-
సముద్ర స్నానానికి వెళ్లి వస్తూ పరలోకానికి
సాక్షి, విశాఖపట్నం : సముద్ర స్నానానికి వెళ్లి వస్తూ ఓ వృద్ధురాలు తిరుగు ప్రయాణంలో ద్విచక్ర వాహనం నుంచి జారిపడి ప్రాణాలు కోల్పోయింది. పరవాడ మండలం నాయుడుపాలెం శివారు వెంకటపతిపాలెం సమీపంలో శనివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకొంది. వివరాలు... చోడవరం దరి భోగాపురానికి చెందిన ఆడారి కన్నంనాయుడు భార్య పిల్లలతో కలసి లంకెలపాలెంలో నివసిస్తున్నాడు. కూలిపనులు చేసుకుంటూ ఆ కుటుంబం బతుకుతోంది. కన్నంనాయుడు అనారోగ్యంతో ఇటీవల మృతి చెందాడు. మరణించిన భర్త కన్నంనాయుడి ఆత్మశాంతి కోసం బుధవారం మూలన కొత్త బట్టలు పెట్టడానికి భార్య మంగతల్లి (65), కుమారులు నాగార్జున, బంగారు నాయుడు నిర్ణయించారు. ఈ మేరకు ముత్యాలమ్మపాలెం సముద్రంలో మైలస్నానం చేయడానికంటూ శనివారం ఉదయం రెండు ద్విచక్ర వాహనాలపై తల్లీకొడుకులు వచ్చి స్నానాలు ఆచరించి తిరుగు ప్రయాణమయ్యారు. వెంకటపతిపాలెం దాటిన తరువాత కొట్టుమసేను మిల్లు వద్ద వాహనం వెనుక కూర్చున్న మంగతల్లి జారి రోడ్డుపై పడిపోయింది. ఈ ఘటనలో ఆమెకు తల వెనుకవైపు బలంగా దెబ్బ తగలడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. కళ్లముందే తల్లి మృతి చెందడంతో కుమారులు కన్నీరుమున్నీరు అయ్యారు. మంగతల్లికి ఒక కుమార్తె కూడా ఉంది. కాగా..ప్రమాదంపై తమకెలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. -
పరవాడలో బీకే టీఎంటీ స్టీల్ ప్లాంట్ ప్రారంభం
సాక్షి, విశాఖపట్నం: విశాఖ జిల్లా పరవాడలో బీకే గ్రూప్ నిర్మించిన టీఎంటీ స్టీల్ బార్ల తయారీ ప్లాంట్ అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భంగా ఆదివారం ఈ ప్లాంట్ను లాంఛనంగా ప్రారంభించారు. పారిశ్రామికవేత్త కంటిపూడి సర్వారాయుడుతో బీకే గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్లు వికాస్ బన్సాల్, మానవ్ బన్సాల్లు ప్రారంభోత్సవం చేయించారు. అనంతరం ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్లు విలేకరులతో మాట్లాడుతూ తమిళనాడు, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో తమకు స్టీల్ప్లాంట్లు ఉన్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా పరవాడలో ఎఫ్ఈ 500డి టీఎంటీ ప్లాంట్ను నెలకొల్పామన్నారు. దీనికి సుమారు రూ.75 కోట్లు వెచ్చించామని చెప్పారు. ఇది రెండు మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని, ఆంధ్రప్రదేశ్లో ప్రైవేటు రంగంలోనే అతి పెద్ద ప్లాంట్ అని వివరించారు. దీంతో తమ బీకే గ్రూప్ వార్షిక టర్నోవర్ రూ.800 కోట్లకు చేరుకుంటుందని చెప్పారు. తమ ప్లాంట్లో 8 నుంచి 40 ఎంఎం సైజ్ వరకు టీఎంటీ బార్ల ఉత్పత్తి జరుగుతుందన్నారు. బీకే ప్లాంట్ల స్టీల్ ఉత్పత్తులను మెక్సికో, న్యూజి లాండ్, కెనడా, ఇంగ్లండ్, సౌదీ అరేబియా, బెహ్రయిన్, ఖతార్, యూఏఈ, మయన్మార్, బంగ్లాదేశ్, శ్రీలంక దేశాల్లో మార్కెటింగ్ చేస్తున్నామని తెలిపారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- Prajwal Revanna: ఏ గదిలో ఏం జరిగింది?
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement