-
సంక్షామమే
పాలమూరు : సంక్షేమ వసతిగృహాల్లో చేరిన విద్యార్థులకు క్షేమం లేకుండా పోయింది. గ్రామీణ ప్రాంతాల్లోని హాస్టళ్లలో మౌలిక సదుపాయాల్లేక విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడాల్సి వస్తోంది. జిల్లా కేంద్రం, ముఖ్య పట్టణాల్లోని కొన్ని హాస్టళ్లలో తప్ప ఇతరచోట్ల తగిన సౌకర్యాలు లేవు. అపరిశుభ్ర వాతావరణం.., దోమల బెడద.., నిద్రపోదామంటే బెడ్షీట్లు లేవు.. ఇదీ.. జిల్లాలోని సంక్షేమ హాస్టల్ విద్యార్థుల అవస్థ. జిల్లాలోని హాస్టళ్లలో విద్యార్థుల ఇబ్బందులపై బుధవారం ‘సాక్షి’ విజిట్ నిర్వహించింది. దీనిలో అనేక విషయాలు బయటపడ్డాయి. 80 శా తం హాస్టళ్లలో రాత్రి 7 గంటలు దాటితే వా ర్డెన్లు, సిబ్బంది ఉండడం లేదు. దీంతో విద్యార్థులు రాత్రంతా బిక్కు బిక్కుమంటూ గడపాల్సి వస్తోంది. మండలాల్లోని హాస్టళ్లకు కాంపౌండ్ నిర్మాణాల్లేవు. మంచినీటి సౌకర్యం, మరుగుదొడ్లు, స్నానాల గదులు, ఫ్యాన్లు లేవు. కనీసం తాగడానికి మంచినీళ్లు కూడా కరువే. అక్కడక్కడా ఏర్పాటు చేసిన బోర్లలో వస్తున్న ఉప్పునీటితోనే కాలం గడుపుతున్నారు. విద్యార్థులకు సరిపోను మూత్రశాలలు, స్నానాల గదులు లేక ఆరుబయటే స్నానాలు చేస్తున్నారు. కొన్ని హాస్టళ్లలో మెనూ పాటించడం లేదు. హాస్టళ్లలో చోటుచేసుకుంటున్న అవినీతిపై ఏసీబీ దాడులు చేస్తున్నా పెద్దగా మార్పేమీ రావడం లేదు. అనేక హాస్టళ్లలో రికార్డుల్లో ఎక్కువమంది పేర్లు రాసి తక్కువమందికి భోజనం పెడుతున్నారు. అది కూడా అరకొరగా ఉందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఊరికి పేరు తేవాలని !
తెలుగు మీడియం చదువుతున్న ఆ విద్యార్థికి డాక్టర్ కావాలన్న కాంక్ష ఏనాడూ కలుగలేదు. పెద్ద చదువులు చదివి ఉన్నతోద్యోగం చేసి తన ఊరికి మంచిపేరు తీసుకురావాలని సంకల్పించారు.. అయితే అనుకోని ఓ సంఘటన ఆయన లో డాక్టర్ కావాలనే కాంక్షను పెంచింది. అనుకోకుండానే వైద్యవృత్తిలోకి ప్రవేశించి... ఎంతోమంది పేదలకు వైద్యసేవలు అందించగలుగుతున్నారు జిల్లా ప్రధాన ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శామ్యూల్ జీవితాన్ని మలుపుతిప్పిన క్షణాలు ఆయన మాటల్లోనే.. పాలమూరు : మాది సామాన్య వ్యవసాయ కుటుం బం. మా నాన్న దేవదానం, అమ్మ అ య్యమ్మ. అమ్మ ఇంట్లోనే ఉండేది. మా నాన్న వ్యవసాయం చేస్తూ మమ్మల్ని పో షించేవా రు. కర్నూలు మండలం మునగాలపాడు మా గ్రామం. కష్టపడి చదివి ఊరికి పేరు తీసుకురావాలని భావిం చాను. చిన్నప్పటినుంచి వైద్యుడిని అవుతానన్న భావన నాలో ఉండేది కాదు. అనుకోకుండా ఆ వృత్తిపై మమకా రం పెరగడంతో ఇటువైపు వచ్చాను. మా కుటుంబంలో నేనొక్కడినే వైద్యుడిని కావడం విశేషం. మా శ్రీమతి సుహాసినితోపాటు ఇప్పుడు మా పిల్లలు జి.ప్రణయ్, జి.