-
నిలోఫర్లో గందరగోళం.. సిబ్బందిపై ఆరోపణలు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ప్రముఖ చిన్నపిల్లల హాస్పిటల్ నిలోఫర్లో బుధవారం గందరగోళ పరిస్థితులు చోటుచేసుకున్నాయి. జియాగూడకు చెందిన 3 నెలల బాలుడు ధృవన్కు జ్వరం రావడంతో తల్లిదండ్రులు నిలోఫర్కు తీసుకొచ్చారు. బాబుకు పరీక్షలు చేసిన వైద్యులు.. అత్యవసర పరిస్థితుల్లో రక్తం ఎక్కించారు. ఆ తర్వాత బాలుడు ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో తల్లిదండ్రులు వైద్యం నిర్లక్ష్యంతోనే ఇలా జరిగిందని, A పాజిటివ్ రక్తానికి బదులు ‘0’ పాజిటివ్ రక్తం ఎక్కించారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ విషయాన్ని బయటకు చెప్పొద్దని ఆసుపత్రి యాజమాన్యం బెదిరింపులకు దిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు. అవగాహనా రాహిత్యం వల్లే.. కాగా, ధృవన్ అంశంపై నిలోఫర్ సూపరెండెంట్ మురళీకృష్ణ స్పందించారు. బాలుడు ధృవన్ ఆరోగ్యం బాగుందని స్పష్టం చేశారు. అవగాహనా రాహిత్యం వల్ల బాలుడి తల్లిదండ్రులు ఆందోళన పడుతున్నారన్నారు. ఆరు నెలల వరకు బ్లడ్ గ్రూప్ నిర్థారణ కాదని, ‘0’ గ్రూప్ విశ్వధాత కావున సదరు బ్లడ్ గ్రూప్ బాబుకి ఎక్కించామని ఆయన వెల్లడించారు. రక్తం ఎక్కించిన తర్వాత బాలుడికి ఎలాంటి ఇబ్బంది జరుగలేదన్నారు. ధృవన్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నాడని, ప్రస్తుతం బాబుకు ప్రాణాపాయం లేదని వివరించారు. -
వైద్యురాలిని దూషించిన రోగి బంధువులు
రాయదుర్గం అర్బ¯న్ : మెరుగైన వైద్యం కోసం రెఫర్ చేస్తే తీసుకెâýæ్లకుండా కాలయాపన చేయడంపై ప్రశ్నించిన తనను రోగి బంధువులు దుర్భాషలాడారని వైద్యురాలు గీతాజ్యోతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని కేబీప్యాలెస్ ఏరియాకు చెందిన సాకమ్మ (55) కోమాలోకి వెళ్లడంతో బంధువులు గురువారం ఉదయం 10.30గంటలకు ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చారు. వైద్యురాలు గీతాజ్యోతి పరిశీలించి, డెరిఫ్లి¯న్ ఇంజక్షన్ తో పాటు డీఎ¯Œన్ఎస్, ఆక్సిజ¯న్ పెట్టారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం రెఫర్ చేశారు. మధ్యాహ్నం ఒంటిగంట అవుతున్నా రోగిని తీసుకెâýæ్లకపోవడాన్ని గమనించిన వైద్యురాలు రోగి బంధువైన కళావతిని ప్రశ్నించారు. మగవాళ్లు లేరని, వచ్చిన తర్వాత తీసుకెâýæతామని చెప్పింది. అయితే పక్కనే ఉన్న రోగిబంధువుల్లో ఒకరైన అశోక్ను చూసి మగవాడే కదా.. తీసుకెâýæ్లవచ్చు కదా అని వైద్యురాలు అన్నారు. దీంతో రెచ్చిపోయిన అశోక్ ఇష్టారాజ్యంగా వైద్యురాలిని దూషించాడు. అతని ప్రవర్తన పట్ల అక్కడే ఉన్న నర్సు వసంతకుమారి, వైద్యులు మన్సూర్ ఆలీఖా¯న్, సిబ్బంది కంటతడి పెట్టారు. అశోక్ తనకు టీడీపీ వాళ్లందరూ తెలుసునంటూ ఫోన్లు చేయడంతో కొందరు కౌన్సిలర్లు సైతం అక్కడికి చేరుకున్నారు. తనను అవమానకరంగా మాట్లాడటంతో వైద్యులు గీతాజ్యోతి, మన్సూర్ అలీఖాన్ లు తాము ఉద్యోగం చేయలేమంటూ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే జోక్యంతో పోలీసులు ఆస్పత్రికి చేరుకున్నారు. అప్పటికే రోగిని అనంతపురం తరలించారు. వైద్యురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రోగి బంధువులైన కళావతి, ఆశోక్లపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ నారాయణ తెలిపారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- వైఎస్ భాస్కర్రెడ్డికి బెయిల్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
Advertisement