-
పేటీఎం మాల్ ‘ఫ్రీడం క్యాష్బ్యాక్’ సేల్
ఈ-కామర్స్ కంపెనీలన్నీ వరుసబెట్టి స్వాతంత్య్ర దినోత్సవ సేల్స్ను ప్రకటిస్తున్నాయి. అమెజాన్ నేటి నుంచి తన ‘ఫ్రీడం సేల్’ను ప్రారంభించగా.. ఫ్లిప్కార్ట్ ‘ది బిగ్ ఫ్రీడం సేల్'ను రేపటి నుంచి నిర్వహించబోతుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ సేల్స్కు పోటీగా.. పేటీఎం మాల్ కూడా ‘ఫ్రీడం క్యాష్బ్యాక్’ సేల్ను ప్రకటించింది. పేటీఎం మాల్ సేల్ నిన్నటి(ఆగస్టు 8) నుంచే ఈ సేల్ను ప్రారంభించింది. ఈ సేల్ ఆగస్టు 15 వరకు కొనసాగనుంది. ఎవరైతే కొత్తగా ల్యాప్టాప్ కొనుగోలు చేయాలనుకుంటున్నారో వారికి ఇది సరియైన సమయమని తెలుస్తోంది. పేటీఎం మాల్ ల్యాప్టాప్లపై ఏకంగా 20 వేల రూపాయల వరకు ధర తగ్గించింది. ఇంటెల్ కోర్ ఐ3, 4జీబీ ర్యామ్, 1టీబీ స్టోరేజ్ స్పేస్, ఏడాది పాటు యాక్సిడెంటల్ డ్యామేజ్ ప్రొటెక్షన్ కలిగిన లెనోవో ఐడియాప్యాడ్ 320 ధర పేటీఎం మాల్లో రూ.22,490కు తగ్గింది. అదేవిధంగా ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్, 8జీబీ ర్యామ్, 1టీబీ స్టోరేజ్ స్పేస్ కలిగిన డెల్ వోస్ట్రో 3578 ల్యాప్టాప్పై ఫ్లాట్ 6000 వేల రూపాయల వరకు క్యాష్బ్యాక్ లభిస్తోంది. ఎంఎస్ఐ జీఎల్63 8ఆర్ఈ-455ఐఎన్ గేమింగ్ ల్యాప్టాప్పై రూ.20వేల క్యాష్బ్యాక్ను పేటీఎం మాల్ తన కస్టమర్లకు ఆఫర్ చేస్తోంది. 13 శాతం తగ్గింపు, 11000 రూపాయల క్యాష్బ్యాక్ ఆపిల్ మ్యాక్బుక్ ఎయిర్ ఎంక్యూడీ42హెచ్ఎన్/ ల్యాప్టాప్పై కస్టమర్లకు అందుతుంది. మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ప్రొ కోర్ ఐ5 ల్యాప్టాప్పై 10 వేల రూపాయల క్యాష్బ్యాక్ అందుబాటులో ఉంది. అంతేకాక, ఆపిల్, హెచ్పీ, ఏసర్ వంటి పలు ప్రముఖ బ్రాండ్లపై కూడా డిస్కౌంట్లు ఉన్నాయి. పైన పేర్కొన్న ఆఫర్లు మాత్రమే కాక, మిడ్నైట్ సూపర్ డీల్స్ను రాత్రి 10 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు పేటీఎం మాల్ ఆఫర్ చేస్తోంది. ప్రతి రెండు గంటలకు ఒకసారి కూడా ఫ్లాష్ సేల్స్, అద్భుతమైన డీల్స్తో అందుబాటులో ఉన్నాయి. ఎవరైతే ఐసీఐసీఐ క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా పేమెంట్లు జరుపుతారో, వారికి అదనంగా 5 శాతం క్యాష్బ్యాక్ను అందిస్తున్నట్టు పేటీఎం మాల్ తెలిపింది. -
పేటీఎం మాల్ తొలి మెగా సేల్