నితీషా ఇద్దరూ వైద్యులే. నా సతీమణి సుహాసిని కూడా వైద్యవృత్తిలో ఉండటంతో ఈ రంగంలో విశ్రాంతి లేకుండా పనిచేయగలుగుతున్నాను. మలుపుతిప్పిన క్షణాలు మా గ్రామం మునగాలపాడులోని ఏబీఎం స్కూల్లో 5 తరగతుల వరకు, కర్నూల్ మునిసిపల్ స్కూల్లో 6, 7 తరగతులు, కోల్స్ మెమోరియల్ హైస్కూల్ 8, 9, 10 తరగతులు, ఇంటర్ కూడా పూర్తిచేశాను. పదోతరగతి పూర్తయిన సందర్భంలో మా అన్న రాజు ఎడ్లబండి బోల్తాపడటంతో వెన్నెముక విరిగింది. అప్పుడు కర్నూలులోని జనరల్ ఆస్పత్రికి రోజూ వెళ్లాల్సి వచ్చేది. దీంతో అక్కడి వైద్యులు, వైద్యసిబ్బంది పేదలకు అందిస్తున్న సేవలు నన్ను ఆలోచింపచేశాయి. ఆ క్షణాలే నన్ను వైద్యవృత్తిపై మమకారం పెంచాయి. ఇంటర్ సెకండ్ ఇయర్లో మెడిసిన్ కోర్సులో చేరేందుకు ప్రవేశ పరీక్ష రాశాను. తెలుగు మాధ్యమంలో చదవడంతో.. ఆంగ్ల భాషపై అంతగా పట్టు ఉండేది కాదు. దీంతో మొదటిసారి పరీక్షలో ఆంగ్లంలో ఫెయిలయ్యాను. ఆ తర్వాత డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతూనే మెడిసిన్ పరీక్షకు సిద్ధమై ఎంబీబీఎస్ ర్యాంకు సాధించగలిగాను. 1976లో కర్నూలు మెడికల్ కళాశాలలో నేను ఎంబీబీఎస్లో చేరాను. ఆ తరువాత ఎంబీబీఎస్ యూజీ, పీజీ(ఎండీ) కోర్సు పూర్తయ్యేవరకు క ష్టపడి చదువగలిగాను. 1987లో జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేసేందుకు నేను మహబూబ్నగర్కు వచ్చాను. 28ఏళ్లుగా ఇక్కడే సేవలందించడంతో పాలమూరు జిల్లాతో నాకు ఎనలేని బంధం ఏర్పడింది. ఆనంద క్షణాలు 1987లో గుండెపోటు వచ్చిన వారికి ఎస్టీకే ఇంజెక్షన్ను మహబూబ్నగర్లోని వైద్యులు ఎవరూ ఇచ్చేవారు కాదు. కానీ గుద్దేటి లక్ష్మణ్కుమార్ అనే ఓ రోగికి గుండెపోటుకు వచ్చినప్పుడు ఎస్టీకే ఇంజెక్షన్ను ఇచ్చి ప్రా ణాలు కాపాడగలిగాను. స్థానిక వైద్యులు నన్ను ప్రశంసించినప్పుడు నాకు ఎంతో ఆనందం కలిగింది. ఆ త ర్వాత వట్టెంలో పనిచేసే ఓ కానిస్టేబుల్కు కూడా ఎస్టీకే ఇంజెక్షన్ను ఇచ్చి ప్రాణాలు కాపాడగలిగాను. పీపీహెచ్లో చేరిన ఓ గర్భిణికి ప్రసవం చేసేందుకు ఆస్పత్రుల వారు భయపడిన సందర్భంలో ఆమెకు దా దాపు ఎనిమిది బాటిళ్ల రక్తం ఎక్కించి ఆమెకు పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందించేందుకు వైద్య బృందంతోనే ఉన్నాను. తర్వాత ఆమె ప్రాణాలతో బయటపడింది. ఇంటికి వెళ్లే సమయంలో ఆమెతో పాటు కుటుంబ స భ్యులు కూడా డాక్టర్ల బృందానికి సాష్టాంగనమస్కారం చేశారు. అంటే నిస్వార్థంగా పనిచేసే వైద్యునికి సమాజంలో ఎంత గౌరవం ఉంటుందో గుర్తించగలిగాను. తీరని కోరిక..! వెనుకబడిన పాలమూరు జిల్లాకు మెడికల్ కళాశాల కావాలన్నది నా చిరకాల కోరిక. ఎప్పటికైనా వస్తుందని కాంక్షిస్తున్నాను. ఇందుకోసం గత కలెక్టర్ ద్వారా ప్రతిపాదనలు కూడా చేశాం. తెలంగాణ రాష్ర్ట వైద్యశాఖ మంత్రి రాజయ్య, ఎంపీ జితేందర్రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్గౌడ్ దీనిపై స్పందించి మెడికల్ కళాశాలను నెలకొల్పుతామని హామీ ఇచ్చారు. నేటి వైద్యులకు నా సలహా దేవుని తర్వాత తమ ప్రాణాలు కాపాడే వైద్యుణ్ణి కూడా ప్రజలు దైవంగా భా విస్తారు. అటువంటి ఉన్నతమైన వృత్తిలో కి వచ్చే కొత్తవారు.. ప్రభుత్వ ఆస్పత్రుల ద్వారా పేద ప్రజలకు సేవలందిం చేందుకు ముందుకు రావాలి. నిస్వార్థ వైద్యసేవతో ఎంతోమంది ప్రాణాలు కాపాడగలుగుతామని వైద్య వృత్తిలోకి వచ్చే ప్రతిఒక్కరూ గుర్తించాలి. -
పాలమూరుపై సీఎం కేసీఆర్కు ప్రత్యేక దృష్టి
పాలమూరు : పాలమూరు జిల్లాపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రత్యేక దృష్టి ఉందని పరి శ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, విద్యు త్ శాఖ మంత్రి సి.లకా్ష్మరెడ్డి, పార్లమెంటరీ కా ర్యదర్శి శ్రీనివాస్గౌడ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నా రు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల స మావేశంలో వారు మాట్లాడారు. జిల్లాలో ఎం తో ఖనిజ సంపద ఉందని, రెండు నదులు ప్రవహిస్తున్నాయని, వచ్చే ఖరీఫ్ నాటికి సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేసి జిల్లాలో 6లక్షల ఎకరాల కు సాగునీటిరందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లాలో తలపెట్టిన అన్ని ప్రా జెక్టులను పూర్తి చేసేందుకు శక్తి వంచన లేకుం డా కృషి చేస్తామన్నారు. జాతీయ ప్లానింగ్ కమిషన్ జరిపిన అధ్యయనంలో దేశవ్యాప్తంగా 10 జిల్లాలు వెనుకబాటుకు గురయ్యాయని గుర్తిం చగా.. అందులో 8 జిల్లాలు తెలంగాణలోనే ఉ న్నట్లు వెల్లడైందన్నారు. గత ప్రభుత్వాలు చేసిన పాపాల కారణంగా ఈ ప్రాంతం వెనుకబడిం దని, దానిని కడిగేందుకే టీఆర్ఎస్ ప్రభుత్వం నిరంతరం పాటుడపతుందన్నారు. పాలమూ రు జిల్లాలో వ్యవసాయ విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉందని, ఇక్కడి రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుత విద్యుత్ కేటాయింపును పెంచేందుకు కృషి చేస్తామన్నారు. జిల్లాలో అవసరమైన చోట విద్యుత్ సబ్స్టేషన్లను ఏర్పాటు చేస్తామని, విద్యుత్ కనెక్షన్లకోసం దరఖాస్తు చేసుకున్న రైతులకు అవసరాన్ని బట్టి వ్యవసాయ కనెక్షన్లు ఇప్పిస్తామన్నారు. జిల్లాలోని వనరులను సద్వినియోగం చేసుకొని చిన్న, మధ్య తరహా, భారీ పరిశ్రమల స్థాపనకు కృషిచేస్తామని పేర్కొన్నారు. పాలమూరు-రంగారెడ్డి తెలంగాణ సర్కారు అమలు చేసే మొదటి ఎత్తిపోతల పథకమన్నారు. దీని నిర్మాణానికి శిలాఫలకం వేసేం దుకు త్వరలోనే కేసీఆర్ జిల్లాకు వస్తారన్నారు. జిల్లాలో దాదాపు 18.50 లక్షల ఎకరాల భూమి సాగుకు యోగ్యంగా ఉందని, ప్రతి నియోజకవర్గంలో కనీసం లక్ష ఎకరాలలో సాగు చేపట్టి వ్యవసాయ హబ్గా ఏర్పాటు చేయనున్నట్లు తె లిపారు. విలేకరుల సమావేశంలో జిల్లా పరి షత్ ఛైర్మన్ బండారి భాస్కర్, ఎమ్మెల్సీ జగదీశ్వర్రెడ్డి, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్రెడ్డి, గువ్వల బాల్రాజు, మర్రి జనార్దన్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు బెక్కెం జనార్దన్, పెద్దిరెడ్డి సా యిరెడ్డి, సురేందర్రెడ్డి పాల్గొన్నారు. -
జెడ్పీలో జగడం !
పాలమూరు: జిల్లా అభివృద్ధి పనులను విస్మరిస్తూ.. రాజకీయ విభేదాలకు వేదికగా.. పరస్పర విమర్శలకు తావిస్తూ ఆదివారం జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ర సాభాసగా మారింది. ప్రజాసమస్యలను గాలికొదిలి వాదనలు, వాదోపవాదోలతో సభ పక్కదారి పట్టింది. జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ టీఆర్ఎస్ జెడ్పీటీసీ సభ్యులకు మాత్రమే ప్రాధాన్యమిస్తున్నారని, కాంగ్రెస్, ఇతర పార్టీల జెడ్పీటీసీ సభ్యులకు అభివృద్ధి పనులకోసం నిధులు మంజూరు చేయడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ సభ్యులు తీవ్రస్థాయిలో విమర్శించారు. ఎట్టకేలకు మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఎజెండాలోని అంశాలపై చర్చ మొదలుపెట్టారు. అంతకుముందు ఉదయం 11.30 గంటలకు సభ ప్రారంభం కాగానే మల్దకల్ జెడ్పీటీసీ సభ్యుడు భాస్కర్ తన మండలంలో అభివృద్ధి పనులకోసం నిర్ణయించిన రూ.5లక్షల నిధులు మంజూరు చేయడంలేదని, కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీల పట్ల వివక్ష చూపుతున్నారని ఆక్షేపించారు. దీంతో కొద్దిసేపు టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ సభ్యుల మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. నిధులు మంజూరు చేయించడం తన బాధ్యత అని జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ పేర్కొనడంతో గొడవ సద్దుమణిగింది. ఆయా నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు ఎజెండాలో లేని అంశాలు మాత్రమే మాట్లాడుతుండటంతో అందరు జెడ్పీటీసీ, ఎంపీపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చే శా రు. ప్రతి మూడు నెలలకోసారి చేపట్టే సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యేలు మాట్లాడటానికే సరిపోతోందని, తమకు మాట్లాడే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఇది జెడ్పీచైర్మన్కు తగదు తనపేరు చెబితే పింఛన్ కట్ చేస్తానని లబ్ధిదారులను హెచ్చరించడం జెడ్పీచైర్మన్ బండారి భాస్కర్కు తగదని, ప్రజాప్రతినిధుల పట్ల ఆయన నిర్లక్ష్యంగా నడుచుకోవడం సమంజసం కాదని గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ ఆరోపించారు. తాను కూడా గద్వాల నియోజకవర్గం ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రనిధిని అన్న విషయాన్ని జెడ్పీ చైర్మన్ గుర్తించాలని పేర్కొన్నారు. పింఛన్ డబ్బులు టీఆర్ఎస్ పార్టీ ఇవ్వడం లేదని, ప్రజల సొమ్మునే ప్రభుత్వ ఖజానాలోనుంచి పేదలకు అందజేస్తున్నామన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవుపలికారు. తనపేరు చెప్పిన వారి పింఛన్ కట్ చేస్తామనడం, ప్రజల్లో తన గౌరవానికి భంగం కలిగేవిధంగా ఆయన మాట్లాడటం సరికాదని డీకే అరుణ హెచ్చరించడంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ సభ్యులు వాగ్వాదానికి దిగారు. అలంపూర్ ఎమ్మెల్యే సంపత్కుమార్ మాట్లాడుతూ.. దళిత ప్రజాప్రతినిధులను అడ్డుపెట్టుకుని ఆయా పార్టీలు రాజకీయం చేస్తున్నాయని, మల్దకల్ జెడ్పీటీసీ సభ్యుడికి నిధులు మంజూరు చేయకుండా వివక్షం చూపడం తగదని పేర్కొనడంతోపాటు టీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేయడంతో ఆ పార్టీకి చెందిన జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు వాగ్వాదానికి దిగారు. దీంతో సభలో కొంత ఉద్రిక్తత నెలకొంది. దీంతో సమావేశమందిరంలోని మీడియా ప్రతినిధులు బయటకు వెళ్లాలని జెడ్పీ చైర్మ న్ బండారి భాస్కర్, కలెక్టర్ జీడీ ప్రియదర్శిని పేర్కొనడంతో పత్రికలు, టీవీ చానళ్లకు సంబంధించిన విలేకరులు పలువురు తమను రమ్మని కబురు పంపి.. ఇప్పుడు వెళ్లమనడం అవమానకరమన్నారు. వీరజవాన్ మృతికి సంతాపం కోయిలకొండ మండలం సంగినోనిపల్లి గ్రామానికి చెందిన సీఆర్పీఎఫ్ జవాన్ రెడ్డిగారి గోవర్ధన్రెడ్డి మృతికి సంతాపం తెలుపుతూ ఆదివారం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో కలెక్టర్ జీడీ ప్రియదర్శినితో పాటు ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు కొద్దిసేపు మౌనం పాటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాకు చెందిన జవాన్ మృతిచెందడం బాధాకరమని, వారి కుటుంబానికి తమ తరఫున సానుభూతి ప్రకటించారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వపరం గా ఆదుకుంటామని, పోలీసు శాఖ తరఫున లాంఛనంగా అంత్యక్రియలు జరిపేందుకు చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ వెల్లడించారు. -
నాయకా.. మీదే.. భారమిక
పాలమూరు : ప్రత్యేక పాలనతో జనం మూడేళ్లుగా విసిగి వేసారిపోయారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించే నాథుడు ప్రజలు ఇబ్బంది పడాల్సి వచ్చింది. 2011లో జెడ్పీ చైర్మన్ పదవీ కాలం ముగిసింది. అప్పటి నుంచి ఎన్నికలు చేపట్టని కారణంగా ప్రత్యేక అధికారులతో సమస్యలు తీరకపోగా.. నిధులు వినియోగం కూడా సక్రమంగా జరుగలేదు. ఎట్టకేలకు ఎన్నికలు చేపట్టి జెడ్పీ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ కూడా పూర్తి చేశారు. మన ఊరు-మన ప్రణాళిక అమలు నేపథ్యంలో కొత్త చైర్మన్ బండారి భాస్కర్ అధ్యక్షతన జెడ్పీ సభ్యులతో సమావేశం జరుగుతుంది. ప్రభుత్వ అభివృద్ధి పథకాలకు సంబంధించి నిధులు సకాలంలో విడుదల కాలేక పనులు పడకేసిన మాట మనం తరచూ వింటుంటాం.. కానీ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధి (బీఆర్జీఎఫ్) పనుల విషయానికొస్తే.. ఇందుకు పూర్తి విరుద్ధమనే చెప్పొచ్చు. అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల ప్రహరీలు, ఆస్పత్రి భవనాలు, సామూహిక భవనాలు, రోడ్లు, మురుగు కాలువలు ఇలా వివిధ అభివృద్ధి పనులను చేపట్టేందుకు కేంద్రం ద్వారా నిధులు పుష్కలంగా మండలాలకు సమకూరినా.. అధికారులు మాత్రం మొద్దు నిద్రవీడడం లేదు. రూ.కోట్లల్లో నిధులు మంజూరయినా తగిన అభివృద్ధి పనులు జరగలేదు. జిల్లాలో దీర్ఘకాలికంగా నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు జెడ్పీ ైచైర్మన్ భాస్కర్ ప్రత్యేక దృష్టి గ్రామీణ ప్రజలు కోరుతున్నారు. తమ బాగోగులు చూసుకోవాల్సిన భారం చైర్మన్పైనే ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
ఆర్సీబీతో మ్యాచ్.. గుజరాత్ జట్టులోకి కొత్త ప్లేయర్! తుది జట్లు ఇవే
గవర్నర్పై ఆరోపణలు.. మమత సర్కారు దూకుడు
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement