ఓటీటీలోకి హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఆ సమస్యతో చాలా బాధపడ్డా, కానీ అదే కాపాడింది : సారా టెండూల్కర్
సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
బెంగాల్ గవర్నర్పై ఆరోపణలు: విచారణ జరపాలన్న మిసా భారతి
డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు
Pooja Hegde: రెడ్ డ్రెస్సులో అగ్గి రాజేస్తున్న బుట్టబొమ్మ (ఫోటోలు)
తప్పక చదవండి
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
- షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
- మరీ అంత చెత్త ఆటగాళ్లలా కనిపిస్తున్నారా?: సెహ్వాగ్ చురకలు
- భారీ ఆఫర్ను రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కారణం ఇదేనట
- Happy Birthday Trisha : 25 ఏళ్ల కెరియర్లో వివాదాలతో పాటు కోట్లలో ఆస్తులు
- Hindupur: కుచ్చుటోపీ చుట్టాలొచ్చారోచ్! ఉండండి టోపీ పెడతాం...
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
Advertisement