-
పళ్లి పరవత్తిలే’ ఆడియో ఆవిష్కరణ
తమిళసినిమా: ఇవాళ సినిమాను విడుదల చేయడం తల్లి పురిటి నొప్పి కంటే ఎక్కువగా మారిందని నటుడు, నడిగర్ సంఘం అధ్యక్షుడు నాజర్ పేర్కొన్నారు. సంగీత దర్శకుడు శిర్పి కొడుకు నందన్రామ్ కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రం పళ్లి పరువత్తిలే. నటి వెంబా నాయకిగా నటించిన ఈ చిత్రంలో దర్శకుడు కేఎస్.రవికుమార్, తంబిరామయ్య తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శనివారం రాత్రి స్థానిక ట్రిపిల్కేన్లోని కలైవాణర్ ఆవరణలో జరిగింది. ఈ చిత్ర ఆడియోను నాజర్ ఆవిష్కరించగా దర్శకుడు ఎస్ఏ.చంద్రశేఖర్,ఆర్బీ.చౌదరి తొలి సీడీని అందుకున్నారు. ఈ సందర్భంగా నాజర్ మాట్లాడుతూ ఇవాళ సినిమాలను నిర్మించడం కష్టం అయితే వాటిని విడుదల చేయడం తల్లి ప్రసవ నొప్పికంటే ఎక్కువగా మారిందన్నారు. అలాంటి వాటిని అధిగమించి చిత్ర పరిశ్రమ విజయం కోసం పోరాడుతోందని అన్నారు. చిత్ర నిర్మాత వేలును తాను అభినందిస్తున్నానన్నారు. పళ్లి పరువత్తిలే చిత్రం పాటలు చాలా బాగున్నాయని, చిత్రం మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందన్నారు. దర్శకుడు ఎస్ఏ.చంద్రశేఖర్ మాట్లాడుతూ చిత్రాన్ని దర్శకుడు వాసుదేవ్ భాస్కర్ సహజంగా తెరకెక్కించారని అన్నారు. చిత్ర హీరోహీరోయిన్లు నందన్రామ్, వెంబాలను చూస్తూనే ఉండాలనిపించిందన్నారు. ఆ జంటటో ఏదో ఆకర్షణ ఉందన్నారు. చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నానని అన్నారు. -
పళ్లిపరువత్తిలేకు రెహ్మాన్ ప్రశంసలు
తమిళసినిమా: పళ్లిపరువత్తిలే చిత్ర యూనిట్కు ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్.రెహ్మాన్ అభినందనలు తెలిపారు. ఇంతకు ముందు మరుబడియుమ్ కాదల్ వంటి వైవిధ్యభరిత చిత్రాన్ని తెరకెక్కించిన వాసుదేవ్భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం పళ్లిపరువత్తిలే. కట్రదు తమిళ్, కాదల్ చిత్రాల తరహాలో రూపొందిస్తున్న మరో విభిన్న ప్రేమ కథా చిత్రంగా ఇది ఉంటుందంటున్నారాయన. చిత్రం చూసిన వారికి కచ్చితంగా వారు చదువుకున్న రోజులు గుర్తుకొస్తాయని దర్శకుడు వాసుదేవ్ భాస్కర్ చెప్పారు. మరో విశేషం ఏమిటంటే ఈ చిత్రాన్ని తన పాతమిత్రులతో కలిసి నిర్మిస్తున్నారట. నాట్టమై, ఉళ్లల్తై అళ్లితా, మేట్టుక్కుడి వంటి పలు విజయవంతమైన చిత్రాలకు సంగీతాన్ని అందించిన సిర్పి కొడుకు నందన్రావ్ కథానాయకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో కట్రదు తమిళ్ చిత్రాల్లో బాలనటిగా నటించి ఇటీవల తెరపైకి వచ్చిన కాదల్ కసక్కుదయా చిత్రం ద్వారా హీరోయిన్గా పరిచయమైన నటి వెంబా నాయకిగా నటిస్తోంది. ఇతర ముఖ్య పాత్రల్లో ఆర్కే.సురేశ్, తంబిరామయ్య, పొన్వన్నన్, ఊర్వశి, పరుత్తివీరన్ సుజాత నటిస్తుండగా ఒక కీలక పాత్రలో దర్శకుడు కేఎస్.రవికుమార్ నటిస్తున్నారు. విజయ్ నారాయణన్ సంగీతాన్ని, వినోద్కుమార్ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్ర ఆడియోను ఏఆర్.రెహ్మాన్ ఆవిష్కరించారు. చిత్ర పాటలను విన్న ఆయన తన పాఠశాల రోజులు గుర్తుకొస్తున్నాయని పళ్లిపరువత్తిలే చిత్ర యూనిట్ను అభినందించారట. ఈ విషయాన్ని దర్శకుడు వాసుదేవ్ భాస్కర్ తెలిపారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
Advertisement