సాక్షి, న్యూఢిల్లీ : ఈ-కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్కార్ట్, అమెజాన్లకు పోటీగా పేటీఎం మాల్ కూడా మెగా సేల్ ఈవెంట్ను ప్రకటించింది. 'మెరా క్యాష్ బ్యాక్' పేరుతో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ నిర్వహించే తేదీల్లోనే పేటీఎం మాల్ కూడా ఈ మెగా సేల్ ఈవెంట్కు తెరలేపబోతుంది. ఈ నెల 20 నుంచి 23 వరకు ఈ ఈవెంట్ నిర్వహించనుంది. ఈవెంట్లో భాగంగా రూ.501 కోట్ల క్యాష్బ్యాక్ ఆఫర్లను కంపెనీ అందించనున్నట్టు ప్రకటించింది. కొత్తగా 50 లక్షల మంది కొనుగోలుదారులను ఆకర్షించాలనే లక్ష్యంగా ఈ సేల్ ఈవెంట్ను నిర్వహిస్తున్నట్టు కంపెనీ చెప్పింది. కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, మొబైల్ ఫోన్లు, ఫ్యాషన్ ప్రొడక్ట్లు, ఇతర ఉత్పత్తులపై 15 శాతం నుంచి 100 శాతం వరకు పేటీఎం మాల్ క్యాష్ బ్యాక్ ఆఫర్లను అందించనుంది. స్మార్ట్ఫోన్లపై రూ.15వేల వరకు, ల్యాప్టాప్లపై రూ.20వేల వరకు, పెద్ద పెద్ద అప్లియెన్స్ టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషన్లపై 20 శాతం వరకు క్యాష్బ్యాక్లను ప్రకటించింది. 25 మంది ఫోన్ కొనుగోలుదారులకు 100 శాతం క్యాష్బ్యాక్ను కంపెనీ బహుమతిగా అందించనున్నట్టు తెలిపింది. అదేవిధంగా నాలుగు రోజుల సేల్లో భాగంగా ప్రతి రోజూ 200 మంది వినియోగదారులకు 100 గ్రాముల పేటీఎం గోల్డ్ను కూడా ప్రకటించింది. పేటీఎం మాల్ నిర్వహిస్తున్న తొలి పండుగ సేల్ ఇదేనని చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అమిత్ సిన్హా తెలిపారు. తమ భాగస్వామ్య బ్రాండులు, మెర్చంట్లతో కలిసి క్యాష్బ్యాక్ ఆఫర్లను అందించనున్నట్టు చెప్పారు. ఆపిల్, జేబీఎల్, ఉడ్ల్యాండ్, టైమెక్స్లు ఈ సేల్లో టాప్ బ్రాండులుగా ఉన్నాయి. తమ విక్రయాలను పెంచుకోవడానికి రిటైలర్లతో కూడా పేటీఎం మాల్ భాగస్వామ్యం ఏర్పరచుకుంది. ఈ కంపెనీ ఇటీవలే అలీబాబా, ఎస్ఏఐఎఫ్ పార్టనర్ల నుంచి ఫండ్స్ సేకరించింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘నల్లసూరీడు’పై నజర్
ఉద్యమం అయిపోలే.. మిగిలే ఉంది
Today Telugu Horoscope: ఈ రాశివారికి పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి
బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్..
10న జిల్లాకు ప్రియాంక గాంధీ రాక
కాంగ్రెస్తోనే కుల వృత్తులకు మహర్దశ
అంతటా యజ్ఞ సహిత యోగా నిర్వహించాలి
ముగిసిన హోం ఓటింగ్
జిల్లా రద్దు అంశంపై ఫోకస్..
మల్లారంలో నేరడిగొండవాసి హత్య
తప్పక చదవండి
- ఉద్యమం అయిపోలే.. మిగిలే ఉంది
- హైదరాబాద్పై కుట్ర
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
Advertisement