-
పాస్పోర్ట్ నిబంధనల్ని మార్చండి
చెన్నై: బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణం తీసుకున్న వారు దేశం విడిచి పారిపోకుండా పాస్పోర్టు నిబంధనల్లో మార్పులు తీసుకురావాలని మద్రాస్ హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. తనను విధుల నుంచి తొలగించడం అన్యాయమంటూ మంగళం అనే అంగన్వాడీ కార్యకర్త వేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా కోర్టు పైవిధంగా స్పందించింది. ‘రుణ ఎగవేత దారులు చట్టం నుంచి తప్పించుకునేందుకు సుదూర దేశాలకు పారిపోతున్నారు. వారు తమ పాస్పోర్టులను రుణం పొందిన బ్యాంకు లేదా సంస్థ వద్ద సరెండర్ చేసేలా నిబంధనలు మార్చాలి’ అని కోర్టు వ్యాఖ్యానించింది. రుణం పూర్తిగా చెల్లించేవరకు రుణదాత వద్దే పాస్పోర్టు ఉండాలి. ఉంచకపోతే పాస్పోర్టు తాత్కాలికంగా రద్దుచేయాలని, పాస్పోర్టు రెన్యూవల్కు కోర్టు అనుమతి ఉండాలని తెలిపింది. మంగళం అనే అంగన్వాడీ కార్యకర్త..అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, తన బంధువు పాస్పోర్టుతో సింగపూర్ వెళ్లడంతో ప్రభుత్వం ఆమెను విధుల నుంచి తొలగించడంపై కోర్టుకు వెళ్లారు. దీంతో కోర్టు ఆమెను మందలిస్తూ వారం రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. మంగళంతోపాటు ఆమె బంధువుకు రేషన్కార్డు తదితర ప్రభుత్వ సౌకర్యాలను ఉపసంహరించాలంది. -
పాస్పోర్ట్లో తండ్రి పేరు అవసరమా!
న్యూఢిల్లీ: 'నా పేరు ప్రియాంక గుప్తా. చిత్రహింసలు పెట్టే భర్త నుంచి దూరంగా ఉంటోన్న నేను.. ఒక్కగానొక్క బిడ్డ (గరీమా)ను ఉన్నత చదువులు చదివించా. ఇప్పుడు ఆమెకు మంచి ఉద్యోగావకాశాలు వచ్చాయి. ఈ క్రమంలోనే గరీమా పాస్ పోర్ట్ కు దరఖాస్తు చేసుకుంది. అప్లికేషన్ లో తండ్రి పేరు రాయాల్సిన చోట ఖాళీ వదిలేసింది. అధికారులు మాత్రం తండ్రి పేరు తప్పనిసరిగా పేర్కొనాల్సిందేనని అంటున్నారు. విడిపోయినా, చనిపోయినా తండ్రి పేరు రాయాల్సిందేనంటున్నారు. మేడం.. నన్ను, నా కూతురిని దారుణంగా హింసించిన ఆ వ్యక్తి పేరును వాడుకోవడం కాదుకదా కనీసం పలకడం కూడా మాకు ఇష్టం లేదు. గౌరవ న్యాయస్థానాలు ఎన్నెన్నో మంచి తీర్పులు చెప్పాయి. మా సమస్యపైనా అలాంటి పరిష్కారాన్నే కోరుతున్నాం. మా అభ్యర్థనను మన్నించి పాస్ పోర్టులో తండ్రి పేరు తప్పనిసరనే నిబంధనను సవరించగలరు'.. ఇది ఢిల్లీకి చెందిన ప్రియాంక అనే మహిళ కేంద్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి మనేకా గాంధీకి రాసిన లేఖలోని సారాంశం. దాదాపు 45 వేల మంది ఈ లేఖను సమర్థించడంతో మంత్రి మనేకా గాంధీ రంగంలోకి దిగారు. పౌరుల పాస్ పోర్టుకు సంబంధించి ప్రస్తుతం అమలులో ఉన్న తండ్రి పేరు నిబంధనను మార్చాల్సిందిగా మనేకా శుక్రవారం విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ కు ఒక లేఖ రాశారు. దేశంలో సింగిల్ పేరెంట్స్ సంఖ్య పెరుగుతోన్న దృష్ట్యా నిబంధనలు సవరించాల్సిన అవసరం ఉందని మనేకా అభిప్రాయపడ్డారు. ఆమె అభ్యర్థనపై విదేశాంగ శాఖ ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదు. రెండు నెలల కిందట ఢిల్లీ హైకోర్టు ఓ తీర్పు చెబుతూ.. దరఖాస్తు దారులను ఇష్టం లేకపోతే పాస్ పోర్టులో తండ్రి పేరు పేర్కొనాల్సిన అవసరంలేదని స్పష్టం చేసింది. దీనిపై త్వరలోనే ఓ శాశ్వత పరిష్కారం లభిస్తుందని మనేకా ఆశాభావం వ్యక్తం చేశారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
IPL 2024: చరిత్ర సృష్టించిన జడేజా.. ధోని రికార్డు బద్దలు
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement